/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 13:26

Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట..

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు.

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐఏఎ్‌సల బదిలీ ఉత్తుర్వుల్లో ఆమెను ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆమ్రపాలి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చిన జోనల్‌ కమిషనర్లు పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, అనురాగ్‌ జయంతి, అదనపు కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి తదితరులు నూతన కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా గతంలో కొన్నాళ్లు పని చేశారు. సంస్థలోని పరిస్థితులపై ఆమెకు కొంత మేర అవగాహన ఉంది.

బదిలీ ఉత్తర్వులు వెలువడిన సమయంలో ఢిల్లీలో ఉన్న ఆమ్రపాలి బుధవారం నగరానికి వచ్చారు. రోనాల్డ్‌రోస్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాక సచివాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లినట్టు తెలిసింది. రోనాల్డ్‌ ఇంధన శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌), మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. బల్దియాలో కొనసాగాలనుకుంటే ఆ మూడు బాధ్యతల నుంచి మినహాయింపునివ్వడం లేదా జీహెచ్‌ఎంసీకి రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమిస్తే ఇప్పటికే ఉన్న పోస్టుల్లో కొనసాగాలని ఆమ్రపాలి భావిస్తున్నట్టు సమాచారం

ఈవీడీఎం కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ బుధవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈవీడీఎంలో డైరెక్టర్‌ పోస్టు మాత్రమే ఉండేది. ఐపీఎస్‌ అధికారులు విశ్వజిత్‌ కంపాటి, ఎన్‌ ప్రకా్‌షరెడ్డిలు డైరెక్టర్లుగా కొనసాగారు. ప్రకాష్ రెడ్డి స్థానంలో రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయన కమిషనర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉందని, అందుకే కమిషనర్‌గా ఆయనను నియమించారని ఓ అధికారి తెలిపారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 13:15

MLA: మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేస్తా..

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.

ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్లైఓవర్‌ బ్రిడ్జి ట్రాఫిక్‌ అవసరాలకు సరిపోవడం లేదన్నారు. దీంతో తరచూ ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మిస్తే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఉండవన్నారు.

రైల్వే, జీహెచ్‌ఎంసీ(Railway, GHMC) అధికారులు సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి సమాంతర ప్లైఓవర్‌ నిర్మాణ పనులు మొదలయ్యేలా పాటుపడాలని ఆయన కోరారు. ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డులోని గుంతలను పరిశీలించి తగిన మరమత్తులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి సుధాకర్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ రాజు, డీఈ రేణుక, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 13:07

KCR: విద్యుత్ జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటుపై కేసీఆర్ రిట్ పిటిషన్...

విద్యుత్ జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది.

కేసీఆర్ పిటిషన్‌ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే విచారించనున్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్: విద్యుత్ జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. కేసీఆర్ పిటిషన్‌ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే విచారించనున్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని కేసీఆర్ చేర్చారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 13:00

TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..

ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్‌(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.

ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్‌(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ నుంచి శని, ఆదివారాల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, భువనగిరి(Yadagirigutta, Vemulawada, Komuravelli, Bhuvanagiri)లోని స్వర్ణగిరి టెంపుల్‌కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివెళ్తుండటంతో ఆయా ప్రాంతాలకు బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం జేబీఎస్‌, ఉప్పల్‌(JBS, Uppal) నుంచి ఈ-మెట్రో నాన్‌ఏసీ రెండు బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది.

ఇదే తరహాలో యాదగిరిగుట్ట, కొమురవెల్లి స్పెషల్‌ సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 25 బస్‌ డిపోలుండగా రోజూ రూ.5.5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అందులో టికెట్లతో రూ. 3 కోట్లు, మహాలక్ష్మి జీరో టికెట్ల ద్వారా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఆదా యం పెంచుకునే మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 12:46

Telangana: ఆ నలుగురికే మంత్రి పదవులు..!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.

ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదానిపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నలుగు పేర్లతో జాబితాను అధిష్ఠానానికి అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు పేర్లతో మరో జాబితాను అందించారు.

దీంతో ఆరు పేర్లలో నలుగురిని ఫైనల్ చేయాలని రాష్ట్ర నేతలకు అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదాని చర్చలు కొనసాగుతోన్నాయి. రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, లంబాడీల నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్​ కు చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 11:24

Srisailam: టన్నెల్‌ పనులకు పరుగులు

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వేగవంతానికి చర్యలు.. ఇన్‌లెట్‌ నుంచి సత్వర తవ్వకానికి కసరత్తు

జేపీ సబ్‌ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం పిలుపు

నవంబరులో ఔట్‌లెట్‌ నుంచి టన్నెలింగ్‌

బేరింగ్‌తోపాటు ఇతర పరికరాలకు ఆర్డర్లు

ఏకకాలంలో రెండువైపులా తవ్వకం

ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది. ఇన్‌లెట్‌ వైపు నుంచి సీపేజీలు టన్నెల్‌ తవ్వకానికి ప్రధాన అవరోధంగా ఉండగా, ఔట్‌లెట్‌ వైపు గట్టి రాయి ఉండటం, మాటిమాటికీ బేరింగులు, బిట్లు దెబ్బతింటుండడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో టన్నెల్‌ పురోగతిపై ఇటీవలే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తవ్వకం పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు.

ఔట్‌లెట్‌ (మన్నెవారిపల్లి-అచ్చంపేట) వైపు ఉన్న టీబీఎంలో బేరింగులు పాడైపోవడంతో.. కొత్త బేరింగులతోపాటు ఇతర పరికరాల కోసం ఆర్డర్లు పెట్టారు. ఈ పరికరాలన్నీ ఆగస్టుకల్లా చేరితే.. వీటిని బిగించి, నవంబరులో ఔట్‌లెట్‌ వైపు నుంచి టన్నెల్‌ తవ్వకం చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను అత్యంత ప్రాధాన్య జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. టన్నెల్‌ తవ్వకానికి గల అవరోధాలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సిఫారసులతో ఇప్పటికే రూ.50 కోట్లను వెనువెంటనే విడుదల చేశారు.

ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.3150 కోట్ల నుంచి రూ.4468 కోట్లకు సవరించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరడంతో త్వరలోనే దీనికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. ఇన్‌లెట్‌లో సత్వరం తవ్వకాలు ప్రారంభించాలని, నవంబరులో ఔట్‌లెట్‌ వైపు నుంచి ప్రారంభించి.. రెండువైపులా ఏకకాలంలో తవ్వకం కొనసాగించాలని నిర్ణయించారు.

రెండువైపులా టన్నెల్‌ తవ్వకం ప్రారంభిస్తే.. నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్‌ పూర్తి చేయగలమని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకేతాలిచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 10:57

హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటే కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వివాదాలన్నీ పరిష్కరించిన కేంద్రం.. రోడ్డు విస్తరణ పనులకు పచ్చజెండా ఊపింది

హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్ల రహదారిని 2010లో ఆరు లైన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.

1740 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చిన జీఎమ్మార్ 2012 నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేసుకుంటోంది. ఇలా 2025 జూన్ వరకూ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. కానీ మధ్యలో దీన్ని ఆరులైన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 10:50

ఏపీలో వారికి చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ పథకం కింద రూ.లక్షన్నర నుంచి లక్ష!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలకు పేర్లు మారుస్తోంది. తాజాగా మరో పథకానికి పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత జగన్ సర్కార్ పేరు మార్చి అమలు చేసింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చేసి అమలుకు సిద్ధమవుతోంది. త్వరలోనే విధివిధానాలను కూడా ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనలో దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో పథకాలకు సంబంధించి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలకు పేర్లు మార్చింది కొత్త ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పథకాలకు పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుకగా మార్చేశారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన (మైనార్టీల కోసం) పథకం పేరును.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్‌గా మారుస్తూ ఆదేశాల జారీ చేశారు. ఈ మేరకు జీవోలు విడుదల చేశారు.

మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి రూ.75వేలు నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే గిరిపుత్రిక కల్యాణం కింద ఎస్టీలకు రూ. 50వేలు, అంతేకాదు కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.50 వేలు, దుల్హన్‌ పథకం కింద మైనార్జీలకు రూ.50 వేలు అందించారు. అదే దివ్యాంగులైన వధువు, వరులకు రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ పథకం ద్వారా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మిగతా వర్గాల యువత ఎస్టీలను వివాహం చేసుకుంటే రూ. 50 వేలు, అదే ఎస్సీలను పెళ్లి చేసుకుంటే రూ.40 వేలు, బీసీలను చేసుకుంటే రూ.30 వేలు, ఓసీలను చేసుకుంటే రూ.20 వేల చొప్పున చంద్రన్న కానుక అందించారు.

గత ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష .. ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు.. అలాగే బీసీలకు రూ.50 వేలు.. కులాంతర వివాహాలకు రూ.75వేలు అందజేసింది. అదే మైనార్టీలకు రూ.లక్ష.. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు.. వీరితో పాటూ భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు అందజేసింది. మరి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం ఈ చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇస్తుందన్నది క్లారిటీ లేదు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఈసారి ప్రోత్సహకాన్ని అందజేస్తారని చెబుతున్నారు.. త్వరలోనే విధివిధానాలు, మార్గ దర్శకాలు ఖరారు చేయనున్నారు.

గత ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల్ని అమలు చేసింది. వివాహ తేదీ నాటికి వరుడి వయస్సు 21 ఏళ్లు..వధువు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.. ఇద్దరు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తొలి విహానికి మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.. వధువు, వరుడు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ.10వేలు, అదే పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు లోపు ఉంటేనే అర్హులు. అలాగే మూడు ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్టభూమి ఉండకూడదు.. కానీ మెట్ట, మాగాణి రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండొచ్చనే నిబంధన విధించారు. మరి ఈ నిబంధనల్ని ఏవైనా సడలిస్తారా అన్నది చూడాలి

మరోవైపు ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలకు పేర్లు మార్చింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ పింఛన్‌ కానుక అని పేరు ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. వైఎస్సార్ రైతు భరోసాను.. అన్నదాత సుఖీభవగా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకం, జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 20:29

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుండంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వేళ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి చెప్పిందిదే

పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుపై పూర్తిస్థాయిలో రివ్యూ నిర్వహించి, అక్కడి లోటుపాట్లను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 20:06

మేడిగడ్డ బ్యారేజ్ తో రేవంత్ ప్రభుత్వానికి రూ. 800 కోట్లకుపైనే కాసులవర్షం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించబోతోంది.

రాష్ట్ర ఖజానాకు ఇది వరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుకమేటలు బయటపడ్డాయి.

మేడిగడ్డ ఇసుకతో 800 కోట్లకు పైగా ఆదాయం

దీంతో ఈ ఇసుకను తవ్వి విక్రయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ఈ మేరకు ఇసుకను వేలం వేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తుంది.

మేడిగడ్డలోని ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తో రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.