/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి Miryala Kiran Kumar
పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

2 న మండల కేంద్రాలలో...3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు,నిరసన ప్రదర్శనలు

బి ఆర్ యస్ శ్రేణులు,మహిళలను సన్నద్ధం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

టేలికాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

పెరిగిన వంట గ్యాస్ ధరలపై బి ఆర్ యస్ పార్టీ యుద్ధభేరి మ్రోగించింది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు,నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు నిచ్చింది.ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను,బి ఆర్ యస్ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ పిలుపు మేరకు ఈ నెల 2 న అంటే గురువారం ఉదయం మండల కేంద్రాలలో ధర్నాలు ,ఆ మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. అటు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఇటు మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో బి ఆర్ యస్ శ్రేణులతో పాటు మహిళలు అధికంగా పాల్గొనేలా చూడాలి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

యాదవుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి తల్లి గారికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ: నివాళులర్పించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ పట్టణ పరిధిలోని 40వ వార్డు సావర్కర్ నగర్ లో యాదవుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాల కృష్ణ యాదవ్ గారి మాతృమూర్తి బొబ్బలి దుర్గమ్మ గారు మరణించారు. వారి పార్థీవ దేహానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని తల్లి గారికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్టి ఎస్సి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాంఘిక సంక్షేమశాఖ నల్లగొండ జిల్లా సూపర్డెంట్ శ్రీ బొబ్బల గోపాలకృష్ణ యాదవ్ గారి తల్లిగారు బొబ్బలి దుర్గమ్మ 87 . గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు స్వర్గస్తురాలు అయినందున వారి స్వగృహం గాంధీనగర్ నల్గొండ నందు బొబ్బలి దుర్గమ్మ గారికి పులమాల వేసి నివాళులర్పించిన sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారుు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని మార్చ్ 25నసుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని కరపత్రముల

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.తల్లమల్ల హసేన్., మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి అను అంశం పైన 25 మార్చి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ నల్గొండ జిల్లా కేంద్రంలో కరపత్రములు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకత అను అంశం పైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ విచ్చేసి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించినందువలన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం చెంది ప్రైవేట్ రంగం విస్తరించడం వలన లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని, కేవలం 8% ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండటం వలన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 92 శాతం ప్రైవేటుపరం జరగటం వలన ఉన్నత విద్యలు అభ్యసించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువకులు నిరాశ నిస్సృహలలో కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించటంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కూడా నూటికి 70 శాతం మంది ఎస్సీలు దారిద్య దివరేఖ లో ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నుండి భూమిని విద్యుత్ శక్తిని సబ్సిడీ రుణాలను తీసుకుంటున్న ప్రైవేట్ రంగ సంస్థలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ఉన్నదని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు 1. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలి.2. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలి.3. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికని 4.నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.5 హైకోర్టు , సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు నియామకాలలో మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సహాయ ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.6 . రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లుకల్పించాలి.7. ప్రభుత్వ టెండర్ విధానాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలి.8. ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించే విధానాన్ని రద్దు చేయాలి. 9. మూసివేసిన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే పునరుద్ధరించాలి..10. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 15 శాతం నుండి 20 శాతం వరకు రిజర్వేషన్లు పెంచాలి ఎస్టీలకు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచాలి.11. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూములు అందరికీ కల్పించాలి.12. దళిత బంధు పథకంలో అర్హులైన మాల కులం అందరికీ ఇవ్వాలి. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య , కేవీపీస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కట్ట దుర్గాప్రసాద్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, మాల మహానాడు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పురిమిట్ల శ్రీనివాస్ , రావిరాల జగన్, చింతపల్లి యాదయ్య, వెన్నమల్ల రమేష్ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, సమత లాయర్స్ ఫోరం నాయకులు కోక రంజిత్ కుమార్, బొల్లెద్దు వెంకటరత్నం, విద్యార్థి నాయకులు ఎడ్ల కళ్యాణ్ కులుకులపల్లి నాగార్జున ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు కారణమైన హరిహరను, విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి...

ప్రచురణార్థం

ఫిబ్రవరి 25 2023

నల్లగొండ క్లాక్ టవర్

------------

నిందితులను ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి...

వి.సి,రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్..

జిల్లా ఎస్పీ కి వినతిపత్రం ఇవ్వడానికి వెలుతున్న క్రమంలో నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

---------------------

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లా పూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున(కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి) పందుల సైదులు(విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు) బకరం శ్రీనివాస్(ఎం.ఎస్పి) 

కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహర ల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం జిల్లా ఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో నాయకుల ను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జ‌రిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం,వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్ ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజుల లోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని వారన్నారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను గంజాయి గుట్కాల ను సేవిస్తున్నా యూనివర్సిటీ విసీ కి గాని,రిజిస్టార్ కు గాని పట్టింపు ఉండదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదు అన్నారు. యూనివర్సిటీ విసీ రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని వారన్నారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని వారన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,టి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినయ్,కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ,బొల్లు రవీందర్, కొంపల్లి రాము,బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

నార్కెట్ పల్లి లో ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

నార్కెట్ పల్లి మండలం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సొంత గ్రామం బ్రహ్మణ వెళ్ళాంల శక్తి కేంద్ర ఇంచార్జ్ చిరుమర్ధి వెంకన్న గారి ఆధ్వర్యంలో ;(బూతులు 159,160,161,162) శక్తి కేంద్ర కార్నర్ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డా"నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాగానే కుర్చీ ఏసుకొని బ్రహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చిన కేసీఆర్ గారికి 9 ఏండ్ల పొద్దయితున్న ఇప్పడిదాక సార్ కి కుర్చీ దోర్కట్లేద అని ప్రశ్నించినారు స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పక్కన పెట్టి సొంత వ్యాపారాలు చేసుకొని అక్రమ సంపాదన పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారని ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శేపూరి రవిందర్ గారు, సీనియర్ సిటిజన్ పాల్వాయి భాస్కర్ రావు గారు,మండల అధ్యక్షుడు కొరివి శంకర్, మాస శ్రీను,శేపూరి రాజు, ముకుంట్ల గణేష్,బుతూ అధ్యక్షులు మంద చంటి,చిరుమర్తి రవి,గేల్లే రాజు,గంజి వెంకటేశ్వర్లు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు.

 సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

పద్మశాలి బీద కుటుంబానికి నల్లగొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

పద్మశాలి బీద కుటుంబానికి చెందిన నల్ల ధనమ్మ కొర్లపాడు గ్రామం ఈమెకు భర్త లేడు ఈమెకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని మా దృష్టికి వచ్చింది. పిల్లల ఫీజు నిమిత్తం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో Rs10000.00 పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి కార్యదర్శి రాపోలు సతీష్ గారు రాపోలు శరభయ్య గారు గంజి రామలింగం గారు మిరియాల స్వామి గారు మిరియాల శ్రీనివాస్ గారు మిర్యాల వెంకటేశం గారు చిలుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, ప్రెస్ మీట్ లో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ డిమాండ్

నేడు నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు నింపాలని పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందే ప్రభుత్వ అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాలని విద్యార్థులు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కావున గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేక విద్యార్థులు పరిస్థితి చాలా దయనీయమైనది కావున వెంటనే బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల పక్షాన 1,80,000 ఉద్యోగాలు నింపాలని లేనియెడల బహుజన విద్యార్థుల సమస్యలపై పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన పోరాడుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ వంగూరి సునీల్ ఎర్ర ప్రశాంత్ శివ చౌహన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టిన కారణంగా భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం: భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం జాయింట్ కలెక్టర్ సూర్య తేజ ఓ వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సిటిజన్ ట్రిబ్యూనల్ కోర్టును మంగళవారం నిర్వహించారు. వృద్ధురాలుని పట్టించుకోని కొడుకు, కోడలికి 14 జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడుతూ.. నవ మాసాలు మోసి.. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయోవృద్ధుల సమయంలో పక్కన పెట్టి హింస పెడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.