/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం Miryala Kiran Kumar
ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన POSHAN PAKWADA కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ బాలికల పాఠశాల ఆర్.పి.రోడ్డులో అనిమీయ క్యాంపు నిర్వహించి బాలికలకు రక్త పరీక్షలు జరిపి వారికి ఆరోగ్య సలహాలు ముఖ్యంగా రక్తహీనత గురించి అదనపు కలెక్టర్ గారు బాలికలకు పలు ఆరోగ్య సలహాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పౌష్టికాహారానికి సంబంధించిన పలు ఆహార పదార్థాలు ప్రదర్శించి విద్యార్థులకు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా గారు DWO సుభద్ర గారు, CDPO నిర్మల గారు, సూపర్ వైజర్ ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, వార్డు కౌన్సిలర్ రయిసా బేగం,అంగన్వాడీ టీచర్స్ నస్రీన్ సుల్తానా, స్వరూపరాణి,అండాలు, అయేషా హుమెరా, వెంకటలక్ష్మి, రాజిలోచన, శ్రీదేవి, హెల్పర్ అన్వరున్నిసా, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి 

నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డుకు చెందిన కట్ట హనుమంతు, లావణ్య కుమారుని మొదటి జన్మదిన వేడుకలో మరియు 40వ వార్డుకు చెందిన నాంపల్లి వెంకటేష్, కవిత చిన్నారుల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు హాజరై, చిన్నారులను ఆశీర్వదించారు. వారి వెంట నల్లగొండ సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, నాంపల్లి శ్రీనివాస్, అన్వర్, వనం చంద్రశేఖర్, మిరియాల కిరణ్ కుమార్, పోషం గిరి, కైరం కొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..

గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని అనేశ్వరమ్మ గుట్ట వెనుక గౌడ కులస్తుల ఆరాధ్య దైవం సురమాంబ కాటమయ్య దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గీత కార్మికులకు ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి

తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

అక్షర దివిటి చెన్నారావుపేట ప్రతి నిధి:

   వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో దివ్యాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో దయనియా స్థితిలో దివ్యాంగులు పూట గడవక కొట్టుమిట్టాడుతున్నరాని సీఎం కెసిఆర్ గారు కరుణ చూపి గృహ లక్ష్మికీ 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలనీ కోరాడం జరిగింది.

    ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మికీ 5 శాతం రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పించి ప్రభుత్వం ఇస్తున్న 3లక్షలతో పాటు దివ్యాంగుల శాఖలో మరో 2 లక్షలు రూ,,కేటాయించి ఆ డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వమే నిర్మించి దివ్యాంగులకు ఇవ్వాలని తెలంగాణ దివ్యాంగుల సమాజం తరుపున తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ గారికి, ఆయా శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గార్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

  

    ఈ కార్యక్రమంలో దివ్యాంగుల-జేఏసీ రాష్ట్ర నాయకులు దేవర రాజు,జిల్లా నాయకులు దారావత్ రమేష్,రాజు,అనిల్,సతీష్,సుధాకర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు నిరసన కార్యక్రమం

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ లో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను

సృష్టించుకోవచ్చు అన్నారు టెక్సటైల్ పరిశ్రమ కోసం ప్రపంచ స్థాయిలో దీటుగా 10,683, కోట్ల ఆర్థిక వ్యయంతో పి ఎల్ ఐ ని ప్రారంభించింది అని అన్నారు తెలంగాణలో మొత్తం 18 క్లస్టర్లు గాను 90 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు ఈ మెగా టెక్స్టైల్ పార్కు ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు మేకిన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ కి ఇది గొప్ప ఉదాహరణ అని కూడా తెలిపారు అలాగే ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వీరేశ్ చంద్రశేఖర్ గారు నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ తిరందాసు కనకయ్య గారు, రాపోలు విద్యాసాగర్, గారు రాపోలు భాస్కర్, శ్రీరాముల రాజు, చిట్టిపోలు అనిలు బద్దం నగేష్, గురిజ సైదులు, టంగుటూరి రాజు, గుర్రం నరేందర్, గజం పాండు గంజి వెంకటేశం మిరియాల శ్రీరాములు గుండు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... ఎమ్మెల్యే కంచర్ల

 ♦️రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

 ♦️నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ చారిత్రాత్మకం.

♦️ 250 మంది రజకులకు వారి ఆర్థిక అభివృద్ధికై.. స్వంత నిధులతో ఉచిత ఇస్త్రీ పెట్టెల పంపిణీ....

♦️ రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... కంచర్ల

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

 నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల రజక భవన్ లో

 చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో పొదుపు చేసుకుం టున్న ప్రోత్సాహంగా 250 ఇస్త్రీ పెట్టెలను.. తన స్వంత నిధులనుండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం లోని రజకులకు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మూడు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తామని. ప్రస్తుతం 55 లక్షలతో మోడ్రన్ దోబీ ఘాట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని,

 మరో రెండు కోట్ల రూపాయల వ్యయంతో మరో మోడరన్ దోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమగు నిధులు కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షులు & మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు.. చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు జిల్లా స్థాయి సభ్యులు గోలి శంకర్ చిలక రాజు సతీష్, గడ్డం రాములు భీమనపల్లి నగేష్ చర్లపల్లి మల్లేష్ బి శంకరమ్మ జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటిఆర్

హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందిస్తూ.."ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థలపై అవగాహన లేని నాయకుడు బండి సంజయ్. టీఎస్ పీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్పీఎస్సీకి అందిస్తాం. రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టిపెట్టాలి" అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ 17వ వార్డులో అభయాంజనేయ స్వామిి దేవాలయానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ 17వ వార్డులో అభయాంజనేయ స్వామిి దేవాలయానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డు గాయిత్రి నగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.

నల్లగొండ లో రెస్టారెంటు ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ పట్టణ పరిధిలోని హైద్రాబాద్ రోడ్డులో తాజ ఆహార్ రెస్టారెంట్ ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పల్లా ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు ఉట్కూరి వెంకట్ రెడ్డి, ప్రదీప్ నాయక్, వట్టిపల్లి శ్రీనివాస్, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, సాయి, రావుల శ్రీనివాస్ రెడ్డి, దోనాల నాగార్జున్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.