/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధం Yadagiri Goud
మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధం

బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది.

తన కుమారుడికి టికెట్ కేటాయించాలని అడగటం వరకూ సబబే కానీ మంత్రి హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దారుణం. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

అలాగే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

దీంతో మైనంపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి అభ్యర్థిని మార్చాలని సైతం బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీశ్ రావు తో శంభీపూర్ రాజు భేటి అయ్యారు. 4 పెండింగ్ సీట్లతో పాటు మల్కాజిగిరికి ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది.

జనగామ పల్లా: రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ :సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి :ఆనంద్ గౌడ్, గోషామహల్ : నందకిషోర్ వ్యాస్‌లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది...

NTR: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దిల్లీ: భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు..

కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు.

రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్‌

చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

అవి తమ కంప్యూటర్‌ కేంద్రానికి వెళుతున్నాయని చెప్పారు. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు.

జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్‌ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు ‘శివ్‌శక్తి’ అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు.

శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్‌-2 కూలిన ప్రదేశానికి పెట్టిన పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్‌ స్పష్టం చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు.  ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన సోమనాథ్‌.. సైన్స్‌, ఆధ్యాత్మికం పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న ఆదివారం శ్రీవారిని 79,152 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

నేడు ఎన్టీఆర్‌ రూ.100 నాణెం ఆవిష్కరణ

లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు.

రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు..

SB NEWS

నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కి స్వర్ణం..

హంగేరి: బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు.

ఫైనల్ మ్యాచ్‌లో జావెలిన్‌ని 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు..

నిజామాబాద్ ఐటీ హాబ్ లో పెట్టుబడులకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్ ఐటీ హబ్‌లో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఆదివారం మంత్రి కేటీఆర్ అమెరికాలో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజామాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని అందుకు రాబోయే రోజుల్లో సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్ మరియు విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.

ఈ భేటీలో ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఉన్నారు.......

సీఎం పదవి కాదు, ముందు డిపాజిట్ తెచ్చుకోండి.. అమిత్షాపై హరీశ్రావు ఆగ్రహం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అమిత్‌ షా చేసిన కామెంట్స్పై ట్విట్టర్‌ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం పదవి సాధించడం కాదు.. మీరు ముందు తెలంగాణలో సింగిల్‌ డిజిట్‌ తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని విమర్శలు గుప్పించారు.

మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మండిపడ్డారు.

బ్యాట్‌ సరిగ్గా పట్టడం చేతకాని మీ అబ్బాయిని ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని అమిత్‌ షాను ఉద్దేశించి మంత్రి హరీశ్‌ రావు అన్నారు.అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్‌ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోక ముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించడం అని అన్నారు...

సీఎం కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి: బండి సంజయ్

ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు...టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు.

ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు...రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు. అని బండి సంజయ్ కుమార్ సెటైర్లు విసిరాడు.

అవినీతి పరులైన వారికి అమిత్ షా చిచ్చరపిడుగు. తెలంగాణ గడ్డపై పౌరు షాన్ని నింపిన ఖమ్మం గడ్డ. తెలంగాణ లో రామరాజ్యం నిర్మిద్దాం." అని బండి సంజయ్ అన్నారు....

తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపులే గణనీయంగా పెరిగాయి : నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్

తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మహారాష్ట్ర నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని కుబీర్ చౌరస్తాలో గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. అసెంబ్లీ ప్రవాస్ యోజన ముగింపు కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించానని అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు కాకుండా అడ్డుకుంటున్నారని తెలిసిందని పర్కొన్నారు.

తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ధరణితో బీఆర్ఎస్ కార్యకర్తలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా తయారైందని అన్నారు. పోలీస్ వ్యవస్థతో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గుండెగాం గ్రామ ముంపు సమస్య ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే తీర్చాక పోవడం బాధాకరమని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం బొస్లే మోహన్ రావు పటేల్, రామారావు పటేల్ ఆధ్వర్యంలో స్థానిక భైంసా మండలం ఎంపీడీవో కార్యాలయం నుంచి పట్టణంలో పలు రహదారుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు, తాలూకా నాయకురాలు పడకండి రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తాలూకా నాయకులు మోహన్ రావు పటేల్, రామారావు పటేల్,

భాజపా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్, శ్రీనివాస్, ముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, నాయకులు బాజనోల్ల గంగాధర్, నారాయణ్ రెడ్డి, గాలిరవి, పోషెట్టి, దిలీప్, బాజీరావు, గౌతం పింగ్లే, పట్టణాధ్యక్షుడు మల్లేష్, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు హాజరయ్యారు....