/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి Miryala Kiran Kumar
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం 

కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి 

 సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

       కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల చేస్తున్న పోరాటంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.

     

శుక్రవారం సిఐటియు నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని విమర్శించారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం 26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మిక హక్కుల పై దాడి అధిక ధరలు నిరుద్యోగం ప్రజలందరి సమస్యల పైన 11 కేంద్ర కార్మిక సంఘాలు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో జిల్లా కలెక్టరేట్ల ముందు ఆగస్టు 10న ఆర్డీవో కేంద్రాలలో జరిగే ధర్నా ల లో కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు.

      

కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో , కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. సమ్మెల పట్ల మొండి వైఖరి విడనాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు,ఐకెపి వివో ఏ, ఆశ వర్కర్స్ ,మున్సిపల్, ఆర్టీసీ, సింగరేణి, అంగన్వాడి ,మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ స్వీపర్ల్, కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ రకాల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ చేసి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని తెలియ చేశారు . ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు

    

   సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి ,జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదయ్య, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నారబోయిన శ్రీనివాస్, మల్లు గౌతమ్ రెడ్డి, కానుగు లింగస్వామి,  జిల్లా కమిటీ సభ్యులు పెంజెర్ల సైదులు, కరిమ్మున్నిసా బేగం, అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ, దయానంద్, భీమ గాని గణేష్, సలివొజు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, సాగర్ల యాదయ్య, సుందరయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

రూపాయలు 250 లాటరీ కట్టి ... రూపాయలు 10 కోట్లు జాక్పాట్

రూపాయలు 250 లాటరీ కట్టి ...

రూపాయలు 10 కోట్లు జాక్పాట్

మలప్పురమ్: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్ కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు...!

అది ఈ మహిళల విషయంలో జరిగింది. కేరళలోని మలప్పురము జిల్లాలో పరప్పనగాడి మున్సిపాలిటీలో హరిత కర్మసేన అనే విభాగం ఉంది. ఇందులో పనిచేస్తున్న 11మంది మహిళలు తమ దగ్గర ఉన్న చిల్లరంతా జమ చేసి 250 రూపాయల తో లాటరీ టికెట్ కొన్నారు. అదృష్టం కలిసి రావడంతో వీరి టికెట్ కే లాటరీ తగిలి ఏకంగా రూ.10 కోట్ల జాక్పాట్ కొట్టారు.

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న ;(సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా..భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.

రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న నల్లగొండ 35వ వార్డు ముఖ్య నాయకులు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న నల్లగొండ 35వ వార్డు ముఖ్య నాయకులు

నల్గొండ పట్టణం లోని బిఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ 35వ వార్డు ముఖ్య నాయకులు పాల్గొని కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా కేటీఆర్ మీద ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. యువతకి ఎంతో ఆదర్శమని, తండ్రి అడుగుజాడల్లో నడిచే యువ నాయకుడు యువతరానికి ఆదర్శమని వారు పొగిడారు.

ఈ కార్యక్రమంలో 35 వార్డు నల్గొండ టౌన్ బిఆర్ఎస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ cheripelly జయప్రకాష్, 35 వార్డు అధ్యక్షుడు తలారి యాదగిరి, వాడు ముఖ్య నాయకులు అక్కనపెల్లి చక్రవర్తి గారు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.

విఆర్ఏల సర్దుబాటుపై సీఎం సమీక్ష

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్​ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీఆర్​ఏల సర్దుబాటుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.

ఉన్నతాధికారులు, వీఆర్ఏ ఐకాసతో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నీటిపారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వీఆర్ఏల సర్దుబాటుపై ఈ నెల 11న జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

వీఆర్​ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జులై 10న నిర్వహించిన సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్​ఏలతో చర్చలు ప్రారంభించాలని తెలిపిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్​ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ కార్యదర్శి

పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం. 

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు.

వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (తాప్రా) పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పోరాట స్ఫూర్తితో సామూహిక ప్రదర్శనలు నిర్వహించి గురువారం కలెక్టర్ల ద్వారా చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాలను సమర్పించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఈపియస్, సింగరేణి తదితర పెన్షనర్లకు ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభినందనలు తెలిపారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీ.పి.ఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పి.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పెన్షనర్లు పొందేది జీవనభృతి కావున ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలలో గతంలో రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

8వ కేంద్ర వేతన కమీషన్ (సి.పీ.సీ), రాష్ట్ర పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సీ)లను వేసి ఇంటరిమ్ రిలీఫ్ ను ప్రభుత్వాలు ప్రకటించాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రీస్టోర్ కాలాన్ని 15 సంవత్సరాలకు బదులుగా 12 సంవత్సరాలకు కుదించాలని కోరారు. అన్ని జిల్లాల్లో వెల్ నెస్ సెంటర్లను ఏర్పరిచి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని, నగదు రహిత చికిత్స వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.

*ఈ.పి.ఎస్- 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000/- నుంచి పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పులను నిజ స్ఫూర్తితో అమలు పరచాలని, పెన్షన్ ఫండ్ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి తదితర కోల్ మైన్ పెన్షనర్ల కనీస పెన్షన్ ను రూ.350/-, రూ.250/- నుంచి పెంచాలని, కరువు భత్యం చెల్లించాలని, పెన్షన్ ను పెంచాలని వి.కృష్ణ మోహన్ కోరారు. సమస్యలు వెంటనే పరిష్కరించనట్లైతే ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు ఐక్యంగా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు.

దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే:టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి

మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్

దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే

దివ్యాంగులకు పెంచిన పింఛన్ 4016 రూ.జీవో అర్ టి నెంబర్ 25 జారీ.

  --- టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు..

      ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు దివ్యాంగులను గుర్తించలేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి,పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన దివ్యాంగులు,వృద్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు,నేత,గీత,బీడీ కార్మికులందరూ మరియు ఇతరులు గౌరవప్రదమైన,సామజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2014లో ఆసరా పింఛన్ పథకం ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి తెలిపారు.

     తెలంగాణ రాక ముందు 3,50,487 మంది దివ్యాంగులకు రూ.500 చొప్పున నెలకు 17.52 కోట్లు అందేవి.ప్రస్తుతం పెంచిన పింఛన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4016 చొప్పున నెలకు 205 కోట్ల 48 లక్షల 10 వేల 496 రూపాయలు అందుతున్నాయని కోరారు.

      దేశంలో ఎక్కడ లేని రీతిలో మన రాష్ట్రంలోనే దివ్యాంగులకు 3016రూ, నుంచి 4016 రూ. పింఛన్ ఇవ్వడం దేశంలోనే ఏకైక తెలంగాణ రాష్ట్రమని గొప్ప విషయమని చెప్పారు.పెరిగిన పింఛన్ తో రాష్ట్రంలోని దివ్యాంగులందరూ గౌరవంగా తమ బతుకులు సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నామని,మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్,ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు పింఛన్లు పెంచమని జీవో జారీ అర్.టి నెంబర్ 25 జారీ చేయడం జరిగిందన్నారు.సీఎం కెసిఆర్ ఉన్నంత వరకు రుణపడి తమకు అండగా ఉంటామని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి ప్రత్యేకంగా సీఎం కెసిఆర్ కు,మంత్రులకు, మరియు రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు దివ్యాంగ పక్షాన తెలుపుతున్నమన్నారు.

రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం

రాష్ట్రంలోని బిసిలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు.

మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని సీఎం అన్నారు. 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి.

- బకరం శ్రీనివాస్ మాదిగ 

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్

ఆగస్టు రెండో వారంలో మాన్యశ్రీ మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన మాదిగల విశ్వరూప మాహాసభను జయప్రదం చేయడానికై ఈనెల 30న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించబోయే నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహాక సదస్సును మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం అచ్చంపేట నియోజకవర్గం స్థాయి సమావేశం ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ సౌట ఖాసిం అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ....

ఈదేశాన్ని 9సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం 100 రోజుల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తా అన్న హామీని కనీసం పార్లమెంటులో 100 నిమిషాల పాటు కూడా మాట్లాడకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగ మాదిగ ఉపకాలాలను అవమానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ బీజేపీని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చేనెల రెండో వారంలో దక్షిణ భారతదేశంలో 30 లక్షల మంది మాదిగ, మాదిగ ఉపకులాలతో హైదరాబాద్ గడ్డమీద బిజెపి పార్టీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మహోత్తరమైనటువంటి న్యాయమైన ధర్మమైనటువంటి అంశానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో MRPS, MSP, MSF, నాయకులు బుక్కాపురం మహేష్, భరత్, ఆంజనేయులు, కొయ్యల వెంకటేష్, గుద్దటి ప్రవీణ్, చిట్టి గోరి పవన్, శ్రీకాంత్, చింతకుంట్ల నిరంజన్, కొమ్ము రాంప్రసాద్, రాజు, భగవంతు, మల్లేష్, సురేష్, రేనయ్య తదితరులు పాల్గొన్నారు.

తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నవీకరించిన:ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్... నవీకరించిన మొదటి అంతస్తు భవనాన్ని.. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ...

 

ఇక్కడికి వచ్చిన వారంతా పెద్దవారుఎంతో అనుభవం ఉన్నవారని .. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో .... ఎంతోమంది బలిదానాలు చేసినా... సంకుచిత రాజకీయాలతో తెలంగాణను అడ్డుకున్నారని... నేడు కేసీఆర్ నాయకత్వంలో.... అకుంఠిత దీక్షతో.. అహింసా పద్ధతులతో... మీ అందరి సహకారంతో.. చావు అంచుల వరకు వెళ్లి, ఢిల్లీ నాయకుల మెడలు వంచి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. తెచ్చిన తెలంగాణాన్ని... బంగారు తెలంగాణగా దేశంలోనే అగ్రభాగాన నిలిపారని... కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు... అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారని.. ఒకప్పుడు మూడు లక్షల టన్నుల ధాన్యం పండించలేని తెలంగాణ రాష్ట్రం ఈనాడు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని... ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించిందని తెలియజేశారు....

నల్లగొండలో మార్పు కోసం... శాసనసభ్యుగా తనను గెలిపించిన తర్వాత... కెసిఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ ను 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి... సుందర నందన వనంగా తీర్చిదిద్దుతున్నామని... ఇప్పటికి కేవలం 25% పనులు మాత్రమే పూర్తయ్యాని మరో 75% పనులకు నిధులు కేటాయించబడి పనులు పురోగతిలో ఉన్నాయని... మరో రెండు సంవత్సరాల తర్వాత అవి పూర్తి అయ్యి నల్లగొండ రూపురేఖలే మారతావని తెలియజేశారు...

 

ఈ భవనం. నవీకరణ కోసం మరో 15 లక్షల రూపాయలు తమ నిధులనుండి మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్... టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్.. రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు... వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి... లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.