/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పాలేరులో లోకల్‌ సెంటిమెంట్‌ పాలిటిక్స్.. : ఎమ్మెల్యే కందాల. Yadagiri Goud
పాలేరులో లోకల్‌ సెంటిమెంట్‌ పాలిటిక్స్.. : ఎమ్మెల్యే కందాల.

  ఖమ్మంజిల్లా పాలేరులో లోకల్‌ సెంటిమెంట్‌ పొలిటికల్ హీటెక్కిస్తోంది. ఇక్కడున్నవాళ్లు ఈ ప్రాంత బిడ్డలు, మనకు పరాయినాయకులు కావాలా? అంటూ లోకల్‌ సెంటిమెంట్‌తో ప్రత్యర్థులను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్‌ టీపీ నాయకురాలు షర్మిలను ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

మన ప్రాంతాన్ని మనం బాగుచేసుకోలేమా..? ఇతర ప్రాంతాల నాయకులు రావాలా అంటూ లోకల్‌ సెంటిమెంట్‌ ప్రయోగించారు. మట్టికైనా మనోళ్లే కావాలంటారు. అలాంటిది మనకు పరాయి నాయకులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారు.

కూసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తన అభిమతం, ఆశయం కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్‌ చేయడమేనన్నారాయన. ఎంజాయ్‌ చేయాలనుకుంటే చాలా డబ్బుంది. కానీ మన ప్రాంతం ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని.. అందుకే వేరే ప్రాంతాల వాళ్ల మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారు.

పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గతంలో పోటీచేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడే పోటీచేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన కందాళ ఉపేందర్‌ రెడ్డి సిట్టింగ్‌ సీటు నాదే అంటే ఇప్పటికే ఫిక్స్‌ అయ్యారు. తుమ్మల లోకల్‌ కాదు.. నేను లోకల్‌ అంటూ కందాళ పదేపదే చెబుతున్నారు. అటు వైఎస్‌ షర్మిల కూడా లోకల్‌ కాదని…ఈ ప్రాంతం కూడా కాదంటూ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లను నమ్మవద్దని.. మీకు తోడుగా ఉంటానంటూ మరోసారి సెంటిమెంట్ రాగం ఆలపించారు.

Influenza: ఫ్లూ లక్షణాలివే.. ఈ పనులు చేయొద్దు..!

వేసవికాలంలో అడుగుపెడుతున్న సమయంలో జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాలు (Viral Fevers) ప్రజలను కంగారు పెడుతున్నాయి. కొవిడ్ (Covid) తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకమైన ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్‌ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) వెల్లడించింది. ఇంతకీ ఈ ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలేంటీ..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఫ్లూ లక్షణాలివే..

గత రెండు మూడు నెలలుగా ఈ ఫ్లూ (Influenza) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ ‘హెచ్‌3ఎన్‌2 (H3N2)’ రకం ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు (Cough), జ్వరం (Fever). దీంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఫ్లూ (Influenza) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఐసీఎంఆర్‌ (ICMR) కొన్ని జాగ్రత్తలు చెప్పింది. అవి..

తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.

పైన చెప్పిన లక్షణాల్లో ఏవైనా మీకు కన్పిస్తే..

మాస్క్‌ (Mask) ధరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దు.

నోరు, ముక్కును పదే పదే తాకకూడదు.

దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు మీ ముక్కు, నోటిని కవర్‌ చేసుకోవాలి.

ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అధిక మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి.

జ్వరం (Fever), ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మందులు వాడాలి.

ఇవి చేయొద్దు..

కరచాలనం చేయడం.. ఆలింగనం చేసుకోవడం వంటివి చేయొద్దు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు.

ఇతరులు లేదా కుటుంబసభ్యులకు దగ్గరగా కూర్చుని ఆహార పదార్థాలను తినకూడదు.

సొంత చికిత్సలు వద్దు. యాంటీబయాటిక్స్ (Antibiotics)‌, ఇతర ఔషధాలను వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలి.

‘‘ఈ కొత్త రకం ఇన్‌ఫ్లుయెంజా (Influenza) ప్రాణాంతకమైనదేం కాదు. కాకపోతే కొంతమంది బాధితులు శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కొందరికి కొవిడ్‌ తరహా లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే పరీక్షల్లో వారికి నెగెటివ్‌ అనే వస్తోంది. అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వైరస్‌ పట్ల అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉంటే చాలు’’ అని వైద్యులు సూచిస్తున్నారు.

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇప్పిస్తామంటూ ప్రచారం..!

•వాట్సప్‌ ద్వారానే లావాదేవీలు

తిరుపతి: తిరుమలలో శ్రీవారి బ్రేక్‌ దర్శన టికెట్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాను తితిదేలో పనిచేస్తున్నానంటూ సదరు వ్యక్తి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో బ్రేక్‌ టికెట్‌కు రూ.10,500 అవుతుందని తనను సంప్రదించిన వ్యక్తులకు వాట్సప్‌లో(8978624931) ఈ దళారి సంక్షిప్త సమాచారం అందిస్తున్నాడు. ఇవి శ్రీవాణి టికెట్లా లేక బ్రేక్‌ టికెట్లా అని అడుగుతుంటే ఎల్‌1 ఇప్పిస్తామంటూ సమాధానం వస్తోంది.

అయితే తితిదేలో పనిచేస్తున్నానని చెబుతున్న వ్యక్తికి ఇదంతా ఎలా సాధ్యమవుతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై తితిదే సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌ను సంప్రదించగా ఇటువంటి ప్రకటనలను భక్తులు నమ్మవద్దని సూచించారు. ప్రస్తుత ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Hyderabad: పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలింపు

•వాహనం కింది భాగం ఖాళీ ప్రదేశంలో సరకు సంచులు

నాగోలు: పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు రట్టుచేశారు. నలుగురిని అరెస్టు చేసి 400 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్‌చౌహాన్‌ వివరాలు వెల్లడించారు. హనుమకొండకు చెందిన బానోత్‌ వీరన్న, హైదరాబాద్‌ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ మీదుగా హైదరాబాద్‌, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనమవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు.

ఏడోసారి దొరికిపోయారు...

వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్‌ పోలీసులకు ఉప్పందింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్‌ క్రెటా కారును పైలట్‌లా పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్‌గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడంతో 400కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితోపాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

కేటీఆర్ నా పేరు ప్రకటించారు.. హుజూరాబాద్‌లో భారాస జెండా ఎగరేస్తా: కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారాస పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అక్కడ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కౌశిక్‌రెడ్డి శనివారం తమ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నాకు విప్‌గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నాకు సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర నేతలకు ధన్యవాదాలు.

నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ భారాస అభ్యర్థిగా కేటీఆర్‌ నాపేరును ప్రకటించి, ఇప్పటి నుంచే పని చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తాను. ఈటలను ఇంటికి పంపిస్తాను’’ అని అన్నారు.

శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్‌రెడ్డి శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సన్నబియ్యం అని చెప్పి.. దొడ్డు బియ్యం పెడతారా?: రేవంత్

సిరిసిల్ల: సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామంటున్న ప్రభుత్వం దొడ్డుబియ్యం అందిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.సిరిసిల్లలో ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహాన్ని ఆయన పరిశీలించారు. హాస్టల్‌ భోజనం, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఖర్చుల కోసం ప్రభుత్వం తక్కువ డబ్బులు ఇస్తోందని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హాస్టళ్లలో మెరుగైన మెనూ ఉండాలా చూస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. అనంతరం సిరిసిల్ల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ అరాచకాలను తరిమికొట్టేందుకు ఇక్కడి వచ్చిన ప్రజలందరికీ అభినందనలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.

‘‘ తెలంగాణ ఉద్యమం కోసం పదవీ త్యాగం చేసిన నేతన్న కొడుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. 2001లో కేసీఆర్‌కు పార్టీ ఆఫీసు ఇచ్చి ఆశీర్వదించారు. అలాంటి వ్యక్తి చివరి చూపులకి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు. ఓట్లేసి గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్ల కింద కేటీఆర్‌ నలిపేస్తున్నాడు. అమరుల కుటుంబాలను ప్రగతిభవన్‌కు పిలిపించి అన్నం కూడా పెట్టని కేసీఆర్‌.. తెలంగాణ నా కుటుంబం అని ఎలా అంటారు?. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం ఆస్తులు సంపాదించుకుంది. అలాంటి వారిని తెలంగాణ పొలిమేరల దాకా తరమాలి’’ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు.

‘‘తితిదేకి నా సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను’’ అని చాగంటి వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తితిదే ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, చాగంటి పదవిని తిరస్కరించిన అంశానికి సంబంధించి తితిదే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్‌ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌..ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత..

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఈ అంశానికి సంబంధించి.. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.

సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా

తప్పుల తడాఖాగా డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్

భారతీయ జనతా పార్టీ పిలుపు

నల్గొండ పట్టణ ప్రజలు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లకి అండగా నిలుస్తూ సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కనుక డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రతి ఒక్కరు రావలసిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. 

భారత్ మాతాకీ జై 

భారతీయ జనతా పార్టీకి జై

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

•బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు అన్నారు.

పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని పేదల ఆరోగ్య ఉచిత వైద్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ప్రారంభించారు.

గ్రామంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించాలని ఈ యొక్క సదా అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఉద్యమంలా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా అహర్నిశలు కృషి చేయాలని పేద ప్రజల జీవన అభివృద్ధి కోసం మనందరం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్రo ఇంచార్జ్ అంతటి వెంకటేష్ గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షుడు బత్తుల వెంకన్న గౌడ్, నాగేంద్ర చారి, శ్రీనివాస్, మహేష్, బత్తుల అనిల్ గౌడ్, ఈదుల పవన్, వెంకటేష్,నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.