/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తీన్మార్ మల్లన్న నిర్బంధం అక్రమం.. Yadagiri Goud
తీన్మార్ మల్లన్న నిర్బంధం అక్రమం..

•నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకలను ఆపగలేరు..!

•విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు

తెలంగాణ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ముందు ఉంచుతున్న తీన్మార్ మల్లన్న ,సుదర్శన్ గౌడ్ ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్,టిపివైఎస్ జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,టీఎస్.యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి అన్నారు.

బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ప్రశ్నించే గొంతుకల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రశ్నించే గొంతుకలే టార్గెట్ గా లాఠిలను నిర్బంధాలను ప్రయోగిస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ కోదండరాం, విమలక్క,డాక్టర్ చెరుకు సుధాకర్, వంటి ప్రజా గొంతుకుల ఇండ్లపై దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందన్నారు.

గత రెండు రోజుల క్రితం తెరాస పార్టీకి సంబంధించిన నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసి నానా బీభత్సం సృష్టించి,సిబ్బంది పై హత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఆరోజు దాడి చేయడానికి వచ్చిన వారే ఈరోజు తీన్మార్ మల్లన్న పై కేసు పెట్టి మమ్ములనే హత్య చేయడానికి ప్రయత్నం చేసినరని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తీన్మార్ మల్లన్న పై అనేకమార్లు అధికార పార్టీ నాయకులు అనేక చోట్ల దాడులు చేశారన్నారు.అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం కెసిఆర్ కు చుట్టంగా మారిందన్నారు.బారాస పార్టీ దాడులతో నిర్బంధాలతో తన నిరంకుశ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి అనేక కుట్రలకు తెరలేపుతుందన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పును ఎత్తిచూపడం గాని తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన నిలబడడంగాని ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు. కెసిఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని నిరంతరాయంగా తీన్మార్ మల్లన్న ప్రజలకు అందించడమే ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు.ఒక వేళ తీన్మార్ మల్లన్న విధానం సరిగ్గా లేకుంటే ప్రభుత్వానికి నచ్చకుంటే న్యాయస్థానాన్ని ప్రభుత్వం గాని ఆ పార్టీ గాని ఆశ్రయించవలసి ఉండే. కానీ ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులు చేసి గొంతు నొక్కాలనుకోవడం ప్రభుత్వం యొక్క అవివేకమైన చర్య అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సహనాన్ని కోల్పోయి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలను మానుకోవాలసిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. తక్షణమే తీన్మార్ మల్లన్న ను వారి సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా కార్యదర్శి చారి, టి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సంపత్,కత్తుల చంధన్, ఉదయ్, సాయి, శ్రీకాంత్, సందీప్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉగాది సంబరాలు

అమరావతి: తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంలోని

వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు.

సీఎం నివాసంలోని గోశాలలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా

సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు.

తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్‌: డీజీపీ అంజనీకుమార్‌కి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. పలు ఫోన్‌ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనకు పాకిస్తాన్‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్‌ స్లీపర్‌ సెల్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు.

ప్లస్‌ 923105017464 నెంబర్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గోరుముద్దలో మరో పౌష్టికాహారం.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్‌

జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు

►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు.

తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది..

తిరుమల భక్తులకు శుభవార్త.. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల..

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు జూన్ నెల టికెట్లు విడుదల కానున్నాయి.

తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి..

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ.

ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలకమండలి.

ఇక ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు సర్వదర్శనం.. ప్రారంభం కానుంది.

ఈ తరుణంలో శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసింది టీటీడీ.

అలాగే రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

దీంతో…శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.

భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60,100కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.58,700 వద్ద ముగిసిన పసిడి ధర సోమవారం భారీగా పెరిగింది. ఇక ఎంఎసీఎక్స్‌పై కూడా తొలిసారి రూ.60 వేల మార్క్‌ను తాకింది.

అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్రేడర్లు మొగ్గుచూపుతుండడం ధరలకు రెక్కలొచ్చేందుకు కారణమవుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్లు పెంపు వంటి పరిణామాలు కూడా బంగారం భగభగలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి విలువ పతనం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోందని చెబుతున్నారు. మరోవైపు వెండి ధర సోమవారం భారీగా పెరిగింది. ఒక కేజీపై రూ.1860 మేర పెరిగి రూ.69,340కు చేరింది.

పది రోజుల్లోనే 8 శాతం పెరుగుదల..

10 రోజుల క్రితం వరకు పసిడి ధరలు ఇంచుమించుగా రూ.55,200 పలికాయి. ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఏకంగా 8 శాతం మేర ర్యాలీ కనిపించింది. కీలక ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతుండడం, మరిన్ని దేశాల్లో సైతం వెలుగుచూడొచ్చన్న సంకేతాల నేపథ్యంలో పసిడి ధరలు మరింత పెరగొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్.. ఇప్పుడు యూరప్‌లో క్రెడిట్ సూయిస్ బ్యాంక్ సంక్షోభాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయని ‘వెంచర్ సెక్యూరిటీస్’ కమొడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు.

పసిడి ధరలు దేశీయంగా రూ.60 వేల మార్క్‌ను తాకడం అంతగా ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1980 డాలర్లు పలుకుతోందన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం భయాల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ అత్యవసర లిక్విడిటీ చర్యలు, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు సైతం కీలక చర్యలకు సిద్ధమవుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణాలని ఎన్ఎస్ రామస్వామి పేర్కొన్నారు.

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భేటీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలకు సంబంధించి వచ్చేవారం చాలా కీలకమని రిడ్డిసిద్ధి బులియన్స్ ఎండీ, సీఈవో పృథ్విరాజ్ కోఠారి విశ్లేషించారు. ఫెడరల్ రిజర్వ్ వరుసగా వడ్డీ రేట్లు పెంచుతుండడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని, దీంతో బంగారం ప్రయోజనం పొందనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న విక్రయాల వెల్లువ బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తోందన్నారు.

ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ

చెన్నైలోని ఆమె నివాసంలో లాకర్ లోని నగలు మాయం తేయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు

పనివారిపై అనుమానం వ్యక్తం చేసిన ఐశ్వర్య

తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 60 సవర్ల బంగారం (480 గ్రాములు/48 తులాలు), వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు.

ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్ లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది. సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బీజిగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు.

ఫిబ్రవరి 18న ఆమె లాకర్ ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు. డైమంట్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.

చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ

•హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా

•చిట్యాల పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను అధ్యక్షతన ముఖ్య అతిథిగా చేపూరి రవీందర్ గారు

ఈ రోజు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా చిట్యాల పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను అధ్యక్షతన చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేపూరి రవీందర్ గారు పాల్గొని గతంలో ఈటల రాజేందర్ గారు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన కృషిచేసిన వ్యక్తి అని,

అదేవిధంగా తెలంగాణలో కెసిఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా తీవ్ర కృషి చేస్తున్న వ్యక్తి, వారి వచ్చే జన్మదినం లోపల కేసీఆర్ ప్రభుత్వము పోవాలని, ఈటల రాజేందర్ గారు నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, లీగల్ సెల్ జిల్లా నాయకులు గుండాల నరేష్, 100వ భూత్ అధ్యక్షుడు రావుల వెంకన్న, బిజెపి నాయకులు ,పల్లపు దుర్గ య్య, పల్లపు రాజశేఖర్, దండ్ల రాజు లు పాల్గొన్నారు.

Big Breaking: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన..

వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ..

సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు..

స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు.. స్పీకర్‌ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఇక్కడ ఘర్షణకు దారి తీసింది..

స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. అయితే, ఆ ప్లకార్డును పక్కకు తోసేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది..

ఇక, స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటంతో రక్షణగా పోడియం దగ్గరకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు..

సుధాకర్‌బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎమ్మెల్యేలు డోలా, సుధాకర్‌ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. సభలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు వైసీపీ ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఇతరులు.. వెంటనే తమ సభ్యులు ముందుకు వెళ్లకుండా మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు.. ఇక, వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ

•ఇవాళైనా హాజరవుతారా? లేదా..?

నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఇవాళైనా హాజరవుతారా? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.

ఈడీ విచారణ ఉన్నందున కవిత నిన్న (మార్చి 19) సాయంత్రమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల ప్రస్తుతం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ ఎదుట విచారణకు నేడు హాజరు కావాల్సి ఉంది.

మూడు రోజుల క్రితమే (మార్చి 16న) హాజరు కావాల్సి ఉండగా, ఆమె విచారణకు వెళ్లకపోవడంతో నేడు (మార్చి 20) రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ కూడా ఆమె ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.