/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ... Yadagiri Goud
లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ...

హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే సీఎం కేసీఆర్‌ తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హాజరే ఎటు పోయారని ప్రశ్నించారు. 69 ఏళ్ళలో రూ. 71 వేల అప్పు చేస్తే... కేవలం 9 ఏళ్ళలో కేసీఆర్ రూ. 5 లక్షలు అప్పు చేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరలించడానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం ఉందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. బీజేపీ పాలన తమకొద్దంటూ జనం చేతులు ఎత్తి దండం పెడుతున్నారన్నారు. దేశంలో ఆర్డినెన్స్‌ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పార్లమెంట్ భవనం ఏదైనా బీజేపీ అప్రజాస్వామికపాలనలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

నల్లధనం తెస్తామన్నారు. ఏమైంది?

అధికారంలోకి రాగానే నల్లధనం తెస్తామని నరేంద్రమోదీ అన్నారని, అది ఏమైందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీకి ఉందా? అని నిలదీశారు.

ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా?..అదాని కంపెనీలలో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోదీ ఎందుకు భయపడుతున్నారన్నారు. పార్లమెంట్‌పై నమ్మకం లేని ప్రధాని లాంటి వ్యక్తికి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి, పాత భవనం అయితే ఏంటి? అంటూ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు..

UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ

దిల్లీ: యూపీఎస్సీ ఫలితాల్లో తమకు ర్యాంకు వచ్చిందంటూ మధ్యప్రదేశ్‌, హరియాణాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు చేసిన ప్రకటనలు మోసపూరితమని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) స్పష్టంచేసింది..

వారిద్దరూ తమలాంటి పేర్లతో ఉన్న వేరే అభ్యర్థుల నంబర్లను చూపించి తమకే ర్యాంకులు వచ్చినట్లు తప్పుదోవపట్టించారంది. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రటకనలో పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అయేషా మక్రానీ, అయేషా ఫాతిమాల్లో తొలి వ్యక్తి అబద్ధాలు చెప్పారని, రెండో వ్యక్తి నిజమైన అభ్యర్థి అని, ఆమెకు 184వ ర్యాంకు వచ్చినట్లు స్పష్టంచేసింది. ''అయేషా మక్రానీ (తండ్రి సలీముద్దీన్‌ మక్రానీ) తనకు ర్యాంకు వచ్చినట్లు డాక్యుమెంట్లను ఫోర్జ్‌ చేసింది..

ఆమె రోల్‌ నంబరు 7805064తో... 2022 జూన్‌ 5న జరిగిన ప్రిలిమ్స్‌ను రాయగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1లో 22.22, పేపర్‌-2లో 21.09 మార్కులు వచ్చాయి. ఈమె తదుపరి దశకు వెళ్లలేదు. మరోవైపు రోల్‌ నంబరు 7811744తో పరీక్ష రాసిన అయేషా ఫాతిమా (తండ్రి నిజాముద్దీన్‌) నిజమైన అభ్యర్థి.

ఆమె 2022 సివిల్స్‌లో 184వ ర్యాంకు పొందారు. అలాగే... హరియాణాలోని రేవారీ ప్రాంతానికి చెందిన తుషార్‌దీ అబద్ధపు కథే. ఇతను 2022లో రోల్‌ నంబరు 2208860తో ప్రిలిమ్స్‌ రాశాడు.

అతనికి జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1లో మైనస్‌ 22.89, పేపర్‌-2లో 44.73 మార్కులు వచ్చాయి. ఇతను కూడా ప్రిలిమ్స్‌ స్థాయిలోనే ఫెయిల్‌ అయ్యాడు. మరోవైపు రోల్‌ నంబరు 1521306తో పరీక్ష రాసిన బిహార్‌కు చెందిన తుషార్‌ కుమార్‌ నిజమైన అభ్యర్థి. అతనికి 44వ ర్యాంకు వచ్చింది'' అని యూపీఎస్‌సీ పేర్కొంది.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు 24 మంది మంత్రుల పేర్లను ఖరారు చేస్తూ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది..

అయితే లింగాయత్ ఓటు బ్యాంకును బీజేపీ నుంచి కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాదిలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు పంపించారు. ఈరోజు ఉదయం 11.45 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది..

SB NEWS

SB NEWS

Terror conspiracy case: ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఏ దాడులు

జబల్‌పూర్ (మధ్యప్రదేశ్): ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ ప్రాంతంలో శనివారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది..

జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు.(Terror conspiracy case) భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.

( NIA raids) ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్(Jabalpur) ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది.

ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది..

SB NEWS

జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్?

తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. 2023 జూన్‌ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ కానున్నాయి.

అంటే వేసవి సెలవులకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్నాయన్న మాట. దాదాపు రెండు నెలల పాటు విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు తమ సొంత పట్టణాలకు చేరకుంటున్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా, రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. కాగా స్కూళ్లకు 2023 ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలావుండగా జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్) నిర్వహించాలని విద్యా శాఖ యోచిస్తోంది.

ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాల్సి ఉంటుంది. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పిస్తారు...

111 జీవో రద్దు ఓకే.. నెక్స్ట్ ఏంటి❓️

మహానగర శివారులోని గ్రామాలకు ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ?

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి.

జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు? ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది.

గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్‌లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు.

గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు.

Arvind Kejriwal: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం.. కేసీఆర్‌ మద్దతు కోరనున్న కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రానున్నారు. శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ సమావేశం కానున్నారు..

ఢిల్లీలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్‌ల (IPS) బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మద్దతును కేజ్రీవాల్ కోరనున్నారు..

ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యత్నిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఇంటి పునర్ నిర్మాణ పనులపై దృష్టి సారించారు.

(Arvind Kejriwal) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బంగ్లా పునరుద్ధరణపై విజిలెన్స్ నివేదిక(Vigilance Report) ఎల్‌జి సక్సేనాకు అందింది. 2020వ సంవత్సరం మార్చిలో అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి సీఎం ఇంట్లో అదనపు వసతి ఏర్పాట్లను ప్రతిపాదించారు.

(Delhi CM's Bungalow Renovation) డ్రాయింగ్ రూమ్, రెండు మీటింగ్ రూమ్‌లు, 24 మంది కెపాసిటీ ఉన్న డైనింగ్ రూమ్ పునర్నిర్మించడం ద్వారా పై అంతస్తును అదనంగా చేర్చారు..

Congress: మోదీ 9 ఏళ్ల పాలన.. కాంగ్రెస్‌ 9 ప్రశ్నలు

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా (BJP) పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కీలక అంశాలను లేవనెత్తారని, వాటిని ఆధారంగా చేసుకుని తాము కేంద్రాన్ని 9 ప్రశ్నలు అడుగుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. 'నౌ సాల్‌.. నౌ సవాల్‌' పేరుతో ఓ బుక్‌లెట్‌ కూడా విడుదల చేసినట్లు చెప్పారు..

కాంగ్రెస్‌ అడిగిన 9 ప్రశ్నలు ఇవే..

1. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు ఆకాశాన్నంటుతోంది? సంపన్నులు మరింత ధనవంతులుగా.. పేదలు మరింత నిర్భాగ్యులుగా ఎందుకు మారుతున్నారు? ప్రజల ఆస్తులను ప్రధాని మోదీ తన స్నేహితులకు ఎందుకు విక్రయిస్తున్నారు?

2. సాగు చట్టాలను రద్దు చేసినప్పుడు రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు గౌరవించట్లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఎందుకు ఇవ్వట్లేదు? 9 ఏళ్లయినా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదెందుకు?

3. మీ ఫ్రెండ్‌ అదానీ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు రిస్క్‌లో పెట్టారు? భాజపా పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

4. మీరు క్లీన్‌చిట్ ఇచ్చినా.. చైనా ఎందుకు ఇంకా భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 18 సార్లు చర్చలు జరిగిన ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోంది?

5. ఎన్నికల లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?

6. మహిళలు, దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సామాజిక న్యాయ పునాదులను ఎందుకు నాశనం చేస్తున్నారు?

7. మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు బలహీన పరుస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలను ఎందుకు ప్రయోగిస్తున్నారు?ధనబలంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు?

8. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి, కఠిన నిబంధనలు తీసుకొచ్చి వాటిని ఎందుకు బలహీనపరుస్తున్నారు?

9. ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ విధించడంతో నష్టపోయిన లక్షలాది వలసకార్మికులకు ఎందుకు సాయం చేయలేదు? కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదు?

ఈ ప్రశ్నలకు ప్రధాని (PM Modi) సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. అంతేగాక.. ఈ తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు గానూ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంది. ఈ రోజును కేంద్ర ప్రభుత్వం 'మాఫీ దివస్‌'గా నిర్వహించాలని హస్తం పార్టీ దుయ్యబట్టింది.

తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ..

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది..

SB NEWS

SB NEWS

SB NEWS

పార్లమెంటు ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

న్యూఢిల్లీ,

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే.. దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ భవనాన్ని ప్రధానికి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సచివాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్‌ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ వేశారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ద్వారా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్‌ తన పిల్‌లో పేర్కొన్నారు.

ప్రధానిని, ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతేనని.. కార్యనిర్వహణకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రపతి పేరు మీదే తీసుకుంటారని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడమంటే అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా.. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వచ్చేదే లేదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన విపక్ష నేతలు తమ వాగ్దాడిని కొనసాగించారు.

ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘మిస్టర్‌ మోదీ.. పార్లమెంటు ప్రజలు నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం. మీ ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి పార్లమెంటరీ వ్యవస్థనే నాశనం చేసింది. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కోవడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ చేశారు.

ఇక.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం మన దేశ బహుళత్వానికి, భిన్నత్వానికి నిదర్శనమని.. పార్లమెంటరీ సాంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఒక నియంతృత్వ ప్రభుత్వ వైఖరికి ప్రతిస్పందన అని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ వ్యాఖ్యానించారు. ‘‘వందేభారత్‌ రైళ్ల నుంచి పార్లమెంటు భవనం దాకా.. అన్నింటినీ ప్రధానే ప్రారంభించాలి. కొవిడ్‌ టీకాల సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫొటోనే వేయాలి. ఏ శాఖ నిర్వహించిన పనికైనా క్రెడిట్‌ ఆయనకే ఇవ్వాలి.

ఈ తరహా మెగెలోమేనియా (తనను తాను అందరికన్నా అధికుడుగా భావించుకునే తత్వం).. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడే నియంతల తీరుకు బండగుర్తు’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే నిప్పులు చెరిగారు. వారి వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. మే 28న పార్లమెంటు ప్రారంభోత్సవానికి విచ్చేసి విపక్షాలు తమ విశాల హృదయాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము అంటే తమకు గౌరవం ఉందని.. రాష్ట్రపతి పదవిని తాము రాజకీయాల్లోకి లాగదల్చుకోలేదని స్పష్టం చేశారు.