/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్ Yadagiri Goud
OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు.

పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు.

ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ బంధించింది. దీంతో ఈరోజు (బుధవారం) ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.725 కేజీల బంగారాన్ని మంగళవారం రాత్రి కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం..

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది.

దాంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇద్దరి వద్ద 1.725 కేజీల బంగారు నగలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్‌ చేశారు. కాగా, బహిరంగ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.72,55,069 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు...

SB NEWS

నేడు తిరుమల లో సాధారణ భక్తుల రద్దీ

తిరుపతి :జులై 19

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం స్వామివారిని 64,003 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 24,659 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖలో నువ్వు మంత్రివా? : అటెండర్ వా?

ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామంటున్నారు.

తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా?. జగదీష్ రెడ్డి నువ్వు మంత్రివా? లేక ఆ శాఖలో అటెండర్ వా ?. అసలు నువ్వు ఎప్పుడైనా ఉచిత కరెంటుపై సమీక్ష చేశావా?. ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేశారు.

కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు విద్యుత్ ఉద్యోగుల ఖాతాలో పడేవి. కానీ బీఆరెస్ పాలనలో 20వ తేదీ వచ్చినా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారింది.

ఇందుకు సిగ్గుతో తలవంచుకుని జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది జగదీష్ రెడ్డే". అని రేవంత్ రెడ్డి విమర్శించారు....

పది మంది అదనపు ఎస్పీల బదిలీలు

తెలంగాణలో 10 మంది అదనపు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

బదిలీ అయిన వారిలో బీవీ సత్యనారాయణ, టీవీ హనుమంతరావు, ఇక్బాల్ సిద్ధిఖీ, కె. నర్సింహారెడ్డి, ఎన్వెంకటరమణ, పి. అశోక్, జి. శ్రీనివాస్, జి. మధుసూదన్రావు, సయ్యద్ రఫీక్, పి. సత్యనారాయణ ఉన్నారు.

బదిలీకి సంబంధించిన వివరాలను ఈ దిగువన చూడొచ్చు. కాగా, ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మరి కొంతమంది నాన్ క్యాడర్ ఎస్పీ లు, ఐపీఎస్ ల బదిలీ జరిగే అవకాశాలున్నాయి...

SB NEWS

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు : మంత్రి హరీశ్‌రావు

ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.

ఇందుకు లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బయోమెట్రిక్‌ విధానంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చారు.

సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

బోర్డు మరికొన్ని నిర్ణయాలు..

మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని బోర్డు నిర్ణయించింది. మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ జరిపేలా ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వాటి సంఖ్యను 103కు పెంచింది. ఫలితంగా డయాలసిస్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రంలోనే డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి.

కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగుచేసే ‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇకపై ఈ తరహా సేవలను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో కూడా అందుబాటులోకి తేవాలని కమిటీ నిర్ణయించింది...

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదారి పరవళ్ళు* l

భ‌ద్రాచలం జిల్లా :జులై 18

గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది.

గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వచ్చి తాలిపేరు ప్రాజెక్టులో చేరుతున్నాయి.

ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,000 క్యూసెక్కుల వరద నీటిని దిగునున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరులశాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపటికి గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారుల అంచనా.

నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. సింగరేణి అధికారులు నీటిని మోటర్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా 503.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు....

ప్రతిపక్షాల కూటమి పేరు I-N-D-I-A..?

•ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ పేరుతో ఎన్నికల్లోకి!

న్యూఢిల్లీః 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించేందుకు, వ్యూహాలు రచించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విపక్షాలు రెండో రోజైన మంగళవారం సమావేశమయ్యాయి..

ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. విపక్ష పార్టీల ఐక్య కూటమికి పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీల ఫ్రంట్‌కు I-N-D-I-A అనే పేరును ప్రతిపాదించగా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A- భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్ఠి కూటమి) అనే పేరు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఫ్రంట్ నేతలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

నిన్న జరిగిన విందు సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్రంట్‌కు పేరు సూచించాలని సూచించారు. ఈ రోజు ఆ పేర్లను పరిశీలించి, చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా I-N-D-I-A పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది..

ఈ రోజు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శరద్ పవార్ నిన్నటి భేటీకి హాజరు కాలేదు. కానీ ఈ రోజు మాత్రం హాజరయ్యారు..

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి

రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి జ‌న్మ‌దినం నేడు. 58 వ‌సంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి జగ‌దీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు.

అలాగే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వేరు వేరుగా మంత్రి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు...

SB NEWS

SB NEWS

Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

కడప (చిన్నచౌక్‌): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు.

స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు..

ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు..