డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నల్గొండలో వారికి నివాళులర్పించిన నల్గొండ బిసి సంక్షేమ సంఘం నాయకులు
రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బహు భాషా కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, వారు అందరివారని కొనియాడారు. ఎంతో ముందు చూపుతో అన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలు తలుత్తకుండా చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్వతంత్ర భారత్ మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి విశిష్టమైన సేవలను అందించారని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మూ నా స ప్రసన్నకుమార్, మహిళా సంఘం అధ్యక్షులు మామిడి పద్మ యాదవ్, శంకరదుర్గ , వెంకన్న యాదవ్, కర్ణా టి యాదగిరి , L వెంకన్న, రాజు. తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ గడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించిన బీసీీీీ సంక్షేమ సంఘం.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ 35వ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామన్న యాదవ్ మిత్రబృందం సభ్యులు తిరుమల రాము, మరియు సిరిగిరి సురేష్ రెడ్డిలు ఒక ప్రకటనలు తెలిపారు. ముఖ్యంగా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో రామన్న యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. వారు మన మధ్యలో లేకున్నా వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామన్న యాదవ్ మిత్రులు, యువకులు యువజన సంఘాల నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.రక్తదానం చేయదలుచుకున్న్న్న వారు వారి వివరాలు సిరిగిరి సురేష్ రెడ్డి గారికి తెలియజేయాలని వారి సెల్ -9640098219 ను సంప్రదించగలరనిి తెలిపారు.
రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పెండెం ధనుంజయ్ నేత
ఆర్థిక సహాయం అందజేత:
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది
నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
Apr 17 2023, 08:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.7k