/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న: CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్ Miryala Kiran Kumar
చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న: CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

ఈదులూరు

 చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 

 CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 20వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈదులూరు గ్రామంలో జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ ఎర్రజెండా ఎగురవేసి అంజన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అంజన్న భూమి,భుక్తి,విముక్తి పోరాటంలో నిజాం నవాబు, రజాకార్ల కు వ్యతిరేకంగా మట్టిమానుషులను తట్టిలేపి ఉక్కుమనుషులుగా మార్చి,బాంచెన్ దొరా నికాల్మొక్త అన్నా చేతులతోనే బందూకులు పట్టించి పొరాటలవైపు నడిపించాడని అంజన్న చరిత్ర మరువలేనిదని అన్నారు.ఎర్రజెండా వెలుగులో దున్నేవానికే భూమి నినాదంతో జరిగిన నక్సల్భరీ ఉద్యమవైపు నిలబడి రైతు కూలీలను ఐక్యం చేశాడని అన్నారు.కామ్రేడ్ అంజన్న 40 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని తెలిపారు.కామ్రేడ్ బూరుగు అంజన్న ఎంతోమంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచాడని,జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని కొనియాడారు. అంజన్న స్పూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అన్నారు.ప్రజలపై పన్నుల భారాన్ని మోపి,కార్పొరేట్ శక్తులకు ప్రజాసొమ్మును ధారాదత్తం చేస్తున్న మోడీ,కేసీఆర్ పాలకులకు బుద్దిచెప్పడమే కామ్రేడ్ అంజన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్,రైతు-కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి,పుట్ట సత్యం, పివైఎల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, బి.వి చారి,గ్రామ పార్టీ కార్యదర్శి బూరుగు సత్తయ్య,ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు భరత్,బింగి నర్సయ్య,వీరంజనేయులు,బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతల అంజయ్య, POW జిల్లా అధ్యక్షుడు బూరుగు లక్ష్మక్క,దణ్డంపెళ్లి చంద్రయ్య, గుడుకుంట్ల వేoకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

 --- కరపత్ర ఆవిష్కరణ

  తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ తెలిపారు

         

సోమవారం ఎస్పిటి మార్కెట్ ట్రస్ట్ భవన్లో మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది*. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేటి తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ మరియు చేనేత కార్మికుల సమస్యలపై గత 70 సంవత్సరాలుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించామని అన్నారు. ఆనాటి బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసేందుకు సత్యం కమిటీ సిఫారసులు తీసుకొని వస్తే ఆ సత్యం కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మిక సంఘాల మరియు చేనేత సహకార సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాలను, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. చేనేత సహకార సంఘాలకు మరియు చేనేత కార్మికులకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని 2008లో ఐక్య కార్యచరణ ఏర్పాటు చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ని కలిసి రుణమాఫీ చేయాలని పోరాడి కార్మికుల రుణమాఫీ చేయించిన చరిత్ర చేనేత కార్మిక సంఘానిదని ఆయన అన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ చేనేత బోర్డుని, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీం, హౌస్ కం వర్క్ షెడ్లాంటి కేంద్ర పథకాలను రద్దు చేసినందుకు చేనేత పరిశ్రమ పైన జిఎస్టి విధించిన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత పరిశ్రమ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైందని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా సభ్యులకు పని కల్పించలేని పరిస్థితికి నెట్టబడిన విధానాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. చేనేత మగ్గాలకు జియో టాక్ వేయకపోవడం వలన చేనేత సంఘాలు, ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను టెస్కో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించక మరియు సంఘాలలో ఉన్న వస్త్రాలను ఖరీదు చేయకపోవడం వలన వస్త్ర నిలువలు పేరుకుపోయాయని, టెస్కో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించకపోవడం వలన సంఘాలు అప్పుల కూరుక పోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరియు సహకారేతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మరియు చేనేత వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నలగొండ పట్టణంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

  

ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో  చేనేత రంగంలో ప్రముఖ నాయకులు మిరియాల సోమయ్య ,రాపోలు దత్త గణేష్, జిల్లా బిక్షం ,మిర్యాల యాదగిరి, కర్నాటి యాదగిరి, జిల్లా గణేష్, దుడుగు లక్ష్మీనారాయణ, చిలుకూరు లక్ష్మీనర్సు, మిరియాల రంగయ్య ,తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, నామిని ప్రభాకర్ ,రాపోలు వెంకన్న,ఏలే శ్రీనివాస్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి

మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి...దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి

.ఐ.ఎఫ్.టి.యూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ డిమాండ్

మైనారిటీ మతస్తులు మనుషులేననే కనీస ఆలోచన లేకుండా మణిపూర్ లో, మైనారిటీ ఆదివాసీ ప్రజలపై ముఖ్యంగా,కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం,అడ్డుగా వచ్చిన తండ్రి, తమ్ముడిని చంపేయడం,మహిళలను హత్యలు చేయడం హేయమైన చర్యని ఈ ఘటనను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) తీవ్రంగా ఖండిస్తుందని,ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అమానుషమైన దుర్మార్గానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఐ.ఎఫ్.టి.యూ నల్లగొండ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం నల్లగొండ పట్టణంలోని CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం శ్రామిక భవన్ లో ఐ.ఎఫ్.టి.యూ జనరల్ బాడీ సమావేశం జరిగింది.. ఈసందర్భంగా వారు పాల్గొని 

మాట్లాడుతూ...ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించిందని,మనో వేదనకు గురిచేసిందని,ప్రధాని మోడీకి మాత్రం కనీస బాధ గానీ,చలనం గానీ లేకుండా మొద్దు నిద్రలో ఉందిని,మౌనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ మౌనమే దేశానికి ప్రమాదమని అన్నారు. 

సర్వ మతాలకు అనుకూలంగా రాజ్యాంగంలో అవకాశం ఉన్నప్పటికీ,హిందూ మతం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు,సర్వ మతాలకు నిలయం ఈ దేశమని మరిచిపోయిన, ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ ఇతర మతోన్మాద శక్తులు, మైనారిటీ ప్రజలపై దాడులు, మారణకాండ ను కొనసాగించడం దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. భారత్ మాత గురించి నిత్యం మాట్లాడుతున్న వీళ్ళు భారతీయ మహిళలను మరీ ముఖ్యంగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న అడవి బిడ్డలైన ఆదివాసీ మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం అనాగరిక సమాజంలో కూడా జరగలేదని,ఇంత అన్యాయానికి పాల్పడడం దారుణమని అన్నారు.

మనుషులను,మైనారిటీ లను చంపి,మానవతా విలువలను మంటగలుపుతున్న హిందూ మనుధర్మ శాస్త్ర,మతోన్మాద శక్తుల సమాజ తిరోగమన విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా త్రిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేపట్టకపోగా మౌనంగా ఉండడం అల్లరి మూకలకు కొమ్ముకాయడమేనని అన్నారు.వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యూ నాయకులు కత్తుల చంద్రశేఖర్,రావుల వీరేశ్,దాసరి నర్సింహా,కల్లూరు అయోధ్య, జానపాటి శంకర్, అంజి,టోపి రాజు,అశోక్, స్వామి,ముత్తు,గౌస్,అంబెడ్కర్,చౌగోని నాగరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల...

పట్టణంలోని 13&14 వార్డులో మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నుండి బొడ్రాయి వరకు రూ. 60 లక్షల రూపాయల వ్యయంతో డబల్ సి.సి.రోడ్ల పనులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మర్రిగూడ లో డబల్ సిసి రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరొక్కసారి అత్యధిక మెజారితో గెలిపిస్తే మర్రిగూడ ను ఇంకా మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని ధైర్యంగా ఉండాలన్నారు..

అనంతరం మర్రిగూడ లో సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి నుండి జేరిపోతుల అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో గుమ్ముల శ్రీధర్ రెడ్డి, మోత్కూర్ శంకర్, బొజ్జ గోవర్ధన్, బుర్ర మల్లేష్, బొజ్జ స్వామి, జేరిపోతుల శ్రీధర్, బాలకోటి ప్రేమకుమార్, మహేష్, గణేష్ తదితరులు.. బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..

మరియు

బిజెపి నుండి బీపంగి వినోద్ కుమార్ (చంటి) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వి.మల్లేష్, వి. సైదులు, ప్రశాంత్, రఘు, మహేష్, ప్రశాంత్, శివమణి, బబ్ల్యూ, వినయ్,ప్రేమ్ కుమార్, ప్రభాస్, వంశీ తదితరులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, జేరిపోతుల భాస్కర్ గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, బొజ్జ వెంకన్న, కో ఆప్షన్ మెంబర్ గున్ రెడ్డి రాధిక యుగెందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు, తుమ్మల గోవింద్ రెడ్డి, తుమ్మల శంకర్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, బీపంగి కిరణ్, మధుసూదన్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కడారి యాదయ్య, బొజ్జ యాదయ్య, బీపంగి కిరణ్, సుంకరబోయిన సత్యనారాయణ, సుంకరబోయిన రవి, బొజ్జ నాగయ్య గార్లు మరియు మర్రిగూడ నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు : మంత్రి కేటీఆర్

కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు : మంత్రి కేటీఆర్

 కేంద్రంలో త‌ప్ప‌కుండా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌త‌ది.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాన‌మంత్రి అయ్యే ప‌రిస్థితి అక్క‌డ ఉండ‌దు అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా ప‌వ‌ర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు ర‌ద్దు చేసింద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. హౌసింగ్ క‌మ్ వ‌ర్క్ షెడ్డు కార్య‌క్ర‌మాన్ని కూడా ర‌ద్దు చేసింది. ప‌నికొచ్చే ప‌థ‌కాన్ని ఉంచ‌కుండా ర‌ద్దు చేసింది మోదీ ప్ర‌భుత్వం. 75 ఏండ్ల‌లో ఏ కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌ని త‌ప్పు ఈ ప్ర‌ధాని చేస్తున్నారు. చేనేత ఉత్ప‌త్తుల‌పై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గ‌మైన ప్ర‌ధాని మోదీ. మునుగోడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా వేల సంఖ్య‌లో ఉత్త‌రాలు రాశాం. జీఎస్టీ ఎత్తేయాల‌ని కోరాం. కేసీఆర్ కూడా చండూరు వేదిక‌గా మోదీకి అభ్య‌ర్థించారని కేటీఆర్ గుర్తు చేశారు.

రాష్ట్రంలో మ‌న‌మే గెలుస్తాం.. అందులో అనుమాన‌మే లేదు..

రాష్ట్రంలో మ‌నమే గెలుస్తాం. అందులో అనుమాన‌మే లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముచ్చ‌ట‌గా మీ అంద‌రి ఆశీర్వాదంతో సీఎం అవుతారు. చేనేత‌పై జీఎస్టీ విధించిన మోదీని ఓడించాలి. కేంద్రంలో కూడా మ‌నం ఉండాలి. కేంద్రంలో త‌ప్ప‌కుండా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌త‌ది. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధానమంత్రి అయ్యే ప‌రిస్థితి అక్క‌డ ఉండ‌దు. కేంద్రంతోని కొట్లాడే వాళ్లు కావాలి. కేంద్రం మెడ‌లు వంచే నాయ‌కుడు కావాలి. కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఇక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా గెలిపించాలి. పార్ల‌మెంట్‌లో మ‌న మాట నెగ్గించుకోవాలి. నెగ్గించుకోక‌పోతే మ‌న నేత‌న్న‌ల బ‌తుకులు బాగు ప‌డ‌వు. మోదీ ఉన్నంత‌కాలం.. ఆయ‌న ఆడిచ్చే డూడూ బ‌స‌వ‌న్న‌లు ఉన్నంత‌కాలం, ఢిల్లీకి బానిస‌లు ఉన్నంత కాలం ప‌రిస్థితులు మార‌వు. త‌ప్ప‌కుండా మ‌న పాత్ర ఢిల్లీలో ఉండాలి. కేసీఆర్ లాంటి ద‌మ్మున్న ద‌క్ష‌త క‌లిగిన నాయ‌కుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే ప‌రిస్థితి రావాలి. రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ప‌ద్మ‌శాలి సోద‌రుల కోసం కోకాపేట‌లో రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లంలో భ‌వ‌నం క‌ట్టిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

చేనేత రుణాల మాఫీ.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..

హ్యాండ్లూమ్, ప‌వ‌ర్ లూమ్ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. టెస్కోను బ‌లోపేతం చేస్తున్నాం. సొసైటీకి ఎన్నిక‌లు కావాలంటే వెంట‌నే పెడుతాం. మాకేం అభ్యంత‌రం లేదు. కార్మికులు బాగుప‌డాల‌నేది మా ఆలోచ‌న‌. మ‌న‌సున్న నాయ‌కుడు మంచి సీఎం ఉంటే అన్ని ప‌నులు అవుతాయి. రైతు రుణ‌మాఫీ అవుతదా అనుకున్నారు. కేసీఆర్ క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయిండు.. రుణ‌మాఫీ చేయ‌డని కాంగ్రెసోళ్లు అనుకున్నారు. కేసీఆర్ మాటిచ్చిండు అంటే.. త‌ప్ప‌డు కాబ‌ట్టే.. 19 వేల కోట్ల‌తో రెండోసారి రైతు రుణ‌మాఫీ చేస్తున్నారు. చేనేత రుణ‌మాఫీ కూడా ఇది వ‌ర‌కు చేశాం. మ‌ళ్లీ చేనేత రుణాల మాఫీ విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

16న కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే ఎస్సి వర్గీకరణ సదస్సును విజయవంతం చేయండి: బకరం శ్రీనివాస్ మాదిగ

పెద్ద కొత్తపల్లి మండలం,

కొల్లాపూర్ నియోజక వర్గం,

నాగర్ కర్నూల్ జిల్లా.

షెడ్యూల్డ్ కులాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఈనెల 16న కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించబోయే నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు పెద్ద కొత్తపల్లి మండలంలోని పెద్ద కార్పాముల MRPS నూతన గ్రామ కమిటీకి 

ముఖ్య అతిధిగా: MRPS, MSP 

నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ హాజరు కావడం జరిగింది.

మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం: గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం

- రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు మంత్రి జగదీష్ రెడ్డి

- 9,8 వార్డులో కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

ఒక రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9 మరియు 8 వార్డులో జగదీష్ అన్న కప్2023 కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. 2014లో తాము ప్రజల వద్దకు వస్తే సమస్యలు చెప్పారని నేడు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. 2014లో సూర్యాపేట పట్టనం ఇప్పుడు ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కలను బాగా పెంచి సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచడం అభినందనీయమన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంతటి అభివృద్ధి మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలోనే జరిగిందన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని అన్నారు.

 సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజల అదృష్టం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మార్చి పాలన దగ్గర చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, 21 స్మశానవాటికలు మహాప్రస్థానం, మూసి మురికి నీటి నుంచి విముక్తి కల్పించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అభివృద్ధి చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ తో వైద్య సదుపాయానికి, నిరుపేదల విదేశీ విద్యకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి, మచ్చ రాము,బొడ్డు దుర్గయ్య, బండమీది రజిత, రజిని పందిరి సువర్ణ,అనుములపురి వినయ్, నవీన్, మహిళ నాయకురాలు కరుణశ్రీ,అంజమ్మ విజయ,మహేశ్వరి,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి: పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఒక్కరికి 3 హాస్టల్ల నిర్వహణ ఎలా సాధ్యం ? వార్డెన్లు అంటే పప్పులు ఉప్పు ఇవ్వడానికేనా ? ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

  

పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి సంక్షేమ హాస్టల్లో ఎంతో ఉపయోగపడతాయనుకుంటే జిల్లాలో ఒక వార్డెన్ కు మూడు హాస్టల్ నిర్వహణ ఎలా సాధ్యమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రశ్నించారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లు అంటే పప్పులు, ఉప్పులు ఇవ్వడానికేనా అని అన్నారు. నల్లగొండ జిల్లాలో 61sc సంక్షేమ హాస్టల్స్ ఉంటే 23 మంది ఉన్నారని,41 st సంక్షేమ హాస్టల్స్ ఉంటే 28 మంది ఉన్నారని, bc 42 హాస్టల్స్ ఉంటే 24 మంది మాత్రమే వార్డెన్లు మాత్రమే ఉన్నారని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

      

శుక్రవారం రోజు చిట్యాల మండలంలోని ఉరుమడ్ల sc సంక్షేమ హాస్టల్లో నిర్వహణ తీరుపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనము అందించాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ లో తల్లిదండ్రులను వదిలేసి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు వార్డెన్లు తప్పక పరిశీలించాలని చదువులో మెరుగైన సూచనలు అందించాలని కోరారు. సరియగు వసతులు కల్పించాలని ఫ్యాన్లు మంచినీరు టాయిలెట్స్ సక్రమంగా ఉంచాల్నారు. విద్యార్థులకు అందవలసిన కాస్మోటిక్ చార్జీలను వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వము పెట్టెలు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు ఈ విద్యా సంవత్సరంలో అందించాలని కోరారు. విద్యార్థులు జబ్బున పడకుండా వైద్యం సక్రమంగా అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సర్వేలు పూర్తయిన తర్వాత కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

   

ఈ సర్వే కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, నాయకులు అయితరాజు నరసింహ, బెలిజ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ: నేషనల్ వైస్ చైర్మన్ కృష్ణ మోహన్

పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి

ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ 

ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను తీవ్రతరం 

హామీ లేని జాతీయ పెన్షన్ విధానాన్ని (ఎన్ పీఎస్) రద్దు చేసి నిర్వచించబడిన, హామీ ఇవ్వబడిన పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని వేలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ బలగాలు, పెన్షనర్లు ఢిల్లీలో పెన్షన్ హక్కుల మహా ర్యాలీ నిర్వహించి రాంలీలా మైదానంలో గురువారం భారీ సభ ఎన్ జేసిఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన జరిపారు.

జాయింట్ ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపిఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర మరియు స్వయంప్రతిపత్త ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని నో పెన్షన్ స్కీమును రద్దు చేయాలని నినదించారు.

ఎన్ పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున ఓపీఎస్‌ ను పునరుద్ధరించడం న్యాయబద్ధమైన కోర్కె అని 

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ ఉపాధ్యక్షులు వి.కృష్ణ మోహన్ తెలిపారు.

జనవరి 1, 2004 న లేదా ఆ తర్వాత నియమించబడ్డ ఉద్యోగులకు అమలు చేయబడిన ఎన్ పీఎస్ ను ఉపసంహరించుకొని వారందరినీ ఓపీఎస్ పరిధి లోకి తీసుకురావాలని, పి.ఎఫ్.ఆర్.డి.ఏ ని రద్దు చేసి దానిలో ప్రతి నెలా జమ చేయబడ్డ 10 శాతం బేసిక్ పే మరియు డి.ఏ ను జీపిఎఫ్ పధకాన్ని అమలు చేసి దానిలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

కాని పి.ఎఫ్.ఆర్.డి.ఏ మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు 2004 నుండి పి.ఎఫ్.ఆర్.డి.ఏ కి అందించిన విరాళాలను తిరిగి పాత పెన్షన్ స్కీమ్‌కి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నాయని వాపోయారు.

పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, పింఛను బహుమతి కాదని, అది వారి జీవితంలో ఉచ్ఛ స్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించిన వారికి సామాజిక-ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తన స్వంత ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వి.కృష్ణ మోహన్ విమర్శించారు.

సీ.ఆర్.పీ.యఫ్, సీ.ఐ.యస్.యఫ్, ఐ.టి.బీ.పి, యస్.యస్.బీ, ఎన్.ఎస్.జీ, అస్సాం రైఫిల్స్ మొదలైన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీ.ఏ.పి.యఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీమ్‌కు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సీ.ఏ.పి.యఫ్ లకు కూడా ఓపీఎస్‌ని అమలు పరచటానికి తిరస్కరించటం శోచనీయమన్నారు.

 

ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు మరియు ఒక వర్గం మీడియా చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు.అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్ట పోయారని, భారత దేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గుర్తు చేశారు.

ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదనీ, సామాజిక రంగానికి మరియు వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాక దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘ కాలంగా అపరిష్కృతంగానున్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని వి. కృష్ణ మోహన్ హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ* అమ్మవారి బోనాల పండుగని విజయవంతం చేయండి: మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలిచ్చే తల్లి ఊర ముత్యాలమ్మ

- 13న బోనాల పండుగ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

- మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలు ఇచ్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారని సూర్యపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం దేవాలయానికి ఆర్చి నిర్మించ డముతో దేవాలయానికి కొత్త కళ వచ్చిందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో సూర్యాపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. వేయి కండ్లతో అందరిని కాపాడే ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో కన్నుల పండుగ జరుపుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో దేవాలయంలోని సమస్యలు పరిష్కారం అయ్యాయనీ అన్నారు. దేవాలయంలో బోనాల పండుగ రోజున భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ ఆవరణ మొత్తం ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని, పండుగ రోజున ప్రత్యేకంగా సిబ్బందిని పెంచి బందోబస్తును ఏర్పాటు చేయాలని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామానుజుల రెడ్డి, పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు సారగండ్ల రాములు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, సారగండ్ల శ్రీనివాస్, సారగాండ్ల కోటేష్, కోలా నాగరాజు, గుంటి సైదులు, వెంకులు, వెంకటేశం, అర్వపల్లి లింగయ్య, కొల లక్ష్మయ్య, ఇండ్ల వెంకటలక్ష్మి, ఎస్. వెంకన్న, మొర జానకిరమూలు, ఎస్. రంగయ్య, బసవయ్య, బైరు వెంకన్న తదితరులు ఉన్నారు.