బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు కారణమైన హరిహరను, విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి...
ప్రచురణార్థం
ఫిబ్రవరి 25 2023
నల్లగొండ క్లాక్ టవర్
------------
నిందితులను ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి...
వి.సి,రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్..
జిల్లా ఎస్పీ కి వినతిపత్రం ఇవ్వడానికి వెలుతున్న క్రమంలో నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..
---------------------
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లా పూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున(కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి) పందుల సైదులు(విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు) బకరం శ్రీనివాస్(ఎం.ఎస్పి)
కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.
శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహర ల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం జిల్లా ఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో నాయకుల ను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం,వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్ ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజుల లోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని వారన్నారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను గంజాయి గుట్కాల ను సేవిస్తున్నా యూనివర్సిటీ విసీ కి గాని,రిజిస్టార్ కు గాని పట్టింపు ఉండదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు. యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదు అన్నారు. యూనివర్సిటీ విసీ రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని వారన్నారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని వారన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,టి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినయ్,కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ,బొల్లు రవీందర్, కొంపల్లి రాము,బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.
![]()

						
ప్రచురణార్థం

నార్కెట్ పల్లి మండలం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సొంత గ్రామం బ్రహ్మణ వెళ్ళాంల శక్తి కేంద్ర ఇంచార్జ్ చిరుమర్ధి వెంకన్న గారి ఆధ్వర్యంలో 
యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

 పద్మశాలి బీద కుటుంబానికి చెందిన నల్ల ధనమ్మ కొర్లపాడు గ్రామం ఈమెకు భర్త లేడు ఈమెకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని మా దృష్టికి వచ్చింది. పిల్లల ఫీజు నిమిత్తం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో Rs10000.00 పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి కార్యదర్శి రాపోలు సతీష్ గారు రాపోలు శరభయ్య గారు గంజి రామలింగం గారు మిరియాల స్వామి గారు మిరియాల శ్రీనివాస్ గారు మిర్యాల వెంకటేశం గారు చిలుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు నింపాలని పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందే ప్రభుత్వ అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాలని విద్యార్థులు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కావున గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేక విద్యార్థులు పరిస్థితి చాలా దయనీయమైనది కావున వెంటనే బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల పక్షాన 1,80,000 ఉద్యోగాలు నింపాలని లేనియెడల బహుజన విద్యార్థుల సమస్యలపై పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన పోరాడుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ వంగూరి సునీల్ ఎర్ర ప్రశాంత్ శివ చౌహన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నల్గొండ 35వ వార్డు బిఆర్ఎస్  పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ నాయకులుు గంజి రాజేందర్, 35 వ వార్డు అధ్యక్షులు తలారిిి యాదగిరిి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుు మాట్లాడుతూూ ఎమ్మెల్యే గారు మరెన్నో పెళ్లిరోజులుు జరుపుకోవాలనిి. సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
కార్యదర్శిపై విచారణ చేపట్టిన డీపీఓ

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి నల్గొండ జిల్లా గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం లో ముఖ్య అతిధులుగా హాజరైన ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు... ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
Feb 25 2023, 21:51
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
5.6k