/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి. Miryala Kiran Kumar
నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం.

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి...

నల్లగొండను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 38వ వార్డులో రెండు లక్షల వ్యయంతో హైమాక్స్ లైట్లు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో కనివిని ఎరుగని రీతిలో నల్గొండ పట్టణం ఎంతో అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగోనీ రమేష్, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీను, నాయకులు గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కాసం శేఖర్ తదితరులు ఉన్నారు..

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి నల్గొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఘనంగా సన్మానం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 

నేడు నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది పెరుమాళ్ళ కుమారి గారు కరోనా సమయంలో పేద ప్రజలకు ఎంతో అండగా వుండి మనం ఫౌండేషన్ ద్వారా లేదా విద్యార్థులకు పేద ప్రజలకు అనాధాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఎన్నో సహాయ సహకారాలు 2017 నందు దళితరత్న అవార్డు గ్రహీత చేస్తున్న దృశ్య వారికి జాతీయ పురస్కారాల్లో భాగంగా నంది అవార్డు ఇవ్వడం పట్ల హర్షిస్తూ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ cholleti ప్రభాకర్ గారు రిటైర్డ్ ఎస్ డబ్ల్యూ షణ్ముఖ గారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి గారు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ సత్యశోధక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు గదే లింగస్వామి బీఎస్పీ సీనియర్ నాయకులు రంగాపూరి యాదయ్య 

sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ప్రజలకు సేవ చేయాలని మరిన్ని అవార్డులు రావాలని తెలిపారు మాతంగి లింగస్వామి పెరిక అంజయ్య కట్టెల మహేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ ఇంచార్జ్ కుడుతాల నాగరాజు mrps అధ్యక్షులు కత్తుల సందీప్ సన్నీ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ గంట సుమన్ mrps మస్రం వెంకన్నరమేష్ వెంకన్న కిన్నారా విజ్ఞాన్ వంగూరు బన్నీ  కత్తుల సాయికిరణ్ పాల్గొన్నారు.

పెరిగే ధరలకు హద్దు లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు

పెరిగే ధరలకు హద్దు లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు

 కూరగాయల ధరలు అదుపు చేయడంలో విఫలం చెందిన పాలకులు

   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

ప్రతిరోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి సామాన్య ప్రజలు లబోదిబోమంటూనే ఉన్నారు పెరిగే ధరలకు హద్దే లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి విమర్శించారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో కూరగాయలతో నిరసన తెలియజేసి ధరలు నియంత్రించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ టమాటా 140 రూపాయలు కూరగాయలు 80 నుంచి 100 రూపాయల వరకు కేజీ పెరిగిపోయినప్పటికీ ధరలు అదుపు చేయడంలో చిత్తశుద్ధి లేని పాలకులు ప్రజలపై భారాలు మోపుతున్నారని కార్పోరేట్ దోపిడీదారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని సిగ్గులేని పాలకుల తీరు ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల అప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత తన మాట అన్నట్లుగా నేడు పెరుగుతున్న ధరలతో కొనలేని తినలేని పరిస్థితులు దాపురించాయని " ఏముకొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు, ధరలు ఇట్లా పెరగబట్టే నాగులు నాగన్న ధరల మీద మన్ను పొయ్య నాగులో నాగన్న పాలించే పాలకులు నాగులు నాగన్న మన నడ్డి విరగొట్టే నాగులో నాగన్న " అన్న చందంగా తయారయిందని ప్రజలు పాలకులకు బుద్ధి చెప్పడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వెలుబుచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, పట్టణ అధ్యక్షురాలు తుమ్మల పద్మ, సాబేర బేగం, నుష్రత్ ఉన్నిస్సా, పుష్పలత, భార్గవి, గీత,కవిత,నర్మద, కవిత,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం..

★ రైతు యుద్ధ వేదిక

★ 3 గంటలు నశించాలి.. 

   3 పంటలు వర్ధిల్లాలి

★ గాంధీభవన్‌లో గాడ్సే 

★ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఆరెస్సెస్‌ ఏజెంట్‌

★ ఎమ్మెల్యేలను కొనటంలో సిద్ధహస్తుడు

★ బాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌

★ రాహుల్‌గాంధీకి ఎడ్లు తెల్వదు.. 

   వడ్లు తెల్వదు

★ హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు

★ ప్రతి బడిని కేసీఆర్‌ సర్కారే బాగుచేస్తున్నది

★ జగిత్యాలలో మీడియాతో మంత్రి కేటీఆర్‌

★ నేటి నుంచి రైతు సభలు

★ కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక 

   విధానాలపై తీర్మానాలు

★ రేవంత్‌ తీరుపై నిరసన

ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం.. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న హస్తం పార్టీ కుట్రలను ఎండగట్టేందుకు రైతు వేదికలు సిద్ధమయ్యాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు రైతు సభలు నిర్వహించనున్నారు. ‘మూడు పంటలు బీఆర్‌ఎస్‌ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్‌ విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

బషీర్‌బాగ్‌లో రేవంత్‌ గురువు చంద్రబాబు రైతులపై కాల్పులు జరపగా, రేవంత్‌ ప్రస్తుత పార్టీ కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇండ్ల స్థలాలు అడిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఘటనలు ఇంకా కండ్ల ముందే మెదులుతున్నాయి. ఆ నాటి దుస్థితి రావొద్దని రైతన్నలు రేవంత్‌పై, రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ పార్టీపై యుద్ధానికి దిగుతున్నారు.

ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడిన మాటలు వ్యవసాయంపై కాంగ్రెస్‌ నేతల అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్‌ రమణను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నివాసంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు.

తెలంగాణలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో అయినా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ‘మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్‌ చాలు అన్న రేవంత్‌రెడ్డి మాటలే కాంగ్రెస్‌ విధానమా? నా నోటి నుంచి ఏది వస్తే అదే వేద వాక్కు, అదే కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ వేరు కాదు, నేను గీసిందే గీత, రాసిందే రాత అని అమెరికాలో రేవంత్‌ చెప్పింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో రైతాంగం మూడు పంటలు పండించడమే సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నినాదమైతే, మూడు గంటల కరెంట్‌ కాంగ్రెస్‌ విధానం. ఇందులో ఏది శ్రేయస్కరం? ఏది తెలంగాణకు, రైతులకు మంచిది? అనేది రైతులు ఆలోచన చేయాలి. మరోసారి కటిక చీకట్ల కాంగ్రెస్‌ కావాలా?, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలా? రైతుబంధు తెచ్చిన కేసీఆర్‌ను విశ్వసిద్ధామా? ఐదు దశాబ్దాల పాటు రైతులను రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్‌ను నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాల పుణ్యమా అని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు ఎదురుపోతున్నాయని అన్నారు.

రాహుల్‌గాంధీకి వ్యవసాయం తెలుసా?

---------------------------------------------

కాంగ్రెస్‌ నేతలు తెల్లారి లేస్తే నోటికొచ్చిన మాటలు, కారు కూతలు కూస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అంటున్నారు. ఆయనకు ఎడ్లు తెలువదు, వడ్లు తెలువదు. క్లబ్బులు, పబ్‌లు మాత్రమే తెలుసు. ఎడ్లు, వడ్లు తెలువనోడు ఇక్కడికి వచ్చి డిక్లరేషన్‌ అంటూ ఏదో చదివారు. రాహుల్‌గాంధీ లీడర్‌ కాదు.. రీడర్‌. ఏం రాసిస్తే అదే చదివారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? అందుకే రాహుల్‌గాంధీని దేశంలో ఏమంటారో అందరికీ తెలుసు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగితే ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి. వరద కాలువలో 122 కిలోమీటర్ల పొడవునా నిండుకుండలా నీళ్లు పొంగిపొర్లుతున్న విషయం వాస్తవం కాదా? ఎస్సారెస్పీలోకి పైనుంచి నీళ్లు రాకుంటే ఈ రోజు దిగువ నుంచి కాళేశ్వరం ద్వారా ఎగువకు నీటిని తరలించి ప్రాజెక్టును నింపుతున్నది వాస్తవం కాదా? మార్గమధ్యలో 68 చెరువులను నింపిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాలేదా? ఎస్సారెస్పీ ఆయకట్‌ రైతులకు ఈ విషయం తెలియదా? వానలు పడకుండానే ఈ నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.

ప్రజా క్షేత్రంలో తేల్చుకొందాం

--------------------------------------------

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిజరూపాన్ని నగ్నంగా బయటపెడుతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ‘ప్రజాక్షేత్రంలో చర్చపెడ్దాం.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన కరెంట్‌ కావాలా? నేడు కేసీఆర్‌ ఇస్తున్న కరెంట్‌ కావాలా? అని అడుగుదాం. దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు కాలిపోయే కరెంటు మళ్లీ కావాలా? అర్ధరాత్రి పోయి బాయికాడ పడుకొనుడు, పాముకుట్టుడు, తేలుకుట్టుడు, మనుషులు చచ్చుడు కావాలా? కేసీఆర్‌ ఇస్తున్న 24 గంటల కరెంట్‌ కావాలా? అని ప్రజలను అడుగుదాం. చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నది రాజకీయ సమస్య కాదని, రైతుల సమస్య అని అన్నారు. ‘కేసీఆర్‌ పాలన, వ్యవసాయ విధానం బాగున్నాయని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రైతులు చెప్తున్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని కేసీఆర్‌ అంటే, మహారాష్ట్ర రైతన్న గొంతు కలుపుతున్నాడు. మరి ఇక్కడున్న కాంగ్రెస్‌ సన్నాసి పార్టీకి ఏమైంది? రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌, ఊరూరా కొనుగోలు కేంద్రం వంటి పథకాలు మంచిగున్నాయని ఇతర రాష్ర్టాలు అంటుంటే, ఇక్కడి భావ దారిద్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? రైతులకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పేదాక ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని ప్రదర్శిద్దాం. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదిరోజుల పాటు రైతాంగాన్ని చైతన్యవంతం చేయాలి. రాష్ట్రంలోని 2,603 రైతు వేదికల్లో కదం తొక్కాలి’ అని పిలుపునిచ్చారు.

గాంధీ భవన్‌లో గాడ్సే

-----------------------------------

రేవంత్‌రెడ్డి నేపథ్యం తెలిసిన వారందరికీ అతడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌ అన్న విషయం స్పష్టంగా తెలుసని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కాంగ్రెస్‌ నడుస్తున్నదని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ కార్యకర్త. ఆయన పీసీసీ అధ్యక్షుడు అయినప్పటినుంచి నేటివరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణకు రావాల్సివాటిపై ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌తో రేవంత్‌కు ఉన్న అనుబంధాన్ని తెలిపే పాత వీడియోలు కూడా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌వాళ్లు కనబడితే ఇప్పటికీ కాళ్లు మొక్కుతాను అన్న రేవంత్‌ వీడియోలన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా వచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌ అంటూ నోటికొచ్చినట్టు వాగతున్నారు. రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లోనే కాదా? ఢిల్లీ గవర్నమెంట్‌ హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే, బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్‌ పార్టీ కాదా?’ అని ఆయన ప్రశ్నించారు.

26 వేల పాఠశాలలు ఆధునీకరణ

-------------------------------------------

కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్లలో ఏ పనీ చేయకుండా వదిలిపెట్టి పోతే, జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి, ఇక్కడ మెడికల్‌ కాలేజీ పెట్టామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తున్నది కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అన్ని పాఠశాలల సుందరీకరణ పూర్తయిన తర్వాత కంటివెలుగు శిబిరాలు పెట్టి కాంగ్రెస్‌ నాయకులు జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డికి అద్దాలు ఇచ్చి ఎంతబాగా పని జరిగిందో చూపెట్టే బాధ్యత సైతం తమదేనని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, గుండు సుధారాణి, జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు విధానాలే ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్దాం

--------------------------------------------

రైతు ప్రయోజనాలు అనే సింగిల్‌ ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్దామని కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ‘కాంగ్రెస్‌ గతంలో ఇచ్చిన కరెంట్‌ కావాలా? కేసీఆర్‌ ప్రస్తుతం ఇస్తున్న కరెంట్‌ కావాలా? అని ప్రజలను అడుగుదాం. తిమ్మిని బమ్మిని చేయడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడు. కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లోకి గాడ్సేగా చొచ్చి ఈ రోజు ఆ పార్టీని నడుపుతున్నారు. అలాంటి చోట లాగ్‌బుక్‌ల గురించి మాట్లాడటం కాదు, వాళ్లు దేన్నైనా మార్చగలరు. అందుకే రైతుల వద్దకే వెళ్లి అడుగుదాం. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొందాం. రాష్ట్రంలోని 70 లక్షల రైతులు రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో పొందారు. వారిని తీర్పు ఇవ్వమని కోరుదాం’ అని సవాల్‌ విసిరారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద కాంగ్రెస్‌ పార్టీని రైతులు, ప్రజలు తన్ని తరిమివేస్తే ఆ బాధ్యత తమది కాదని మంత్రి స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరు

------------------------------------------

కాంగ్రెస్‌ పార్టీ రైతులకు క్షమాపణలు చెప్పాలని సోమవారం నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతువేదికలో వెయ్యిమంది రైతులతో తీర్మానం చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతులను, వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ రైతు వేదికకు వచ్చి తీర్మానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ కటిక చీకట్ల కాలం వద్దు, 24 గంటలపాటు కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌ పాలనే ముద్దు.. మూడు గంటల వ్యవహారం వద్దు, మూడు పంటల విధానం కావాలి’ అని తీర్మానం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ దుర్నీతిని ఎండగడుతూ పదిరోజులపాటు ప్రతి నియోజకవర్గంలోని రైతువేదికలో తీర్మానం చేయాలని కోరారు. గ్రామ రైతు వేదికలు తీర్మానం చేసి మండల రైతు సమాఖ్యకు, వారు జిల్లా రైతు సమాఖ్యకు, వారు రాష్ట్ర రైతుబంధు సమితికి పంపించాలని సూచించారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్‌పై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉచిత కరెంట్‌ తెచ్చిన మాట నిజం. మరి నేడు రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదా? ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్‌ తప్ప, రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ కాదు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో ఆంధ్రాకు తీసుకుపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్‌ తప్ప ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదు. చంద్రబాబు వ్యవసాయం దండుగ అంటే, ఆయన శిష్యుడు.. చోటా చంద్రబాబు అదే లైన్‌లో మూడు గంటల కరెంట్‌ చాలు అంటూ ముక్కు విరుస్తున్నారు. తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్‌ మీది కాదు.. ఇక్కడి కాంగ్రెస్‌ చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్‌. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించాలి’ అని సూచించారు.

కరెంటు అడిగితే కాల్చి చంపారు..

--------------------------------------------

కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగినవారిపై కాల్పులకు దిగి ముగ్గురిని బలిగొన్నది నాటి చంద్రబాబు సర్కార్‌. 2000 ఆగస్టు 28న వామపక్షాల ఆందోళనకు భారీగా రైతులు, యువకులు తరలివచ్చారు. బషీర్‌బాగ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చంద్రబాబు శిష్యుడు ఇప్పుడు కరెంటు మూడుగంటలే చాలంటూ మళ్లీ రైతుల గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారు.

భూమి అడిగితే బుల్లెట్‌ దించారు..

------------------------------------------

ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ పేదలు చేసిన ఆందోళనపై కర్కశంగా వ్యవహరించింది.. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. 2007 జూలై 28న ఖమ్మం జిల్లా ముదిగొండలో నిరసనపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏడుగురిని పొట్టనబెట్టుకున్నది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌.. ఉచిత విద్యుత్తుపై విషం కక్కుతున్నారు. పేద రైతుల నోట్లో మట్టిగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నల్లగొండ యువకులు బిఆర్ఎస్ లో చేరిక

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో... నల్గొండ 22 వార్డు నుండి...మహమ్మద్ నూర్.. నాయకత్వంలో .. నాగుల్ షరీఫ్, ఆసిఫ్ భాయ్ ఆధ్వర్యంలో... 100 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన యువకులు... బిఆర్ఎస్ పార్టీలో చేరారు..

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ...

కెసిఆర్ నాయకత్వంలో అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి.. అభివృద్ధిలో, సంక్షేమంలో సమన్యాయం జరుగుతుందని... సమాజంలోని ప్రతి ఒక్క పేదవారికి వారి సంక్షేమ పథకాలు అవుతున్నాయని... అందుకే అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని..

 ముఖ్యంగా నల్లగొండకు గత ఎన్నికల్లో... ఇచ్చిన హామీ మేరకు దత్తత తీసుకొని నల్లగొండ నల్లవైపుల నుండి అభివృద్ధి చేస్తూ సుందర పట్టణంగా నల్లగొండను తీర్చిదిద్దుతున్నారని... 1200 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి శర వేగంతో నిర్మాణం పనులు పూర్తవుతున్నాయని... ఇవన్నీ పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాల పడతాయన్నారు.

 ఇందుకు నల్లగొండ నియోజకవర్గ ప్రజలందరు తమ సహకారాన్ని అందించి...తమ రాజకీయ చైతన్యాన్ని మరోసారి చాటుకోవాలని..విజ్ఞప్తి చేశారు.

 పార్టీలో చేరిన వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..

నాగుల్ షరీఫ్ మాట్లాడుతూ..తాము స్వర్ణకార వృత్తి చేస్తున్నామని తమను ఇంతవరకు ఎవరు గుర్తింపు చేయలేదని... మా సమస్యలు కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే సాధించుకోగలమని నమ్మకంతో...

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి, పట్ల పూర్తి విశ్వాసంతో BRS పార్టీలో చేరుతున్నామని... పార్టీ విజయం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో... జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి సీనియర్ నాయకులు జమాల్ ఖాద్రి.. బకరం వెంకన్న . 22 వ వార్డు నాయకులు మహమ్మద్ శంషుద్దీన్.. సోహెల్ అహ్మద్,

పార్టీలో చేరిన వారిలో...సుభాని ఇంతియాజ్,ఇమ్రాన్,రెహమతుల్లా, యూనస్, సుభాని, అల్తాఫ్, రసూల్ మహమ్మద్ షఫీ మహమ్మద్ సమీర్... తదితర వందమందికి పైగా ముస్లిం మైనార్టీ కి చెందిన యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

గుండెపోటుతో మరణించిన పానగల్ ఛాయా సోమేశ్వరాలయం ధర్మకర్త భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల

గుండెపోటుతో మరణించిన... పానగల్ ఛాయా సోమేశ్వరాలయం ధర్మకర్త నూల శివప్రసాద్ ...భౌతిక దేహాన్ని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు సందర్శించి నివాళులర్పించారు... చిన్న వయసులోనే... శివైక్యం చెందటం

తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ మనోధైర్యంతో ఉండాలని...తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు ...

 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్ పున్న గణేష్, సందినేని జనార్దన్ రావు, రావుల శ్రీనివాసరెడ్డి ముత్తినేని శ్యాంసుందర్ రొట్టెల రమేష్ కందుల లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు,

ప్రీతి లత గురించి మీకు తెలుసా

ప్రీతి లత గురించి మీకు తెలుసా

"భారతీయులకు..కుక్కలకు.. ఇక్కడ ప్రవేశం లేదు" అని...చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు.ఎంత దుర్మార్గం..ఎంత అహంకారం.

బ్రిటిష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి..ఓ అమ్మాయి మనసు రగిలింది.ఆమె గుండెలో ఆగ్రహం మండింది.ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి.

ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి... తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొంది.

ఆమె పేరు ప్రీతిలత.

కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ.ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి.

స్వరాజ్యవీరుడు సూర్యసేన్ సహకారంతో..1932సెప్టెంబర్ 24 రాత్రి 10-45నిముషాలకు..బ్రిటిష్ క్లబ్ పైన దాడి చేసింది.ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలయ్యింది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి ..కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం.యువ వీరుల్ని చూసి భయంతో గజగజ లాడారు బ్రిటిష్ అధికారులు.అప్పటికే చాలా మంది గాయపడ్డారు.ఇంతలో..ఒక మూలనుండి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్..ప్రీతిలత భుజంలోకి దూసుకు పోయింది.రక్తం ధార కట్టింది.ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి..ప్రీతిలత ముందుకు సాగింది.ఆమె ధైర్యానికి బ్రిటీష్ అధికారులు వణికిపోయారు.

క్రమంగా బులెట్ గాయంనుండి రక్తస్రావం ఎక్కువయ్యింది. ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు ఇష్టం లేదు. అందుకే..తనతో తెచ్చుకొన్న విషం మింగి.. భరతమాతకూ జై అంటూ.. ప్రాణాలు విడిచింది.ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసు మాత్రమే.

ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవాళ్ళు.

అదీ ప్రీతిలత అంటే

ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్

★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు 

   కేరాఫ్‌ తెలంగాణ

★ రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్‌ 

   కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్‌

★ చందనవెల్లిలో నికోమాక్‌, దైఫుకు 

   పరిశ్రమలకు శంకుస్థాపన

★ జపాన్‌ కంపెనీలతో క్లస్టర్‌ ఏర్పాటు

   చేయాలని రాయబారికి వినతి

★ 2 వేల ఉద్యోగాలు.. పరోక్షంగా మరో 

   4 వేల మందికి ఉపాధి

ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమతులతో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చందనవెల్లిలో రూ.576 కోట్లతో ఏర్పాటుకానున్న జపాన్‌కు చెందిన దైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, నికోమాక్‌ తైకిష క్లీన్‌ రూమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చందనవెల్లిలో ప్రత్యేకంగా జపాన్‌ కంపెనీలతో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని భారత్‌లో జపాన్‌ రాయబారిని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. జపాన్‌ భాషలో ఆశీర్వచనంగా వాడే ‘ఇనీ ఆరాటా’ పదాన్ని కేటీఆర్‌ ప్రత్యేకంగా వివరించారు. ఇనీ అరాటా గతంకంటే భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించటమని, రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కంపెనీలు కూడా అలాగే ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. జపాన్‌ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా ఇంతే ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఫ్యాక్టరీలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

జపాన్‌ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్‌

----------------------------------------------

127 మిలియన్ల జనాభా ఉన్న జపాన్‌ దేశానికి ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినప్పటికీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగటం ప్రశంసనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మనదేశంలో ఎవరి ఇంట్లో చూసినా జపాన్‌కు చెందిన ఏదో ఒక వస్తువు ఉంటుందని, జపాన్‌ ఉత్పత్తులపై ఇక్కడి ప్రజలకు ఉన్న గౌరవం అలాంటిదని తెలిపారు. జపాన్‌కు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని మంత్రి సూచించారు. జపాన్‌ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ రాయబారికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోనే కీలకంగా చందనవెల్లి పారిశ్రామిక వాడ

---------------------------------------------

విస్తారంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల స్థాపనతో చందనవెల్లి పారిశ్రామిక వాడ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్స్‌ మొదలుకొని ఎలక్ట్రిక్‌ వాహనాల వరకు విభిన్నమైన కంపెనీలు చందనవెల్లినే కేంద్రంగా ఎంచుకొంటున్నాయని తెలిపారు. దైఫుకు, నికోమాక్‌ తైకిష కంపెనీలు పెడుతున్న రూ.576 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 1600 నుంచి 2 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని యువతకు శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనిత హరినాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, దైఫుకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గరిమెళ్ల, నికోమాక్‌ తైకిష కంపెనీ ఎండీ తకుయ మోరిసన్‌, కౌన్సిల్‌ జనరల్‌ మసయుకి టగసన్‌, దైఫుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నావ్‌యుకి ఆండౌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: తిప్పర్తి జడ్పిటిసి

ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం

 అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం .

 బడా కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న బీ జే పీ కేంద్ర ప్రభుత్వం.. 

 ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్... 

బడుగు జీవుల, అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న కేంద్ర ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ప్రభుత్వం,బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ,దేశ సంపదను దోచిపెడుతున్నదని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు.

శనివారం నాడు నల్గొండ పట్టణం లోని శ్రామిక భవన్ (సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం) లో ఐ ఎఫ్ టి యు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం,

జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ,దేశంలో ముప్ఫై అయిదు కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల జీవనోపాధి రోజు రోజుకు కడు దయణీయంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం,కార్మికుల కూలీ రేట్లు,వేతనాలను పెంచడంలో అశ్రద్దగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

కార్మికుల శ్రమ మూలంగా అనేక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న సంపదను,కార్మికుల శ్రమను,వివిధ రంగాలకు చెందిన యాజమాన్యాలు యదేచ్ఛగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లుగా ముందుకు తెచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో కేసిఆర్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం,75 షెడ్యూల్డ్ జీ ఓ లకు గెజిట్ లు లేకుండా కాలయాపన చేస్తుందని,75 షెడ్యూల్డ్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జీ ఓ లకు గెజిట్ ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.

కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన గా,జూలై,ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కేంపైన్ నిర్వహిస్తుందని,అందులో భాగంగానే జూలై 20 న,హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, క్విట్ ఇండియా కు పిలుపు నిచ్చిన ఆగస్టు 9 నాడు హైదరాబాద్ సిటీలో, అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, రావుల వీరేశ్,జానీ,అశోక్ పాషా,స్వామి,ముత్తు,ఎం.డి జానీ,రవి,తదితరులు పాల్గొన్నారు.