NLG: పే రోల్, ఐడి ఇచ్చి కనీస వేతనం అమలు చేయాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ: కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, కుక్కింగ్ వర్కర్స్ కు పే రోల్, ఐడి ఇచ్చి రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు.
ఈ మేరకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ సమగ్ర శిక్ష లో భాగంగా కేజీబీవి మోడల్స్ స్కూల్ హాస్టల్లో వర్కర్స్ 2015 నుండి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వీరికి కనీస వేతనం రూ 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వీరికి కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.24 గంటలు డ్యూటీ చేస్తున్నారని ఇది ఆపాలని కోరారు. పే రోల్ లేదనే నెపంతో వీరికి కనీస వేతనాలు ఇవ్వకుండా స్కూల్ కు వచ్చే బడ్జెట్ తోనే, తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 192 గర్ల్స్ హాస్టల్ లో సుమారు1200 మంది 24 గంటలు పనిచేస్తున్నారని వీరికి పే రోల్ ఐడి ఇచ్చి 26 వేల కనీస వేతనం ఇవ్వాలని, వీరందరినీ విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని,ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆరోగ్య ,జీవిత బీమా 10 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ నాయకులు జ్యోత్స్న, మీనాక్షి, జానకమ్మ,పార్వతమ్మ, భాగ్యమ్మ, జయలక్ష్మి, మాధవి, కావ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, కుక్కింగ్ వర్కర్స్ కు పే రోల్, ఐడి ఇచ్చి రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు.

యాదాద్రి జిల్లా:
నల్గొండ: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28 న ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
నల్గొండ జిల్లా:
ఈ నెల 24 న మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు.
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
నల్గొండ జిల్లా:
నల్గొండ: సమాచార హక్కు సాధన సమితి నియోజకవర్గ కమిటి ఆద్వర్యంలో, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొహమ్మద్ గయాజుద్దీన్ ను నియమించారు.
నల్లగొండ: మూడవరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా, ఆదివారం డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు జిల్లా అధ్యక్షులు వట్టెపాక శ్రీనివాస్ దళిత శక్తి పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి సంఘీభావం, మద్దతు తెలిపారు.
Dec 24 2024, 09:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.0k