/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Andhra news: అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తా: రేణుకాచౌదరి Yadagiri Goud
Andhra news: అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తా: రేణుకాచౌదరి

విజయవాడ: ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు..

బుధవారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి చెప్పారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.

ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదన్నారు.

Guntur: గుంటూరులో బరి తెగించిన దోపిడీ దొంగలు.. ఇద్దరు వాచ్‌మెన్ల దారుణహత్య..

గుంటూరు: గుంటూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు వాచ్‌మెన్లను హతమార్చిన దుండగులు.. పలు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు..

వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు నగర వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర్లు అనే వాచ్‌మెన్‌ హత్యకు గురయ్యాడు. మరో వైపు అమరావతి రోడ్డులోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌ వద్ద కృపానిధి అనే వాచ్‌మెన్‌ సైతం ఇదే విధంగా హత్యకు గురయ్యాడు.

రెండు హత్యలకు సారూప్యత కనిపిస్తోంది. పొట్టకూటికోసం విధులు నిర్వహించే వాచ్‌మెన్లపై దుండగులు దాడి చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరండల్‌పేట ప్రాంతంతో పాటు పాత గుంటూరులోని కొన్ని దుకాణాల్లో ఇదే ముఠా చోరీకి పాల్పడింది. గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..

పాతనేరస్థుల పనేనా?

హత్యలు, దోపిడీ ఘటనలు నగరంలోని పాతనేరస్థుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో పాతనేరస్థులు దారుణాలకు తెగబడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో వైపు దోపిడీ దొంగలు బరితెగించి హత్యలకు తెగబడటంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి 2.30.. 3గంటల సమయంలో హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Rahul Gandhi: కేంబ్రిడ్జిలో డిఫరెంట్‌ లుక్‌తో రాహుల్‌.. ఫొటోలు వైరల్‌

దిల్లీ: నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్‌ జోడో యాత్ర(Bharat jodo yatra)లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్‌(Newk look)తో ఆకట్టుకుంటున్నారు.

హెయిర్‌ కటింగ్‌, గడ్డం ట్రిమ్‌ చేయించుకొని తొలిసారి స్టైలీష్‌ లుక్‌లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్‌ అక్కడ సూట్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్‌ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు..

52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ''లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్‌ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ''మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా 'లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ'' అనే అంశంపై ప్రసంగిస్తారు'' అని పేర్కొంటూ నిన్న ట్వీట్‌ చేసింది. మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కళాశాల డైరెక్టర్‌, ట్యూటర్‌, గ్లోబల్ హ్యుమానిటీస్‌ ఇనిషియేటివ్‌ కో డైరెక్టర్‌ అయిన శ్రుతి కపిలతో రాహుల్‌ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు.

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే భాజపా పోటీ: బండి సంజయ్‌

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా.. లేరా? అనే సందేహం వస్తోందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

''వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలి. భాజపా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుందని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఆయనకు ట్విటర్ టిల్లు అని నామకరణం చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్‌కు సీబీఐ, పోలీసుల కంటే మహిళా మోర్చా అంటే భయం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారు. హత్యలు, అత్యాచారాలకు ప్రధాన కారణం మద్యం. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది'' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Suryanarayana: జీపీఎఫ్‌ సొమ్ము పేపర్ల పైనే.. అకౌంట్లలో లేదు: సూర్యనారాయణ

శ్రీకాకుళం: ఏప్రిల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు..

ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆందోళలనకు వెళ్తామని చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

''ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేది కాదు.. అది మా హక్కు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లిచేలా చట్టం చేయాలి. ఉద్యోగులకు చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. రానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై చట్టబద్ధత తీసుకురావాలి. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము పేపర్లపై తప్ప ఖాతాల్లో ఉండటం లేదు'' అని సూర్యనారాయణ అన్నారు..

పిట్టంపల్లి, చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమం

ముఖ్య అతిథులుగా

•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్,

•బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు,

•చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పిట్టంపల్లి మరియు చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్ , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు పాల్గొని మాట్లాడారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 350 కి పైగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని ఢిల్లీలో విడుదలైన బడ్జెట్ ను సరాసరి గ్రామపంచాయతీ ఖాతాలో పడేవిధంగా 14వ 15వ ఆర్థిక సంఘాల ద్వారా నిధులు ఏర్పాటు చేశారని

ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్, మంచినీటి పథకాలు, మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు వ్యవసాయం ఎరువుల సబ్సిడీ, రేషన్ బియ్యం, ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి యోజన, రైతులకు ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్, ఇల్లు లేని పేద వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా 350 పైగా పథకాలు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.

ఇట్టి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలనలో నరేంద్ర మోడీ గారి పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్ దొర అరాచక పాలనను అంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆనాడు ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణను మోసం చేస్తున్నారని తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని తెలంగాణ ఉద్యమం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ 1200 మందికి పైగా విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమైందని ఉద్యమకారులను ఆగం చేసిన కేసీఆర్ కుటుంబం సర్వనాశనమైతుందని,

తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఆగం చేసిన కేసీఆర్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యమకారులను మోసం చేసి పబ్బం గడుపుతున్న కెసిఆర్ కుటుంబం నిరంకుశ పాలన ఇక కొనసాగడానికి వీలులేదని, పేద ప్రజలకు ఉండడానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేక అవస్థలు పడుతుంటే కేసీఆర్ దొర వారి కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ లు వందల ఎకరాల్లో నిర్మించుకొని తెలంగాణ సొమ్మును దోచుకుని దాసుకుంటుంరని, తెలంగాణలో ఉన్న సంపద మొత్తం దోసుకొని లిక్కర్ స్కాములు, సాండ్ స్కాములు, ల్యాండ్ స్కాములు అన్ని రకాల స్కాములు చేసి ఇప్పుడు మల్ల సామాన్య ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడ తన కూతురు కవిత అరెస్టు అయితదని ముందస్తుగా

పార్టీ శ్రేణులకు అరాచకాలు సృష్టించే విధంగా పన్నాగాలు పన్నుతున్నారని దొంగ ఎప్పుడైనా దొంగే అని ప్రజలు గమనించాలని, కెసిఆర్ కు ఎలక్షన్లు వచ్చినప్పుడే దళిత బంధు, గిరిజన బంధు గుర్తుకొస్తాయని తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు కేసీఆర్ కంటికి కనబడడం లేదని వాళ్ళ అభివృద్ధిని ఏనాడు కూడా ఆకాంక్షించలేదని కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా విభజించి పాలిస్తున్నారని తెలంగాణ ప్రజల గోస వినడానికి భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామానికి వెళ్లి ఈ యొక్క బిజెపి భరోసా కార్యక్రమాలని పదకొండు వేల కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి విజయవంతం చేశారన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈసారి తప్పకుండా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్వసనీయతో ప్రజలు ఉంటారని తెలియజేశారు.

తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్య ఉచిత వైద్యం వెంటనే అమలు చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తెలియజేశారు అన్నారు. ఈ యొక్క ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమాలను విజయవంతం చేసిన తెలంగాణ యావత్ ప్రజానీకానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ నాగాచారి బూత్ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, జనార్ధన్, పొలిమేర రాము, శ్రవణ్, బిజేపి నాయకులు ప్రభాకర్, కృష్ణయ్య, నరసింహ, వెంకన్న, సత్తయ్య, వెంకటేశం, మురళి, రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

వర్గీకరణ సాధించి మాదిగ అమరవీరులకు అంకితం చేస్తాం.

-ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం.

-బకరం శ్రీనివాస్ మాదిగ.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఏమ్మేస్పి నల్లగొండ నియోజకవర్గం ఇంచార్జీ బకరం శ్రీనివాస్ మాదిగ అన్నారు.

బుధవారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో అశువులు బాసిన మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మున్సిపాలిటీ పార్కు వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేసిన నిర్లక్ష్యం వల్ల వర్గీకరణ పోరులో సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగలను ఎందరినో ఉద్యమ వీరులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ 8 సంవత్సరాలు కావాస్తున్నా వర్గీకరణ అంశంపై పార్లమెంట్లో గానీ రాజ్యసభలో గానీ మాట్లాడకుండా మాదిగలను ఓటు బ్యాంకుగా ఎన్నికల సందర్భంలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మౌనం వీడి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును రాబోయే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు ఇంకా ఉదృతం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగ అమరవీరులకు అంకితం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

----------------------------------------------------

ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపెల్లి రమణ గౌడ్, ఏమ్మెస్పి నల్లగొండ మండల ఇన్చార్జ్ బొజ్జ దేవయ్య మాదిగ, కనగల్ మండల ఇన్చార్జి దుబ్బ సత్యనారాయణ మాదిగ, పట్టణ కన్వీనర్ మాసారం వెంకన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు కురుపాటి కమలమ్మ, బొజ్జ నాగరాజు, తలకొప్పుల రాజు, బేపంగి అర్జున్, బొజ్జ నవీన్, సందీప్, వంశి, నితిన్, కాసర్ల అంజి, సందీప్, ప్రణయ్, నరేష్, పవన్, శివశంకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి లీలా పవిత్ర (28) దారుణ హత్య (Murder)కు గురైంది.

తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

లీలా పవిత్ర స్వస్థలం కాకినాడ (Kakinada). ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి బంధం గురించి లీలా తన ఇంట్లో వాళ్లకు చెప్పగా.. పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా.. దివాకర్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ప్రియుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు (Bengaluru) పోలీసులు వెల్లడించారు..

IMD: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే సూర్యుని ప్రకోపం

దిల్లీ: దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఐఎమ్‌డీ అందించిన సమాచారం ప్రకారం..

దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ, సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. మధ్యభారతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి భాగంలో మార్చి నుంచి మే మధ్యకాలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటున 15.49 డిగ్రీలమేర నమోదుకాగా

ఈ ఏడాది 16.82 డిగ్రీలుగా నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువ స్థాయిలో నమోదుకావడం అయిదోసారి. ఈ ఫిబ్రవరిలో వాయవ్య భారత్‌లో 24.86 డిగ్రీలు (సాధారణ సగటుకంటే 3.40 డిగ్రీలు అధికం), మధ్యభారత్‌లో 31.93 (2.05 డిగ్రీలు అధికం), తూర్పు, ఈశాన్య భారత్‌లో 13.99డిగ్రీల(1.67 డిగ్రీలు అధికం)మేర నమోదయ్యాయి. రాబోయే మార్చి నుంచి మే నెలల మధ్యకాలంలో దేశంలోని ఈశాన్యం, తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో, నైరుతి భాగంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

చారిత్రక కట్టడం నేలమట్టం

కాలగర్భంలో కలిసిన మహబూబ్‌నగర్‌ పాత కలెక్టరేట్‌ భవనం

ఉమ్మడి జిల్లాకేంద్రం మహబూబ్‌గర్‌లోని పాత కలెక్టరేట్‌ భవనం నేలమట్టమైంది. నిజాం నవాబుల కాలంలో నిర్మితమై చారిత్రక కట్టడంగా విరాజిల్లుతూ 8 దశాబ్దాలకు పైగా పాలన కేంద్రంగా ఉన్న ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ భవన నిర్మాణానికి 1931లో శంకుస్థాపన చేసి 1936లో ప్రారంభించారు. నిజాం నవాబుల పరిపాలనలో ఉండే 12 శాఖల అధికారులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. పాలమూరు జిల్లా 8 తాలుకాలతో ఉండేది. అప్పట్లో నాగర్‌కర్నూల్‌ కేంద్రంగా పరిపాలన సాగేది. జనాభా పెరగడం, గ్రామాలు విస్తరించడంతో మరో రెండు తాలుకాలు కొత్తగా ఏర్పాటుచేయగా పాలమూరు జిల్లా ఆవిర్భవించింది. తర్వాత 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ గౌరవార్థం 1890లో పాలమూరు పేరును మహబూబ్‌నగర్‌గా మార్చారు. కలెక్టరేట్‌(పాత) భవన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో అప్పటి నుంచి ఈ భవనం ద్వారానే ప్రభుత్వ పాలన మొదలైంది. 1960-61 నుంచి ఇప్పటి వరకు ఈ భవనం నుంచి 45 మంది కలెక్టర్లు పరిపాలన అందించారు. 2022 డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ భూత్పూర్‌ రోడ్డులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయడంతో పాత కలెక్టరేట్‌ భవనాన్ని ఖాళీ చేశారు. శిథిలావస్థకు చేరిందంటూ మంగళవారం కూల్చివేశారు.

ఆసుపత్రి నిర్మించాలని..

చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న భవనాలను వారసత్వ సంపదగా చూడాలని, వాటిని కాపాడుకుంటూ గ్రంథాలయాలు, మ్యూజియం వంటి వాటికి వాడాలని జిల్లాలోని సీనియర్‌ సిటిజన్లు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్లకు పలు దఫాలుగా వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వానికి మెయిల్స్‌ ద్వారా విజ్ఞాపనలు పంపించారు. అయినా ప్రభుత్వం పాత కలెక్టరేట్‌ భవనం కూల్చేందుకే నిర్ణయించడంపై జిల్లా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం కోసం ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత కలెక్టరేట్‌ భవనాన్ని కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.