/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది.. Yadagiri Goud
Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది..

Kishan Reddy In Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని, కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు.

అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారన్నారు. ఇదే సమయంలో కిషన్ రెడ్డి నోటి వెంట ఏపీ రాజధాని ప్రస్తావన కూడా వచ్చింది. విశాఖపట్టణం రాజధాని ప్రాంతం అని, జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా మాధవ్‌ని ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ వంటి వారుంటే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు..

తప్పుల తడకగా డబల్ బెడ్ రూమ్ ల వెరిఫికేషన్
నల్లగొండ పట్టణ 36 వ వార్డులో తప్పుల తడకగా డబల్ బెడ్ రూమ్ ల వెరిఫికేషన్. అధికారుల నిర్లక్ష్య వైఖరి తో సొంత ఇల్లు ఉన్నవారికి ఎలిజిబుల్ లిస్టులో పేరు... అర్హులైన నిరుపేదలకు ఎలిజిబుల్ లిస్టులో దక్కని చోటు?
ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించి భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కి బ్రహ్మరథం

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలో

బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి హర్షం

ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు. భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో త్రిపుర నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తపరిచారు.

ఈ భారత దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ ఎన్నికలు నిగ్గు తేల్చాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి దీక్ష దక్షిత భారత దేశంలోని ప్రతి రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా నిరూపించారు. యావత్తు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు రూపాని నరసింహ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, పాలకూరి వెంకన్న గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, సుంకరి మల్లేష్ గౌడ్, చింతకాయల రాము, పాకాల దినేష్, పల్లపు వెంకటేష్, పాకాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు

Andhra News: ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు

ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు

అమరావతి: ఏపీలో ఈనెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో) ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు..

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..

ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సమావేశం..

విజయవాడ: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.

ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు..

అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాం. మా సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏప్రిల్‌లో బదిలీ అవకాశం ఉంటుంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సామాజిక పథకాలు ఇవ్వాలని కోరాం.గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు జాబ్‌చార్ట్‌ ప్రకారం ప్రమోషన్లు ఉంటాయి' అని తెలిపారు.

నల్గొండ మున్సిపాలిటీ 25వార్డ్ లో ఆర్థికసాయం అందించిన తండు

నల్గొండ మున్సిపాలిటీ 25వార్డ్ లో ఆర్థికసాయం అందించిన తండు

నల్గొండ మున్సిపాలిటీలో 25వార్డ్ కి చెందిన ముంతాజ్ బేగం ప్రభుత్వం హాస్పిటల్ అడ్మిట్ అయిన సీరియస్ గా ఉన్నందువలన వాళ్ల ఆర్థిక ఇబ్బందుల విషయం తెలుసుకున్న వెంటనే

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు EX జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

10000- రూపాయల ఆర్థిక సాయం అందించి చంద్రం ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ మైనారిటీ నాయకులు గౌస్ , సమీర్,అశోక్, రాజు, స్వామి, సల్మాన్, రియాజ్, ఉమేర్, అజ్జు, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Telangana News: చేవెళ్లలో కారు బీభత్సం.. 2 కార్లు, 15 ద్విచక్రవాహనాలు ధ్వంసం..

చేవెళ్ల: అతి వేగంతో వచ్చిన ఓ కారు .. 15 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది..

చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ అనే యవకుడు కారులో చేవెళ్ల వెళ్తుండగా.. జర్నలిస్టు కాలనీకి రాగానే అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న రెండు కార్లు, 15 ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ధ్వంసమయ్యాయి.

కారు బీభత్సంతో ఒక్కసారిగా కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

మధ్యాహ్న సమయం కావడంతో జనసంచారం లేక ప్రమాదం తప్పిందని, సాయంత్రం సమయంలో అయితే ప్రాణనష్టం సంభవించేదని వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను జేసీబీ సాయంతో తొలగించారు. స్వల్పంగా గాయపడిన రాజశేఖర్‌ను ఆసుపత్రికి తరలించారు..

శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి.

•విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసు, హత్యా కేసు నమోదు చేయాలి.

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఓ ముక్కు పచ్చలారని విద్యార్థి జీవితం బలయిందన్నారు. పది రోజుల క్రితమే ఉప్పల్ ఫిర్జాదిగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆత్మహత్య ఘటన మరవకముందే హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన

నాగుల సాత్విక్ అనే ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థి తన తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ముక్కు పచ్చలారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం కొట్టడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తక్షణమే శ్రీచైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం....

•CPI (M-L) న్యూడెమోక్రసీ

కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతంగా గృహ వినియోగదారులకు 50/రు,,లు, కమర్ష్యాల్ 350 లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం (బస్టాండ్)వద్ద రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా CPI (ML)న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరు సాగర్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రోజు రోజుకు వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే పెట్రోల్,డీజిల్ ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు.

పేద,మధ్య తరగతి,సాధారణ ప్రజలు ధరల పెరుగుదలతో హార్దికం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.దేశభక్తి ముసుగులో దేశ సంపదను కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు,ఆదాని,అంబానీ లాంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ..ప్రజలకు మాత్రం ధరల భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ ధరలు పెంచడం మూలంగా మధ్యతరగతి ప్రజల జీవితాలను హార్దికం గా దెబ్బతింతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి,పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, IFTU జిల్లా నాయకులు బొంగరాల నర్సింహ,సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ,IFTU నాయకులు రావుల వీరేష్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,మామిడాల ప్రవీణ్,నాంపల్లి శంకర్, నర్సింహా,బొమ్మపాల అశోక్,రాంనగర్ శంకర్,మోడీకట్టి సురేందర్, మహేష్,చింత యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు 60 ఏళ్ల తర్వాత తొలిసారి

నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు 60 ఏళ్ల తర్వాత తొలిసారి

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్థి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఎన్డీపీపీ అభ్యర్థి హేకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి గెలుపు ఒక చరిత్ర అని చెప్పుకుంటున్నారు..