/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్.. Yadagiri Goud
Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం.

గాయపడినవారు సంఘటన స్థలం నుంచి పారిపోతుండగా చూసినట్లు భద్రతా దళాలు తెలిపినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త బృందానికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుంచి బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

సుక్మా జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనే సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత మిలిటరైజ్డ్ జిల్లాల్లో ఇదొకటి. నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్ల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది..

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్.. ఈజీగా లక్షపొందండి ఇలా

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెడితే అవి ఉన్నత చదువుల కోసం ఉపయోగపడుతాయి.అందువలన ఉమెన్స్ డే సందర్భంగా ఈ పథకం గురించి తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం అర్హతలు :

ఈ పథకాన్ని ఓపెన్ చెయ్యాలంటే భారత పౌరురాలు అయి ఉండాలి

అకౌంట్‌ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయసు పదేళ్లకు మించి ఉండరాదు.

సుకన్య సమృద్ధి యోజన ఖాథఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రమే తెరుస్తారు.

బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు.

ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు.

పథకం ముఖ్యమైన వివరాలు :

సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఒక వేళ మీరు పది సంవత్సరాల కాలానికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. 100000 అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.

మహిళల సమాన భాగస్వామ్యంతోనే ప్రపంచం సంతోషమయం : రాష్ట్రపతి

న్యూఢిల్లీ : మానవ పురోగతిలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పిస్తేనే ప్రపంచం సంతోషమయం అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు..

బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ మహిళల అలుపెరగని స్ఫూర్తిని ప్రశంసించారు. దేశంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో మనం అన్ని రంగాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించినప్పటికీ..

చాలా దేశాల్లో మహిళలు ప్రభుత్వ ఉన్నతస్థాయిలో నియమితులవలేదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షురాలిగా తాను ఎన్నిక కావడం మహిళా సాధికారతలో భాగమేనని అన్నారు. అలాగే అనేక మంది మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లో పనిచేస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. అయితే లింగ సమానత్వం కోసం ఇంకా కృషి చేయాల్సి ఉందని అన్నారు..

స్త్రీ,పురుష సమానత్వం కై ఉద్యమిద్దాం...

అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం సభలో

POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ

అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు కప్పల విజయ అధ్యక్షతన సభ జరిగింది.

ఈ సందర్భంగా POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ మరియు హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శ్రామిక మహిళల సంఘటిత పోరాటాలకు, హక్కుల సాధనకు సంకేతంగా నిలుస్తూ మార్చి 8 స్ఫూర్తినిస్తున్నదని. నేడున్న సామాజిక, ఆర్థిక సంక్షోభిత పరిస్థితుల్లో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, ప్రేమ పేరిట హంతక దాడులకు, పరువు హత్యలకు బలవుతున్నారని దుయ్యబట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ,దళిత మహిళలపై భూస్వామ్య, పెత్తందార్ల దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని. పాలకులు అనుసరిస్తున్న దోపిడీ విధానాలన్నీ మహిళల జీవితాల్ని నిరంతరం అభద్రతలోకి నెట్టేస్తున్నాయని. హక్కుల్ని కాలరాస్తున్నాయని అన్నారు. సమాజంలో వేళ్ళూనుకొని వున్న పితృస్వామ్య భావజాలం, భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ విష సంస్కృతులు, మద్యం దోపిడీ - ఇవన్నీ కలగలిసి మహిళల జీవితాలని హింసాత్మకం చేస్తున్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో, హుందాగా బ్రతకటం మహిళల హక్కు అని, అందుకోసం మహిళల్ని అడుగడుగునా అణచివేస్తూ, హక్కుల్ని నిరాకరిస్తున్న పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని, సంఘటిత శ్రామికవర్గ పోరాటాల ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన మార్చి 8 స్ఫూర్తిని స్వీకరిద్దామని.

మద్యం, మత్తు పదార్థాలు, విష సంస్కృతి ప్రభావాలకు యువతను బలిచేస్తున్న నేరమయ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని మహిళల జీవితాల్ని విధ్వంసం చేస్తూ, శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న పాలకుల మద్యం విధానాన్ని ప్రతిఘటిద్దామని. మహిళలపై సాగుతున్న శ్రమదోపిడి, పితృస్వామ్య పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.ఆధిపత్య పితృస్వామ్య వ్యవస్థను స్టీరికరిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు.

CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మనుధర్మ శాస్రం పేరుతో తిరోగమన వాదాన్ని ప్రజలపై బీజేపీ,ఆర్.ఎస్.ఎస్ లాంటి సంఘ్ పరివార్ శక్తులు కుటిల ప్రయత్నం చేస్తున్నాయని,ఈ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు,మహిళను అంగడి బొమ్మగా,ఆట వస్తువుగా మార్చి పెట్టుబడి సరుకుగా మారుస్తున్నారని దేనికి వ్యతిరేకంగా మహిళలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు...

ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బురుగు అంజన్న,పజ్జూరి ఉపేంద్ర,కప్పల విజయ,సిలువేలు సునీత,వరక్క,పద్మ,రాదమ్మ,వెంకటమ్మా,రేణుక,స్వప్న, ఎల్లమ్మ,సుశీల,రమేశ్వరి,రోజా,సరితా తదితరులు పాల్గొన్నారు.

మాదిగల ప్రధాన శత్రువు బీజేపీ పార్టీ

ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బోడ సునీల్ మాదిగ, ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కోదాడ నుంచి చేపట్టిన మాదిగల సంగ్రామ పాదయాత్ర తొమ్మిదవ రోజు బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

ఎస్సీ వర్గీకరణకు 28 ఏళ్లగా మద్దతు తెలిపిన బీజేపీ ప్రస్తుతం దేశంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మోసం చేస్తోందన్నారు. ఎన్నో బిల్లులను పార్లమెంట్ ఆమోదించుకుంటున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1996లో తిరుపతిలో, 2014లో భద్రాచలంలో ఎస్సీ వర్గీకరణపై బీజేపీ తీర్మానం చేసి ఇప్పుడు విస్మరించడమంటే నమ్మించి ద్రోహం చేయడమేనన్నారు. 2014 ఎన్నికల సమయం లో ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఎస్సీలతో చర్చించి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కనీసం స్పందించడం లేదన్నారు.

ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మాదిగల ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీల వర్గీకరణ బిల్లును తక్షణమే పరిష్కరించి బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా ఇంచార్జి మామిడి కరుణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా కోకన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, గ్యార శ్రీనివాస్, కత్తుల సన్నీ, కొండేటి గోపి, తరి కొండల్, మామిడి వెంకటేష్, ఎమ్మెస్పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కొమిరే స్వామి, నలగొండ మండల ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, పట్టణ నాయకులు బొజ్జ నాగరాజు, మల్లేపల్లి రాంబాబు, జీడిమెడ్ల రమేష్, బొజ్జ నవీన్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తెలంగాణ శాసనమండలికి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు తీరని అన్యాయం చేశారని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను మూడు స్థానాలు అగ్రవర్ణాల వారినే ఖరారు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా సగానికి పైగా జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మొండిచేయి చూపి తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుని బీసీలపై భారాస ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలు భారాసా పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని కట్టెకోలు దీపెందర్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొళ్ళ నాగరాజు, శివేంద్ర, మారోజు రాజ్ కుమార్, వంశీ, దినేష్, శివకుమార్, ప్రవీణ్, గణేష్, అనిల్, లోకేష్, రాజు, ప్రశాంత్, సాయిహర్షిత్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన విస్తృతంగా ఆయుష్మాన్ భారత్ నమోదు కార్యక్రమం

•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం ఆయుష్మాన్ భారత్ నమోదు కార్యక్రమం గ్రామ గ్రామాన విస్తృతంగా ఏర్పాటు చేస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

చిట్యాల మండలం వేంబాయి మరియు ఎలికట్టే గ్రామాలలో బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆయుష్మాన్ భారత్ కార్డు ఉచితంగా నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా 1665 రకాల రోగాలకు ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో తీసుకోవచ్చు అని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా పొందవచ్చునని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల పథకాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు సిద్ధగాని అశోక్, గుడిపాటి సందీప్, మత్స్యగిరి, ఈదుల పవన్, పామనగుండ్ల వెంకన్న, గురిజ వెంకన్న, పామన గుండ్ల నరసింహ, ఓర్సు శంకర్, గుణగంటి వెంకన్న, ఉయ్యాల మల్లేష్, గురిజా అశోక్, పాలకూరి వెంకన్న, అంజయ్య, లింగస్వామి, నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.

UNSC: పాక్ మాటలకు స్పందించడం కూడా దండగే.. భారత్‌ ఘాటు విమర్శలు..

యునైటెడ్‌ నేషన్స్‌: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐరాసలో మహిళల భద్రతపై చర్చ సందర్భంగా కశ్మీర్‌ (Kashmir Issue) అంశాన్ని లేవనెత్తిన దాయాది పాక్‌కు భారత్‌ (India) గట్టి సమాధానమిచ్చింది.అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే అని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో 'మహిళ, శాంతి, భద్రత' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ..

మరోసారి జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఐరాస (UN)కు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) ఘాటుగా స్పందించారు. ''ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుపుతున్నాం. ఈ చర్చ ఆవశ్యకతను మేం గుర్తించి దానికి పూర్తి గౌరవిస్తున్నాం.

దానిపైనే మా దృష్టంతా. ఈ సమయంలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధులు చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే'' అని ఆమె మండిపడ్డారు..

కశ్మీర్‌ (Kashmir) అంశాన్ని ఎత్తిచూపి అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ గతంలోనూ పలుమార్లు ప్రయత్నించి భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమేనని, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఇదివరకే దాయాదికి గట్టిగా చెప్పింది. పొరుగు దేశంతో తాము సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నామని న్యూదిల్లీ మరోసారి స్పష్టం చేసింది. అయితే ఆ బంధం కొనసాగాలంటే.. బీభత్సం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని నొక్కి చెప్పింది..

మహిళా జర్నలిస్టులకు కేటీఆర్ భరోసా

హైదరాబాద్‌: ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు. మహిళా కెమెరామెన్‌, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవి. మహిళల కోసం వీహబ్‌ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నారు.

మీడియా రిలేటెడ్‌ స్టార్టప్‌ పనులు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండి. దాంతో పాటు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నాం.

మాతా శిశుమరణాలు తగ్గాయి, నిమ్స్‌లో అత్యధిక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు చేశాం. మా తప్పులు ఎంత కవర్‌ చేస్తారో.. పాజిటివ్‌ న్యూస్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండి. దుర్ఘటనలు జరిగినప్పుడు మాకు బాధ్యత లేదన్నట్టు మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడి... మీ సమస్యలను ఐఅండ్‌పీఆర్‌ శాఖకు తెలపాలి’’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వ సత్కారం అందుకున్న మహిళా జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు.

Pawan Kalyan:మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..

వాడవాడలా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చట్టసభల్లో, అన్నిచోట్ల మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది.

స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం వేళ మహిళా మణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్వీట్ చేశారు పవన్.