/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇప్పిస్తామంటూ ప్రచారం..! Yadagiri Goud
శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇప్పిస్తామంటూ ప్రచారం..!

•వాట్సప్‌ ద్వారానే లావాదేవీలు

తిరుపతి: తిరుమలలో శ్రీవారి బ్రేక్‌ దర్శన టికెట్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాను తితిదేలో పనిచేస్తున్నానంటూ సదరు వ్యక్తి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో బ్రేక్‌ టికెట్‌కు రూ.10,500 అవుతుందని తనను సంప్రదించిన వ్యక్తులకు వాట్సప్‌లో(8978624931) ఈ దళారి సంక్షిప్త సమాచారం అందిస్తున్నాడు. ఇవి శ్రీవాణి టికెట్లా లేక బ్రేక్‌ టికెట్లా అని అడుగుతుంటే ఎల్‌1 ఇప్పిస్తామంటూ సమాధానం వస్తోంది.

అయితే తితిదేలో పనిచేస్తున్నానని చెబుతున్న వ్యక్తికి ఇదంతా ఎలా సాధ్యమవుతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై తితిదే సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌ను సంప్రదించగా ఇటువంటి ప్రకటనలను భక్తులు నమ్మవద్దని సూచించారు. ప్రస్తుత ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Hyderabad: పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలింపు

•వాహనం కింది భాగం ఖాళీ ప్రదేశంలో సరకు సంచులు

నాగోలు: పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు రట్టుచేశారు. నలుగురిని అరెస్టు చేసి 400 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్‌చౌహాన్‌ వివరాలు వెల్లడించారు. హనుమకొండకు చెందిన బానోత్‌ వీరన్న, హైదరాబాద్‌ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ మీదుగా హైదరాబాద్‌, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనమవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు.

ఏడోసారి దొరికిపోయారు...

వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్‌ పోలీసులకు ఉప్పందింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్‌ క్రెటా కారును పైలట్‌లా పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్‌గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడంతో 400కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితోపాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

కేటీఆర్ నా పేరు ప్రకటించారు.. హుజూరాబాద్‌లో భారాస జెండా ఎగరేస్తా: కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారాస పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అక్కడ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కౌశిక్‌రెడ్డి శనివారం తమ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నాకు విప్‌గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నాకు సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర నేతలకు ధన్యవాదాలు.

నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ భారాస అభ్యర్థిగా కేటీఆర్‌ నాపేరును ప్రకటించి, ఇప్పటి నుంచే పని చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తాను. ఈటలను ఇంటికి పంపిస్తాను’’ అని అన్నారు.

శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్‌రెడ్డి శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సన్నబియ్యం అని చెప్పి.. దొడ్డు బియ్యం పెడతారా?: రేవంత్

సిరిసిల్ల: సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామంటున్న ప్రభుత్వం దొడ్డుబియ్యం అందిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.సిరిసిల్లలో ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహాన్ని ఆయన పరిశీలించారు. హాస్టల్‌ భోజనం, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఖర్చుల కోసం ప్రభుత్వం తక్కువ డబ్బులు ఇస్తోందని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హాస్టళ్లలో మెరుగైన మెనూ ఉండాలా చూస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. అనంతరం సిరిసిల్ల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ అరాచకాలను తరిమికొట్టేందుకు ఇక్కడి వచ్చిన ప్రజలందరికీ అభినందనలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.

‘‘ తెలంగాణ ఉద్యమం కోసం పదవీ త్యాగం చేసిన నేతన్న కొడుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. 2001లో కేసీఆర్‌కు పార్టీ ఆఫీసు ఇచ్చి ఆశీర్వదించారు. అలాంటి వ్యక్తి చివరి చూపులకి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు. ఓట్లేసి గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్ల కింద కేటీఆర్‌ నలిపేస్తున్నాడు. అమరుల కుటుంబాలను ప్రగతిభవన్‌కు పిలిపించి అన్నం కూడా పెట్టని కేసీఆర్‌.. తెలంగాణ నా కుటుంబం అని ఎలా అంటారు?. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం ఆస్తులు సంపాదించుకుంది. అలాంటి వారిని తెలంగాణ పొలిమేరల దాకా తరమాలి’’ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు.

‘‘తితిదేకి నా సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను’’ అని చాగంటి వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తితిదే ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, చాగంటి పదవిని తిరస్కరించిన అంశానికి సంబంధించి తితిదే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్‌ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌..ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత..

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఈ అంశానికి సంబంధించి.. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.

సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా

తప్పుల తడాఖాగా డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్

భారతీయ జనతా పార్టీ పిలుపు

నల్గొండ పట్టణ ప్రజలు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లకి అండగా నిలుస్తూ సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కనుక డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రతి ఒక్కరు రావలసిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. 

భారత్ మాతాకీ జై 

భారతీయ జనతా పార్టీకి జై

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

•బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు అన్నారు.

పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని పేదల ఆరోగ్య ఉచిత వైద్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ప్రారంభించారు.

గ్రామంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించాలని ఈ యొక్క సదా అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఉద్యమంలా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా అహర్నిశలు కృషి చేయాలని పేద ప్రజల జీవన అభివృద్ధి కోసం మనందరం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్రo ఇంచార్జ్ అంతటి వెంకటేష్ గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షుడు బత్తుల వెంకన్న గౌడ్, నాగేంద్ర చారి, శ్రీనివాస్, మహేష్, బత్తుల అనిల్ గౌడ్, ఈదుల పవన్, వెంకటేష్,నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Chandrababu Naidu: పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా..

ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. గత నాలుగేళ్లల్లో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చ జరిగింది..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వైసీపీ నేతల దాడుల్లో తాము పడ్డ ఇబ్బందులను.. లీగల్ సెల్ అందించిన సాయాన్ని సదస్సులో వివరించారు బాధిత కుటుంబాల సభ్యులు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలు..

కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసింది. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా. అధికార పార్టీకి సహకరించే పోలీసులను హెచ్చరిస్తున్నా. తప్పుడు పనులకు పోలీసులు సహకరించకూడదు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. విశాఖలో రూ. 40 వేల కోట్లను దోచుకున్నారు. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. పోర్టు.. భూములను బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు..

ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉంది.అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటాం.ఇప్పటి వరకు నాపై ఎలాంటి కేసులు లేవు.నాపై కేసులు పెట్టేందుకు ఎవ్వరూ సాహసించ లేదు.ఇప్పుడు నాపై ఎన్ని కేసులున్నాయో నాకే తెలీదు.నాపై ఏమైనా కేసులున్నాయా..? అని డీజీపీకి లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించాలి.వైసీపీ పతనం ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి.ఓటర్ల జాబితా మొదలుకుని.. ఏజెంట్ల నియామకం వరకు లీగల్ సెల్ సేవలు అవసరం.ఏజెంట్ల నియామకం విషయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి.డెకాయిట్లు రాజకీయాల్లో ఉండకూడదంటే.. వచ్చే ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకోవాలి.ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్ సేవలు అవసరం అన్నారు చంద్రబాబు..

Bill Gates: మోదీతో మాట్లాడాక.. మరింత ఆశతో ఉన్నా: బిల్‌గేట్స్‌

దిల్లీ: టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో దేశం పురోగతి చెందుతోందని, సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు ఈ దేశమే నిదర్శనమని కొనియాడారు..

ఈ సందర్భంగా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ టెక్నాలజీ గురించి బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. సాంకేతికతతో ప్రభుత్వం పనితీరు మెరుగవుతుందని చెప్పేందుకు గతిశక్తి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు. ఇక, జీ-20 (G-20) సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించడంపై స్పందిస్తూ.. ''దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచం ఎలా ప్రయోజనం పొందొచ్చే చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం'' అని ప్రశంసించారు.

''ప్రధానితో మాట్లాడిన తర్వాత.. ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్‌ (India) సాధిస్తోన్న పురోగతి గురించి గతంలో కంటే మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నా. మనం సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఏం సాధించగలమో భారత్‌ నిరూపిస్తోంది. ఈ పురోగతి ఇలాగే కొనసాగాలని, భారత్‌ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నా'' అంటూ గేట్స్‌ (Bill Gates) తన బ్లాగ్‌ను ముగించారు.