/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఎన్జీ కళాశాలలో ప్రపంచ పర్యాటక  దినోత్సవం Mane Praveen
NLG: ఎన్జీ కళాశాలలో ప్రపంచ పర్యాటక  దినోత్సవం
నల్లగొండ: ఈరోజు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ పరంగి రవికుమార్ అధ్యక్షతన యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. చరిత్ర,సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే అనేక కట్టడాలు, పవిత్రమైన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు, ప్రకృతి సోయగాలతో అలరారే అనేక ప్రదేశాలు నల్లగొండ జిల్లాలో అడుగడుగున కలవని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలు కూడా కలవు అన్నారు.

డాక్టర్ పరంగి రవికుమార్ మాట్లాడుతూ.. ఇండియాలో టూరిజంకు విదేశీ మారక నిల్వలను లక్షకోట్ల డాలర్లకు చేర్చాలన్నది కేంద్రం యొక్క లక్ష్యం అని.. ఆ దిశగా కొనసాగాలని, పర్యాటకం మరియు శాంతి లక్ష్యంతో ఆకట్టుకునే బీచ్ లు ఉల్లాసం కలిగించే సముద్ర క్రీడలు, విపరీతమైన వృక్ష జాతులతో పర్యాటకానికే తలమానికంగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న  డా. మునిస్వామి మాట్లాడుతూ.. జి డి పి లో పర్యాటకం రంగం వాటాపెరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఈ పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని యువత రాణించాలని అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా  నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో  ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ మరియు తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగినది.

యువ టూరిజం క్లబ్ కో ఆర్డినేటర్ నర్సింగు కోటయ్య ,పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డా.వి. శ్రీధర్, డా.టంగుటూరు సైదులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది,యువ టూరిజం క్లబ్ స్టూడెంట్ కో ఆర్డినేటర్ బి.సాయితేజ, విద్యార్ది సభ్యులు, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.
లెంకలపల్లి: అంగన్వాడీ కేంద్రం-2 లో పౌష్టిక వారోత్సవాలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -2 ఆధ్వర్యంలో పౌష్టిక వారోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ..  పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాల గురించి అంగన్వాడీ లోని  పిల్లల తల్లులకు వివరించి చెప్పారు. ఆశ సైదాబి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
26 పంచాయతీ రాజ్ రోడ్లు మంజూరు.. మరో 27 రోడ్లకు ప్రతిపాదనలు

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, ఘట్టుప్పల్ మండలాల లో మంజూరైన 26 పంచాయతీ రాజ్ రోడ్ల పనులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఈ రోజు మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి సీతక్క తో మాట్లాడి రోడ్లు మంజూరు చేయించాలని రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. మరో 27 రోడ్లకు ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తో మాట్లాడి ఈ రోడ్లను మంజూరు చేయించానని రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రమాదపు మూల మలుపు లను తొలగించాలాన్నారు. ఒకసారి రోడ్డు నిర్మాణాలు జరిగితే దానిపై కొన్ని లక్షల కుటుంబాలు ప్రయాణం చేస్తాయని రోడ్ల నిర్మాణము భద్రత గా ఉండాలని అధికారులను కోరారు.

మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు సన్మానం
మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు సన్మానం
నారాయణపురం: మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు మండల పిఆర్టియు శాఖ తరపున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి, ఉదయ, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి యాదిరెడ్డి, మండల అసోసియేట్ ప్రెసిడెంట్ అంతటి శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళ  ఉపాధ్యక్షులు మమత మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి
స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్దత కలిగిన రాజకీయవేత్త
స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా .. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ Md బాబా షరీఫ్, కొరగొని లింగస్వామి,ఆలే నాగరాజు, బొడిగె బాలకృష్ణ, తాడూరి పరమేష్, కామిశెట్టి భాస్కర్, నాయకులు ఉష్కాగుల, రమేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నాంపల్లి: చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ  నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంమని బలహీనవర్గాల కులంలో పుట్టి కూడా ఆమె చూపించిన తెగువ గొప్పది అన్నారు.

నాంపల్లి మండల కేంద్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తున్నాని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల  రుణమాఫీ ఇంకొందరికి కాలేదు, త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తామని తెలిపారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, కొత్త  పింఛన్లు ఇస్తామన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో బస్ స్టేషన్, బైపాస్, మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు డబల్ రోడ్లు నిర్మాణం చేపట్టామని ఎటువంటి కరెంటు సమస్య తలెత్తకుండా నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని నాంపల్లి మండలానికి చెప్పిన విధంగానే అభివృద్ధి చేసి చూపిస్తానని మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేరుస్తానని అన్నారు. 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నాంపల్లి మండలంలోని నర్సింహులగూడెం గ్రామ పరిధిలో 3 కోట్ల వ్యయంతో 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, అంగిరేకుల పాండు, వీరమల్ల శ్వేతా నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గఫార్, కలకొండ దుర్గయ్య, ఎస్.కె చాంద్ పాషా, రవి నాయక్, దీప్లా నాయక్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, కోరే శివ, సుధన బోయిన శ్రీను, చత్రపతి, సైదాబీ, బట్టు జగన్, నా రోజు సైదాచారి, ఈదశేఖర్, బేకరీ గిరి, మేకల రమేష్ యాదవ్, మారేపాకుల రాములు, పూల యాదగిరి, ఈదశేఖర్, ఎదుళ్ల రాములు, గాదేపాక రమేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి
నల్లగొండ: సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, దోపిడీలకు ఎదురోడి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకొని గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సాగర్ రోడ్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు పోరాట పటిమ ను నేర్చుకోవాలని, ఆమెను ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరును కోటి ఉమెన్స్ కాలేజీకి పెట్టడం శుభపరిణామం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్, సాగర్, మహేష్, యాదగిరి, పృథ్వీరాజ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు
NLG: సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలం, నరసింహుల గూడెం గ్రామంలో రూ. 3 కోట్ల వ్యయంతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణానికి గురువారం మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ప్రజలు లోవోల్టేజీ సమస్య కారణంగా ఇబ్బందులు పడకుండా సబ్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జన్మదినం సందర్భంగా, ఈ రోజు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, వారి చేతుల మీదుగా ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ మర్రిగూడ లో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఆమె పోరాట పటిమ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పేదల కోసం, బడుగు బలహీనవర్గాల కోసం, మహిళల కోసం ఇందిరమ్మ పాలన వచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ దాత మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్, పగడాల ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇతర ముఖ్య నాయకులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, గాంధీ సెంటర్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ ను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్పూర్తిదాయకమని కొనియాడారు.