NLG: నామినేషన్ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి

ఈనెల 24న జరిగే నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా, నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించి కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీపీ మనిమద్ది సుమన్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG
Apr 22 2024, 15:12