/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్.... Miryala Kiran Kumar
అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

నల్గొండ జిల్లా చండూర్ మండలం శిర్ధేపల్లి గ్రామానికి చెందిన గంట గీత తండ్రి:నగేష్,నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.చిన్నప్పటినుంచి చదువుతో పాటు ఆటల్లోనూ మంచి ప్రతిభ కనబర్చుతూ ఉండేది.ఇటీవల యూత్ ఫెడరేషన్ డెవలప్ గేమ్స్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ తరుపున వివిధ రాష్ట్రల జట్టులతో తలపడి ఉత్తమ ప్రతిమ కనబర్చింది.దీంతో భారత దేశం తరుపున ఏప్రిల్ 6 నుంచి నేపాల్ లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన,ఈ అమ్మాయిది నిరుపేద కుటుంభం,వారి తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులు జీవనం సాగిస్తున్నారు.నేపాల్ లో జరిగే కబడ్డీ పోటీలకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేనేమో అని నిరాశతో ఉన్న విషయాన్నీ తెలుసుకున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారు స్పందించి 15,000/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని తమ ఫౌండేషన్ సభ్యులైన శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి గారి ద్వారా కుటుంభానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంట రాము గారు ,శ్రీ మారగోని శ్రవణ్ కుమార్ గారు,శ్రీ పేసర్ల హరీష్ గారు,శ్రీ కారింగు సాయి కుమార్ గారు,శ్రీ కనగాని లింగయ్య గారు,శ్రీ గంట రమేష్ గారు,తదితరులు పాల్గొన్నారు.

ఇదో దివ్యాంగుడి ముంపు గోస

వీరి దీనస్థితిగతులపై 'ఈనాడు' గత ఏడాది జులై 20న 'ఇదో దివ్యాంగుడి ముంపు గోస' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఇతను శాశ్వత పరిష్కారం కోసం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. సోమవారం జిల్లా సమీకృత ప్రాంగణానికి అతడి తల్లితో సహా వచ్చి మరోసారి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంథని ఆర్డీవో వీరబ్రహ్మేంద్రచారికి ఫోన్‌ చేసి రెండు పడక గదుల ఇల్లు మంజూరుకు అర్హతలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విషయాన్ని మంథని ఆర్డీవోతో 'ఈనాడు' ప్రస్తావించగా.. అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మహేశ్‌ కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సమగ్రంగా పరిశీలించి అర్హుడా? కాదా? అనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

35 ఏళ్ల మహేశ్‌.. కండరాల క్షీణత (మాస్క్యులర్‌ డిస్ట్రోఫీ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని చిన్నపిల్లాడిలా సాకుతున్న తల్లి మల్లమ్మకు వితంతు పింఛను, మహేశ్‌కు దివ్యాంగుల పింఛనే ప్రధాన ఆదాయం. దరఖాస్తు చేసుకోవడానికి బెస్తపల్లి నుంచి ఆటోలో ప్రజావాణికి వచ్చిన ప్రతిసారి రానుపోనూ రూ.1,000 ఖర్చవుతున్నాయని, అయినా రోజుల తరబడి తమ ఇల్లు సమస్య పరిష్కారం కావడం లేదని మహేశ్‌ వాపోయారు.

పిల్లలను సక్రమంగా పేంచే బాధ్యత తల్లిదండ్రులదే గుడ్ పేరెంట్టింగు కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి

పిల్లలను సక్రమంగా పేంచే బాధ్యత తల్లిదండ్రులదే

- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

మన తెలంగాణ/ సూర్యాపేట ప్రతినిధి :

పిల్లల సక్రమంగా పెంచి భవిష్యత్తు విషయంలో జరిగే మంచి చెడులకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆవరణలో గుడ్ పేరెంట్టింగు ( పిల్లలను ఎలా పెంచాలి) అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు తమ తల్లిదండ్రులై హీరోలన్నారు. వారిని చూసే పిల్లలు ముందుకు సాగుతారని తెలిపారు. నేటి తరం పిల్లలు యువత సమాజంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. జీవితం యొక్క అర్థం తెలిసేలా పిల్లలను తల్లిదండ్రులు పెంచాలని సూచించారు. లక్ష సాధుని లక్ష్యంగా ఎన్ని వంతురాలు ఎదురైనా ముందుకు సాగేలా పిల్లల్లో స్ఫూర్తి నింపాలని అన్నారు. చిత్తశుద్ధి లక్ష్యసాధనతో ముందుకు సాగితే ఎంతటి కష్టతరమైన పనిని కూడా పూర్తి చేయవచ్చు అన్నారు.అంతకుముందు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఐఏఎస్, ఐపిఎస్ శిక్షకుడు రాఘవేంద్ర సదస్సుకు హాజరైన తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట చైర్ పర్సన్ అన్నపూర్ణ, పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీటిసి జీడి బిక్షo, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నల్గొండ 17వ వార్డులో శ్రీ మల్లన్న కేతమ్మ శివలింగం విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణం లో పాల్గొని భారీ విరాళం ప్రకటించిన మున్సిపల్ చైర్మన్

నలగొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లో శ్రీ మల్లన్న కేతమ్మ శివలింగం విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణం ఘనంగాా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి గారుు గుడికిి విరాళంగా రెండుుు లక్షల రూపాయలుు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలుు, కార్యకర్తలు అత్యధికంగాా పాల్గొన్నారు.

అవినీతి పాల్పడిన DBCDOను తక్షణమే సస్పెండ్ చేయాలి:SFI

నల్లగొండ జిల్లా బిసి సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి పాల్పడిన DBCDOను తక్షణమే సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి‌ SFI వినతి . ఈకార్యక్రమంలో SFIజిల్లా‌ అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ కోర్ర సైదా నాయక్ లక్ష్మణ్ బుడిగ వేంకటేష్ కొరె రమేష్ ‌రవిందర్ గోపి తదితరులు పాల్గొన్నారు

పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

2 న మండల కేంద్రాలలో...3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు,నిరసన ప్రదర్శనలు

బి ఆర్ యస్ శ్రేణులు,మహిళలను సన్నద్ధం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

టేలికాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

పెరిగిన వంట గ్యాస్ ధరలపై బి ఆర్ యస్ పార్టీ యుద్ధభేరి మ్రోగించింది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు,నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు నిచ్చింది.ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను,బి ఆర్ యస్ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ పిలుపు మేరకు ఈ నెల 2 న అంటే గురువారం ఉదయం మండల కేంద్రాలలో ధర్నాలు ,ఆ మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. అటు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఇటు మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో బి ఆర్ యస్ శ్రేణులతో పాటు మహిళలు అధికంగా పాల్గొనేలా చూడాలి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

యాదవుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి తల్లి గారికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ: నివాళులర్పించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ పట్టణ పరిధిలోని 40వ వార్డు సావర్కర్ నగర్ లో యాదవుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాల కృష్ణ యాదవ్ గారి మాతృమూర్తి బొబ్బలి దుర్గమ్మ గారు మరణించారు. వారి పార్థీవ దేహానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని తల్లి గారికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్టి ఎస్సి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాంఘిక సంక్షేమశాఖ నల్లగొండ జిల్లా సూపర్డెంట్ శ్రీ బొబ్బల గోపాలకృష్ణ యాదవ్ గారి తల్లిగారు బొబ్బలి దుర్గమ్మ 87 . గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు స్వర్గస్తురాలు అయినందున వారి స్వగృహం గాంధీనగర్ నల్గొండ నందు బొబ్బలి దుర్గమ్మ గారికి పులమాల వేసి నివాళులర్పించిన sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారుు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని మార్చ్ 25నసుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని కరపత్రముల

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.తల్లమల్ల హసేన్., మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి అను అంశం పైన 25 మార్చి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ నల్గొండ జిల్లా కేంద్రంలో కరపత్రములు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకత అను అంశం పైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ విచ్చేసి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించినందువలన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం చెంది ప్రైవేట్ రంగం విస్తరించడం వలన లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని, కేవలం 8% ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండటం వలన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 92 శాతం ప్రైవేటుపరం జరగటం వలన ఉన్నత విద్యలు అభ్యసించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువకులు నిరాశ నిస్సృహలలో కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించటంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కూడా నూటికి 70 శాతం మంది ఎస్సీలు దారిద్య దివరేఖ లో ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నుండి భూమిని విద్యుత్ శక్తిని సబ్సిడీ రుణాలను తీసుకుంటున్న ప్రైవేట్ రంగ సంస్థలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ఉన్నదని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు 1. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలి.2. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలి.3. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికని 4.నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.5 హైకోర్టు , సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు నియామకాలలో మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సహాయ ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.6 . రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లుకల్పించాలి.7. ప్రభుత్వ టెండర్ విధానాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలి.8. ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించే విధానాన్ని రద్దు చేయాలి. 9. మూసివేసిన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే పునరుద్ధరించాలి..10. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 15 శాతం నుండి 20 శాతం వరకు రిజర్వేషన్లు పెంచాలి ఎస్టీలకు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచాలి.11. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూములు అందరికీ కల్పించాలి.12. దళిత బంధు పథకంలో అర్హులైన మాల కులం అందరికీ ఇవ్వాలి. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య , కేవీపీస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కట్ట దుర్గాప్రసాద్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, మాల మహానాడు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పురిమిట్ల శ్రీనివాస్ , రావిరాల జగన్, చింతపల్లి యాదయ్య, వెన్నమల్ల రమేష్ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, సమత లాయర్స్ ఫోరం నాయకులు కోక రంజిత్ కుమార్, బొల్లెద్దు వెంకటరత్నం, విద్యార్థి నాయకులు ఎడ్ల కళ్యాణ్ కులుకులపల్లి నాగార్జున ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు కారణమైన హరిహరను, విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి...

ప్రచురణార్థం

ఫిబ్రవరి 25 2023

నల్లగొండ క్లాక్ టవర్

------------

నిందితులను ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి...

వి.సి,రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్..

జిల్లా ఎస్పీ కి వినతిపత్రం ఇవ్వడానికి వెలుతున్న క్రమంలో నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

---------------------

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లా పూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున(కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి) పందుల సైదులు(విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు) బకరం శ్రీనివాస్(ఎం.ఎస్పి) 

కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహర ల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం జిల్లా ఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో నాయకుల ను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జ‌రిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం,వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్ ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజుల లోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని వారన్నారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను గంజాయి గుట్కాల ను సేవిస్తున్నా యూనివర్సిటీ విసీ కి గాని,రిజిస్టార్ కు గాని పట్టింపు ఉండదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదు అన్నారు. యూనివర్సిటీ విసీ రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని వారన్నారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని వారన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,టి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినయ్,కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ,బొల్లు రవీందర్, కొంపల్లి రాము,బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.