/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్గొండలో తప్పిపోయిన వృద్ధులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త సాధిక్ పాష Miryala Kiran Kumar
నల్గొండలో తప్పిపోయిన వృద్ధులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త సాధిక్ పాష

అభాగ్యులకు అండగా

నల్గొండ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సామాజిక కార్యకర్త, మరియు మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు తన గొప్ప మనసును చాటుకుంటు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్గొండ కు చెందిన సాదిక్ పాషా గారు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తు సమాజానికి తన వంతు సేవలు అందిస్తు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. 2018 లో తన స్నేహితుని బంధువులు(భార్యా భర్తలు) అనారోగ్యంతో చనిపోగా తానే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి వారి ఇద్దరు పిల్లల్ని నల్గొండ కు తీసుకువచ్చి సి.డబ్ల్యూ.సి ద్వారా మేయర్స్ బాల భవన్ లో ఆశ్రయం కల్పించి వారికి ఉచిత విద్యా, వసతి కల్పించి వారికి గార్డియన్ గా(సంరక్షకునిగా)వున్నాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు అబ్బాయి 5వ తరగతి అమ్మాయి 3వ తరగతి చదువుతున్నారు. అతను చేసే సేవలకు గాను పలు అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎందరికో తన సేవలు అందించి విజయవాడలో కోవిడ్ వారియర్ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సమాజంలో నిరాదరణకు గురైన వారికి, అనాధాలకు, వృద్ధులకు, వికలాంగులకు, అత్యవసర సమయంలో రక్తదానం, మరియు అభాగ్యులకు సేవలు చేస్తుంటానని తాను సామాజిక సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన ఆ భగవంతునికి ఎల్లప్పుడూ రుణ పడి వుంటానని సామాజిక సేవలోనే తనకు తృప్తి వుంటుందని సామాజిక సేవతోనే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుందన్నారు అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి తమకు తొచిన విధంగా ఎదో ఒక రూపంలో సామాజిక సేవలు చేసి సమాజంలో మానవత్వాన్ని చాటాలని అలాగే రక్తదానానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు రావాలని అభిలాషించారు.

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే కంచర్ల

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలోని పానగల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, డిఈ రాములు, కౌన్సిలర్ ఖయ్యుం బేగ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ పట్టణ పరిధిలోని మీర్ బాగ్ కాలనీలో మై చోట కిడ్స్ స్కూల్ ను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. వారి వెంట నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు కౌన్సిలర్ మారగోని భవాని గణేష్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల లక్ష్మయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సయ్యద్ హాశం, సిపిఎం సీనియర్ నాయకులు దండంపల్లి సత్తయ్య, సలీం గార్లు తదితరులు పాల్గొన్నారు.

ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్‌ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్‌ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

చండీగఢ్‌: ఆఫీస్‌లో పని ఒత్తిడిగా అనిపిస్తే.. చాల మంది ఉద్యోగులు క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్‌ అయ్యాక..

పబ్‌, బార్‌కో వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. ఇకపై ఆఫీస్‌ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్‌కు వెళ్లి బీర్‌ తాగొచ్చు. ఎక్కడంటారా? హరియాణాలో. ఈ మేరకు హరియాణా (Haryana) ప్రభుత్వం ఉద్యోగులు ఆఫీస్‌లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమేనని తెలిపింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని (Liquor Policy) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీస్‌ పరిసరాల్లో ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉన్న బీర్‌, వైన్‌ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది..

జూన్‌ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. మే 9 తేదీన జరిగిన సమావేశంలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఐదువేలు మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక లైసెన్స్‌ (L-10F)ను జారీ చేస్తుంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలు రూ. 10 లక్షలు వార్షిక రుసుము చెల్లించాలి. దాంతోపాటు మరో రూ. 3 లక్షలు సెక్యూరిటీ మొత్తంగా చెల్లించాలి. అలానే, సంస్థలో క్యాంటీన్‌ కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. నిబంధనల ప్రకారం లైసెన్స్‌ పొందిన సంస్థల వద్ద ఎలాంటి రద్దీ ఉండకూడదు. కలెక్టర్‌, ఎక్సైజ్‌, ఐటీ కమీషనర్ల అనుమతితో లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు

మే 7వ తేదీన జరిగిన బీఎస్పీ తెలంగాణ బరోసా సభ లో బీఎస్పీ జాతీయ అధినేత్రి మాయావతి గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సందర్బంగా బిఎస్పి నాయకులు పెండం ధనంజయ్ నేత ఆధ్వర్యంలో ఆర్ఎస్పీ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బోట్ట శివన్న ఎద్దుల పృథ్వీరాజు, సూరన్న,కొమ్ము గణేష్,గోలి ప్రవీణ్ , నారపాక సైదులు , వడ్డేపలి సైదులు,తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

NLG: యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు

నల్లగొండ పట్టణ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్త యాదగిరి రెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, మిర్యాల యాదగిరి, గుర్రం వెంకన్న, తలారి యాదగిరి, రాజేందర్, జయప్రకాష్ గార్లు నివాళులర్పించారు.

మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి:పల్లకొండ కుమారస్వామి

మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి

వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో అనాధ పిల్లలతో పాటుగా వికలాంగులు తల్లిదండ్రులుగా ఉన్న వారి పేద విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకానికి వర్తింపజేయాలని వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు వికలాంగులుగా ఉన్న వారి పిల్లలు పేదరికం వలన విద్యాభ్యాసం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు.

   కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడ విద్యను అందించడం కోసం కృషి చేయాలని,ఈ పథకానికి 72 వేల ఆదాయ పరిమితి విధించడం వల్ల,ఆదాయ పరిమితిలో

సడలింపు ఇవ్వాలి. చాలామంది ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని, ప్రభుత్వం,ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకంలో వర్తింప చేయాలనీ కోరడమైందన్నారు.

    కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాస్తల్య పథకానికి కావాల్సిన ధ్రువ పత్రాలు సరైన సమయానికి అందక విద్య సంస్థలు సెలవులు కావడం వల్ల నాన అవస్థలుపడుతున్నారని దరఖాస్తు గడువు చాలా తక్కువగా ఉందనందున ఈ గడువును మరోసారి పొడిగించాలని తెలిపారు.పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ వాస్తల్య పథకం వికలాంగుల కుటుంబానికి చెందిన వారి పిల్లలు కూడా విద్యను అభ్యసించడానికి సహకారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

సత్తా చాటిన ఎల్లారెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం ఎస్ఎస్సి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మంచి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులకు 39 మంది విద్యార్థులు 97% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నల్లగొండ, చర్ల పళ్లికి చెందిన శ్యామల శివప్రసాద్ 9.3 మరియు నల్ల రక్షిక 9.2 జిపిఏతో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ చైర్మన్ రమేష్ అభినందించారు.

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నొస్టిక్ హబ్, రేడియాలజీ (రొమ్ము కాన్సర్) మరియు ఎక్స్ రే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభించి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు... ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్ గారు,

DMHO అనిమల్ల కొండల్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్, వైద్య కార్మికుల సంఘం పల్లా దేవేందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు గార్లు తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మున్సిపల్ చైర్మన్

NLG: పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు పద్మానగర్ లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పట్టణాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమన్నారు….ఈ కార్యక్రమంలో *గాదె వివేక్ రెడ్డి, మద్ది దినేష్ యాదవ్,మూడ వేణు, వనం చంద్ర శేఖర్,మిర్యాల కిరణ్, దొంత రవి, పోషంగిరి, కైరంకొండ శివశంకర్, గంజి గణేష్, మూడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.