/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వివాహిత కిడ్నాప్‌.. లైంగిక దాడి Yadagiri Goud
వివాహిత కిడ్నాప్‌.. లైంగిక దాడి

మామిళ్లగూడెం:పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్‌ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన నీల(45).. తన అత్తతో కలిసి వైద్యం కోసం ఏప్రిల్‌ 27న ఖమ్మం నగరానికి వచ్చింది.

వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా దుండగులు నీలను కిడ్నాప్‌ చేశారు. ఆ రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.

మరుసటి రోజు 28న ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న నీలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతున్న మహిళ అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించి.. బంధువుల కోసం వాకబు చేశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా మార్చురీలో భద్రపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఖమ్మం పట్టణ ఏసీపీ పీవీ గణేశ్‌ తెలిపారు.

గ్రేటర్’లో దళిత బంధు ప్రకంపనలు

దళిత బంధు పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలలో ప్రకంపనలు సృష్టిస్తోంది . ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి జాబితాను కలెక్టర్‌కు పంపే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం కొంత మంది ఎమ్మెల్యేలు తమ అనుచరులతో మద్యవర్తిత్వం నడిపి వారికిచ్చే రూ 10 లక్షలలో 2 నుండి 3 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంపిక జాబితాను కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ ముందు ఇచ్చిన లిస్ట్ ను ఆపించి జాబితాలో పేర్లు మార్పించి రెండు, మూడు పర్యాయాలు కలెక్టర్ కు ఇచ్చారు. ఇదే విషయం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి పోవడంతో ఇటీవల జరిగిన పార్టీ మినీ ప్లీనరీలో మీ అవినీతి చిట్టా నా దగ్గరుంది.

ఎవరెవరు దళిత బంధులో పేర్లు చేర్చేందుకు డబ్బులు తీసుకున్నారో వారి వివరాలు నా దగ్గర ఉన్నాయి, అటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం ఆలోచిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మాకు టిక్కెట్ వస్తుందో ? రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది శాసనసభ్యులు తమ ముఖ్య అనుచరుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించి ముడుపులు తీసుకున్న విషయం బయటకు ఎలా పొక్కిందోనని ఆరా తీస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా గ్రేటర్ ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. ఈ పథకం కింద ముడుపులు ఇచ్చి లబ్ధి పొందిన వారు ఎమ్మెల్యేల అవినీతి గురించి బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదు.

ముఖ్య అనుచరులకే

ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలదే అని ఈ పథకం అమలు సమయంలో సీఎం ప్రకటించారు . అయితే వారికి ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారిని ఎంపిక చేయకుండా తమ ముఖ్య అనుచరులు, వారు సూచించిన పేర్లను లిస్ట్ లో చేర్చారు. తర్వాత అవసరాలను బట్టి లబ్ధిదారుల పేర్లను మార్చారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో దళిత బంధుకు అర్హులైన వారు వేల సంఖ్యలో ఉన్నారు . వారంతా తమకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఇలా వచ్చిన దరఖాస్తుల నుండి ఎంపిక పారదర్శకంగా చేపట్టవలసినప్పటికీ ముఖ్య అనుచరులను దగ్గర పెట్టుకుని ముడుపులు ఇచ్చిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి జాబితాలో పేర్లను చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా దళిత బంధు ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడ పడితే అక్కడ చర్చించుకోవడంతో అసలు విషయం వెలుగు చూశాయి. దీనికితోడు ప్రభుత్వ నిఘా విభాగాల నుండి కూడా సేకరించిన సమాచారంతో సీఎం హెచ్చరికలు జారీ చేశారు . ఇదిలా ఉండగా దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులను పెంచుతామని సీఎం చెప్పడంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు

బి ఆర్ ఎస్ అంటే భారత రైతు సమితి

నూతన సచివాలయంలోకి సామాన్యులను అనుమతించకపోవడానికి కారణాన్ని మంత్రి కేటీఆర్‌ సరికొత్తగా నిర్వచించారు. సచివాలయం.. సచివులు ఉండే ఆలయం మాత్రమేనని ఆయన అన్నారు. తద్వారా సెక్రటేరియట్‌ కేవలం మంత్రుల కోసమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో కొందరు ఈ విషయాన్ని ప్రస్తావించగా మంత్రి సమాధానం దాట వేశారు. జిల్లాలోని ముస్తాబాద్‌, గోపాలపల్లె, గుండపల్లి చెరువు తండా, వీర్నపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యాన్ని కేటీఆర్‌ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారికి భరోసా కల్పించారు. లావణి పట్టా కలిగిన రైతులకు కూడా పంట నష్టం సాయం అందుతుందన్నారు.

కొందరు రైతులు ఇళ్ల గురించి ప్రస్తావించగా గృహలక్ష్మి పథకం కింద నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు ఉచితాలు దేశానికి మంచిది కాదంటూ ప్రధాని మోదీ పదే పదే గొంతు చించుకున్నారని, కానీ.. కర్ణాటకలో మూడు సిలిండర్లు, పాలు ఫ్రీ అంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. కర్ణాటకు ఇచ్చినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఫ్రీ సిలిండర్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అదానీ కొనే ఎయిర్‌పోర్టులకు జీఎస్టీ లేదని, కానీ.. పాలు, పెరుగు, సామాన్యులు వాడే మందులకు జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇలాంటి పిరమైన ప్రధానికి, బీజేపీకి కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అడుగు పెట్టిన మొదటిరోజే రాష్ట్రంలో పేదలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్లకు రైతులు నష్టపోయిన సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి ఐదు జిల్లాల్లో పర్యటించారని, రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి అని, రైతుకు భరోసా ఇచ్చే పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. వడగండ్లు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా హెక్టారుకు రూ.25 వేలు, ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారని తెలిపారు. అధికారులు, పంట నష్టం అంచనాలు వేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌

పంటనష్టం పరిశీలనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎకరానికి రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకు లాగేశారు.

మహిళల రక్షణకు ‘అభయం’ యాప్‌

రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నేతృతంలో పోలీసులు ‘అభయం సేఫ్‌ ఆటో’ యాప్‌ను రూపొందించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ క్రీడల ముగింపు సందర్భంగా ఈ యాప్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. జిల్లాలోని ఆటోల్లో సేఫ్‌ ఆటో క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా లేమని అనిపిస్తే తమ ఫోన్‌ నుంచి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డ్రైవర్‌ ఫొటో వివరాలతోపాటు వాహనం లైవ్‌ లొకేషన్‌ పోలీస్‌ కమాండ్‌ ఏరియాకు వెళ్తుంది. ఈ యాప్‌ను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. పోలీస్‌ క్రీడల్లో గెలుపొందిన వారికి పతకాలను అందజేశారు

AP Weather Update: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈ సారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది..

ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది.

పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది.

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే2 మంగళవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనివార్య కారణల వలన ఆయన టూర్ వాయిదా పడింది.

అయితే ఎందుకు వాయిదా పడిందో స్పష్టంగా తెలియరాలేదు. రేపు అంటే మే 03 బుధవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

వాస్తవానికి ఇవాళ ఢిల్లీకి వెళ్లి.. అక్కడ వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

మే 4న పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నట్లుగా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

గ్యాస్ ధ‌ర‌ల పెంపుపై రేపు నిరసన కార్యక్రమాలు : మంత్రి కేటీఆర్ పిలుపు

ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఎన్నిక‌లు అయిపోయిన వెంట‌నే ప్ర‌తిసారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం కేంద్ర ప్ర‌భుత్వానికి ఆన‌వాయితీగా మారింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

తాజాగా కేంద్రం భారీగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచ‌డంపై కేటీఆర్ మండిప‌డ్డారు. కేంద్రం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్య‌క్షుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

SB NEWS

SB NEWS

కర్ణాటకలో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..

200 యూనిట్లతో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి గృహిణి రూ. 2 వేలు , పది కిలోల బియ్యం. అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపింది.

నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3 వేలు,. డిప్లొమా చేసిన వారికి రూ. 1500 చెల్లించనున్నట్టుగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 2006 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పొందుతారని కాంగ్రెస్ ప్రకటించింది..

మంగళవారంనాడు బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

కేసీఆర్‌లాంటి సీఎం కావాలంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రలో కుల రాజకీయం చేస్తున్నరు. రెడ్డి, కాపు, కమ్మలు వేర్వేరుగా రాజకీయాలు చేస్తూ ప్రజలను పట్టించుకుంటలేరు. రేపు ఏపీలో ప్రజలను పట్టించుకునేది కూడా బీఆర్‌ఎస్‌ పార్టీనే. పోలవరం పూర్తి చేసేది.. విశాఖ ఉక్కును కాపాడేది కూడా కేసీఆరే. ఇంక ఎవరికీ ఆ దమ్ము లేదు. 2024లో ఆంధ్రలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది’’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లోని ప్రజలు కేసీఆర్‌లాంటి సీఎం కావాలని, తెలంగాణలో ఉన్నటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు సంస్థలకు బెస్ట్‌ మెనేజ్‌మెంట్‌ అవార్డులను; పలువురు వ్యక్తులకు శ్రమ శక్తి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఒకేసారి ఏర్పడ్డాయి.

తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. ఆంధ్ర అవుట్‌ అయ్యింది. జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులిస్తున్నా.. పోలవరం పూర్తి కాలేదు. కానీ, రాష్ట్ర నిధులతోనే కేసీఆర్‌ సర్కారు ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అనతికాలంలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఏపీలో పోలవరం పూర్తి చేసే దమ్ము కేసీఆర్‌కే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన 75 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాశారని, ఉన్నత విద్యలో ఇక్కడున్న మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్‌ సినిమా యాక్టర్‌ కాదని, అయినా, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభలకు లక్షల మంది వస్తున్నారని, బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో తెలంగాణ గాలి నడుస్తోందని, కేసీఆర్‌కు మనమంతా మద్దతుగా నిలవాలని కార్మికులను కోరారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుండడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 25 లక్షలమంది ఉపాధి పొందుతున్నారన్నారు. అమెరికా పాతబడిందని, వచ్చే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

ఉసురు తాకి పోతరు

రాష్ర్టానికి బీజేపీ నిధులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ దేశాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆ రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న రామచంద్రుల (కేసీఆర్‌, కేటీఆర్‌)ను దుర్భాషలాడుతున్నారు. పని చేసేటోళ్లను తిడితే ఆ ఉసురు తాకి గాలికి కొట్టుకుపోతారు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. మోదీ పిరమైన ప్రధాని అని, ఒక్కనికే ఆయన దోచిపెట్టడం దేవుడు చూస్తున్నాడని, పాపం పండుతుందని వ్యాఖ్యానించారు. ఇంకెన్నాళ్లు.. మరో ఏడాది ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రజలు తరిమేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు, వారి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, కరోనాతో ఆలస్యం జరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ ప్రజలు బతకడానికి దూర ప్రాంతాలకు పోయేవారని, ఇప్పుడు దేశానికి బతుకు దెరువుగా రాష్ట్రం మారిందని మరో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ను చూసి న్యూయార్కా..? హైదరాబాదా...? అని ఆశ్చర్యపోయానని సినీనటుడు రజనీకాంత్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ సర్కారుకు మావోయిస్టుల లేఖ

 తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు.

నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

SB NEWS

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలోనే ఇంటర్ మూల్యంకనం ప్రక్రియ ముగిసినా అధికారులు రిజల్ట్స్ వెలువరించేందుకు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఇంటర్ ఫలితాల్లో ఎదురైన చిక్కులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈసారి ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 26వ తేదీనే ఫలితాలు వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం అధికారులు జాప్యం వహిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో ఇంటర్ ఫలితాల జాప్యానికి కారణం టెక్నికల్ సమస్యలేనని పలువురు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సాంకేతిక కారణాల వల్లనే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆలస్యమైనా సరే రిజల్స్ట్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే అధికారులు రిజల్ట్స్‌కు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అంతా ఒకే అనుకున్నాకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రాసెసింగ్ సక్సెస్ అయ్యాక విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒకే చెప్పిన మరుక్షణమే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫలితాల వెల్లడిలో అధికారులు కాస్త తాత్సారం వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి తొలుత మూల్యంకనం ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో చేపట్టాలని భావించారు.

ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు టెండర్లకు సైతం అహ్వానించింది. కానీ బిడ్డింగ్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కూడా రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఈనెల 10వ తేదీలోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్న అధికారులు అన్నీ ఒకే అనుకుంటే ఈనెల మొదటి శనివారంలోపే వెల్లడించాలని చూస్తున్నట్లు వినికిడి.