/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz PM Modi: బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు Yadagiri Goud
PM Modi: బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరు: విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ ఇక్కడి వచ్చిన సంగతి తెలిసిందే..

ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌' నినాదం ఇచ్చారు. ''చంద్రుడిపై మన ల్యాండర్‌ దిగినప్పుడు భారత్‌లో నేను లేను. ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశా.

అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని అనుకున్నా. భారత్‌ రాగానే శాస్త్రవేత్తలను కలుసుకొని అభినందించాలనుకున్నా. ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా'' అని మోదీ వెల్లడించారు.

అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు..

మూడు ప్రార్థన ఆలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సచివాలయం ప్రాంగణంలో నిర్మితమైన దేవాలయం, మసీద్‌, చర్చి మ‌రికొద్దిసేప‌టిలో సీఎం కేసీఆర్‌ మీదుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం సర్వమత సమ్మేళనానికి అత్తం పట్టనున్నది. సచివాల యం ఆవరణలో కొత్తగా ఈ మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి.

సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా ఆయరు చేయించి తెప్పించారు. కాగా, గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు.

జులై 25 నాడే ప్రారంభించాలని భావించినా అనివార్యంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడటంతో నిల్చిపోయింది. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలన్ని నేడు పున:ప్రారం భించనున్నారు.ఆ తర్వాత ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదా యాల మేరకు ఆయా మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను ప్రారంభిస్తారు.

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్ధనా మందిరాలను తెలంగాణ సర్కార్‌ నూతన సచివాలయ నిర్మాణం తర్వాత పున:నిర్మించింది. గతంలో తెలంగాణ పాత సచివాల యంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చి ఉండేవి. పాత భవనాల కూల్చివేతల సమయంలో ప్రార్ధనా మందిరాలకు నష్టం వాటిళ్లడంతో ప్రభుత్వ ఖర్చుతోనే పున:నిర్మి స్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగా సచివా లయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల మూడు నిర్మాణాలను నిర్మించారు. సచివాలయానికి నైరుతి మూలలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం విశాలంగా నిర్మించారు.

ప్రధాన ఆలయంలో భాగంగా గర్బగుడి, మహామండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతోపాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి, సుబ్రహ్మన్య స్వామి ఆలయనాలను కూడా నిర్మించారు...

Stalin: దేశంలోనే తొలిసారి అల్పాహార పథకం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం స్టాలిన్‌

నాగపట్టణం: తమిళనాడు (Tamil Nadu)లోని ప్రభుత్వ పాఠశాలల్లో 'ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (breakfast scheme)'.. సీఎం స్టాలిన్‌ (MK Stalin) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం.

నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీం (breakfast scheme) రెండో విడతను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు..

IMS scam: ఐఎంఎస్‌ కుంభకోణం కేసులో ఈడీ ఛార్జిషీట్‌

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) కుంభకోణం(IMS scam) కేసులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్‌ మాజీ సంచాలకులు దేవికారాణితో పాటు 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది..

గతంలో నిందితులకు చెందిన ₹144 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది..

వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు తక్కువ ధరకు కొనుగోలు చేసి లెక్కల్లో ఎక్కువ చూపడం ద్వారా కొందరు ఐఎంఎస్‌ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు 2019లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయిదేళ్లలో దాదాపు రూ.300 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అప్పట్లో ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు..

భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌ జిల్లా :ఆగస్టు 25

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులుతీరారు.

రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు.....

కాసేపట్లో సచివాలయానికి గవర్నర్ తమిళి సై

చార్మినార్ భాగ్యలక్మి అమ్మవారిని గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత గవర్నర్ తొలిసారి వెళ్లడం విశేషం. కాగా, దాదాపు రెండేండ్లుగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య దూరం పెరిగింది

రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోటోకాల్ లేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిప్పులు చెరిగారు.

రాజ్‌భవన్‌‌లో బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో తమిళిసై సెటైర్ వేశారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్‌తో సీఎం దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

అనంతరం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఆహ్వానం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఇన్వైట్ చేశారు. దీనికి అంగీకరించిన ఆమె కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు..

Hyderabad: విమానంలో మందుబాబుల హల్‌చల్.. శంషాబాద్‌లో అత్యవసరంగా దించిన పైలట్

శంషాబాద్‌: దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు..

ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్‌ దారిమళ్లించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని... పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా పోలీసులు తెలిపారు..

బోల్తా పడ్డ ట్రావెల్స్ బస్సు పలువురికి గాయాలు

ఎన్టీఆర్ జిల్లా :

జిల్లా లోని జగ్గయ్యపేట పరిధిలో ఉన్నతోటచర్ల మునగచర్ల మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద గురువారం అర్ధరాత్రి మయూరి ట్రావెల్స్ బస్సు (AP39 TC 4248) బోల్తా కొట్టింది.

జాతీయ రహదారి పక్కన ఉన్న కందకంలో పల్టీ కొట్టిన బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాదు నుండి విజయనగరం వెళ్తున్న బస్సు అతి వేగంకారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రయాణికులకు గాయాలు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , జి ఎం ఆర్ ,108 సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.....

ఈనెల 27న ఖమ్మంలో పర్యటించనున్న అమిత్ షా

ఈ నెల 27న ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో‌ జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అమిత్ షా ఖమ్మం పర్యటన షెడ్యూల్

27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్‌లో బయలుదేరి‌ 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు...

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌

అట్లాంటా: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది..

ఈ మేరకు జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు.

దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. ట్రంప్‌ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు..