/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కేంద్ర కొలువులు హిందీ వాళ్లకేనా?.. కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ Yadagiri Goud
కేంద్ర కొలువులు హిందీ వాళ్లకేనా?.. కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్‌ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్‌ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్‌ ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కేటీఆర్‌ శుక్రవారం లేఖ రాశారు.

ఈ పరీక్షను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహించడం ఇతర ప్రాంతాలపై తీవ్ర వివక్ష చూపటమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవనివారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ ఉద్యోగాల కోసం నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ విధానంలో 12 అధికార భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొన్న నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని విమర్శించారు.

రాజ్యాంగ విరుద్ధం

అనేక అధికారిక భాషలున్న భారతదేశంలో హిందీవారికి మాత్రమే పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీలేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. సమాన అవకాశాలు పొందేలా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హకును సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌ కాలరాస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్‌ 18న కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు.

దక్షిణాదిలో వెల్లువెత్తిన నిరసనలు

సీఆర్పీఎఫ్‌లో దాదాపు 1.3 లక్షల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ జారీచేసిన నోటిఫికేషన్‌లో పరీక్షను ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించటం దక్షిణాది రాష్ర్టాల్లో అగ్గి రాజేసింది. కేంద్ర ఉద్యోగాల భర్తీలో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆందోళనబాట పట్టారు. 'లింగ్విస్టిక్‌ ఈక్వాలిటీ' కావాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి సహా పలువురు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు గళం విప్పారు. 'బంగ్లా పోఖో' ప్రధాన కార్యదర్శి గార్గా ఛటర్జీ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఈ విషయంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల్లోనూ సీఆర్పీఎఫ్‌ పరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Droupadi Murmu: సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గువాహటి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారిగా సుఖోయ్‌-30 MKI (Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు..

ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం ఆమె ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి సుఖోయ్‌-30 విమానంలో కొద్దిసేపు విహరించారు.

ఈ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. కాగా.. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) గత గురువారం అస్సాం (Assam) చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్‌ ఉత్సవ్‌ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్‌ కాంచనగంగ సాహసయాత్ర - 2023ను కూడా ఆమె ప్రారంభించారు.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ..

- ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు..

- 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

- 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.

- మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

- 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు

- 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం...

- 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.

- 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ

- 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.

'నా రాజు ఎవరి మాటా వినడు'

•రాహుల్ గాంధీపై దాడి చేస్తూ బిజెపిలో చేరే ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఘాటు వ్యాఖ్యలు

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ మాజీ, చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు బీజేపీలో చేరారు. ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కిరణ్ ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్

ఢిల్లీలో బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్‌ మాజీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్ద నాయకులు తన మాట వినడం లేదని సైగలతో అన్నారు. రెడ్డి మాట్లాడుతూ, 'నేను కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాహుల్‌పై విరుచుకుపడుతూ.. 'నా రాజు చాలా తెలివైనవాడు, తన గురించి ఆలోచించడు, ఎవరి సలహాలూ వినడు' అని ఒక సామెత ఉందని అన్నారు.

ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు

కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఎప్పుడో నేను ఆయన్ను కలిసినప్పుడు ప్రధాని మోదీని చూసి ఇంప్రెస్ అయ్యానని, అందుకే ఈరోజు బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న కిరణ్ అవినీతిపై మా పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు.

తండ్రి మరణం తర్వాత సీఎం అయ్యారు

2009లో తన తండ్రి, ఆంధ్రా మాజీ ప్రధాని రాజశేఖరరెడ్డి మరణంతో కిరణ్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. 2010లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆ కాలంలో రాజకీయ పరిణామాలు తలెత్తాయి, దాని కారణంగా రాష్ట్ర అధికారాన్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు.

కిరణ్ రెడ్డి రాజకీయ జీవితం 1989లో మొదలైందని చెప్పండి. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై వాయల్పాడు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రా, తెలంగాణాగా విభజించడంతో కిరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర అనే కొత్త పార్టీని స్థాపించారు. అయితే, 2018లో రాహుల్ గాంధీ అతన్ని వెనక్కి తీసుకున్నారు.

Coronavirus: పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు గుర్తింపు..

దిల్లీ: కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు..

గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్‌ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.

వీటికి అదనంగా- గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం..

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు..

కోనసీమ: రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని,

కేవలం వీడియో (Video)లో కనిపించినందుకే పోలీసులు లాక్కుపోయారని విమర్శించారు..

అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేయడం తథ్యమని స్పష్టం చేశారు. అల్లర్ల కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. అందుకే ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజు కోనసీమ దళిత సంఘాలను సీఎం జగన్ (CM Jagan)దగ్గరికి తీసుకెళ్తున్నామని విశ్వరూప్‌ తెలిపారు..

కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం.. సొంతంగా కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు సలహా..

Covid Vaccine: కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్‌లపై కేంద్రం చేతులెత్తేసింది..

వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాలని సూచించింది. ఓ వైపు 180 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించిన వసుదైక కుటుంబం అంటున్నారు.. కానీ వ్యాక్సిన్‌లను రాష్ట్రాలనే కొనుక్కోమంటున్నారని.. ఇదెక్కడి న్యాయం అని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌మాండవీయ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో నిల్వలు లేవని.. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కావాల్సిన వ్యాక్సిన్లు రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని.. మార్కెట్‌లో పుష్కలంగా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని సమాధానమిచ్చారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు..

ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..

Bopparaju: అప్పుడు జీతం పెరిగితే.. ఇప్పుడు పడితే సంతోషించాల్సి వస్తోంది: బొప్పరాజు

అమరావతి: ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు..

జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డితో ఏపీ ఐకాస అమరావతి నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ లేఖను ఆయనకు అందజేశారు. అనంతరం నేతలు బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.

ఫిబ్రవరిలో సీఎస్‌కు లేఖ ఇచ్చినా డిమాండ్లు పరిష్కారం కాలేదని బొప్పరాజు చెప్పారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని సీఎస్‌కు తెలిపినట్లు వెల్లడించారు. ''ఉద్యోగ సంఘాల పోరాట కార్యాచరణపై సీఎస్‌కు నోటీసిచ్చాం. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఇవ్వట్లేదు. మేం దాచుకున్న డబ్బుకూ ప్రభుత్వం

లెక్కలు చెప్పడం లేదు. జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక వడ్డీలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమంది ఉద్యోగులు లోన్‌ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం దారుణం. ఇవన్నీ పరిష్కరించకపోవడం వల్లే ఉద్యమానికి దిగాం. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తెలంగాణలో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. గతంలో జీతం పెరిగితే సంతోషించేవాళ్లం.. ఇప్పుడు జీతం పడితే సంతోషించాల్సి వస్తోంది. పోరాటంలో కలిసి రావాలని ఏపీ ఎన్జీవో ఐకాసను కోరాం. మాతో కలిసొచ్చినా.. లేక విడిగా పోరాటం చేసినా ఫర్వాలేదు'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Kiran Kumar Reddy: భాజపా ఎదిగేకొద్దీ.. కాంగ్రెస్‌ దిగజారింది: కిరణ్‌కుమార్‌రెడ్డి..

దిల్లీ: దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు భాజపా చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు..

దిల్లీలో కాషాయ పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే భాజపా బలీయమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు.

''కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడింది. భాజపా ఎదిగేకొద్దీ కాంగ్రెస్‌ దిగజారుతూ వచ్చింది. పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసిందే సరైనదనే ధోరణి కాంగ్రెస్‌లో ఉంది. దేశ నిర్మాణం పట్ల భాజపా నాయకత్వంలో స్పష్టమైన అవగాహన ఉంది. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణన్న సంకల్పం భాజపాకు ఉంది. దేశం కోసం మోదీ, అమిత్‌షా కంకణబద్ధులై ఉన్నారు'' అని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు..