/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని ఆశాల ధర్నా Mane Praveen
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని ఆశాల ధర్నా
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,  ఆశాలు తమ యొక్క ఫిక్స్డ్ శాలరీ ని ప్రభుత్వం పెంచాలని ధర్నా చేపట్టారు. జిల్లా ఆశా వర్కర్ సిఐటియు అనుబంధ యూనియన్ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి మాట్లాడుతూ..  ఆశా వర్కర్లుగా గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు కేవలం రూ .9750/- మాత్రమే ఇస్తున్నారని, తమపై పని భారం పెరిగిందని తెలిపారు. ఇట్టి జీతం టార్గెట్ కు అనుగుణంగా బిల్లు చేస్తున్నారని టార్గెట్ కానటువంటి వారికి తక్కువ వేతనం వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ యొక్క వేతనం పెంచాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలని, టార్గెట్లకు సంబంధం లేకుండా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు పాల్గొన్నారు.  ఆశాలు ధనమ్మ, షహీన్, గోవిందమ్మ, అనుష, తదితరులు ఉన్నారు.
NLG: బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన రెండవ ఏఎన్ఎంలు
నల్లగొండ: గత ఎనిమిది రోజులుగా  2వ ఏఎన్ఎం లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏఎన్ఎం ల గురుంచి పట్టించుకోకపోవడం  అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండోవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెలో భాగంగా ఎనిమిదివ రోజు బతుకమ్మలాడి తమ బాధలను పాటల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 16 నుండి 20 ఏళ్లుగా  రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా.. రెగ్యులర్ ఏఎన్ఎం, మొదటి ఏఎన్ఎం మరియు 2వ ఏఎన్ఎం ఒకే రకమైన  పని చేసినప్పుడు వేతనాలలో తేడాలు ఎందుకు ఇస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న  వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని తెలిపారు. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు.

ఏఐటియుసి జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు, రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, నాగమణి, వసంత, సుశీల, గీతరాణి, అరుణ, మాధురి, భూదేవి, అండాలు, సరళ, శకుంతల, ఇందిరా, సుచిత్ర, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, పార్వతి, సాలమ్మ, గీత, నీలవేణి, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, రజిత, రెహాన, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
NLG: 24న ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా
నల్గొండ: Magic Bus ఆధ్వర్యంలో ఈనెల 24న  జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ మరియు టిఎస్కేసి సమన్వయకర్త కె నాగిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళా నందు Tech Mahindra, SYKES, Genpact  లాంటి  ప్రముఖ సంస్థలు పాల్గొంటారని తెలిపారు. ఈ ఉద్యోగ మేళా కొరకు 2019 నుండి 2023 వరకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ మెమూల తో పాటు ఆధార్ కార్డు, 2 ఫోటోలు 5 రెజ్యూమ్ లు తీసుకుని కళాశాలలో అల్లుమిని హాల్ కి రాగలరని తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్లు 9949055604, 9553141962, 9912803677 లను సంప్రదించాలని కోరారు. Share it
రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి: మేడి ప్రియదర్శిని

నల్లగొండ: ప్రభుత్వం విడుదల చేసిన ఏఎన్ఎం ల నోటిఫికేషన్ రద్దు చేసి ఎటువంటి పరీక్షలు లేకుండా రెండవ ఏఎన్ఎం లను వెంటనే రెగ్యులర్ చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏఎన్ఎం లు చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొని, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ వారి ఆశలు నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి దాదాపు 20 సంవత్సరాల నుండి ఎంపిహెచ్ఎ లకు సమానంగా విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకున్నా ఏదో ఒక రోజు రెగ్యులర్ చేస్తారనే నమ్మకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సం. లుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యాధిగ్రస్తులకు దగ్గర ఉన్న సమయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయినా.. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఏఎన్ఎం లను ఎటువంటి పరీక్షలు లేకుండా వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రెండవ ఏఎన్ఎం సామ సునీత, యాతకుల మాధవి, రూప, శ్రీలత,అరుణ, విజయ్ జయలక్ష్మి, వసంత, మాదవి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.

NLG: రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయండి: మునాస ప్రసన్న
ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ దీటి మల్లయ్య, గంగపుత్ర సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ, జాతి మనగడే లక్ష్యంగా గత 40 సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేస్తున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర కార్యాచరణ సమితి చైర్మన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా ప్రకటించారు. ఈనెల 25న శుక్రవారం నాడు హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్, శాంతినగర్ వద్ద గల మత్స్యశాఖ భవన ప్రాంగణంలో దీటి మల్లయ్య తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సమాఖ్య చైర్మన్, ప్రత్యేక కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్ ,మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా నేడు తెలంగాణ గంగపుత్ర సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న దీటి మల్లయ్య కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నల్గొండ పట్టణంలోని తెలంగాణ గంగపుత్ర సంఘ జిల్లా కార్యాలయంలో, ఈ నెల 25న హైదరాబాద్ లోని మత్స్య భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి జిల్లా గంగపుత్ర సంఘ సభ్యులు , మత్స్య సంఘం సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచూ కరపత్రాన్ని ఆవిష్కరించి ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటయ్య, గౌరవ సలహాదారుడు ( Besta) మునసు వెంకన్న, ప్రధాన కార్యదర్శి మంగిలిపల్లి కిషన్, ఉపాధ్యక్షుడు వడ్డెబోయిన అంజయ్య,జిల్లా అధికార ప్రతినిధి వద్దబోయిన సైదులు, మీడియా కన్వీనర్ మరియు యువజన అధ్యక్షుడు అంబటి ప్రణీత్, ప్రచార కార్యదర్శి మనాస వెంకన్న, కోశాధికారి సింగం దుర్గయ్య, కార్యదర్శి మంగలిపల్లి శంకర్ , రాసమల్ల యాదగిరి, కందరబోయిన నాగయ్య, కోరేపల్లి కొండల్, కందరబోయిన శ్రీను, అంబటి రాజశేఖర్, అంబటి శివకుమార్, వడ్డెబోయిన పురుషోత్తం, మునాస నాగరాజు, మునాస వినయ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు మాలల వాటా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి: నాగిల్ల మారయ్య                   
                 
మర్రిగూడ: దళిత బందులో మాల కులస్తుల వాటా జనాభా దమాషా ప్రకారం కేటాయించాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దళితరత్న నాగిళ్ల మారయ్య అన్నారు.  మర్రిగూడ మండలంలో బుధవారం మాట్లాడుతూ.. మాలలకు దళిత బందులో సరియైన ప్రాధాన్యత ఇవ్వాలని, మాలలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మాలలకు సహకరించిన వారికి మాలల మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి, అందులో మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సరైన నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన లెంకలపల్లి బిఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం: బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. మరోసారి మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా, మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, లెంకలపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేనుకుంట్ల నరేందర్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mane Praveen

చింతపల్లి మండలం, మాల్: తెలంగాణ ప్రజా నాట్యమండలి మరియు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షతన మంగళవారం ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభలో ఆట-పాట-మ

తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆట-పాట-మాటలతో.. గద్దర్ కు జోహార్లు
చింతపల్లి మండలం, మాల్: తెలంగాణ ప్రజా నాట్యమండలి మరియు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షతన మంగళవారం ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభలో ఆట-పాట-మాటలతో.. గద్దర్ కు జోహార్లు సమర్పించారు.
NLG: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మర్రిగూడ మండల బిఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండలానికి చెందిన బిఆర్ఎస్ నేతలు మంగళవారం మునుగోడు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మరోసారి బిఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మర్రిగూడెం మండలం బిఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, బిఆర్ఎస్ యువనేత అభి సందేశ్, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ  వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ను ఎన్నిసార్లు కలిసినా కూడా ప్రయోజనం లభించలేదని వాపోయారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు, పెరిగిన ధరలు భరించలేకపోతున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండీ జకీర్, అండాలు, చంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.