/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్ర పూజలు: ఇద్దరి అరెస్ట్ Yadagiri Goud
ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్ర పూజలు: ఇద్దరి అరెస్ట్

వరంగల్ : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏం. ఏ బారి, సెంట్రల్ జోన్ డీ సి పి గారు ఈ మేరకు వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంబించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏం. జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏ సి పి గారి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మరియు వైద్యశాఖ సిబ్బంది తో ఫారహీన ఆసుపత్రి పై ఈ రోజు 13.03.2023 ఉదయం దాడులు చేసి, ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్రపూజలు చేసి చేతబడి చేసినవారికి తగ్గిస్తామని , సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు :

వీరు ఎక్కవగా పౌర్ణమి, అమావాస్య లలో క్షుద్రపూజాలు చేసి, తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే నెపం తో క్షుద్రపూజాలు చేసి, వారిని నమ్మించి అదిక మొత్తం లో డబ్బులు వసూలు చేశారు. సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొని , తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టేవాడు. ఈ అనుబావం తో అతను హనమకొండ లోని నయీంనగర్ లోని కె యు సి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సం.. ల నుండి తన స్వంత భవనం లో ఫారహీన క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి మరియు ల్యాబూ పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన రోగులకు వారి పై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టినధి అని, నర దృష్టి ఉంది అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతనాలు కలుగడం లేదని , ఉద్యోగాలు రావడం లేదని , కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలును కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. కొంతమంది దీర్గ కాలం గాట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకోవడం చేస్తున్నాడు. కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు వలనే చేయడం వల్లనే తగ్గినధి అని నమ్మిస్తున్నారు. ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో మరియు కొంత మంది రోగుల స్థితి ని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజాలు నిర్వహిష్టడు. ఇతనికి ఇట్టి క్షుద్రపూజాలు కు సహాయకులు గా ఉన్న సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) తండ్రి పేరు నూర్ నివాసం ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకొనినది. ఇట్టి క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా మరియు అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం 5-11-509, నియర్ కె యు సి, నయీంనగర్. పై గతం లో గుప్తా నిదుల తవ్వకం పై ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్. నెంబర్ 30/2017 U/s 447,427,420 r/w 34 IPC , 20 ITTA Ac t. .

వీరి వద్ద నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు.

అరెస్ట్ అయిన వారు : 02

1. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం

5-11-509, నియర్ కె యు సి,

2. సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) నివాసం హబ్సిగూడ హైదరాబాద్

పరారీ లో ఉన్నవారు : 03

1.యాకూబ్ బాబా మరియు అతని 2.భార్య సమరీన్, 3.ఏం. డీ ఇమ్రాన్

స్వాదిన పరుచుకున్న వస్తువులు:

1. ఆలోపతి మందులు

2. క్షుద్రపూజ సామగ్రి-2.

3. ల్యాబ్ టెస్ట్ సామగ్రి.

4. చరవాణి-01

5. తవేర వాహనం. 01

6. పేషెంట్ రిజిస్టర్ : 01 మరియు కరపత్రం

7. నగదు: 3,00,000/-

వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావ్, ఎస్సై లు నిస్సార్ పాషా, లవన్ కుమార్, ఏ ఏ వో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతా మరియు కానిస్టేబుల్ బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీనివాస్, శ్రావణ కుమార్, నాగరాజు, నవీన్ లను ఆబినందిచారు.

మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

ఇప్పటివరకూ తమ ప్రేమని అంగీకరించలేదనో, లేక మోసం చేశారనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడమో, ఇతర అఘాయిత్యాలకు పాల్పడటమో చూశాం. కానీ.. తాజాగా అందుకు భిన్నంగా ఓ అబ్బాయిపై ఒక అమ్మాయి ఎటాక్ చేసిన ఘటన వెలుగు చూసింది. తనని మోసం చేశాడన్న కోపంతో.. తన ప్రియుడిపై ఓ యువతి సలసల కాగే నూనె పోసింది. దీంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

చెన్నై ఈరోడ్‌కి చెందిన మీనాదేవి, కార్తి రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. కొంతకాలం నుంచి కార్తిలో మార్పు రావడాన్ని మీనా గమనించింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. అతడు మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే విషయం మీనాదేవికి తెలిసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.

చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న మీనాదేవి.. ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పథకం రచించింది. ప్లాన్ ప్రకారం.. శనివారం మాట్లాడాలని ఉందని కార్తిని తన రూమ్‌కి పిలిచింది. ప్రియురాలి పిలుపు మేరకు కార్తి ఆమె రూమ్‌కి వెళ్లాడు. అప్పటికే అతనిపై దాడి చేసేందుకు ఆమె నూనెని వేడి చేసి పెట్టింది. ప్రియుడు రూమ్‌కి రాగానే.. అదును చూసి, అతనిపై సలసల కాగే ఆ నూనెని పోసేసింది. అనంతరం ‘‘ఇప్పుడు నిన్ను ఎవరు ప్రేమిస్తారో నేను చూస్తా’’ అంటూ గట్టిగా అరిచింది.

ఈ ఘటనలో కార్తికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, చేతులు కాలిపోయాయి. సహాయం కోసం అతడు కేకలు వేయగా.. ఇరుగుపొరుగు వారు మీనా రూమ్ వద్దకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కార్తిని చూసి.. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కార్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. మీనా దేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. బాధితుడు కార్తి.. పెరుందురైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్తి, మీనాదేవి దగ్గరి బంధువులే అవుతారు. ఆ బంధుత్వంతోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం జరిగింది. అయితే.. సుఖాంతంగా ముగుస్తుందని అనుకున్న ఈ ప్రేమకథ, కార్తి మోసం చేయడంతో విషాదాంతంగా మారింది.

గుంటూరు..పేద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రెయిన్ ట్రీ పార్క్ వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్న వైనం

బెట్టింగ్ కి పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్ , వారి వద్ద నుంచి 4.30లక్షలు 4ల్యాప్ టాప్స్,బెట్టింగ్ కి వాడే పరికరాలు స్వాధీనం

బెట్టింగ్ కి వాడే "కి ప్యాడ్"సెల్ ఫోన్లు 29 స్వాధీనం

బెట్టింగ్ పై విచారణ చేస్తున్న పోలీసులు

సల్కునూరు గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి విశిష్టత
సల్కునూరు గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి విశిష్టత *సల్కునూరు గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు* రాష్ట్రమంతా ఒకరోజు సల్కునూరు గ్రామంలో ఒక రోజు లక్ష్మీ నరసింహ స్వామి వసంతోత్సవ సందర్భంగా
సల్కునూరు గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు
రాష్ట్రమంతా ఒకరోజు సల్కునూరు గ్రామంలో ఒక రోజు లక్ష్మీ నరసింహ స్వామి వసంతోత్సవ సందర్భంగా
Amit Shah: CISF సాధించిన విజయాలకు భారత గర్విస్తోంది

హైదరాబాద్- దేశాన్ని రక్షించడంలో CISF సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు.

54వ సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా..CISF పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు..

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది..

శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..

36,784 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు..

శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు..

Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. ఎనిమిది గంటలుగా ఏమేం ప్రశ్నించారు..!?

ఏమేం ప్రశ్నించారు..!?

1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?

2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (Manish Sisodia) పరిచయం ఎలా ఏర్పడింది..!?

3. ఢిల్లీ గవర్నమెంట్‌కు (Delhi Govt)- సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?

4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?

5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?

6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?

7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?

8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?

9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?

10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?

11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?

12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?

13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?

14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?

15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?

16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?

17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?

18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?

19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?

20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..? అని కవితను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..

చిరునవ్వుతో బయటికొచ్చిన కవిత
తొమ్మిది గంటల సుదీర్ఘ ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చారు. ఆమె కోసం ఈడీ కార్యాలయం బయట వేచి చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు. అయితే కవితను మాట్లాడాలంటూ మీడియా చుట్టుముట్టగా ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Delhi Liquor Scam Case : హై అలర్ట్..

•కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సాయంత్రం 6.30 గంటలు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఏడున్నర గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు.

అయితే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపుతున్నారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారీ బందోబస్తు..

మరోవైపు.. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ భవన్ దగ్గర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఏం జరగబోతోంది..?

అయితే.. విచారణ తర్వాత కవిత ఏం చేయబోతున్నారు..? మీడియాతో మాట్లాడుతారా..? ఢిల్లీలోని నివాసానికి వెళ్తారా లేకుంటే హైదరాబాద్‌కు పయనం అవుతారా..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ ముగిస్తే.. ఇవాళే హైదరాబాద్‌కు కవిత బృందం బయల్దేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. విచారణకు రావాలని మరోసారి కవితకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రేపు ఆదివారం కానుండటంతో సోమవారం విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు వచ్చి.. సోమవారం మళ్లీ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. శుక్రవారం రాత్రి నుంచే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అక్కడే ఉన్నారు.