/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆగస్టు 1 నుంచి 23వరకు ‘గురుకుల’ పరీక్షలు Yadagiri Goud
ఆగస్టు 1 నుంచి 23వరకు ‘గురుకుల’ పరీక్షలు

: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్‌ గురుకులాల్లోని 9,210 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 23వరకు ఆయా పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను (సీబీఆర్‌టీ) నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే.. ఆగస్టులోనే కేంద్ర సర్వీసుల పరీక్షలు ఉన్నాయి. ఇటు టీఎస్‌పీఎస్‌సీ సైతం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో గురుకుల పోస్టులను ఏ తేదీల్లో నిర్వహించాలి, ఎప్పుడు ఏం పరీక్షలు ఉన్నాయి అన్నదానిపై ట్రిబ్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆగస్టులో కేంద్ర సర్వీసుల పరీక్షల తేదీలు సైతం ఇప్పటికే విడుదల అయ్యాయి. మరోవైపు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామ్‌(ఎస్‌ఎస్‌సి–హెచ్‌ఎస్‌ఎల్‌)ను ఆగస్టు 2 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడదులైంది.

ఈ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి చాలా మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బి పరీక్షలో ఉచిత పరీక్ష శిక్షణను(పీఈటీ) ఆగష్టు 17 నుంచి 22 వరకు నిర్వహించాలని, ప్రిలిమినరీ పరీక్షను అదే నెల 12, 13, 19 తేదీల్లో నిర్వహించాలని ఆ బోర్డు నిర్ణయించింది. ఇక గురుకుల పరీక్షల షెడ్యూల్‌ కూడా వస్తే తమ పరిస్థితి ఏంటోనని అభ్యర్ధులు అందోళనకు లోనవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో అత్యంత ముఖ్యమైన పరీక్షలన్నింటినీ ఉంటే తాము అంతిమంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందేమోనంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పోస్టుల పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసి తమను ఆదుకోవాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని 9,210 పోస్టులను భర్తీ చేసేందుకు గురుకుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 25వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఆయా పోస్టుల దరఖాస్తులను స్వీకరించారు. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి. ఈక్రమంలో గురుకుల బోర్డు పరీక్ష తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ : వాన కబురు

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా.. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణను తాకే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. అలాగే పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం కొనసాగనుంది.

నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వాతావారణశాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది.

ఇక ఇవాళ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలుల ప్రభావం ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. రేపు పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలులు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోమవారం పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఈరోజు నుంచి 21 మధ్య రుతుపవనాలు విస్తరించేందుకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో తెలంగాణలో 19వ తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

ఇక నేడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు, 27 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంది.

అటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పలు ప్రాంతాల్లో నమోదవుతుండటంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు.....

మండే ఎండ‌లు.. సెలవులు ఇవ్వాలా! వద్దా? ఆలోచనలో తెలుగు ప్రభుత్వాలు

ఇంకా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ల కెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి.

ఇప్ప‌టికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ప్రారంభించ‌లేదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం లేదు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా.. స్కూల్స్ సెల‌వుల విష‌యంలో ఆలోచిస్తున్నారు.

జూన్ చివరివారంలో పడుతున్నా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. మిగతా వాళ్లసంగతేమో గాని స్కూళ్లకెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి. పేరెంట్స్ పిల్లల ఆరోగ్యమా, చదువులా అనే డైలమాతోనే తల్లడిల్లిపోతున్నారు. మండేసూర్యుడు నడినెత్తిన నాట్యమాడేస్తున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా గ్రీష్మతాపంతో తల్లడిల్లిపోతోంది తెలంగాణా. రామగుండంలో నిన్న 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండలకు భయపడి పిల్లల రాక తగ్గిపోవడంతో స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా పడిపోతోంది.

కొన్ని జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో రెండుపూట్లా బడి నడుస్తోంది. కానీ 60 శాతానికి మించి విద్యార్థుల్లేరు. కేవలం టీచర్లు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే పరిస్థితి. ఒంటిపూట బడి పెట్టినా స్టూడెంట్స్‌కి తిప్పలు తప్పడం లేదు. జూన్‌లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి.. ఉత్సాహంగా స్కూళ్లకెళ్లాల్సిన పిల్లల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది గ్రీష్మతాపం. అటు.. ప్రైమరీ స్కూల్స్‌కి పిల్లల్ని పంపడం దాదాపుగా ఆపేశారు పేరెంట్స్.

తెలుగు రాష్ట్రాలలో దారుణంగా ఎండ‌లు..

జూన్‌ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చదువుల కంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..

ఈ లోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి.

ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. మరి ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..? లేదా ఒంటి పూట బడులు కొనసాగిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు కూడా సెల‌వులు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ఉన్నారు.

పిల్లలను స్కూల్ కు పంపిస్తే..

వైద్య‌ నిపుణులు కూడా విపరీతమైన ఎండల్లో పిల్లలను స్కూల్ కు పంపిస్తే డీ హైడ్రేషన్, వడదెబ్బలకు గురై అనారోగ్యాల భారిన పడతారని సూచిస్తున్నారు. ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వైద్య, విద్యారంగానికి చెందిన నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఇరు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే...

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఈ మేరకు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేశారు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ కక్కిస్తుందని..

వైసీపీ, టీడీపీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు. ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన పేరుతో నిర్వహిస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

టీడీపీపాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ అని.. ఆ పార్టీ ఏర్పాటు, అది అధికారంలోకి రావడం దురదృష్టం అని మండిపడ్డారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. రెండు పార్టీలు రాజధాని విషయంలో అన్యాయం చేశాయని ఆగ్రహించారు..

బీసీలకు రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రియ...!

దరఖాస్తు ఫారాన్ని ఏఅదికారికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆన్లైన్ చేయాలి.

- గంగుల కమలాకర్ వెళ్ళడి

రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ.లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు.కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదయ్యాయని వివరించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని వెల్లడించారు.ప్రతి నెలా 5వతేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.

ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గాని సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్ధిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు.

బండి సంజయ్ సంచలన కామెంట్స్

కరీంనగర్ జిల్లా :జూన్ 18

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారని అన్నారు.

ఈ సందర్బంగా ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ 30 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారన్నారు. మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని సూచించారు.

అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలు గాజులు, బొట్టు పెట్టుకుంటే తీసేసినప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారని.. సీఎం కేసీఆర్ వస్తారా? అని సవాల్ చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు సిద్ధమా? అన్నారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు..

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న.. ఎక్కడోచోట రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయివేట్ ట్రావెల్ బస్సులు వరస ప్రమాదాలకు గురై ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

తాజాగా ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదవశాత్తు కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఫల్టీ కొట్టింది.

హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37మంది ప్రయాణీకులుఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హైవే రహదారికి అడ్డు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు...

ఓల్డ్ సిటీ మీర్చౌక్లో అర్థరాత్రి గన్ ఫైరింగ్

ఓల్డ్ సిటీ మీర్చౌక్లో అర్థరాత్రి గన్ ఫైరింగ్ కలకలంరేపింది. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కొన్ని రోజుల క్రితం అర్ఫాత్ అనే వ్యక్తి.. ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

అయితే ఆ ఇంటికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా ఎలా కొంటారని పక్క ఇంటి వారు గొడవకు దిగారు. ఇదే విషయంపై ఇరువర్గాలవారు పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్లారు.

గత శనివారం మరోసారి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో అర్ఫాత్ కేసు పెట్టారు. ఇదే విషయంలో నిన్న శనివారం అర్థరాత్రి అడ్వకేట్ మహ్మద్ అలీ.. మూర్ఖుజ.. గన్‌తో వచ్చి గొడవ చేశారు. భయపెట్టడానికి అడ్వకేట్ తన లైసెన్సుడ్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందినవారు రాళ్లు.. కర్రలతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గన్ ఫైరింగ్‌లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చినుకు జాడేది?

చినుకు జాడ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటుతున్నా తొలకరి పలకరించడం లేదు. జిల్లాలో ఎండలు దంచి కొడుతుండడంతో ప్రజలు ఇవేమీ ఎండలు బాబోయ్‌ అంటూ తలలు పట్టుకుంటున్నారు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైంది. సాధారణంగా ఈ కార్తె నుంచే వర్షాలు కురుస్తాయి. కానీ జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తాకిడికి జనం విల విల్లాడిపోతున్నారు. వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా, ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అని ఎదురు చూస్తున్నారు. యేటా ఈ సమయంలో సాధారణానికి మించి వర్షాలు పడితే రైతులు విత్తనాలు విత్తు కునే వాళ్లు. దుక్కులు దున్ని నాట్లు వేసేం దుకు సిద్ధంగా ఉన్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తొలకరి జల్లు పడగానే వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతారు. ఆశించిన రీతిలో పంట దిగుబడి రావాలని ఇష్టదైవాలకు మొక్కులు తీర్చుకుంటారు. గతేడాది ఈ సమయానికి నారు పోయగా ఈ యేడు భిన్నంగా తయారైంది. దుక్కి దున్ని నారు పోసుకుందామని విత్తనాలు సిద్ధం చేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది జూన్‌లోనే అధిక వర్షాలు కురిశాయి. రైతులు నారు పోసిన తర్వాత భారీ వర్షాలు పడడంతో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. యేటా జూన్‌లో వర్షాలు ప్రారంభమై జూలై, ఆగస్టు మాసాల్లో అత్యధికంగా కురుస్తాయి. జూన్‌లో కనీసం సాధారణ వర్షపాతం నమోదైనా రైతులు పంటలు వేస్తారు. భారీ వర్షాలు కురిసే నాటికి పంటలు దెబ్బ తినకుండా ఉంటాయి. వర్షాలు ఆలస్యంగా కురిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో యేటా లక్షా90 వేల ఎకరాల్లో వరి, లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. ఈ సారి రైతులు ఆశించిన సమయానికి వర్షాలు కురుస్తాయనే ఆశతో సాగు పెరుగుతుందని ఆశించారు. ఇప్పటికే వ్యవసాయాధికారులు 500 క్వింటాళ్ల వరకు సబ్సిడీ విత్తనాలు అందజే శారు. వర్షాలు కురుస్తాయని మరో 2 వేల క్వింటాళ్ల అవసరం ఉంటా యని ప్రతిపాదనలు పంపారు. వర్షాలు పడకపోవడంతో పలు చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.

ఆరుతడి పంటలను పండించే రైతులు మే నెల నుంచే వేసవి దుక్కులు దున్ని భూమిని చదును చేసుకున్నారు. వర్షాలు కురిసిన వెంటనే మరొక సారి దుక్కి దున్ని అచ్చు కొట్టి విత్తనాలు వేయడా నికి సిద్ధంగా ఉన్నారు. పత్తి పంటను సాగు చేసే రైతులు కొన్ని గ్రామాల్లో దుక్కులు దున్ని అచ్చు కొట్టి విత్త నాలు వేసేందుకు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వరి పంటను సాగు చేసే రైతులు మాత్రం వ్యవసాయ బావుల వద్ద వరి నార్లు పోస్తున్నారు.........

తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’..

•ఈ పెను సవాళ్ల సంగతేంటి..

•ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

డీకే శివకుమార్..డీకే.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకేకు.. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు ముగియగా.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని గత రెండు మూడ్రోజులుగా పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. డీకే తెలంగాణకు వస్తారు సరే.. ఇక్కడ పార్టీలో పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? ఆయన ముందున్న సవాళ్లు ఏంటి..? ఆయన కర్ణాటక ఫార్ములానే ఇక్కడ అమలు చేస్తారా..? లేకుంటే ఆయన టార్గెట్ వేరే ఉందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

వస్తారు సరే.. ఇవన్నీ ఎలా..?

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే.. నేతల్లో మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్లుగా పరిస్థితులున్నాయ్. ఎందుకంటే.. పార్టీని వివాదాలు, విబేధాలు, అసంతృప్తి ఎప్పుడూ వెంటాడుతుంటాయ్. రాష్ట్ర నేతలు ఎప్పుడేం మాట్లాడతారో..? ఎలా యూటర్న్ తీసుకుంటారో..? ఎప్పుడు గుడ్ బై చెప్పేసి వేరే గూటికి చేరతారో..? ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు తలెత్తుతాయో..? ఎవరు అసమ్మతి గళం వినిపిస్తారో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మూడ్రోజులు మంచిగా ముచ్చటగా ఉంటే ఆ తర్వాత ఇక ఆ నేతల మధ్య ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతుంది. దీనికి తోడు ఎవరికివారే ప్రకటనలు చేసేస్తుంటారు.. పార్టీ లైన్ దాటేసి మరీ మాట్లాడేస్తుంటారు.. ఇదీ టీ. కాంగ్రెస్ పరిస్థితి. ఈ పరిణామాల మధ్య ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ తెలంగాణకు వస్తే ఏం చేస్తారు..? పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? అనేవి ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. మరీ ముఖ్యంగా.. టికెట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన.. ఆ తర్వాత నెలకొనే పరిస్థితులు కూడా పెద్ద టాస్కే.! అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజంగా ఈ సమస్యలను పరిష్కరించడంలో డీకే సక్సెస్ అయితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.

రంగంలోకి దిగిపోయారుగా..!

కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కబెట్టడానికి డీకే ఇప్పటికే రంగంలోకి దిగేశారు. పార్టీలో చేరికల నుంచి ట్రబుల్‌ షూటింగ్‌ వరకు అన్నీ ఇక ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన భేటీని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరికపై బెంగళూరుకు పిలిపించుకొని మరీ డీకే రహస్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీ తర్వాతే ఆ ఇద్దరూ మనసు మార్చుకోవడం, ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం లాంటివి చేశారట. అంతేకాదు.. చేరికలపై నిత్యం తెలంగాణ ముఖ్యనేతలతో డీకే టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించాలంటే రాష్ట్ర, నియోజకవర్గ స్థాయుల్లో ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పనిసరి అని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఆర్థికంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. చేరికల ద్వారా నియోజకవర్గ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయక తప్పదన్న నిశ్చితాభిప్రాయానికి అధిష్ఠానం వచ్చింది.

హామీలు.. వ్యూహాలు ఇలా..?

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి 5 కీలక హామీలే ప్రధానం. రైతు రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవే కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ పథకాలను తెలంగాణలోనూ ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు అప్పుడున్న పరిస్థితులను బట్టి.. ఉద్యోగాలు, ఉద్యమ నేతలకు పెన్షన్, పెన్షన్ పెంపు.. ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా ఉండే పథకాలు మేనిఫెస్టోలో పెట్టాలని అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇవేకాదు ఏం చేసైనా సరే.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలన్నదే లక్ష్యంగా డీకే వ్యూహాలు రచిస్తారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మునుపటితో పోలిస్తే బీజేపీ బలహీనపడటం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కూడా కాంగ్రెస్‌కు అన్నివిధాలుగా కలిసొచ్చే అంశాలని వ్యూహకర్త సునీల్ కనుగోలు భావిస్తున్నారట. అందుకే ఈ విషయాలన్నీ ‘పే సీఎం’ కర్ణాటకలో ఎలాగైతే జనాల్లోకి తీసుకెళ్లారో.. అలాగే ఇక్కడ కూడా పక్కాగా ప్లాన్ చేశారట. వీటికి తోడు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటన నెలలో రెండు, మూడుసార్లు ఉండేలా పక్కా ప్రణాళిక రచిస్తున్నారని తెలియవచ్చింది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

... ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పదిరోజులకోసారి రాష్ట్రంలో పర్యటించాలని కోరిన విషయం తెలిసిందే.

మొత్తానికి చూస్తే..

ఓ వైపు రేవంత్, ఇంకోవైపు వ్యూహకర్త పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో డీకే కూడా వీరికి తోడైతే కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ట్రబుల్స్‌ను పరిష్కరించడం ట్రబుల్ షూటర్ డీకేకు పెద్ద విషయమే కాదని నేతలు చెప్పుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న గులాబీ బాస్ కేసీఆర్‌ను తట్టుకుని.. డీకే, రేవంత్, సునీల్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే మరి..