/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Global Investors' Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్‌ ఆంక్షలు Yadagiri Goud
Global Investors' Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Global Investors' Summit: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం..

ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులు, కార్పొరేట్‌ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000 కిపైగా నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు.

మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు..

Hyderabad: బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ.. రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు..

కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు.

ఒంటిపై గాయాలు చూసిన బాలుడి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ''నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం'' అని గ్యాంగ్‌ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

ఉమెన్స్‌ డే సందర్భంగా దేశ మహిళలకు మోదీ కానుక ఇదేనా?: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్యాస్‌ ధరల (Gas cylinder Price) పెంపునకు నిరసనగా ఎల్లుండి (శుక్రవారం) అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (Minister KTR) పిలుపునిచ్చారు.

మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోదీ (PM Modi) సిలిండర్‌ ధరలు (Gas Cylinder) పెంచారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు.

గృహావసరాల సిలిండర్‌ ధరను రూ.50, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.350 మేర పెంచడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1200లకు చేరుకుందన్నారు. పెరుగుతున్న గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ నేతలకు కేటీఆర్‌ వివరించారు.

ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, కేంద్రాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం ధరలు పెంచుతున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయ మాటలు చెప్పిన భాజపా ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్‌ ధరలను భారీగా పెంచుతూ ప్రజలకు సిలిండర్‌ను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఉజ్వల పథకంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ కూడా ఇప్పుడు సిలిండరు కొనలేక పొయ్యిపై వంట చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును మూడోసారి పెంచారు.

ఇంతకు ముందు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. తాజాగా దాన్ని ఈనెల 8వ తేదీ వరకు మరోసారి పొడిగించినట్లు ఆదర్శ పాఠశాలల అదనపు సంచాలకురాలు ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 64,350 మంది దరఖాస్తు చేశారని ఆమె పేర్కొన్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికలు.. కాసేపట్లో కౌంటింగ్‌

అగర్తల: మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయల్లో ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవమయ్యాయి. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 4 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.

బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్‌ జరిగింది. నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. 

మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో 259 మంది పోటీ పడ్డారు.

గంజాయి కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ 6 కేజీల గంజాయి స్వాధీనం:

•నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో

గత కొంతకాలంగా నలగొండ పట్టణంలో గంజాయికి బానిసై, జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఐదుగురు యువకులు పథకం వేసి ఒరిస్సా నుండి తెచ్చి లోకల్ లో అమ్మాలని నిర్ణయించుకున్నారు .

ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు విద్యుత్ నగర్ కాలనీలోని ఒక రూమ్ లో యువకులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రాగా, నల్గొండ టూ టౌన్ సిఐ చంద్ర శేకర్ రెడ్డి ఆదేశాను సారం నలగొండ టూ టౌన్ SI లు రాజశేఖర్ రెడ్డి ,సైదులు వారి సిబ్బంది శంకర్ ,బాలకోటి , సత్యనారాయణ వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, రాకను గమనించి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించి 3kg ల గంజాయి స్వాధీనం చేసుకుని, MRO నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించడం జరిగింది.

వారు చెప్పిన వివరాల ప్రకారం అర్జల బావి దాబా దగ్గర గల ఒక రూములో మరొక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి మరొక 3 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు

(1) బోట్ల విశ్వంత్ తండ్రి కృష్ణయ్య గ్రామం: వూత్కుర్ , శాలిగౌరారం,

(2) విశ్వనాధుల ఈశ్వర్ తండ్రి Late, బ్రహ్మచారి ,R/o శ్రీరామ్ నగర్, కాలనీ నల్గొండ

(3) వాడపల్లి శివ తండ్రి రాములు ,R/o గాంధీనగర్ ,నల్గొండ

(4) గోసుకొండ శివ తండ్రి జనార్ధన్ R/o పానగల్, నల్గొండ

(5) కొక్కు రమేష్ తండ్రి బిక్షపతి R/o శ్రీరామ్ నగర్ కాలనీ నల్గొండ.

వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపనయినది.

పట్టణ ప్రజలకు విజ్ఞప్తి

మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏవైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే 100 నెంబర్ కు గాని పోలీస్ స్టేషన్కు గాని తెలియచేయగలరు.

ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ

తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు.

''శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు.

నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు.

Andhra news: అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తా: రేణుకాచౌదరి

విజయవాడ: ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు..

బుధవారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి చెప్పారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.

ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదన్నారు.

Guntur: గుంటూరులో బరి తెగించిన దోపిడీ దొంగలు.. ఇద్దరు వాచ్‌మెన్ల దారుణహత్య..

గుంటూరు: గుంటూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు వాచ్‌మెన్లను హతమార్చిన దుండగులు.. పలు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు..

వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు నగర వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర్లు అనే వాచ్‌మెన్‌ హత్యకు గురయ్యాడు. మరో వైపు అమరావతి రోడ్డులోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌ వద్ద కృపానిధి అనే వాచ్‌మెన్‌ సైతం ఇదే విధంగా హత్యకు గురయ్యాడు.

రెండు హత్యలకు సారూప్యత కనిపిస్తోంది. పొట్టకూటికోసం విధులు నిర్వహించే వాచ్‌మెన్లపై దుండగులు దాడి చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరండల్‌పేట ప్రాంతంతో పాటు పాత గుంటూరులోని కొన్ని దుకాణాల్లో ఇదే ముఠా చోరీకి పాల్పడింది. గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..

పాతనేరస్థుల పనేనా?

హత్యలు, దోపిడీ ఘటనలు నగరంలోని పాతనేరస్థుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో పాతనేరస్థులు దారుణాలకు తెగబడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో వైపు దోపిడీ దొంగలు బరితెగించి హత్యలకు తెగబడటంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి 2.30.. 3గంటల సమయంలో హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Rahul Gandhi: కేంబ్రిడ్జిలో డిఫరెంట్‌ లుక్‌తో రాహుల్‌.. ఫొటోలు వైరల్‌

దిల్లీ: నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్‌ జోడో యాత్ర(Bharat jodo yatra)లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్‌(Newk look)తో ఆకట్టుకుంటున్నారు.

హెయిర్‌ కటింగ్‌, గడ్డం ట్రిమ్‌ చేయించుకొని తొలిసారి స్టైలీష్‌ లుక్‌లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్‌ అక్కడ సూట్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్‌ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు..

52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ''లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్‌ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ''మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా 'లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగిస్తారు'' అని పేర్కొంటూ నిన్న ట్వీట్‌ చేసింది. మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కళాశాల డైరెక్టర్‌, ట్యూటర్‌, గ్లోబల్ హ్యుమానిటీస్‌ ఇనిషియేటివ్‌ కో డైరెక్టర్‌ అయిన శ్రుతి కపిలతో రాహుల్‌ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు.