/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz గాయపడిన శారదను పరామర్శించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, కెవిపిఎస్ నాయకులు Mane Praveen
గాయపడిన శారదను పరామర్శించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, కెవిపిఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా: పీఏ పల్లి మండల కేంద్రంలోని వద్దిపట్ల గ్రామంలో ఏనిక శారద భర్త వెంకటేశ్వర్లు ఎస్సీ మాల కులానికి చెందిన ఆమెను..శనివారం వారి వ్యవసాయ పొలం దగ్గర భూ వివాదంలో అదే గ్రామానికి చెందిన కొంత మంది, ఆమె పై దాడి చేసి ఆమె పండ్లు ఊడిపోయిన విధంగా కొట్టి గాయపరిచినారని, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ మరియు కెవిపిఎస్ నాయకులు తెలిపారు.
దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శారదను పరామర్శించి గొడవకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను వారు కోరారు. బాధ్యులపై కులం పేరుతో దూషించి గాయపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పండ్లు ఊడిపోయే వరకు కొట్టినందుకు ఇతర చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని దోషులను శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంబేద్కర్ అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయకుమార్, జిల్లా నాయకులు ధర్మాపురం శీను, వాస్కుల రాజ్ కుమార్, పర్వతం శివలింగం, బుడిగ గిరి, గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
బొజ్జగూడెం తండా: తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా, అనంతగిరి: మండలం బొజ్జగూడెం తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  కోదాడ ఎమ్మేల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
నర్సిరెడ్డి గూడలో టీబీ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండల టిబి, లెప్రసీ నోడల్ అధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం, మండలంలోని నర్సిరెడ్డి గూడ గ్రామంలో ఏసిఎఫ్ క్యాంపు నిర్వహించి, టీబీ వ్యాధి పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. టీబి వ్యాధి వ్యాపించే విధానం, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్ష కొరకు ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పి డాక్టర్ శ్రీనివాస్, ఎంపిహెచ్ఎ నవీన్, లక్ష్మీ, సునీత, ఆశాలు సుజాత, దుర్గమ్మ, మేరీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
17వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె, మద్దతు తెలిపిన ప్రియదర్శిని

నకిరేకల్: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని నిరసన దీక్షలో పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి  ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలపాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడకా విజయ్, నకిరేకల్ మండల అధ్యక్షులు  చెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి పబ్బతి శ్రీశేలం, మండల అధ్యక్షులు పల్స సైదులు , ఉపాధక్షులు రాంరెడ్డి, కార్యదర్శి కందికంటి ప్రకాష్, కోశాధికారి నకిరేకంటి మట్టపల్లి, గద్దల విమలమ్మా, శ్రీనివాస్, యాదయ్య, వెంకటమ్మ, అలివేలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

నల్లగొండ జిల్లా, హాలియా: అల్పపీడ ప్రభావం వలన వర్షాలు పడుతున్నందున, పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి తెలిపారు. పట్టణంలో వివిధ వార్డులలో శిథిలావస్థకు చేరిన గృహాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు వహించాలని అన్నారు.
వర్షాభావ పరిస్థితుల వలన ఇంటి పైకప్పు మరియు గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్న నివాసయోగ్యం లేని ఇళ్లలో  నివసించకుండా సురక్షిత ప్రాంతాల్లో నివాసం ఉండాలని ప్రజలను కోరారు.
TS: ఎస్సీ, ఎస్టీ గురుకులాల నూతన సెక్రెటరీ నవీన్ నికోలస్ కలిసిన పిపిఎల్ కమిటీ
హైదరాబాద్: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్టీ, ఎస్టీ గురుకులాల సెక్రెటరీ నవీన్ నికోలస్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించి, నిరంతరం శ్రమించి తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిపిఎల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మచ్చ నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ఇతర రాష్ట్ర నాయకులు, పిపిఎల్ నల్లగొండ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహిత కు.. బీఎస్పీ ఆధ్వర్యంలో సన్మానం
రామన్నపేట: మండల బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేట సూర్య ప్రభంజనం  ఎడిటర్ గృహంలో, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని,నియోజకవర్గ ఉపాధ్యక్షులు  పావిరాల నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో సూర్య ప్రభంజనం ఎడిటర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు.
రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు  గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కోశాధికారి గట్టు రమేష్, నాయకులు బెల్లి మల్లయ్య యాదవ్, నకిరేకంటి స్వామి, బొడ్డు నవీన్, మేడి తేజ, మేడి చందు, నకిరేకంటి హరీష్, మేడి నిఖిల్, గొర్ల నర్సింగరావు , మేడి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
NLG: దోమల మందును పిచికారి చేపించిన కౌన్సిలర్  గడిగ హిమబిందు శ్రీనివాసులు
నల్లగొండ: మున్సిపాలిటీలోని  18వ వార్డులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వార్డులోని ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికి, శుక్రవారం మురికి నీరు నిల్వ ఉన్న పలు చోట్ల మరియు ఓపెన్ నాలా లలో దోమల నివారణ కొరకు దోమల మందును,  కౌన్సిలర్  గడిగ హిమబిందు శ్రీనివాసులు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అన్నారు.
Mane Praveen

నల్లగొండ జిల్లా, మునుగోడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టీపీసీసీ అధికార ప్రతినిధి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవ

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి: పాల్వాయి స్రవంతి
నల్లగొండ జిల్లా, మునుగోడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టీపీసీసీ అధికార ప్రతినిధి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి గురువారం ప్రజలకు పలు సూచనలు చేశారు.
సుర్వి లింగస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా: తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సుర్వి లింగస్వామి గౌడ్ (47) అనే గీత కార్మికుడు తన దిన చర్యలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో, ఈదురుగాలులు రావడంతో చెట్టు పై నుంచి జారిపడి గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని  మాట్లాడుతూ.. కులవృత్తిని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కార్మికుడు ఆకస్మాత్తుగా మృతి చెందడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే, బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్సిగ్రేషియా ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.