/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పట్నం మహేందర్ రెడ్డి కే పట్టం Yadagiri Goud
పట్నం మహేందర్ రెడ్డి కే పట్టం

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్‌భవన్‌ లో గవర్నర్ తమిళిసై మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ పలువురు మంత్రులు హజరయ్యారు. మొత్తానికి పట్నం మహేందర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్ ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు.

తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా.. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది...

WhatsApp: పేరు లేకుండానే గ్రూప్‌ క్రియేట్‌ చేసేలా.. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తూనే ఉంది. చాట్‌ ఎడిట్‌, చాట్ లాక్, వీడియో కాల్‌ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు అందించింది..

తాజాగా గ్రూప్‌ క్రియేట్‌ చేయటంలో వాట్సాప్‌ కొత్త మార్పును తీసుకొచ్చింది.

సాధారణంగా వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే ముందుగా కాంటాక్ట్స్‌లోని వారిని సెలెక్ట్ చేసుకొని దానికో పేరు పెట్టాలి. అప్పుడే గ్రూప్ క్రియేట్ అవుతుంది. అయితే, ఏదైనా హడావిడిలో పేరు ఎంపిక సాధ్యం కాకపోతే.. గ్రూప్‌ క్రియేట్‌ చేయడం కుదరదు. ఇకపై ఆ సమస్య ఉండబోదని వాట్సాప్ తెలిపింది. పేరుపెట్టాలనే నియమం లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ విషయాన్ని మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తన ఫేస్‌బుక్‌ (Facebook) ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే దానికి సంబంధించిన ఓ ఫోటోలను కూడా షేర్ చేశారు..

అత్యధికంగా ఆరుగురుతో క్రియేట్‌ చేసే వాట్సాప్ గ్రూప్‌లకు ఇకపై పేరు లేకపోయినా ఫర్వాలేదు. సభ్యుల పేర్ల ఆధారంగా గ్రూపు పేరు డైనమిక్‌గా మారుతుంటుంది. ప్రతి సభ్యుడికి వారి కాంటాక్టుల ఆధారంగా ఈ పేరు వేర్వేరుగా కనిపిస్తుంది. కావాలనుకుంటే తర్వాత గ్రూప్‌కి పేరు పెట్టొచ్చు. కేవలం అడ్మిన్‌ మాత్రమే కాకుండా గ్రూప్‌లోని సభ్యులు కూడా పేరును మార్చవచ్చు. అయితే, కాంటాక్ట్‌ని సేవ్‌ చేసుకోని వారికి మాత్రం ఫోన్‌ నంబర్ డిస్‌ప్లే అవుతుందని వాట్సాప్‌ వెల్లడించింది. రానున్న కొన్ని వారాల్లో ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..

ఢీల్లీ: మొదటి విడత 'భారత్ జోడో యాత్ర'కు అశేష ఆధరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు..

అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది.

లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు.

మొదటిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించారు రాహుల్. రెండోసారి భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది..

డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్‌ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.

తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.

కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధిస్తూ అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది...

త్వరలోనే 6611 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌: మంత్రి సబిత

టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ లో నేడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మొత్తంగా 6,611పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

కాగా వర్శిటీలలో అధ్యాపకులు పోస్ట్ ల భర్తీ బిల్లు గవర్న్ వద్ద పెండింగ్ లో ఉంద‌ని తెలిపారు.. ఇప్ప‌టికే ఆ బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ అడిగిన అనుమానాల‌కు స‌మాధానాలు ఇచ్చామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్ల బడ్జెట్ కేటాయించారని మంత్రి గుర్తుచేశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థల్లో రాష్ట్రం గర్వించే స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. గురుకులాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడం, వాటిని అప్ గ్రేడ్ చేయడంలో విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు.

కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని, కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు.

దీంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని, ప్రపంచం అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు.

నీళ్లు, నిధులకు సంబంధించి ఉద్యమకాలం నాటి ఆకాంక్షలు ఇప్పటికే నెరవేరాయని, నియామకాలకు సంబంధించిన ఆకాంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ పాలనలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.....

బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం

కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్

ఇటీవల బిఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే తమ అభ్యర్థుల జాబితా ప్రకటించారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 20 శాతం టికెట్లు ఐదు శాతం ఉన్న రెడ్లకు 33% అరశాతం ఉన్న వెలమలకు 16% టికెట్లు కేటాయించి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా నిరూపించుకుందని ఇందుకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బీసీలకు గతంలో కంటే తక్కువగా 23 టికెట్లు కేటాయించి బీసీలను అవమానించిందని బిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి బీసీలకు కేటాయించినటువంటి టికెట్ల కేటాయింపే నిదర్శనం అని ఆయన అన్నారు, బీసీలను పచ్చి మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు, రెడ్లకు, వెలమలకు టికెట్ల కేటాయింపుల్లో పెద్దపీట వేసిన బిఆర్ఎస్ పార్టీ అంటే రెడ్ల వెలమల సమితిగా మారిందని ఆయన ఆరోపించారు,

సిట్టింగ్ సీట్లు ఇచ్చి తెలంగాణలో అగ్రకులాల పాలనను కేసీఆర్ శాశ్వతం చేయాలని చూస్తున్నారని అందులో భాగంగానే 115 మందిలో 65 మంది అగ్రకులాలకు టికెట్లు ఇవ్వడం చాలా సిగ్గుచేటన్నారు. బీసీలలో ప్రతి నియోజకవర్గంలో అత్యంత సమర్థులైన వారు ఉన్నప్పటికీ పార్టీ పట్ల విధేయులుగా ఉండి పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ కేవలం బీసీలనే కారణంతో కేసీఆర్ వారిని పక్కన పెట్టి అగ్రకులాలకు అరశాతం ఐదు శాతం ఉన్నోళ్లకు టికెట్ లు ఇవ్వడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు టికెట్లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీకి బిసీల నుండే పతనం మొదలవుతుందన్నారు. బీసీలు అంటే లెక్కలేకుండా వ్యవహరించిన బిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల తడాఖా ఎట్లా ఉంటదో ఈ ఎన్నికలలో చూపిస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, కర్నె శ్రీకాంత్ లింగాయత్, అనిల్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఎంపీ పేరిట సోషల్ మీడియాలో రచ్చ

•కావాలనే నాపై దుష్ప్రచారం

•ట్విటర్ వేదికగా స్పందించిన గల్లా జయదేవ్

'యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదు.. ఈ పాదయాత్ర వల్ల ఒరిగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటి..? పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తి స్తున్నారు.. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు 'ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది.

లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మడం లేదు. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదు. టీడీపీ హైకమాండ్ ఇకనైనా పునరాలోచన చేయాలి' అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారం టీడీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది.

అందులోనూ లోకేశ్ పాదయాత్రలో గల్లా జయదేవ్ కనిపించకపోవడంతో ఒకవేళ నిజంగానే చేసి ఉంటారే మొనన్న అనుమానం కూడా కలిగింది.

అయితే ఈ ప్రచారంపై గల్లా జయదేవ్ ట్విటర్ వేదికగా స్పందించారు.

నారా లోకేశ్, యువగళం పాదయాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు. 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద, ఆయన తలపైట్టిన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం తప్ప ఏమాత్రం నిజం లేదు.

నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు.

నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని తెలిపారు.

అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని గల్లా జయదేవ్ తేల్చి చెప్పారు.

రణరంగంగా మారిన వరంగల్ జిల్లా కేంద్రం:తీవ్ర ఉద్రిక్తత

హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. హన్మకొండ లోని బి అర్ ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు జిల్లా ధర్మారం అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వరంగల్ పట్టణ సమస్యలు పరిష్కరించడంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొంటూ బీజేపీ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ గానే మోహరించారు.

బీజేపీ నేతలు రాకను తెలుసుకున్న బీఆరెస్ నేతలు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రెండు పార్టీల నేతలు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు.

రెండు పార్టీల నేతల తలలకు, కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. బీజేపీ అధికారప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గాయపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.....

యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం.. బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం చేశాడు ఓ భర్త. మగశిశువుకు జన్మనిచ్చి ఆ ఇల్లాలు కన్నుమూసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామవాసి మాదేశ్‌తో 2021లో వివాహం జరిగింది.

మాదేశ్‌ సేంద్రియ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య ఇటీవల గర్భం దాల్చగా.. సేంద్రియ పద్ధతిలాగే ఆమెకు కూడా ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు.

ఆ మేరకు లోకనాయకికి వైద్యపరీక్షలు సైతం చేయించలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. మాదేశ్‌ ససేమిరా అన్నాడు. ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతోపాటు పౌష్టికాహారాన్నీ నిరాకరించాడు..

తనే ఆమెకు గింజలు, ఆకుకూరలు ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 22న ఇంట్లో ఉన్న లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. మాదేశ్‌ తన ఫోనులో యూట్యూబ్‌ చూస్తూ భార్యకు ప్రసవమయ్యేలా చేశాడు.

సరైన రీతిలో వైద్యం అందకపోవడం వల్ల మగశిశువుకు జన్మనిచ్చిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

ఇక తప్పదని.. కున్నియార్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లోకనాయకి మరణించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..

నేడు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తెలంగాణ కెబినెట్లోకి తీసుకోనున్నారు. ఈటల రాజేందర్ స్థానంలో ఖాళీ అయిన బెర్త్‌ను ఇప్పటి వరకు అలాగే ఉంచారు.

ఖాళీగా ఉన్న ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి తాండూరు నుండి పోటీ చేయాలనుకున్నారు.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వడం తో పట్నం కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు.

దీంతో గురువారం మధ్యాహ్నం గం.3కు రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై. మంత్రిగా పట్నంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు...