/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ Yadagiri Goud
Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

కడప (చిన్నచౌక్‌): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు.

స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు..

ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు..

ఏలూరులో ఆశ వర్కర్ల ధర్నా

ఏలూరు :జులై 18

ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆశావర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు....

SB NEWS

SB NEWS

SB NEWS

Nitish Kumar: ప్రతిపక్షాల భేటీ.. నీతీశ్‌ కుమార్‌ను విమర్శిస్తూ పోస్టర్లు..

బెంగళూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమి లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించాయి..

రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. అయితే, విపక్షాల రెండో రోజు భేటీ సందర్భంగా బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరులోని చాళుక్య సర్కిల్‌ సహా అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రతిపక్షాల భేటీ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం..

ఒక పోస్టర్‌లో బిహార్‌లో సుల్తాన్‌గంజ్‌ వంతెన కూలిపోవడాన్ని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. ' బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు స్వాగతం. సుల్తాన్‌గంజ్‌ వంతెన నీతీశ్‌ కుమార్‌ బిహార్‌కు ఇచ్చిన బహుమతి. అది ఎప్పుడూ కూలిపోతూనే ఉంటుంది. నీతీశ్‌ పాలనను బిహార్‌లో వంతెనలు తట్టులేకపోతున్నాయి. అలాంటి వ్యక్తిపై ప్రతిపక్షాలు ఐక్యత కోసం ఆధారపడుతున్నాయి' అని ఒక పోస్టర్‌లో రాశారు. మరో పోస్టర్‌లో 'నిలకడలేని ప్రధానమంత్రి పోటీదారు. బెంగళూరులో బిహార్‌ సీఎంకు రెడ్‌కార్పెట్‌ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. సుల్తాన్‌గంజ్‌ బ్రిడ్జ్‌ మొదటిసారి కూలింది ఏప్రిల్ 2022, రెండోసారి కూలింది జూన్ 2023' అంటూ విమర్శించారు..

ఈ పోస్టర్ల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కార్పొరేషన్‌ సిబ్బంది సహాయంతో వాటిని తొలగించారు. విపక్షాల భేటీలో భాగంగా రెండో రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతిపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, కన్వీనర్‌గా బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది..

పుట్టిన రోజున మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి సునితతో కలసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్, అనిల్ కుర్మాచలం, రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు మంత్రి జగదీశ్‌ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రితో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.......

తడిసి ముద్దయిన హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి భారీగా వర్షం కురుస్తూనే ఉంది మంగళవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది, బుధవారం కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని తెలిపింది. బుధవారంలోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా.

మరోవైపు ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి...

SB NEWS

గాలి అనిల్ వైపే అధిష్టానం చూపు?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నది. ఇందుకు దీటుగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది.

ఇందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. సీనియర్లు, జూనియర్లు అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఎవరికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుపై కాంగ్రెస్ అధిస్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్‌ను బరిలో దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఆర్థిక, స్థానిక బలం ఉండాలని ఈ నేపథ్యంలోనే అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వేగంగా మారుతున్న పరిణామాలతో పటాన్ చెరు కాంగ్రెస్ రాజకీయంగా రసవత్తరంగా మారుతున్నది...

ఉమెన్ చాందీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రజా నాయకులు ఉమెన్ చాందీ, ఆయన మరణం కేరళకు తీరని లోటన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పని చేశారన్నారు.

ఆయన మరణం కేరళ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు...

Operation Trinetra 2: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్‌ త్రినేత్ర-2.. నలుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ త్రినేత్ర-2 సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు..

సోమవారం రాత్రి 11.30 సమయంలో భద్రతా దళాలు సింధార ప్రాంతంలో డ్రోన్లను ఎగురవేసి గస్తీ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. మంగళవారం ఉదయం వరకు భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్టీయ రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టాయి..

పూంఛ్‌లోని సురాన్‌ కోట్‌ సమీపంలో సింధార, మైదాన గ్రామాల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం పేర్కొంది. వీరి వద్ద ఏకే-47 తుపాకులు, పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. వీరు రాజౌరీ, పూంఛ్‌ ప్రాంతాల్లో భారీగా దాడులు చేయడానికి వచ్చినట్లు వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో విదేశీయులున్నట్లు సైన్యం తెలిపింది. వీరి స్థావరంలో గ్రనేడ్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా ప్రత్యేక దళం, సైన్యం కాలాఝూలా అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. దీంతోపాటు పూంఛ్‌ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు..

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా నేడు విడుదల

తిరుమల: జూలై18

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం నేటి ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

అలాగే అక్టోబరు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ టికెట్లు, టోకెన్లను ‘తిరుపతి బాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది..

విద్యార్థుల భావోద్వేగ నైపుణ్యాలపై విద్యాశాఖ కసరత్తు

విద్యార్థుల్లో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో విద్యాశాఖ పని తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7 వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పై ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణలపై ప్రోత్సహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో మెరుగైన 1500 ఆవిష్కరణలను ప్రోత్సహించి. ఒక్కో ఆవిష్కరణకు రూ.రెండు వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి, వీరిని భవిష్యత్ లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు......