/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా? Yadagiri Goud
భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60,100కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.58,700 వద్ద ముగిసిన పసిడి ధర సోమవారం భారీగా పెరిగింది. ఇక ఎంఎసీఎక్స్‌పై కూడా తొలిసారి రూ.60 వేల మార్క్‌ను తాకింది.

అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్రేడర్లు మొగ్గుచూపుతుండడం ధరలకు రెక్కలొచ్చేందుకు కారణమవుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్లు పెంపు వంటి పరిణామాలు కూడా బంగారం భగభగలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి విలువ పతనం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోందని చెబుతున్నారు. మరోవైపు వెండి ధర సోమవారం భారీగా పెరిగింది. ఒక కేజీపై రూ.1860 మేర పెరిగి రూ.69,340కు చేరింది.

పది రోజుల్లోనే 8 శాతం పెరుగుదల..

10 రోజుల క్రితం వరకు పసిడి ధరలు ఇంచుమించుగా రూ.55,200 పలికాయి. ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఏకంగా 8 శాతం మేర ర్యాలీ కనిపించింది. కీలక ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతుండడం, మరిన్ని దేశాల్లో సైతం వెలుగుచూడొచ్చన్న సంకేతాల నేపథ్యంలో పసిడి ధరలు మరింత పెరగొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్.. ఇప్పుడు యూరప్‌లో క్రెడిట్ సూయిస్ బ్యాంక్ సంక్షోభాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయని ‘వెంచర్ సెక్యూరిటీస్’ కమొడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు.

పసిడి ధరలు దేశీయంగా రూ.60 వేల మార్క్‌ను తాకడం అంతగా ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1980 డాలర్లు పలుకుతోందన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం భయాల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ అత్యవసర లిక్విడిటీ చర్యలు, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు సైతం కీలక చర్యలకు సిద్ధమవుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణాలని ఎన్ఎస్ రామస్వామి పేర్కొన్నారు.

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భేటీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలకు సంబంధించి వచ్చేవారం చాలా కీలకమని రిడ్డిసిద్ధి బులియన్స్ ఎండీ, సీఈవో పృథ్విరాజ్ కోఠారి విశ్లేషించారు. ఫెడరల్ రిజర్వ్ వరుసగా వడ్డీ రేట్లు పెంచుతుండడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని, దీంతో బంగారం ప్రయోజనం పొందనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న విక్రయాల వెల్లువ బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తోందన్నారు.

ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ

చెన్నైలోని ఆమె నివాసంలో లాకర్ లోని నగలు మాయం తేయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు

పనివారిపై అనుమానం వ్యక్తం చేసిన ఐశ్వర్య

తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 60 సవర్ల బంగారం (480 గ్రాములు/48 తులాలు), వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు.

ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్ లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది. సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బీజిగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు.

ఫిబ్రవరి 18న ఆమె లాకర్ ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు. డైమంట్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.

చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ

•హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా

•చిట్యాల పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను అధ్యక్షతన ముఖ్య అతిథిగా చేపూరి రవీందర్ గారు

ఈ రోజు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా చిట్యాల పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను అధ్యక్షతన చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేపూరి రవీందర్ గారు పాల్గొని గతంలో ఈటల రాజేందర్ గారు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన కృషిచేసిన వ్యక్తి అని,

అదేవిధంగా తెలంగాణలో కెసిఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా తీవ్ర కృషి చేస్తున్న వ్యక్తి, వారి వచ్చే జన్మదినం లోపల కేసీఆర్ ప్రభుత్వము పోవాలని, ఈటల రాజేందర్ గారు నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, లీగల్ సెల్ జిల్లా నాయకులు గుండాల నరేష్, 100వ భూత్ అధ్యక్షుడు రావుల వెంకన్న, బిజెపి నాయకులు ,పల్లపు దుర్గ య్య, పల్లపు రాజశేఖర్, దండ్ల రాజు లు పాల్గొన్నారు.

Big Breaking: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన..

వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ..

సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు..

స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు.. స్పీకర్‌ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఇక్కడ ఘర్షణకు దారి తీసింది..

స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. అయితే, ఆ ప్లకార్డును పక్కకు తోసేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది..

ఇక, స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటంతో రక్షణగా పోడియం దగ్గరకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు..

సుధాకర్‌బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎమ్మెల్యేలు డోలా, సుధాకర్‌ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. సభలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు వైసీపీ ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఇతరులు.. వెంటనే తమ సభ్యులు ముందుకు వెళ్లకుండా మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు.. ఇక, వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ

•ఇవాళైనా హాజరవుతారా? లేదా..?

నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఇవాళైనా హాజరవుతారా? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.

ఈడీ విచారణ ఉన్నందున కవిత నిన్న (మార్చి 19) సాయంత్రమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల ప్రస్తుతం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ ఎదుట విచారణకు నేడు హాజరు కావాల్సి ఉంది.

మూడు రోజుల క్రితమే (మార్చి 16న) హాజరు కావాల్సి ఉండగా, ఆమె విచారణకు వెళ్లకపోవడంతో నేడు (మార్చి 20) రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ కూడా ఆమె ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

MLC Elections 2023: ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?

MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది..

ఈ రోజు తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. మరోవైపు.. ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది..

23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కదలికలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించిందట.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? అని జిల్లాల్లో ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడు మాత్రమే ఖాళీగా ఉన్నా.. ఇప్పడు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు..

అనూహ్యంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్క ఓటు చే జారినా ఫలితాలపై ప్రభావం పడనుంది.. అయితే, ఈ మధ్యే వైసీపీకి రెబల్‌గా మారిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.. ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తాం అని ప్రకటించడంతో.. వారి ఓట్లు వైసీపీకి పడడం డౌట్‌గానే ఉంది.. ఇక, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దారిలో ఇంకెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది..

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు. జర్నలిస్టుల జర్నలిజం ద్వారా మన సమాజానికి ప్రతినిత్యం అన్ని రకాల సమాచారం అందిస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమైనటువంటి తీన్మార్ మల్లన్న

న్యూస్ ఆఫీస్ పై 25 మంది దుండగులు ఎవరైతే దాడి ఆఫీస్ ఫర్నిచర్ కంప్యూటర్లు ధ్వంసం చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిజాన్ని తొక్కి పట్టి తనకు అనుకూలంగా మాట్లాడే పత్రికలను చూపించే టీవీ ఛానల్ ను

మాత్రమే ప్రచారం చేసుకునే విధంగా స్వార్థ పూరితమైనటువంటి కుట్ర వ్యవహారాలని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు ఖండించారు . తీన్మార్ మల్లన్న క్యు న్యూస్ ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి స్కాముల బాగోతం బట్ట బయలు అయితున్నందుకు తట్టుకోలేక

కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి హేమమైన దుర్మార్గమైన చర్యలు చేస్తున్నాయన్నారు. కాబట్టి ఇట్టి దాడిని యావత్ తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నది. జర్నలిజం ద్వారా ప్రజల మేలుకొలుపు ఉంటుంది తప్ప ఎవరికి వత్తాసు పడకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న తీన్మార్ మల్లన్నకు పూర్తిస్థాయిగా మా మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు తెలియజేస్తున్నారు.

తీన్మార్ మల్లన్న Qన్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తీన్మార్ మల్లన్నకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం ఎప్పటికప్పుడు తన Qన్యూస్ చానల్ ద్వారా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న బడుగు బలహీనవర్గాలకు చెందిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పై కక్ష గట్టి

తనకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని గుండాలు దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేయడం అంటే ఇది పూర్తిగా జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, శేరి రవీందర్, సురేందర్, అనిల్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరో టీఎస్పీఎస్సీగా మారనున్న ఎంజి యూనివర్సిటీ

•బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

ఆదివారం బి.సి విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా మరో టిఎస్పిఎస్సి గా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆరేళ్లుగా ఒకరే పరీక్ష అధికారిగా కొనసాగుతున్నారు పరీక్షల ఫలితాల్లో వెల్లడిలో ఎన్నోసార్లు అవకతవకలు జరిగాయి.

దాంతో వేల మంది విద్యార్థులు ఆందోళనల చెందారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగనే కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరం తక్షణమే పరీక్షల విభాగంలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో టీఎస్పీఎస్సీగా మారకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

పరీక్షల విభాగ అధికారి కొన్ని ప్రైవేట్ కళాశాల యజమానులతో ప్రతి సెమిస్టర్ కి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. అసలు రిజిస్టర్ కి అతనికి సంబంధించిన సబ్జెక్టు యూనివర్సిటీ పరిధిలో లేకపోయినా అతన్ని కావాలని వీసి తన సొంత స్వలాభం కోసం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వీసీ, రిజిస్టర్ మరియు ఓ.ఎస్.డి ముగ్గురు కలిసి యూనివర్సిటీ నిధులని తమ ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జల్సాలకు వినియోగించుకుంటున్నారు.

అంతేకాకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అనేక విభాగాలలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వీటన్నిటి పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బి.సి విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, యువజన సంఘం జిల్లా నాయకుడు రావుల రాజేష్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్,పండ్ల హరికృష్ణ గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు......

ఈదురు గాలులు,అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి

...AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులతో నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు- కూలీ సంఘం (AIKMS) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అకాల వర్షాల కారణంగా నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరి, మామిడి, మిర్చి, నిమ్మ,బత్తాయి, మొక్కజొన్న, బొప్పాయి తదితర తోటలు నేలమట్టం అయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.ఇప్పటికే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక,తెచ్చిన అప్పులు తీర్చలేక మధ్య దళారులతో విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

మార్కెట్లో కల్తీ పురుగుల మందులు,నాసిరకం విత్తనాలతో పంటలు పండక,పండిన పంటకు ధరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రకృతి(విపత్తు) వైపరిత్యాలతో మరింత నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి లక్ష రూపాయలు ఏక్సిగ్రెసియా చెల్లించాలని అన్నారు.

దేశానికి రైతే వెన్నెముక అంటున్నా పాలకులు రైతాంగాన్నీ తీవ్ర సంక్షోభంలో నెడుతున్నారని,వ్యవసాయ రంగానికి అన్నిరకాల సబ్సిడీపై ఎరువుల,విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు అందించాలని,ఏక కాలంలో లక్ష రూపాయలను రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంన్నారని దుయ్యబట్టారు.వెంటనే రైతాంగానికి చేయూత నివ్వాలని కొరారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏక్సిగ్రెసియా వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.