/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్ Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 13:05

యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్

మంగళవారం రష్యా భూభాగంలోని యుద్ధ ట్యాంకులు, సాయుధ దళాలతో చొచ్చుకొచ్చిన ఉక్రెయిన్ సైన్యం.. దూకుడుతో ముందుకు సాగుతోంది. కీవ్ సేనలతో పోరాటంలో మాస్కో దళాలు వెనుకబడిపోయాయి. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిని తిప్పికొడుతున్నామని రష్యా చెబుతున్నా.. అది కేవలం మాటలకే పరిమితం. ప్రస్తుతం యుద్ధంలో ఉక్రెయిన్‌దే పైచేయి. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయి. వారం రోజుల కిందట కుర్స్క్‌ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కుర్స్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ప్రకటించారు

అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా తమ సైనికుల ధైర్యసాహసాలను అభినందించిన జెలెన్‌స్కీ.. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇతరులపై రష్యా ప్రారంభించిన యుద్ధం.. ఇప్పుడు ఆ దేశానికే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. డాన్‌బాస్‌లో మాస్కోను నిలువరించేందుకు కీవ్ చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌ సైన్యంతో సాగుతున్న భీకర పోరులో రష్యా తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా ఉన్నతస్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్‌.. ఆగస్టు 6న ఉక్రెయిన్‌ దాడులు ప్రారంభమైనట్టు తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పుతిన్ ఆరోపించారు. ‘శత్రువు స్పష్టమైన లక్ష్యాలలో ఒకటి అసమ్మతి, కలహాలు, ప్రజలను భయపెట్టడం, రష్యన్ సమాజం ఐక్యతను దెబ్బతీయడం’అని మండిపడ్డారు.

ఇరు సైన్యాలు భీకర దాడులతో కర్క్స్ రీజియన్‌లో 1.21 లక్ష మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 60 వేల మందిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, 28 గ్రామాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని కస్క్ గవర్నర్ వెల్లడించారు.

దాడుల్లో 12 మంది పౌరులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. గత మంగళవారం రష్యా భూభాగంలోకి మొదటిసారి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యాలు.. సరిహద్దుల నుంచి 30 కి.మీ. దూరం చొచ్చుకొచ్చాయి. ఇది ఉక్రెయిన్‌కు నైతికస్థైర్యాన్ని కలిగించినా.. మరో ముప్పుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఈ పరిణామాలతో రగిలిపోతున్న మాస్కో.. ఉక్రెయిన్ పౌరులు, మౌలిక వసతులపై దాడులను రెట్టింపు చేసే ప్రమాదం ఉందని బ్రిటిష్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు ఆహారం సహా మానవతా సాయం అందిస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 08:43

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది.

ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందు పరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చూపించారు. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ పోటీ చేస్తుందో లేదో వేచి చూడాలి.

మరోవైపు.. గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానంతో ముందస్తుగా వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి.

మరీ టీడీపీ పోటీలో నిలుస్తుందా లేదా అనేది కాసేపట్లో ఖరారు కానుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 17:56

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు.

ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు.

బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు.

ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:42

అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు

అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంలో దేశం విడిచిన హసీనా .. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన తిరుగు బాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.

ఆమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని పేర్కొన్నారు. వారు విద్యార్ధుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని, దానిని తాను సహించలేదన్నారు.

ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి .. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు.

తాను బంగ్లాదేశ్ లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని, అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లు చెప్పారు.

దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు.

తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. చాలా మంది అవామీలీగ్ నాయకులు హత్యకు గురి కావడం ఆవేదన కల్గించిందన్నారు.

తమ పార్టీ మరోసారి నిలదొక్కుకుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:40

తగ్గిన సిమెంట్‌ ధరలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌ అమ్మకాలు 3 నుంచి 9 శాతం పెరిగాయి. అయితే ధరలు తగ్గటంతో కంపెనీల ఆదాయాలు, లాభాలకు గండి పడింది.

గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల సిమెంట్‌ బస్తా సగటు ధర 3 శాతం తగ్గి రూ.348కు చేరింది. ఇదే సమయంలో ఫ్లైయాష్‌, స్లాగ్‌ వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరిగాయి.

ఇది కంపెనీల ఆదాయాలు, లాభాలను దెబ్బతీసింది. ఇవి చాలవన్నట్టు పులి మీద పుట్రలా సూర్యుడి భగభగలు, ఎన్నికల ప్రచార హోరుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలకు బ్రేక్‌ పడింది.

ఈ కారణంగానే అలా్ట్రటెక్‌ కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో 1.87 శాతం వృద్ధి రేటుతో రూ.18,069.56 కోట్లకు చేరినా నికర లాభం మాత్రం ఫ్లాట్‌గా రూ.1,696.56. కోట్లుగా నమోదు చేసింది.

ఏసీసీ నికర లాభాలకైతే జూన్‌ త్రైమాసికంలో 22.46 శాతం గండి పడి రూ.361.40 కోట్లకు చేరింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.5,154.89 కోట్లుగా నమోదైంది.

అయితే జూన్‌ త్రైమాసికం నిరాశ పరిచినా భవిష్యత్‌కు మాత్రం ఢోకా లేదని కంపెనీలు కొండంత ఆశాభావంతో ఉన్నాయి. పుంజుకుంటున్న గృహ, మౌలిక సదుపాయాల నిర్మాణం, బడ్జెట్‌లో మౌలిక, గృహ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు కావటం సానుకూల అంశాలుగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:38

హై కోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం

ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.

ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు. తాజాగా స్మితా సబర్వాల్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.

దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర ఈ పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె తెలిపారు. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకున్నా విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. ( IAS/ IPS/IFoS) అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాలను స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు(netizens) తీవ్రంగా స్పందించారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.

వికలాంగులను 'సంకుచిత దృక్పథం'తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని స్మితా సబర్వాల్ వైఖరీపై మండిపడుతున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారని గుర్తు చేశారు. ఇలా చాలా మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు.

అలాగే, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు(officers) ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ‘మీ పని మీరు సరిగ్గా చేయండి చాలు. అంతేకానీ మీకు సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు’ అని అన్నారు. అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారిణిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది.

యూపీఎస్‌సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతి (నాన్-క్రీమీ లేయర్) కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:16

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్‌ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీంతో.. ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌ వేయనున్నారు.

ఇక, వైజాగ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో వైసీపీకి 598.. కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. అయితే, ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికార పార్టీకి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. మ్యాజిక్‌ ఫిగర్‌ 425 కాగా.. కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయసంగా గెలుపు సాధ్యం అవుతుంది.

కానీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంపై వైసీపీ మండిపడుతోంది.. సంఖ్యాబలం లేకపోయినా.. ఎన్నికల బరిలోకి దిగడం అంటే.. కచ్చితంగా ప్రలోభాలకు గురిచేయడం.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టడంలో భాగమేనని ఆరోపిస్తోంది వైసీపీ.. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యింది.. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే తమ ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే, విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి వైపే కూటమి మొగ్గుచూపుతుందన్న ప్రచారం సాగుతోంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.. వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అనుకున్నట్టుగా జరిగితే.. బొత్సను ఢీకొనబోతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి..

దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు వినిపిస్తోంది.. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధం అవుతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, హైకమాండ్‌ నుంచి పోటీపై.. అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:10

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్..

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.

సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. అక్కడ కూడా వాయిదా పడింది. ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో వేచిచూడాల్సి ఉంది.

ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ కవితకు బెయిల్‌ అంశంపై చర్చించారని జోరుగా ప్రచారం సాగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోర్టులో నిరాశే ఎదురవ్వడం గమనార్హం.

ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని... అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరుఫు సీనియర్ న్యాయవాదులు గతంలో ఢిల్లీ హైకోర్టులో వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తీరును ఆమె తరుఫు న్యాయవాది తప్పుబట్టారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని.. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని వాటి కింద కవితకు బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:07

తిరుపతికి తియ్యటి వార్తను ప్రకటించిన కేంద్రం

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కావడంతోపాటు వరుసగా నాలుగు రోజులు సెలవుదినాలు కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసి నడవబోతున్నాయి.

రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈనెల 14, 16 తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతి మధ్య (07653) నడవబోతున్నాయి.

రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మార్గమధ్యంలో షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటాయి.

షిరిడీ వెళ్లేవారికి అనుకూలంగా ఈనెల 14వ తేదీన తిరుపతి నుంచి నాగర్ సోల్ మధ్య 07417 పేరుతో మరో రైలు నడవనుంది. తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నాందేడ్, ఔరంగాబాద్ మీదుగా తర్వాత రోజు ఉదయం 10.00 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 07418 పేరుతో 15వ తేదీ రాత్రి 10.00 గంటలకు నాగర్ సోల్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

అధికారులకు ప్రయాణికుల ఫిర్యాదు ఏపీలో ప్రధాన నగరమైన కడపకు ఈ నాలుగు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఇచ్చారు. అయితే వివిధ ప్రాంతాలకు వెళుతున్న రైళ్లు కొన్ని కడప జిల్లాలోని కొన్ని స్టేషన్లలో ఆగడంలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా తర్వాత హాల్టింగ్ నిలిపివేశారని, వెంటనే పునరుద్ధరించాలంటూ అధికారులకు విన్నవించారు.

కొన్ని కొన్ని స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు రైళ్లను ఆపుతున్నామని, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం రైల్వేకు బాగుంటే కొనసాగిస్తామని, లేదంటే అంతటితో ఆ సౌకర్యాన్ని నిలిపివేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:05

సర్కార్ కమాల్..తెలంగాణలో సాగు ఢమాల్..!!

తెలంగాణలో వ్యవసాయంకు పెద్ద దెబ్బ తగిలింది. ఖరీఫ్ సీజన్‌లో సాగునీరుపై నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా పథకం ఆలస్యం కారణంగా ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో పంటపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సీజన్‌ ముగిసేందుకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పంటలైన వరి, పత్తి, ధాన్యాల సాగుపై సందిగ్ధత నెలకొంది.

మనకు అందుతోన్న సమాచారం మేరకు ఆగష్టు 10వ తేదీ నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాధారణంగా ఖరీఫీ సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల కేవలం 65.4శాతం మేరకే నాట్లు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది 99.9 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా మొత్తం ఖరీఫ్ సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంట సాగైంది.

అయితే ఇప్పటికీ నాట్లు పూర్తి కాకపోవడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో సాగునీరు అందడం, రైతు భరోసా అందడంతో వ్యవసాయంలో వృద్ధి నమోదయ్యేదని కానీ ఈసారి ఆగష్టు నెల వచ్చినప్పటికీ నాట్లు వేసే కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడం, సాగునీరు కొరత ఉండటంతో పూర్తిస్థాయిలో నాట్లు చేపట్టలేకపోయామని రైతులు చెబుతున్నారు.

కొన్ని జిల్లాలు పూర్తిగా సాగునీరు పై ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. రైతులు కూడా పంట వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటన్నిటికీ సమగ్ర కారణం భూగర్భ జలాలు అడుగంటిపోవడమే. గతేడాది 6.17మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండగా అది 2.08 మీటర్లకు పడిపోయింది.

అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండగా.. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వ్యవసాయం అత్యంత దారుణంగా ఉంది. కృష్ణ నదీ జలాలపైనే ఆధారపి ఉన్న నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కేవలం 60శాతం మాత్రమే పంట సాగు జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో ఈ స్థాయిలో పంట సాగు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరుకు, వరి, ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె, పత్తి వంటి ప్రధాన పంట సాగుపై తీవ్ర ప్రభావం పడింది.

ఇదిలా ఉంటే తెలంగాణలో పంట సాగు ఇంత తీవ్రంగా పడిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని విరుచుకుపడ్డారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగం ఎంత సంబరంగా వ్యవసాయం చేసిందో ఇప్పటి ప్రభుత్వంలో అదే రైతాంగం ఎలా దిగాలుగా ఉందో చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో అత్యంత పేలవంగా పంటసాగు జరుగుతోందంటే ఎవరు కారణమని ప్రశ్నించారు. దశాబ్దకాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే వ్యవసాయ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు.