/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz AP : అయోధ్య శ్రీరామచంద్రుడికి కోటి కోటి తలంబ్రాలను సమర్పించనున్న శ్రీకృష్ణ చైతన్య సంఘం Andrapradesh
AP : అయోధ్య శ్రీరామచంద్రుడికి కోటి కోటి తలంబ్రాలను సమర్పించనున్న శ్రీకృష్ణ చైతన్య సంఘం

ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండించిన వరితో తయారుచేసిన తలంబ్రాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం అయోధ్య శ్రీరామచంద్రుడికి సమర్పించనుంది.

 కోటి కోటి తలంబ్రాలను మూడు వేల మంది భక్తులు ఒలిచి సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను అభిషేకం అనంతరం గత 12 ఏళ్లుగా భద్రాచలం శ్రీరామచంద్రులకు సమర్పించడం జరుగుతుంది. 

ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు 108 కడవలతో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గత 12 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ రామచంద్రులకు ఐదు రాష్ట్రాల్లో మూడువేల మంది కోటి తలంబ్రాలతో ఒలిపించి కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది.

ఈసారి అయోధ్యలో కూడా ఏర్పాటు చేయాలని భావనతో దేశమంతా రామ తత్వాన్ని తీసుకురావాలని, రామరాజ్యం కావాలని కోటి తలంబ్రాలను అయోధ్యకు తీసుకెళ్లాలని, ఈనెల 22న అయోధ్యకు బయలుదేరడం జరుగుతుందని చెప్పారు. 26న సరయు నది తీరంలో 108 మంది కలశాలతో అభిషేకం చేసి అయోధ్యకు తలంబ్రాలు సమర్పించడం జరుగుతుందని శ్రీకృష్ణ చైతన్య సంఘం కళ్యాణం అప్పారావు చెప్పారు.

ఈ నెల 22 నన్నయ యూనివర్సిటీ లో జరిగే యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును విజయ వంతం చేయండి - PDSU

అనంతపురం జిల్లా

కణేకల్ మండలం

అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కణేకల్ మండలం లో PDSU కర పత్రాలు విడుదల

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

 విశ్వవిద్యాలయాలు శాస్త్రీయ ఆలోచనలకూ, స్వతంత్ర బావ జలాలకు కేంద్రాలుగా ఉండాలి. విద్యార్థుల్ని నూతన ఆవిష్కరణల వైపు సృజనాత్మకంగా మళ్ళించగలిగే శక్తి విశ్వవిద్యాలయాలకి ఉన్నది. సామాజిక, విప్లవ, అస్తిత్వ ఉద్యమాలకు కూడా కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. 

 ఇది చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అసమానతలు, అంతరాలు, సామాజిక, రుగ్మతలతో నేడు కూనరిల్లుతున్నాయి. ప్రమాణాలు, నాణ్యత దిగజారిపోతున్నాయి. మరోవైపు హిందూ మతోన్మాదం విశ్వవిద్యాలయాల్లో విస్రాంకలంగా మారింది. కాషాయికరణ అజెండాతో బిజెపి లౌకిక భవానిల్ని సహించలేకపోతున్నది. 

 మన రాష్ట్రంలో సుమారు 30 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటి అభివృద్ధికి జగన్ సర్కారు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒక్కో విశ్వవిద్యాలయానికి 200 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1204 ఆశ్చర్య పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. విశ్వవిద్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. V.C ఆచార్యుల నియామకాలన్నీ రాజకీయ నాయకుల కన్ను సన్నల్లోనే జరుగుతున్నాయి.

      జాతీయ విద్యా, విధానం 2020 లో భాగంగా దేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) చైర్మన్ జనవరి 5 నా ప్రకటించారు. విదేశీ, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చి పెట్టి, దేశంలో ప్రభుత్వ ఉన్నత విద్యను, దెబ్బతీసీ పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను, దూరం చేసే (యూజిసి ) ముసాయిదాను వ్యతిరేకించాలి.

రాష్ట్రoలో సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు లేవు, సొంత భవనం లేక ప్రొఫెసర్ పోస్టులు లేక విద్యార్థులు 'చదువు' కొనసాగిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి, విభజన హామీల ప్రకారం 11 కేంద్రీయ, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.

ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పటిష్టకరణ, సంరక్షణలకై 2023 ఫిబ్రవరి 22 వ తేదీన రాజమండ్రిలో నన్నయ విశ్వవిద్యాలయంలో జరుగు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమం లో PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్. PDSU నాయకులు నాగరాజు, సుదీర్, నాగరాజు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పుష్పపల్లకిపై దర్శనమిచ్చిన శ్రీస్వామి వారు

శ్రీశైలంలో కన్నులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పుష్పపల్లకిపై దర్శనమిచ్చిన శ్రీస్వామి అమ్మవార్లు వేలాదిగా తరలివచ్చి దర్శించుకున్న భక్తులు

 శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు.

 విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు.

 గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది.

 గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. పుష్పపల్లకిపై ఉన్న శ్రీస్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

 శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారుమ్రోగింది. పుష్ప పల్లకిసేవలో ఆలయ ఈవో లవన్న దంపతులు, ఆలయ ట్రస్టు బోర్డ్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.

కనేకల్ పట్టణం లో ప్రభుత్వం డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయండి

అనంతపురం జిల్లా

కనేకల్  

M.R.O గారికీ వినతిపత్రం.

రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 

 కనేకల్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు చదువుని మధ్యలో ఆపేస్తున్నారు. 

కారణం డిగ్రీ కళాశాలకు వెళ్లాలంటే అటు రాయదుర్గం ఇటు కళ్యాణదుర్గం ఇటు ఉరవకొండ కు వెళ్లాలంటే దూరం అవ్వడం వల్ల చాల ఇబ్బందులు ఎదురుకోవాలి అనీ పేద మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు.

 బస్సులో వెళ్లాలంటే బస్ పాస్ చార్జీలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి లో విద్యార్థులు తల్లీ, తండ్రులు లు ఉన్నారు ఇక్కడే డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయాలనీ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమం లో రాయదుర్గం డివిజన్ PDSU కార్యదర్శి మల్లెల ప్రసాద్, గంగరాజు, ఆనంద్ రాజు, కిషోర్, యోగి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

              ఇట్లు

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

8977939733

AP : ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసిన భరత్

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ భరత్ రామ్ లోక్‌సభ ప్రత్యేక హోదాపై మోదీని నిలదీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఈ బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని భరత్ రామ్ చెప్పారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే.. కేంద్రం మూడింటికి నిధులు ఇస్తామని చెప్పిందని భరత్ రామ్ తెలిపారు.

రైల్వే పరంగా విశాఖపట్నం విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి వుందని.. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు , హైదరాబాద్ కారిడార్లకు నిధులు ఇస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్ కు ఇచ్చారని రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని భరత్ రామ్ వెల్లడించారు.

AP : కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. 17వ రోజు తిరుపతి జిల్లాలో...

 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 17వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం కొత్తూరు నుంచి ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. నేడు కూడా చిత్తూరుజిలాల్లో కొనసాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గం తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4.40 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం డీఎం. పురం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు ద్వారకా నగర్ చేరుకుని లోకేష్ అక్కడే బస చేయనున్నారు.

నేటితో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పూర్తి చేసి.. తిరుపతి జలాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 201.2 కిలో మీటర్ల జరిగింది.

AP : ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేయాలన్న వెంకయ్య నాయుడు

పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలోని SRKR ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 43వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో రెండున్నర కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యాక్టివ్‌ ఐడియా ల్యాబ్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కాలేజీలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు వెంకయ్య నాయుడితో కాసేపు చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడుని విద్యార్థులు ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతిని చూడాలా.. వైజాగ్ ని చూడాలా.. మీరు క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ వెంకయ్య నాయుడుని విద్యార్థినిలు అడిగారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరణమ చేసిన తానూ రాజకీయాల్లోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన అభిప్రాయం చెప్పానని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు.

తాను రాజకీయాల్లో లేను కాబట్టి, రాజకీయాలపై వ్యాఖ్యానిస్తే పెద్ద సమస్యగా మారుతుందన్నారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి తో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని వెంకయ్య తెలిపారు.

IND vs AUS: టీమిండియా టెస్టు జట్టులోకి తెలుగు తేజం.. మైదానంలో ఎమోషనలైన తల్లి.. సీఎం జగన్ స్పెషల్ విషెస్

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా గెలిచినా, ఓడిపోయినా ఈ జెంటిల్మెన్‌ గేమ్‌కు ఉండే పాపులారిటీ ఏ మాత్రం తగ్గదు. అలాంటి గేమ్‌లో ఆడాలని, టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ అతి కొద్దిమందికే ఆ అవకాశం దక్కుతుంది. ట్యాలెంట్‌ ఉండి, పరిస్థితులు అన్ని అనుకూలించి.. టీమిండియా అవకాశం తలుపు తడితే మాత్రం అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఆ క్రికెటర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు గాల్లో తేలిపోతారు.

తాజాగా అలాంటి అద్భుతమైన సంఘటనకు నాగ్‌పూర్‌ టెస్ట్ వేదికగా నిలిచింది. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 09) ప్రారంభమైన తొలి టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే భరత్ మ్యాచ్‌ ఆడుతున్నాడని తెలిసి అతని తల్లి ఎమోషనల్ అయింది. గ్రౌండ్ లో తన తనయుడిని ఆప్యాయతతో హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ట్యాలెంట్‌ ఉన్నా జట్టులో చోటు కోసం కొన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు భరత్. టెస్టు జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. సాహా, పంత్ జట్టులో పాతుకుపోవడం వల్ల మైదానంలో దిగే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే గత ఏడాది చివరలో పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అతని స్థానంలో కేఎస్ భరత్ టీమిండియాలోకి ఎంపికయ్యాడు.

మూడేళ్లుగా ఎదురుచూపులకు మోక్షం..

ఇక భరత్‌ విషయానికొస్తే.. అతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. శ్రీనివాసరావు, దేవి దంపతులకు 1993 అక్టోబరు 3న జన్మించాడు. తండ్రి విశాఖపట్నంలో నావీలో ఉద్యోగం ఉండడంతో ఆయన విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇక భరత్ 2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి భరత్‌ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. ఆతర్వాత 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 308 పరుగులు చేశాడు. తద్వారా రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఈ ప్రతిభతో భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు భరత్‌. ఇక 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతనికి మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌ మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టును గెలిపించడం క్రికెట్‌ అభిమానులందరికీ గుర్తుండిపోతుంది. కాగా రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ కోసం భరత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. 

అయితే అప్పటికే పంత్‌ జట్టులో కుదురుకోవడంతో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కేఎస్‌ భరత్‌ 2021 నవంబర్ నాటికీ 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4283 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 730 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 సెంచరీలు 23 హాఫ్‌ సెంచరీలు, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు, టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు టీమిండియాలో స్థానం దక్కించుకుని తన కలను సాకారం చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by K S Bharat జగన్‌ ప్రత్యేక అభినందనలు..

కాగా టీమిండియాలో చోటు దక్కించుకున్న శ్రీకర్‌ భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భరత్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మా తెలుగు తేజం భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు. తెలుగు జాతి గర్వపడేలా భరత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు’ అని ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.

Our very own is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.

The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF

— YS Jagan Mohan Reddy February 9, 2023

AP : రాజధాని పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం ....

ఏపీ రాజధాని వివాదం పార్లమెంట్ లో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

బుధవారం రోజున రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా’ అని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. సెక్షన్‌ 5, 6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపింది.ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడటం సబ్‌జ్యుడిస్‌ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది.

2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం తెలిపింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంలో పిటిషన్‌ వేయగా, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

పెను విషాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం..

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

మొదట ఒక వ్యక్తి ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు. దానిని గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.