/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ ఆర్జాలబావి గోదాములను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి Miryala Kiran Kumar
నల్లగొండ ఆర్జాలబావి గోదాములను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆర్జాలబావి ధాన్యం గోదాములను... పరిశీలించారు..

 ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన. రాష్ట్రంలో పండిన పండిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... ఇప్పటికే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా..3.5 లక్షల మెట్రిక్ టన్నుల,ధాన్యాన్ని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉందని,అందులో నల్లగొండ నియోజకవర్గం లో లక్ష మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరించినదన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని తాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం తడవకుండా రాశులను కప్పి ఉంచుకోవాలని, కోరారు.

 ఎప్పటికప్పుడు, కాంట ఐన ధాన్యాన్ని .. లారీలు ట్రాక్టర్లతో వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించాలని.. అధికారులను ఆదేశించారు..

 జిల్లా సివిల్ సప్లై అధికారి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి అన్నెపర్తి సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల యజమానులు కందుకూరు మహేందర్ కొండా లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు.

పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్న నల్గొండ చేనేత కో కన్వీనర్

భూదాన్ పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా. ఈ యొక్క దీక్షకు మద్దతుగా , మరియు చేనేత కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలయ భాస్కర్ రాజుగారు, రాష్ట్ర ఓబిసి కార్యదర్శి నందనం దివాకర్ గాారు, మరియు రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ శివకుమార్ గారు, కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర చేనేత కో కన్వీనర్ మిరియాల వెంకన్న గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు, భువనగిరి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారు, పోచంపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు దోర్నాల సత్యం గారు, పోచంపల్లి మూడో వార్డు కౌన్సిలర్ సుర్కంటి జ్యోతి రంగారెడ్డి గారు, పార్టీ నాయకులు ఏల చంద్రశేఖర్ గారు,, పట్టణ ఉపాధ్యక్షులు ఏల శ్రీనివాస్ గారూ, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శేఖర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గంజి బసవలింగం గారు, కర్నాటి నరసింహ, చిటుకుల అంబదాసు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వంగూరి సిద్దు, భారత బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

జన విజ్ఞాన వేదిక వార్షిక సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

NLG: ఘనంగా జనవిజ్ఞాన వేదిక వార్షిక సభలు 

నల్లగొండ పట్టణ పరిధిలోని మనోరమ హోటల్లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాలుగో వార్షిక మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు హాజరై, జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విసి గోపాల్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాను నడవలేకున్నా... తన వారిని పోషించాలని!

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమది. నిలువ నీడలేదు. ఆ తల్లిదండ్రులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. కానీ వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ దంపతులిద్దరూ మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే వారికి పెద్ద దిక్కయింది. కష్టపడి డిగ్రీ చదివినా ఉపాధి దొరక్క.. అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి బతుకీడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేటకు చెందిన గుంజి రాంబాబు(60), లక్ష్మి (55) దంపతులకు నలుగురు కూతుళ్లు. భార్యభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కూతురు అంజమ్మ(35)కు చిన్నతనంలోనే పోలియో రావడంతో రెండు కాళ్లూ పనిచేయవు. డిగ్రీ వరకు ఎలాగో చదివిన ఆమె ఊత కర్రలమీదే నడుస్తోంది. చిన్న కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కొద్ది సంత్సరాల క్రితం చనిపోయింది. మరో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగా కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. గతేడాది లారీ ఢీకొనడంతో రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఒక కాలు తొలగించారు. మరో కాలులో రాడ్లు వేశారు. దీనికితోడు పక్షవాతం రావడంతో ఆయన పూర్తిగా మంచానపడ్డారు. ఇది జరిగిన కొద్ది నెలలకే మరో రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని కకావికలం చేసింది. లక్ష్మి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఊత కర్ర లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. ఇప్పుడా తల్లిదండ్రుల భారమంతా పెద్ద కుమార్తెపై పడింది. తండ్రి, కూతుళ్లకు వస్తున్న దివ్యాంగుల పింఛన్లతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ఆ వచ్చే డబ్బులు ప్రతినెలా మందులకు కూడా సరిపోవడంలేదు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న తనకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపాలని అంజమ్మ జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అద్దె ఇంట్లోనే ఉంటున్న తమకు రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

నల్గొండ ప్రజలు ఫోన్ పోగొట్టుకున్నట్లయితే ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోండి: నల్గొండ ఎస్పీ కే అపూర్వరావు

నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లను CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా వెతికి బాధితులకు అందజేత.

 జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS.

 మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి.

 -www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన

  CEIR పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా యస్.పి గారు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని ఎస్పీ గారు తెలిపారు.ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని తెలిపారు.

క్షతగాత్రునికి పరామర్శించిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

క్షతగాత్రునికి పరామర్శ

నల్లగొండ పట్టణ పరిధిలోని 13వ వార్డు మర్రిగూడకు చెందిన మందడి మధుసూధన్ రెడ్డి కాలుకి గాయం కావడంతో సాయిరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి పరామర్శించారు. వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. వారి వెంట నల్లగొండ పట్టణ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో MD బిలాల మంజు బాబా గారికి ఘన సన్మానం

Md bilala మంజు బాబా గారికి ఘనంగా సన్మానం 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా జామా మజీద్ మాధవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బిలాల్ మంజు బాబా గారు ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ నందు పీహెచ్డీ పట్టా పొందడం జరిగింది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి పర్యవేక్షణలో డెవలప్మెంట్ ప్రోగ్రాం పీపుల్స్ పార్టిసిపేషన్ ఏ కే స్టడీ ఆఫ్ నల్గొండ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంశంలో డాక్టర్ పట్టా పొందారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎకనామిక్స్ లో పిహెచ్డి పట్టా పొందడం జిల్లాకి ఎంతో గర్వకారణం అని ఆయన తెలిపారు నల్గొండ జిల్లా ప్రజలందరూ ఎండి బిలాల్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని బాగా చదువుకోవాలని కోరారు ఎండి బిలాల్ మాట్లాడుతూ నాకీ సన్మానం ఎంతో బాధ్యతను పెంచింది పేద ప్రజల విద్య అభివృద్ధికై కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సత్యశోధక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు గాదె లింగస్వామి ప్రిన్సిపల్.. బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు రంగాపూర్ యాదయ్య సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కంబాలపల్లి శ్రీకాంత్ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్ sc st నియోజకవర్గ ఇన్చార్జి కుడుతల నాగరాజు కార్యదర్శి ఇరికి బిక్షం శంకర్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు మండల పరిధిలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కంచర్ల, గాదరి కిషోర్ మరియు నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.

మునుగోడు మండల పరిధిలోని కోతులారం గ్రామంలో కేదారేశ్వర స్వామి, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ గారు, మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైది రెడ్డి గారు పాల్గొన్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని కోరారు. వారికి బ్రహ్మోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్, ఆలకుంట్ల మోహన్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ లో భాగంగా 17వ వార్డులో జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండాాా ఆవిష్కరణలో భాగంగా నల్గొండ 17వ వార్డులోో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడిిిిి సైదిరెడ్డి గులాబీ జెండాా ఎగురవేయడం జరిగిందిి. ఈ సందర్భంగాా వార్డులోని ప్రజలుు అత్యధికంగా పాల్గొనిి కార్యక్రమాన్ని విజయవంతంం చేశారు. అదేవిధంగాా ఈరోజు ఏర్పాటుచేసిన BRS పార్టీ ప్లీనరీీ సమావేశంలో భారీీీీ ఎత్తున కార్యకర్తలతో సైదిరెడ్డి గారు పాల్గొన్నారు.

నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.

నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.ముస్లిం సోదరులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు.నెల రోజుల పాటు ఎంతో దీక్షతో,నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ,ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్  వేడుకలు జరుపుకున్నరు... అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా , ససస్యశ్యామలంగా మారింది..

ప్రజలంతా,కలిసి మెలసి జీవిస్తూ, సోదరభావంతో ప్రశాంతమైన జీవనం గడిపేల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

ఇవాళ మత సామరస్యంలో తెలంగాణ దేశానికే  రోల్ మోడల్ గా నిలిచింది...సభండ వర్గాలు కలిసి జీవించి, ఉన్నతమైన సమాజం నిర్మాణం  జరిగేలా  కేసీఆర్ గారు కృషి చేశారన్నారు.