/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz దేశాధి నేతల నైనా కలవోచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ను మాత్రం కలవలేం Yadagiri Goud
దేశాధి నేతల నైనా కలవోచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ను మాత్రం కలవలేం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి స్పందించారు.

అభివృద్ధి అంటే ఒక్క కుటుంబం కోసం కాదని .. అందరూ అభివృద్ధి చెందాలన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ, ఈ స్టేట్‌ చీఫ్‌ని మాత్రం కలవలేం. నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయి’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

నాలుగు ఇళ్ళలో పట్టపగలే చోరీ

పట్ట పగలే నాలుగు ఇళ్లలో దొంగలు చొరబడి కొంత నగదు బంగారమును దోచుకెళ్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో బుధవారం రోజున చోటుచేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోల్లే పల్లి గ్రామానికి చెందిన ఓ వివాహ వేడుకకు హాజరు అయ్యేందుకు వారందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళారు.

ఇదే అదునుగా భావించిన దొంగలు ఎవరు లేని సమయం చూసి పట్ట పగలే గ్రామానికి చెందిన గోపు ఉపేందర్ రెడ్డి , వెంకట్ రెడ్డి , కంది యాకూబ్ రెడ్డి , తంగళ్ళపల్లి లలిత ఇళ్లలో చొరబడి 4 తులాల బంగారం మరియు రెండు లక్షల రూపాయల నగదు దోచుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు.

ఈఘటనపై గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ మధ్య కాలం లో గూడూరు మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో మండల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే మండల ప్రజలు భయపడాల్సి వస్తుంది.

మేడారం మహా జాతరకు ముహూర్తం ఫిక్స్

2024 సంవత్సరంలో జరగబోయే మేడారం మహా జాతరకు సంబంధించి తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పూజారులు ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలువబడే మేడారం మహా జాతర జరిగే తేదీలను బుధవారం ఖరారు చేశారు.

బుధవారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024మహా జాతర తేదీలను నిర్ణయించి ప్రకటించారు.

ఫిబ్రవరి 14న బుధవారం మండమేలగడం మొదలవుతుందని తెలిపారు. 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు చేరుకుంటారన్నారు. 22న సమ్మక్క దేవత గద్దెకు చేరుకుంటుందన్నారు. 23న భక్తులు మొక్కులు చెల్లించవచ్చన్నారు. 24న దేవతల వనప్రవేశం ఉంటుందన్నారు. 28న తిరుగువారం జాతర పూజలు ముగింపు ఉంటుందన్నారు.

Cyclone Mocha: ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!

దిల్లీ: అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను (cyclone) ముప్పు పొంచి ఉంది..

ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. (Cyclone Mocha)

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను cyclone) ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది'' అని ఆయన తెలిపారు..

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు.. ఊపిరాడక ఇబ్బందులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

Vikram : తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం.. విక్రమ్ కు విరిగిన పక్కటెముక.. హాస్పిటల్ కు తరలింపు

తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..

ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు..

చెన్నైలోని ఈపీవి ఫిలిం సిటీలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది..

నేడు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది..

వెంటనే చిత్రయూనిట్ విక్రమ్ ను హాస్పిటల్ కు తరలించారు.

వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ మీడియాకు తెలిపారు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి తెలంగాణ సర్కార్ కసరత్తు

తెలంగాణ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నూ (ఏఐ) వాడుకోవాలనుకుంటున్నది. రోజువారీ పాలనా అవసరాలకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో వినియోగంలోకి వచ్చిన చాట్ జీపీటీ‌లోని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టింది. త్వరలో ఆ కంపెనీకి చెందిన నిపుణుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరపనున్నది.

ఈ మీటింగ్ తర్వాత ఏఐ టెక్నాలజీని అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై స్పష్టత రానున్నది. ఏఐను పరిపాలనాపరమైన అవసరాలకూ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే బ్లాక్ చైన్ టెక్నాలజీని కొన్ని అవసరాలకు వాడుతున్నామని గుర్తుచేశారు. కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్న టైంలోనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సైతం అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో వీలైనంత ఎక్కువగా డిజిటల్ వినియోగం ఉండాలని భావించామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దానికి తగినట్లుగానే సచివాలయంలోని చాంబర్లు, వర్క్ స్టేషన్ల డిజైన్ జరిగినట్టు వివరించారు.

రెండేండ్లుగా..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న టెక్నాలజీల్లో ఏఐ కూడా ఒకటని, భవిష్యత్తు ఈ టెక్నాలజీదేనంటూ గతేడాది జూలైలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో అనేక అంశాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతుందని, అనేక రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రంగంలో కనీసంగా లక్ష మంది హైస్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు అందించే తరహాలో శిక్షణ అందిస్తామని, ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జి) ద్వారా వేలాది మంది విద్యార్థులకు, వివిధ కాలేజీల్లోని ఫ్యాకల్టీకి జాబ్-రెడీ స్కిల్స్‌లో శిక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ ఇండియా, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌ల సంయుక్త సహకారంతో అప్లయిడ్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్‌’ను నెలకొల్పింది. రానున్న కాలంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులకు ప్రత్యేక ట్రెయినింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో అడ్మినిస్ట్రేషన్ అవసరాలకూ ఏఐ టెక్నాలజీని వాడడం ద్వారా పనుల్లో కొంత వేగం పెరిగే చాన్స్ ఉందనే చర్చలు అధికారుల స్థాయిలో జరుగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు నిర్దిష్టంగా ఏ రూపంలో ఏఐ టెక్నాలజీని రోజువారీ పరిపాలనా అవసరాలకు వాడుకోవాలన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ పలు దేశాల్లో పైలట్ ప్రాతిపదికన వాడుతున్న అనుభవాలను స్టడీ చేస్తున్నారు.

మహారాష్ట్రపై కన్నేసిన KCR

జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయిన గులాబీ పార్టీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. దానికి తోడు శివసేన అంటే హిందుత్వ పార్టీ అనే భావన అక్కడి ప్రజల్లో ఉన్నది. ఇక దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ బలపడే అవకాశాలు లేవనేది బీఆర్ఎస్ అభిప్రాయం. మరో వైపు ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మరింత పెరగనుంది. ఈ పరిస్థితులన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయని, యాంటీ బీజేపీ పార్టీగా తమ పార్టీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గులాబీ బాస్ భావిస్తున్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు రాస్తా క్లియర్ అవుతుందని నమ్ముతున్నారు.

తెలంగాణ గులాబీ పార్టీ బీఆర్ఎస్‌ గా పేరు మార్చుకున్న తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందుకు నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి.

యాంటీ బీజేపీ ఫోర్స్‌గా చెప్పుకుంటూ జాతీయ పార్టీ‌గా ఎదగాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్న టైమ్‌లోనే మహారాష్ట్రను కార్యక్షేత్రంగా కేసీఆర్ ఎంచుకోవాలని భావించారు. ఈ ఏడాదిన్నర సమయంలో ఆయన అంచనాలకు తగ్గట్టుగానే అక్కడి రాజకీయ పరిస్థితులు గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ శూన్యత, అక్కడి పార్టీలకు ఉన్న బలహీనతలు, నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్‌కు ఉన్న అనుకూల పరిస్థితులు కేసీఆర్‌కు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు బుధవారం మున్సిపల్‌ కార్యాల యం ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వేతనం రూ. 15,600లను రూ.16,600లకు పెంచుతూ మేడే సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం టపాసులు పేల్చి, స్వీట్లు పం చిపెట్టారు. నాయకులు సోహెల్‌ఖాన్‌, ఆశన్న, నవీన్‌, సత్తయ్య పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: మున్సిపల్‌ కార్మికుల వేతనం రూ.1000 పెంచడంతో క్యాతన్‌పల్లి మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌, కేటీఆర్‌, బాల్క సుమన్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కౌన్సిలర్లు మల్లయ్య, రవిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టడమే కాకుండా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.

వివాహిత కిడ్నాప్‌.. లైంగిక దాడి

మామిళ్లగూడెం:పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్‌ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన నీల(45).. తన అత్తతో కలిసి వైద్యం కోసం ఏప్రిల్‌ 27న ఖమ్మం నగరానికి వచ్చింది.

వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా దుండగులు నీలను కిడ్నాప్‌ చేశారు. ఆ రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.

మరుసటి రోజు 28న ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న నీలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతున్న మహిళ అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించి.. బంధువుల కోసం వాకబు చేశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా మార్చురీలో భద్రపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఖమ్మం పట్టణ ఏసీపీ పీవీ గణేశ్‌ తెలిపారు.