/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ చేస్తాం Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:43

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ చేస్తాం

హైదరాబాద్ :

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 125 స్థానాల వరకు ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 70 స్థానాల్లోనే ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ పరోక్షంగా పరాజయం అంగీకరించారు.

ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ట్రెండ్స్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా తో కనిపించారు. కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్: దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారింది. హస్తం వశం అవుతోంది. వెల్లడవుతన్న ట్రెండ్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. జేడీఎస్ సహకారం లేకుండానే కాంగ్రెస్ అధికారం దక్కించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:40

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలే

•నెలాఖరు వరకు మద్యం ప్రియులకు పాత సరుకే

భూపాలపల్లి:

మద్యం ప్రియుల ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోలేదు. పాత స్టాకు ఉన్నంత వరకు బాటిల్‌పై ఉన్న ధరల లేబుల్‌ ప్రకారమే అమ్మకాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి కావటంతో మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తం లో స్టాక్‌ తెచ్చి పెట్టుకున్నారు. అది అమ్ముడుపోతేనే కొత్త స్టాకు వచ్చేది. అప్పటి వరకు పాత స్టాకుపై ఉన్న ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ షాపుల్లో పాత ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు వర్షాలతో బీర్లకు డిమాండ్‌ తగ్గటంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయం పైన ఆధార పడుతోంది. ఉమ్మడి భూపాలపల్లి ఎక్సైజ్‌ పరిధిలో 60 వైన్‌ షాపులు ఉన్నాయి. ఒక్క మంగపేట మండలంలో మినహా మిగతా అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో వైన్‌ షాపులు నడుస్తున్నాయి. ప్రభుత్వం గతంలో భారీగా మద్యం ధరలు పెంచటంతో అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పడిపోతుండటంతో ప్రభుత్వం మే 5న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఫుల్‌ బాటిల్‌పె రూ.40, హాఫ్‌ బాటిల్‌పె రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలను తగ్గించారు. అన్నిరకాల బ్రాండ్లపై ఇదే పద్ధతిలో రేట్లు తగ్గాయి. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పాత ధరలకే షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో షాపుల వద్ద తగ్గిన ధరలకు అమ్మకాలు చేయటం లేదని మద్యం ప్రియులు వాగ్వావాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించినామద్యం వ్యాపారులు పాత ధరలే వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఫోన్లు కూడా వెళ్లుతున్నాయి. ధరలపై సర్దిచెప్పలేక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

స్టాక్‌ ఉన్నంత వరకు పాత ధరలే..

మద్యం వ్యాపారులు నెలకు సరిపడా సరుకుకు ఒకేసారి ఆర్డర్‌ ఇస్తారు. ఏప్రిల్‌ 30వ తేదీనే మే నెలకు కావాల్సిన మద్యం కోసం డీడీలు చెల్లించారు. అయితే ప్రభుత్వం మే 5న మద్యం ధరలు తగ్గించింది. అప్పటికే నెలకు కావాల్సిన మద్యం పాత ధరల లేబిల్‌తో ఆయా ప్రాంతాల్లోని గోదాంలోకి చేరింది. పాత ధర ప్రకారమే వ్యాపారులు ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. తమకు వచ్చిన మద్యం పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త మద్యం కోసం డీడీలు తీయనున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల మద్యం స్టాకు ఉన్నట్లు అంచనా. దీంతో దాదాపుగా ఈ నెలఖారు వరకు పాత స్టాకే విక్రయించనున్నారు. మద్యం సీసాలపై తగ్గిన ధరల కోసం రెండు వారాలు మద్యం ప్రియులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:37

ముఖ్యమంత్రి పీఠంపై కర్చీఫ్‌ వేసిన యతీంద్ర

బెంగళూరు :

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో టపాసులు కాల్చి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అప్పుడే సీఎం పీఠంపై అప్పుడే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కర్చీఫ్‌ వేసేశారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కుతుందని.. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు.

ఒక కొడుకుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో ఆయన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బీజేపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను సరిచేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అవుతారని నొక్కి చెప్పారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:36

అమ్మ లేని జీవితం నాకు వద్దు

హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పిన అమ్మ మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నేదులూరు మండలం ముక్కేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా హరిక్ణృష్ణ(22) ఐటీఐ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

స్నేహితుడితో కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకుంటున్నాడు. 2021లో హరికృష్ణ తల్లి సత్యవాణి గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచే తల్లిలేని జీవితం వృథా అంటూ హరికృష్ణ డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. తల్లి జ్ఞాపకాలతోనే గడిపేవాడు.

పనికి కూడా సరిగ్గా వెళ్ళకుండా ఆలోచనలతోనే ఇంట్లో గడిపేవాడు. ఈ నేపథ్యంలోనే స్నేహితుడు వెంకటేశ్వర్‌రావు డ్యూటీకి వెళ్ళిన కొద్దిసేపటికే శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తన కొడుకు మానసికంగా బాధపడుతూ కరెంటు వైరుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి అర్జున్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 18:33

Hyderabad : హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

నకిలీ నోట్ల దందాకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా.. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని నిందితులు రెచ్చిపోతున్నారు..

తాజాగా ఇలాంటిదే ఓ భారీ ఫేక్ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్‌ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నాట్లు శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 16:43

Karnataka Results: కన్నడ పోరులో.. కాంగ్రెస్‌ అఖండ విజయం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీ అఖండ విజయం సాధించింది. శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. మరో చోట ఆధిక్యంలో ఉంది. ఇక భాజపా (BJP) 64 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్‌ (JDS) 20 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 13:40

అలిపిరిలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ శ్రమదానం

చిత్తూరు జిల్లా:

తిరుపతి సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని గత 13 రోజులుగా టీటీడీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. స్వచ్ఛంద సేవతో సుందర తిరుమలకు అందరూ పూనుకోవటం అభినందనీయమన్నారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని కోరినట్లు తెలిపారు. అది గుర్తుపెట్టుకున్న ఆయన ఈ రోజు తనను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారన్నారు.

తిరుమల పవిత్రత తమ కర్తవ్యంగా భక్తులు భావించాలని ఎన్వీ రమణ అన్నారు. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు.

అనేక దేవతలు సంచరించిన సప్తగిరులకు ఎంతో పవిత్రత ఉందన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకోవాలని సూచించారు. భక్తులు కూడా శుద్ధ తిరుమల.. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 13:39

కేసీఆర్ ఒక హంతకుడు : వైయస్ షర్మిల

హైదరాబాద్ :

సీఎం కేసీఆర్ ఒక హంతకుడని.. ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి నాలుగేళ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడన్నారు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందన్నారు.

15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందన్నారు. కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత ఉందన్నారు.

వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులున్నారని షర్మిల పేర్కొన్నారు. ‘‘ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె!

మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా? ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు కేసీఆర్? బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చావు కదా?’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 13 2023, 13:37

కర్ణాటక ముఖ్యమంత్రి : ఎవ్వరు❓️

బెంగళూరు :

కాంగ్రెస్‌కు తగిన మెజారిటీ వస్తే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? ప్రజాధరణ ఎక్కువగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారా? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది.

కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ టేబుల్: కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

లింగాయత్ ఓట్లలో చీలిక.. 30 శాతం వరకు కాంగ్రెస్‌కు

లింగాయత్‌ల ఓట్లలో చీలిక ఏర్పడినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం ఓట్లు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌కు దక్కిన దళితుల మద్దతు

ఎస్సీ ఓట్లు గతంలో బీఎస్పీకి మద్దతుగా పడేవి. గత ఎన్నికల అనంతరం బీఎస్పీ ప్రభావం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో దళితులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగిత ప్రభావం

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో విశ్లేషించింది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయని ముందుగానే అంచనా వేసింది.

40 శాతం సర్కారు నినాదం ఫలించిందా?

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్‌ నినాదం ద్వారా కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది.

సిలిండర్, పెట్రోలు ధరల ప్రభావం?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే స్థితికి రావడానికి సిలిండర్ ధరల పెరుగుదల, పెట్రోలు, డీజిల్ పెరుగుదల ప్రభావం చూపిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ సీట్లలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లతో ముందంజటలో ఉంది. బీజేపీ 36.1 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీఎస్ 13 శాతం ఓట్లు దక్కించుకుంది.

స్పష్టంగా కాంగ్రెస్‌కు ఆధిక్యం

కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు 119 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. అయితే చివరి వరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి.

ప్రజలు బీజేపీతో విసిగిపోయారు. సిద్దరామయ్య

కర్ణాటకలో నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రచారం ఏ మాత్రం మార్పు తీసుకురాలేదని సిద్ధరామయ్యా అన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందని సిద్ధరామయ్య విశ్లేషించారు.

నిజంనిప్పులాంటిది

May 13 2023, 12:38

సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య

కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు మంచి మెజారిటీ వస్తోందని, సొంతంగానే అధికారంలోకి వస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

అన్నారు. ప్రధాని పర్యటన ప్రభావం చూపలేదన్నారు. మత రాజకీయాలు కర్ణాటకలో పనిచేయవన్నారు.

120 స్థానాలకుపైగా గెలుస్తాం బీజేపీపై ప్రజలు విసిగిపోయారని, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని సిద్ధరామయ్య అన్నారు. కాగా, కాంగ్రెస్‌ రెబల్స్‌తో డీకే శివకుమార్‌ టచ్‌లోకి వెళ్లారు. రెబల్స్‌ను గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఐదుగురు రెబల్స్‌తో డీకే శివకుమార్‌ మంతనాలు జరుపుతున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS