/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన...రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా Miryala Kiran Kumar
మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన...రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా

గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రుణపడి ఉంటాము 

- మొహమ్మద్ మున్నా 

టిఆర్విఎస్ - అధ్యక్షులు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు సొంత జాగ ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు జూలై 21st న చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి, జి.ఓ ఇప్పించినందుకు వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. 

రాష్ట్రములోని వికలాంగులు సంతోషంతో ఉన్నారని సొంతింటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నారు. ఈ జీవోతో వికలాంగులలో అత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ జి.ఓ 25 కు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జివో నెంబర్ 33ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5% కేటాయిస్తారు. ఇది తెలగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో వికలాంగులకు లభించిన మరొక గొప్ప భరోసా.

మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన.రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా, దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న, గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన నేడు భారత రాష్ట్ర సమితి సంబరాలు

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన భారత రాష్ట్ర సమితి సంబరాలు 

గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీగా సంబరాలు నిర్వహణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు*

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పిలుపునిచ్చారు.

ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినదని, రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం అన్నారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రతి గ్రామము, మండలము, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి సంబరాలను ఎవరికి తోచిన విధంగా వారు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జి లు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులను కోరారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మంత్రి కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా తీసుకోని విధంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉన్నదని నేతలకు కేటీఆర్ చెప్పారు.

ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులను కేటీఆర్ కోరారు. అంతేగాక ఒకటి రెండు రోజుల్లో వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కేటీఆర్ సూచించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనాథలు అందరినీ ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చేసిన నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలనా నిర్ణయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. మెట్రో సేవలు అందుబాటులోకి రానున్న నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు.

మెట్రో విస్తరణతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దాంతో నగర విస్తరణ వేగంగా జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందుల పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.500 కోట్లు ప్రకటించిందని, ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

భూమి, కూలి పోరాటాలే కామ్రేడ్ కృష్ణమూర్తికి నిజమైన నివాళి

భూమి, కూలి పోరాటాలే కామ్రేడ్ కృష్ణమూర్తికి నిజమైన నివాళి

 వర్ధంతి సభలో నారీ ఐలయ్య

      తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 17 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

       

 ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య మాట్లాడుతూ కా"అమరజీవి కాచం కృష్ణమూర్తి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతంగా పోరాట ఉద్యమం అంచాలంచాలుగా ఎదిగి నిజం నిరంకుశ రాజరికన్ని అంతం చేసి, భూస్వాముల నుండి10 లక్షల ఎకరాలభూమి స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచడం జరిగిందని అన్నారు. 3000 గ్రామాల విముక్తి చేసే ఈ గ్రామాలను ప్రజారాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉద్యమానికి సారాధ్యం వహించి ప్రజలను చైతన్యపరిచింది ఆంధ్ర మహాసభ పేరిట ఉద్యమాలు నిర్వహించిన కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి కి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికిస్ఫూర్తిదాయకమని అన్నారు. కూలి భూమి పోరాటాలే వారికి నిజమైన నివాళి అని అన్నారు

       

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య , నలపరాజు సైదులు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, జిల్లా ఆఫీస్ బేరర్స్ కత్తుల లింగస్వామి, మన్నెం బిక్షం, గoడమల రాములు, నల్లగొండ మండల అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అంజయ్య,గోలి నర్సింహ,పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష యాదయ్య, తెలకలపల్లి శ్రీను,బోడ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..

రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.

TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు... మీ ముందు

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు….

సహచర మంత్రులతో కలిసి వివరాలు వెల్లడించిన కేటీఆర్ గారు 

వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించాం.

తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

ప్రజా రవాణా ను పతిష్టపరిచేందుకు

టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

43వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు,క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం

3న జరిగే శాసన సభలో ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు.

హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని నిర్ణయం

మూడు నాలుగేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి పంపుతాం

రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానం.

వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టు కు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం

హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉంది.

హాకింపేట ఎయిర్పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం

మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం

రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధి పై క్యాబినెట్ లో పలు నిర్ణయాలు

వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం.

కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలి.అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలి!!

అంగన్వాడి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి ---సిఐటియు

అంగన్వాడి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి ---సిఐటియు

      

నారాయణపేట జిల్లా మద్దూరు సిడిపిఓ అంగన్వాడి ఉద్యోగుల పట్ల వేధింపులు ఆపాలని సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య కోరారు

       సోమవారం నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ బాసిత్ కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ బిఎల్ఓ డ్యూటీలు ఇతర సందర్భాల్లో నారాయణపేట జిల్లా మద్దూర్ సిడిపిఓ వేధింపులకు గురి చేస్తూ నలుగురిని టెర్మినేట్ చేయడం, 100 మంది వరకు మెమోలు ఇవ్వడం విచారకరమని అన్నారు. సిడిపిఓ పై చర్య తీసుకోవాలని జూలై 10న కలెక్టరేట్ ధర్నా సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన హామీ అమలు చేయకుండా తిరిగి సిడిపిఓ అంగన్వాడీ ఉద్యోగులను వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు. మద్దూరు సిడిపిఓ ఆగడాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామని, ఆమెపై చర్య తీసుకుని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

   

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి నల్లగొండ ప్రాజెక్టు నాయకులు మని రూప పాదూరు లక్ష్మి భారతి రత్న భవాని తదితరులు పాల్గొన్నారు*

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ 3 నెలలు.. రూ.50,910 కోట్లు

తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది.

వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది.

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ

బడ్జెట్‌ అంచనాల్లో 20% రాబడి

నిరుడు కంటే 7,360 కోట్లు అధికం

పన్నుల రూపంలోనే 31 వేల కోట్లు

జీఎస్టీ ద్వారా 11 వేల కోట్ల రాక

స్టాంపులు, రిజిస్ట్రేషన్లతో 3 వేల కోట్లు

కాగ్‌ త్రైమాసిక నివేదికలో వెల్లడి

తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రాష్ర్టానికి రూ.2,59,861.91 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో అంటే.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కలిపి మొత్తం రూ.50,910.11 కోట్లు ఖజనాకు చేరాయి. అంటే.. బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే సుమారు 20 శాతం ఆదాయం సమకూరినట్టే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,256.61 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, నిరుడు జూన్‌ వరకు రూ.43,550.51 కోట్లు వచ్చా యి. అంటే.. అప్పటి బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే వచ్చింది 18 శాతం. అయితే… గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరింది. శనివారం కాగ్‌ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. అందులో తెలంగాణ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్న తీరును వర్ణించింది. కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నా… తెలంగాణ మాత్రం ఆర్థికంగా ఏటికేడు బలపడుతూనే ఉన్నది. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కొర్రీలు పెడుతున్నా… సీఎం కేసీఆర్‌ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

జీఎస్టీదే అగ్రస్థానం

రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ రాబడే అగ్రస్థానంలో ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి జీఎస్టీ రూపంలో రూ.50,942.49 కోట్లు వస్తుందని ఆర్థిక అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి రూ.11,418.47 కోట్లు వసూలైంది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 22 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపం లో రూ.42,189.47 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. మొదటి త్రైమాసికానికి రూ. 9,645.14 కోట్లు వచ్చింది. అంటే నిరుడితో పోలిస్తే ఈ సారి రూ.1,773.33 కోట్లు అధిక రాబడి వచ్చిం ది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.18,500 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా, జూన్‌ నాటికి రూ. 3,510.63 రాబడి సమకూరింది. అమ్మకం పన్ను రూపంలో రూ.7,532.96 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ.2,988.88 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,488.10 కోట్లు రాబడి వచ్చింది. ప్రధాన వ్యయాలను పరిశీలిస్తే రెవెన్యూ ఖాతా ఖర్చు రూ.15,406.89 కోట్లు ఉన్నది. వేతనాల కోసం రాష్ట్రం వెచ్చించింది రూ.9,796.83 కోట్లు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పింఛన్ల రూపంలో రూ.4,158.57 కోట్లు వెచ్చించింది. ఇలా.. జూన్‌ నెల వరకు రాష్ర్టానికి రూ.50,910.11 కోట్లు సమకూరగా, అన్నింటికీ కలిపి రూ.47,290.64 కోట్లను రాష్ట్రం ఖర్చు చేసింది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే రాష్ట్రం వెచ్చిస్తున్నది. పటిష్ట ప్రణాళికతో ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకొంటున్నది.

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నందు నిరసన కార్యక్రమం

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నందు నిరసన కార్యక్రమం గురుకుల ఉద్యోగ పరీక్షలు వారి జిల్లాల్లో సెంటర్ వేయకుండా విద్యార్థులను 200 కిలోమీటర్ల దూరంలో పరీక్ష ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు టీచర్ అర్హత పరీక్ష రాయలేకపోవడం జరుగుతుంది ఒక్క పరీక్షకి 2000 రూపాయలు అయితే ఉన్న నాలుగు పరీక్ష పేపర్లు రాయాలంటే సుమారుగా ఒక్కొక్క విద్యార్థి పదివేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు వారి సొంత జిల్లాలోనే అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల్లో గురుకుల టీచర్ పరీక్ష తేదీలను దూర ప్రాంతం విద్యార్థుల కేటాయించడం పట్ల విద్యార్థులు ఉద్యోగ పరీక్ష రాయకపోవడం జరిగి వారికి పూర్తి అన్యాయం జరుగుతుంది కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సొంత జిల్లాల్లో సుమారు 20 కిలోమీటర్ల పరిధి లోపల సెంటర్లు ఏర్పాటు చేయాలని లేని ఎడల అనేక ఉద్యమాలు విద్యార్థుల పట్ల చేస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు నరేందర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ జిల్లా అద్యక్షులు మిర్యాల శివ కుమార్

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఆర్యవైశ్యుల లో ఉన్న పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ జిల్లా అద్యక్షులు మిర్యాల శివ కుమార్ తెలిపారు.ఆదివారం హైదరాబాద్ లోని ముషిరాభాధ్ నందు ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి అన్ని వైశ్య కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్యులంతా ఐక్యంగా ఉండి తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ సాధన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సభ్యులు ఈగా దయాకర్ గుప్త అధ్వర్యంలో తరలి వెళ్లే వారిలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్ కోశాధికారి గుడిపాటి రమేష్, రాష్ట్ర నాయకులు బొనగిరి విజయ్ కుమార్ సభ్యులు గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం,చల్లా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.