/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు నిరసన కార్యక్రమం Miryala Kiran Kumar
యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు నిరసన కార్యక్రమం

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ లో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను

సృష్టించుకోవచ్చు అన్నారు టెక్సటైల్ పరిశ్రమ కోసం ప్రపంచ స్థాయిలో దీటుగా 10,683, కోట్ల ఆర్థిక వ్యయంతో పి ఎల్ ఐ ని ప్రారంభించింది అని అన్నారు తెలంగాణలో మొత్తం 18 క్లస్టర్లు గాను 90 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు ఈ మెగా టెక్స్టైల్ పార్కు ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు మేకిన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ కి ఇది గొప్ప ఉదాహరణ అని కూడా తెలిపారు అలాగే ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వీరేశ్ చంద్రశేఖర్ గారు నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ తిరందాసు కనకయ్య గారు, రాపోలు విద్యాసాగర్, గారు రాపోలు భాస్కర్, శ్రీరాముల రాజు, చిట్టిపోలు అనిలు బద్దం నగేష్, గురిజ సైదులు, టంగుటూరి రాజు, గుర్రం నరేందర్, గజం పాండు గంజి వెంకటేశం మిరియాల శ్రీరాములు గుండు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... ఎమ్మెల్యే కంచర్ల

 ♦️రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

 ♦️నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ చారిత్రాత్మకం.

♦️ 250 మంది రజకులకు వారి ఆర్థిక అభివృద్ధికై.. స్వంత నిధులతో ఉచిత ఇస్త్రీ పెట్టెల పంపిణీ....

♦️ రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... కంచర్ల

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

 నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల రజక భవన్ లో

 చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో పొదుపు చేసుకుం టున్న ప్రోత్సాహంగా 250 ఇస్త్రీ పెట్టెలను.. తన స్వంత నిధులనుండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం లోని రజకులకు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మూడు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తామని. ప్రస్తుతం 55 లక్షలతో మోడ్రన్ దోబీ ఘాట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని,

 మరో రెండు కోట్ల రూపాయల వ్యయంతో మరో మోడరన్ దోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమగు నిధులు కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షులు & మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు.. చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు జిల్లా స్థాయి సభ్యులు గోలి శంకర్ చిలక రాజు సతీష్, గడ్డం రాములు భీమనపల్లి నగేష్ చర్లపల్లి మల్లేష్ బి శంకరమ్మ జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటిఆర్

హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందిస్తూ.."ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థలపై అవగాహన లేని నాయకుడు బండి సంజయ్. టీఎస్ పీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్పీఎస్సీకి అందిస్తాం. రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టిపెట్టాలి" అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ 17వ వార్డులో అభయాంజనేయ స్వామిి దేవాలయానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ 17వ వార్డులో అభయాంజనేయ స్వామిి దేవాలయానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డు గాయిత్రి నగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.

నల్లగొండ లో రెస్టారెంటు ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ పట్టణ పరిధిలోని హైద్రాబాద్ రోడ్డులో తాజ ఆహార్ రెస్టారెంట్ ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పల్లా ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు ఉట్కూరి వెంకట్ రెడ్డి, ప్రదీప్ నాయక్, వట్టిపల్లి శ్రీనివాస్, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, సాయి, రావుల శ్రీనివాస్ రెడ్డి, దోనాల నాగార్జున్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.

TSPSC: ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు.

TSPSC: ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు.

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు..

కానీ, ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు.

వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్‌, టౌన్‌ ప్లానింగ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్‌ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని, సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 9మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

 అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు. ఈనెల 11న జరిగిన విచారణలో పూర్తిగా సహకరించా. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు ఇచ్చా. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఈనెల 11న సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీకి పంపుతున్నాను. నా హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 24 న విచారించనుంది.' అని కవిత ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు కవిత తరఫు న్యాయవాది భరత్ మాట్లాడుతూ ఆమెను ఈడీ వేధిస్తోందని ఆరోపించారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కవిత అనారోగ్యంతో ఉన్నారని ఆమెపై అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలని ఈడీ చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని.. 24న విచారణ ఉందని వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని న్యాయవాది భరత్ స్పష్టం చేశారు.

Tspsc ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి-sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

Tspsc ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకుంటూ ఉంటే మన నిరుద్యోగుల పొట్ట కొడుతున్న టీఎస్పీఎస్సీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహించిన చైర్మన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేయాలని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ లు తీసుకొని ఈరోజు ఉద్యోగాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రవన్న బిడ్డలు చదువుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లీకేజీల వ్యవహారం చాలా దౌర్భాగ్యకరమని దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇట్టి కారకులైన వారిని పీడియాట్ కేసు నమోదు చేయాలని సీట్ వేగవంతంగా దర్యాప్తు చేసి వారిని శిక్షించాలని బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని యధావిధిగా గ్రూప్ వన్ మరియు ఇతర పరీక్షలు కూడా అభ్యర్థులు పరీక్ష పెట్టాలని రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలు పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కఠినంగా నియమ నిబంధనలతో నిర్వర్తించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మామిళ్ల జానీ యాదవ్ వరికుప్పల విష్ణు వెంకన్న శ్రీధర్ నవీన్ విష్ణు సురేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

వినియోగదారుడా మేలుకో నీ హక్కులు తెలుసుకో: వినియోదారుల హక్కుల జోనల్ కార్యదర్శి ఎం డి సాధిక్ పాష

వినియోగదారుడా మేలుకో

నీ హక్కులు తెలుసుకో

తేదీ: 15/03/2023 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మరియు వినియోగదారుల హక్కుల జోనల్ కార్యదర్శి శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపధ్యంలో వినియోగదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వస్తువు కొనే ముందు తయారీ తేదీ మరియు గడువు తేదీ, నాణ్యత చూసి కొనాలని కొన్న ప్రతి వస్తువుకు తప్పని సరిగా బిల్లు తీసుకోవటం మరిపోవద్దని వస్తువు యొక్క నాణ్యత విషయంలో లోపం ఉంటే వ్యాపారిని నిలదీసే హక్కును వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారునికి కల్పించిందని ఒకవేళ వినియోగదారుడు నష్ట పరిహారం కోరుకుంటే జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ ను సంప్రదించి స్వయంగా కేసు వేసి తన కేసును తానే వాదించుకునే అవకాశం వినియోగదారునికి ఉన్నది కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వినియోగదారుల హక్కుల చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని అలాగే ప్రభుత్వం మరియు వినియోగదారుల సంఘాలు కూడా తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓ,జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ చైర్మన్, లీగల్ మెట్రాలజి,ఆర్.టి.ఏ. మరియు వివిధ శాఖ అధికారులు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొన్నాయి.