/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz APPSC: త్వరలో గ్రూప్‌ -1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: గౌతమ్‌ సవాంగ్ Yadagiri Goud
APPSC: త్వరలో గ్రూప్‌ -1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: గౌతమ్‌ సవాంగ్

విజయవాడ: త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు..

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సవాంగ్‌ తెలిపారు.

ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించామని సవాంగ్‌ చెప్పారు. పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు.

జూన్‌ 3 నుంచి మెయిన్స్‌ పరీక్షలను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.

కేవలం 15 నిమిషాలు మాత్రమే గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుందని.. ఆ సమయం దాటితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించి ఆగస్టు చివరి నాటికి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు కు ప్రమాదం

నార్కట్ పల్లి :

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. షూటింగ్ ప్రస్తుతం యమఫాస్ట్ గా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రయూనిట్ కు అనుకోని అవాంతరం ఎదురైంది.

‘పుష్ప 2’ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేనప్పటికీ.. చాలామంది యాక్టర్స్ కు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తొలి భాగం కంటే గ్రాండ్ గా తీస్తున్నారు. అయితే ‘పుష్ప 2’ ఆర్టిస్టులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్ పల్లి దగ్గర బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆర్టిస్టులతో వెళ్తున్న ఈ బస్సును.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఇన్సిడెంట్ లో పలువురు నటీనటులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన వాళ్లని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

‘పుష్ప 2’లో అల్లు అర్జున్ తోపాటు రష్మిక, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఈసారి అంతకు మించి అనేలా సినిమాను తీస్తున్నట్లు సమాచారం.

ఎలాంటి అంచనాల్లేకుండా 2021 డిసెంబరులో వచ్చిన ‘పుష్ప’ సంచలనాలు క్రియేట్ చేసింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి ఈ టైంలో అనుకోని విధంగా బస్ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి ‘పుష్ప 2’ ఆర్టిస్టులు వెళ్తున్న బస్ ప్రమాదానికి గురి కావడంపై అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు..

తెలుగు రాష్ట్రాలలో మోగనున్న బడిగంట?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులు కొనసాగతున్నాయి. పాఠశాలలకు జూన్ 12వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. జూన్ 01వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానుండగా.. ఇదే రోజు నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు సందేశాలను పంపించాయి. అయితే.. ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

అయితే.. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. ఈ సెలవులను పొడిగించే అవకాశాలు ఉంటాయనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. ఎండ తీవ్రత తగ్గి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం చేశాయి.

దీంతో .. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఒక వేళ ఎండ వేడి తీవ్రంగా ఉంటే అప్పటి పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి......

SB NEWS

నిన్న కవిత పేరు లేదు ఈరోజు : ఈడీ ఏం చెప్పింది..!❓️

లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన కేసు ఇవాళ జరిగిన వాదనల్లో ఈడీ తరఫు న్యాయవాదులు సుదీర్ధ వాదనలు వినిపించారు. ‘ లిక్కర్ పాలసీ ద్వారా పెద్ద కుంభకోణమే జరిగింది. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారు. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ప్రాపర్టీలు కొన్నారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో పలుమార్లు సమావేశాలు జరిగాయి.

ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు హైదరాబాద్‌లో ప్రాపార్టీలు కొన్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపాం’ అని కోర్టుకు ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు.. తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాది కోరారు. ఎందుకిలా రోటీన్ వాదనలు చేస్తున్నారని జస్టిస్ నాగ్‌పాల్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జూన్- 2కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

ఇదీ అసలు కథ..!

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీ లాండరింగ్ కేసుపై మంగళవారం నాడే రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన నాల్గవ అనుబంధ చార్జ్‌షీట్‌‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మే-04న లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో నాలుగవ అనుబంధ చార్జ్‌షీట్‌‌ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే ఈడీ అభియోగాలు మోపింది. అంతేకాదు.. ఈ చార్జ్‌షీట్‌‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. కవిత విషయంలో గత చార్జ్‌షీట్‌‌‌లో మోపిన అభియోగాలు, అంశాలనే మరోమారు ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో కవిత ఉన్నారని.. ఆ గ్రూప్‌కు- ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా సిసోడియా విధాన రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయితే ఇలా లబ్ధి చేకూర్చినందుకు గాను సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేతలకు ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

అంతా రోటీన్..!

లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని.. మాట్లాడారని ఇలా పలు అభియోగాలనే గతంలో దర్యాప్తు సంస్థలు మెపాయి. తాజా అభియోగపత్రంలోనూ ఇదే విషయాలను ఈడీ పునరుద్ఘాటించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన 51 మంది వివరాలను అభియోగ పత్రాల్లో ఈడీ పేర్కొంది. అయితే.. ఈడీ ప్రశ్నించిన జాబితాలో మొన్న కవిత పేరు లేకపోగా ఈసారి మాత్రం ఉంది. కాగా.. గతంలో కవితను మూడుసార్లు విచారణకు ఈడీ పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. నిందితులతో కవిత పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీనని అరుణ్ పిళ్ళై చెప్పిన విషయం.. ఇలా రోటీన్ అభియోగాలనే మళ్లీ ఈడీ మోపినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. లిక్కర్ స్కామ్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న కవిత పేరే అస్సలు లేకపోవడం.. ఇప్పుడు మళ్లీ అభియోగాలు ఉన్నట్లు చార్జ్‌షీట్‌లో పెట్టడం బిగ్ ట్వి్స్టే అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే పలు అనుమానాలకు దర్యాప్తు సంస్థలు తావిస్తున్నాయి. అది కూడా రెండ్రోజులు వ్యవధిలోనే దర్యాప్తు సంస్థలు ఇలా రెండు మాటలు మాట్లాడాన్ని బట్టి చూస్తే మున్ముందు ఇంకా పెను సంచలనాలే వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి......

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం జగన్ దంపతులు

గుంటూరు:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు.

వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు తదితరులు స్వాగతం పలికారు. 

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు.

అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారు....

ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా:

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ అమ్మవారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి దర్శించుకున్నారు.

దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం

ఆలయ అభివృద్ధి కొరకై కోటి రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అభివృద్ధి అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని మంత్రి అన్నారు.

మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఏ రంగాన్ని ఎంచుకున్న రంగంలో అన్ని విధాల అభివృద్ధి చెందేటట్లు 50 సంవత్సరాలు చరిత్రలో నిలిచే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని పేర్కొన్నారు.

నా నియోజకవర్గంలో గల అతి పురాతనమైన దేవాలయాల మరమ్మత్తులకై ముఖ్యమంత్రి ని అడగగా తక్షణమే 8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,రామనర్సింహ గౌడ్,ఎండోమెంట్ ఇంజనీరింగ్ అధికారులు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు, అరవింద్ శర్మ, బేర బాలకిషన్,లోకసాని కొండల్ రెడ్డి, అంకిరెడ్డి ఆర్కే పురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, సాజిద్, ధర్పల్లి అశోక్,సునీత రెడ్డి, స్వప్న మరియు ఇతర నాయకులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు...

చెన్నై ఫైవ్‌ స్టార్‌... ఐదోసారి చాంపియన్‌

ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన సూపర్‌కింగ్స్‌

ఫైనల్లో 5 వికెట్లతో గుజరాత్‌పై ఘన విజయం

వర్షంతో మారిన లెక్కల్లో ధోని సేనదే పైచేయి

ఆఖరి బంతికి గెలిపించిన జడేజా

అహ్మదాబాద్‌:

ఐపీఎల్‌–2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా... వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్‌; 2 సిక్స్‌లు) రాణించారు.

సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన...

42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్‌ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్‌–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్‌ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్‌లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్‌ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్‌ చహర్‌ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్‌ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్‌ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు.

21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను కూడా చహర్‌ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్‌ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్‌ కాగా, సుదర్శన్‌ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్‌ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు.

తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్‌ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్‌ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్‌ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది.

వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు.

అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

15 ఓవర్లకు కుదింపు...

రిజర్వ్‌ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్‌ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు.

వర్షం తగ్గినా, ప్రధాన పిచ్‌ పక్కన ఉన్న మరో పిచ్‌ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్‌ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు.

స్కోరు వివరాలు

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) ధోని (బి) చహర్‌ 54; గిల్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 39; సుదర్శన్‌ (ఎల్బీ) (బి) పతిరణ 96; పాండ్యా (నాటౌట్‌) 21; రషీద్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–67, 2–131, 3–212, 4–214, బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–38–1, తుషార్‌ 4–0–56–0, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–38–1, పతిరణ 4–0–44–2.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) రషీద్‌ (బి) నూర్‌ 26; కాన్వే (సి) మోహిత్‌ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్‌) 32; రహానే (సి) విజయ్‌శంకర్‌ (బి) మోహిత్‌ 27; రాయుడు (సి) అండ్‌ (బి) మోహిత్‌ 19; ధోని (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 0; జడేజా (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–117, 4–149, 5–149. బౌలింగ్‌: షమీ 3–0–29–0, పాండ్యా 1–0–14–0, రషీద్‌ 3–0–44–0, నూర్‌ 3–0–17–2, లిటిల్‌ 2–0–30–0, మోహిత్‌ శర్మ 3–0–36–3.

పోలీసులకు పుష్ప సినిమా చూపించిన గంజాయి స్మగ్లర్లు

భద్రాచలం :మన్యంలో పుష్ప చిత్రం సీన్లు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అడవిమాటున అక్రమం రాజ్యమేలుతోంది. గంజాయి స్మగ్లింగ్ జోరు అందుకుంది. గంజాయి స్మగ్లర్లు గంజాయి తరలింపునకు రకరకాల మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు.

భద్రాచలం మీదుగా కోట్లాది రూపాయలు విలువ చేసే నిషేధిత గంజాయి సరిహద్దులు దాటుతోంది. సోమవారం అర టన్ను విలువ చేసే గంజాయి పోలీసులకు చిక్కటం గమనార్హం. ట్రాక్టర్ ట్రాలీకి ప్రత్యేక ఛాంబర్ కట్టి అందులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన ‘పుష్ప’ చిత్ర సన్నివేశం గుర్తుకు తెచ్చింది.

మన్నెంలో స్మగ్లింగ్ స్మెల్…

భద్రాచలం మన్యంలో నిషేధిత గంజాయి స్మగ్లింగ్ గుట్టుగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అడవుల్లో గంజాయి సాగు జరుగుతుండగా, ఈ నిషేధిత గంజాయిని అక్కడినుంచి సమీప భద్రాచలం అటవీ ప్రాంతం గుండా అక్రమార్కులు సరిహద్దును దాటిస్తున్నారు.

ఒడిశాలోని చిత్రకొండ, కల్లూరు, బలిమెల, పెళ్లి బాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తేడు, డొంకరాయి, సీలేరు, కొండరాజుపేట, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తులో సాగుతోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా స్మగ్లర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్ గఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో చెక్ పోస్ట్ లు ఉన్నా అవి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి.

అక్కడి అధికారుల కనుసనల్లోనే ఈ గంజాయి రవాణా సాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ భద్రాచలం వద్ద కూడా చెక్ పోస్ట్ లు ఉన్నాయి. అడపాదడపా ఇక్కడ కూడా గంజాయి పట్టుబడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున భద్రాచలం కూడా గంజాయి దాటి పట్టణాలకు తరలిపోతోందని తెలుస్తోంది. గతంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టు పడగా, ఇటీవల కాలంలో స్మగ్లర్లు రకరకాల మార్గాల ద్వారా గంజాయిని సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం...

వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సై ల బదిలీలు

వరంగల్ జిల్లా:

కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ ఏవీ రంగనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఎస్సైలు వీరే..

1.ఎం.సురేష్ వీఆర్ నుంచి హసన్ పర్తి

2.భూక్యా చందర్ వీఆర్ నుంచి కేయూసీ

3.ఏ.ప్రవీణ్ కుమార్ వీఆర్ నుంచి వర్ధన్నపేట

4.బి.రామారావు వర్ధన్నపేట నుంచి హన్మకొండ

5.డి.వి ఫణి వీఆర్ నుంచి సుబేదారి

6.డి.రాజు హన్మకొండ నుంచి టాస్క్ ఫోర్స్

7.జి.అరుణ్ రిపోర్ట్ ఫ్రమ్ భద్రాది కొత్తగూడెం నుంచి జనగామ

8.బి.మాధవ్ వీఆర్ నుంచి మట్టెవాడ

9.ఎండీ.గాలిబ్ వీఆర్ నుంచి సుబేదారి

10.గాలిబ్ షరీఫ్ వీఆర్ నుంచి ఇంతేజార్ గంజ్

11.ఎండీ వలీ వీఆర్ నుంచి హసన్ పర్తి కె.లక్ష్మి భరోసా సెంటర్

12.ఎస్. డేవిడ్ వీఆర్ నుంచి కొడకండ్లకు. బదిలీ చేసినట్లు తెలిసింది..

ఇట్లా కాలిస్తే ఎట్లా ❓️

వరి కొయ్యలను తగులబెడుతున్న రైతులు

సారం దెబ్బతింటున్నదంటున్న శాస్త్రవేత్తలు

మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం

పెద్దపెల్లి జిల్లా : గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో మొదళ్ల వరకు కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్య కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. వీటిని రైతులు మడిలోనే తగులబెడుతున్నారు.

ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నది. కాల్చడం వల్ల అపార నష్టాలున్నాయంటూ శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా మెజార్టీ రైతులు వినకుండా వరి కొయ్యలను కాల్చుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా సారవంతమైన భూమి దెబ్బతినడంతో దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నది. వాతావరణం కలుషితమవుతున్నది.

అప్పట్లో దొడ్డినిండా పశువులు ఉండడం వల్ల వాటి మేత కోసం గడ్డిపోచను కూడా విడిచిపెట్టకుండా.. కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. ఇప్పుడు పశువులు లేకుండా పోయాయి. రైతుకు గడ్డి అవసరం లేకుండాపోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తదుపరి గడ్డిని కుప్పవేసే రైతులను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితులు వచ్చాయి. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో.. ప్రస్తుతం రైతులు వరిపంట కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పంటకు, పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరికోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులు నశింపచేయవచ్చన్న అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు.

తగులబెట్టడం వలన అనేక నష్టాలు

వరి కొయ్యలను తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ కొయ్యలను తగులపెట్టడంతో అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం లేకుండాపోతున్నది. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రీయ కర్బనం, కార్బన్‌డైఆక్సైడ్‌గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతున్నది. పొగ, ధూళికణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పొలాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

కలియ దున్నినా..కుప్ప పెట్టినా.. బంగారమే

వరిపంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపునీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ వేస్తే నేలలో మిగిలిపోయిన వరికొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఈవిధానంపై ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది......