/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz క్షతగాత్రునికి పరామర్శించిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి Miryala Kiran Kumar
క్షతగాత్రునికి పరామర్శించిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

క్షతగాత్రునికి పరామర్శ

నల్లగొండ పట్టణ పరిధిలోని 13వ వార్డు మర్రిగూడకు చెందిన మందడి మధుసూధన్ రెడ్డి కాలుకి గాయం కావడంతో సాయిరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి పరామర్శించారు. వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. వారి వెంట నల్లగొండ పట్టణ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో MD బిలాల మంజు బాబా గారికి ఘన సన్మానం

Md bilala మంజు బాబా గారికి ఘనంగా సన్మానం 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా జామా మజీద్ మాధవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బిలాల్ మంజు బాబా గారు ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ నందు పీహెచ్డీ పట్టా పొందడం జరిగింది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి పర్యవేక్షణలో డెవలప్మెంట్ ప్రోగ్రాం పీపుల్స్ పార్టిసిపేషన్ ఏ కే స్టడీ ఆఫ్ నల్గొండ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంశంలో డాక్టర్ పట్టా పొందారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎకనామిక్స్ లో పిహెచ్డి పట్టా పొందడం జిల్లాకి ఎంతో గర్వకారణం అని ఆయన తెలిపారు నల్గొండ జిల్లా ప్రజలందరూ ఎండి బిలాల్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని బాగా చదువుకోవాలని కోరారు ఎండి బిలాల్ మాట్లాడుతూ నాకీ సన్మానం ఎంతో బాధ్యతను పెంచింది పేద ప్రజల విద్య అభివృద్ధికై కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సత్యశోధక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు గాదె లింగస్వామి ప్రిన్సిపల్.. బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు రంగాపూర్ యాదయ్య సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కంబాలపల్లి శ్రీకాంత్ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్ sc st నియోజకవర్గ ఇన్చార్జి కుడుతల నాగరాజు కార్యదర్శి ఇరికి బిక్షం శంకర్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు మండల పరిధిలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కంచర్ల, గాదరి కిషోర్ మరియు నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.

మునుగోడు మండల పరిధిలోని కోతులారం గ్రామంలో కేదారేశ్వర స్వామి, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ గారు, మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైది రెడ్డి గారు పాల్గొన్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని కోరారు. వారికి బ్రహ్మోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్, ఆలకుంట్ల మోహన్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ లో భాగంగా 17వ వార్డులో జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండాాా ఆవిష్కరణలో భాగంగా నల్గొండ 17వ వార్డులోో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడిిిిి సైదిరెడ్డి గులాబీ జెండాా ఎగురవేయడం జరిగిందిి. ఈ సందర్భంగాా వార్డులోని ప్రజలుు అత్యధికంగా పాల్గొనిి కార్యక్రమాన్ని విజయవంతంం చేశారు. అదేవిధంగాా ఈరోజు ఏర్పాటుచేసిన BRS పార్టీ ప్లీనరీీ సమావేశంలో భారీీీీ ఎత్తున కార్యకర్తలతో సైదిరెడ్డి గారు పాల్గొన్నారు.

నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.

నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.ముస్లిం సోదరులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు.నెల రోజుల పాటు ఎంతో దీక్షతో,నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ,ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్  వేడుకలు జరుపుకున్నరు... అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా , ససస్యశ్యామలంగా మారింది..

ప్రజలంతా,కలిసి మెలసి జీవిస్తూ, సోదరభావంతో ప్రశాంతమైన జీవనం గడిపేల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

ఇవాళ మత సామరస్యంలో తెలంగాణ దేశానికే  రోల్ మోడల్ గా నిలిచింది...సభండ వర్గాలు కలిసి జీవించి, ఉన్నతమైన సమాజం నిర్మాణం  జరిగేలా  కేసీఆర్ గారు కృషి చేశారన్నారు.

నల్లగొండ ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో శాలి గౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం మరియు పేదలకు దుప్పట్ల పంపిణీ

జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా రివైవ్ మల్టి స్పెషాలిటి హాస్పిటల్ నకిరేకల్ వారి సౌజన్యంతో ఆదివారం నాడు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే NHRC తరపున పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, NHRC డివిజనల్ ఆదనపు కార్యదర్శి ఎం.డి.సాదిక్ పాషా గారు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన పౌర హక్కులకు భంగం కలుగకుండా జాతీయ మానవ హక్కుల మండలి ఎల్లవేళలా కృషి చేస్తుందని అలాగే అవినీతి రహిత సమాజం నిర్మితమయ్యేలా సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజలు ఎల్లప్పుడూ NHRC సేవలు పొందొచ్చని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రివైవ్ ఆసుపత్రి వారి సామాజిక సేవను కొనియాడారు వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా పేర్కొంటు రోగి వైద్యుడిని భగవంతుని మరో రూపంగా భావిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వైద్యులు కృషి చేయాలని అలాగే రివైవ్ ఆసుపత్రి సేవలను ఆదర్శంగా తీసుకుని ఇతర వైద్యులు కూడా సామాజిక సేవలను కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో NHRC ఉమ్మడి జిల్లా అధ్యక్ష,ఉపాధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు,రివైవ్ ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది,మరియు NHRC సభ్యులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నల్గొండలో వారికి నివాళులర్పించిన నల్గొండ బిసి సంక్షేమ సంఘం నాయకులు

రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బహు భాషా కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, వారు అందరివారని కొనియాడారు. ఎంతో ముందు చూపుతో అన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలు తలుత్తకుండా చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్వతంత్ర భారత్ మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి విశిష్టమైన సేవలను అందించారని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మూ నా స ప్రసన్నకుమార్, మహిళా సంఘం అధ్యక్షులు మామిడి పద్మ యాదవ్, శంకరదుర్గ , వెంకన్న యాదవ్, కర్ణా టి యాదగిరి , L వెంకన్న, రాజు. తదితరులు పాల్గొన్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ నిర్వహించిన నలగొండ బీసీ సంక్షేమ సంఘం

ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ గడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించిన బీసీీీీ సంక్షేమ సంఘం.

 ఈ సందర్భంగా బీసీ కుల, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ సమాజానికి మండల్ చేసిన సేవలను కొనియాడారు .మండల కమిషన్లో సూచించిన 40 అంశాలలో ఒక్కదాని మాత్రమే అమలు చేసి మిగతా 39 అంశాలను నేటికీ అమలు చేయకపోవడం బీసీ సమాజానికి అన్యాయం చేయడమేనని,

 ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 39 అంశాలను అమలు చేసి తీరాలని  

అందులో భాగంగా క్రిమిలేయర్ విధానాన్నిఎత్తివేయాలని ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని ,చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, జనగణనలో కులగనన చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్గఎన్నికైన పంకజ్ యాదవ్ గారు ,దుడుకు లక్ష్మీనారాయణ, వంగూరు నారాయణ యాదవ్, కాశి రాములు యాదవ్ ,పర్వతాలు, ఆమంచి అంజయ్య ,రమణ ముదిరాజ్, ప్రసన్నకుమార్ ,బత్తుల శ్రీనివాస్, కనకరాజు, బక్కతట్ల వెంకన్న, మామిడి పద్మ ,శంకర్ దుర్గ ,వల కీర్తి శ్రీనివాస్, కోటయ్య, రాచకొండ గిరి ,హరీ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు లో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట 

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నలగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల బలోపేతానికి రంజాన్ పండుగ కానుకగా తోఫాలు అందజేసి గౌరవించుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 17 వార్డు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు.

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న వారి మిత్ర బృందం సభ్యులు

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ 35వ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామన్న యాదవ్ మిత్రబృందం సభ్యులు తిరుమల రాము, మరియు సిరిగిరి సురేష్ రెడ్డిలు ఒక ప్రకటనలు తెలిపారు. ముఖ్యంగా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో రామన్న యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. వారు మన మధ్యలో లేకున్నా వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామన్న యాదవ్ మిత్రులు, యువకులు యువజన సంఘాల నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.రక్తదానం చేయదలుచుకున్న్న్న వారు వారి వివరాలు సిరిగిరి సురేష్ రెడ్డి గారికి తెలియజేయాలని వారి సెల్ -9640098219 ను సంప్రదించగలరనిి తెలిపారు.