/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz మునుగోడు మండలంలో ఎమ్మార్వో గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన SHVS క్యాలెండర్. Miryala Kiran Kumar
మునుగోడు మండలంలో ఎమ్మార్వో గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన SHVS క్యాలెండర్.

సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు

కడప అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి

వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జగిత్యాల జిల్లా : 

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.,

ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొని 

కండక్టర్‌ మృతి చెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.. 

వారిని హుటాహుటిన 

జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. 

జగిత్యాల నుంచి వరంగల్‌ 

వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా బస్సులో 8 మంది ప్రయాణికులున్నట్లు ఆర్టీసీ 

అధికారులు తెలిపారు... 

ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ఉండగా కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం 

చోటు చేసుకుంది..

మృతి చెందిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన బొల్లం సత్యం గా గుర్తింపు.

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

ఈనెల 19వ తేదీన హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బైక్ ర్యాలీని పురస్కరించుకొని ఈరోజు రామగిరి రామాలయంలో వాల్ పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది.

 హిందూ వాహిని ఉమ్మడి జిల్లా ప్రముఖ్ సంగపాక రాంబాబు గారు మాట్లాడుతూ ఈ ఆదివారం 19వ తేది సాయంత్రం 4.00 గంటలకు స్థానిక రామగిరి రామాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభం అయితుందని, ఈ ర్యాలీలో సంఘ వివిధ క్షేత్ర ప్రముఖులు పెద్దలు ,కార్యకర్తలు మరియు హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గండికోట రాజు, ఉపాధ్యక్షుడు తారల నరేష్, జిల్లా కమిటీ మెంబర్ దొండ నరేందర్, ఉపాధ్యక్షుడు పందిరి మాధు, గురు, సతీష్ ,హరి ,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ 14వ వార్డులో మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు

నల్లగొండ: మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

నల్లగొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడ ప్రభుత్వ పాఠశాలలో రూ. 26 లక్షల వ్యయంతో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వారి వెంట DMHO కొండల్ రావు, కౌన్సిలర్లు ఊట్కూరు వెంకట్ రెడ్డి, బొజ్జ శంకర్, వడ్డే సుధాకర్ రెడ్డి, వెంకన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల రద్దీ తాకిడి తగ్గట్టుగా సదుపాయాలు ఏర్పాటు చేయండి: కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

 ఛాయా సోమేశ్వరాలయం రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని... ముఖ్యంగా బార్కేడింగ్ సానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారి బాధ్యతలు అప్పగించి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు...

 123 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్న ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, పచ్చల చాయా వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి శిల్పారామం, తీగల వంతెన, లతో ఈ ప్రాంతమంతా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతుందని.. రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకొన ఉందని కంచర్ల తెలియజేశారు...

 ఈ సంవత్సరం నుండి.. పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు..

 ఇందుకు ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి రామగిరి రామాలయం నుండి ఛాయా సోమేశ్వరాలయం వరకు విధ వివిధ కళా రీతులను ప్రదర్శిస్తూ... బ్రహ్మాండంగా నగరోత్సవాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు .. ఇందుకు అయ్యే ఖర్చు తానే స్వయంగా భరిస్తానని వారు

 తెలియచేశారు.

ఈ సమావేశంలో.. నల్గొండ ఆర్డీవో, డి.ఎస్.పి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ఆలయ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి.. వివిధ శాఖలకు చెందిన అధికారులు.. సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు,కౌన్సిలర్లు,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకటరెడ్డి,వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్, పున్నా గణేష్ మారగోని గణేష్, నాయకులు.. బకరం వెంకన్న భువనగిరి దేవేందర్ సంధినేని జనార్దన్ రావు సూర మహేష్, చెన్నుగూడెం సర్పంచ్ జంగయ్య భక్తులు పాల్గొన్నారు.

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకట లక్ష్మి మోటార్స్ నందు హీరో బైక్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన 110CC స్కూటర్,Hero XOOM మోడల్ బైక్ ను రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మార్కెట్లోకి విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ, 

ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి మార్చడంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా సామర్థ్యంతో తెలంగాణ దేశంలోనే మొబిలిటీలో ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా అవతరించాలని సీఎం కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. 

హీరో కంపెనీ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ 110CC స్కూటర్,Hero XOOM యువతను ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు.

ఆటోమొబైల్ రంగంలో విశేష అనుభవం ఉన్న వెంకటలక్ష్మి మోటార్స్ అధినేత రాచర్ల కమలాకర్ ఎప్పటికప్పుడు సూర్యాపేట జిల్లా ప్రజలకు నూతన మోడల్ బైక్స్ ను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అదే విధంగా బైక్ వినియోగదారులకు సర్వీస్ విషయంలో ఉత్తమ సేవలు అందజేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో షోరూం అధినేత రాచర్ల లక్ష్మి కమలాకర్ , మేనేజర్ సుధీర్ , షోరూమ్ ఉద్యోగస్తులు రాజు, జైపాల్, సూర్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...

నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...

నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు

ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే?

కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…

చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు

2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…

గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…

‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…

ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!

ఇలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి,తరాలు సంపద కూడబెట్టే వాళ్ళు కాదు.

నల్లగొండ 14 వ వార్డు లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ 14 వ వార్డు లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి DMHO కొండల్ రావు కౌన్సిలర్లు ఊట్కూరి వెంకట్ రెడ్డి బొజ్జ శంకరయ్య తో కలిసి ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా కళ్లద్దాలు పొందాలన్నారు.

బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి:BSP నల్లగొండ కమిటీ

బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలి, అనే నినాదాలను ప్రజలకు వివరిస్తూ వారి సంతకాల ద్వారా మద్దతు తెలియజేయాలని కోరగా వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ గారు, ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, మహిళ కన్వీనర్ గోస్కొండ కవిత గారు, నియోజకవర్గ ఇన్చార్జీలు వంటపాక యాదగిరి, అంకెపాక శ్రీనివాస్ గార్లు నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ గారు తిప్పర్తి మండల అధ్యక్షులు పేరపాక లింగస్వామి గారు, ప్రధాన కార్యదర్శి దాసరపు నవీన్ కుమార్, పజ్జురు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు రవితేజ మరియు వీరస్వామి, కృష్ణయ్య, సతీష్, వెంకన్న, యాదయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.