/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులకు సీఎం జగన్‌ ప్రశంస Yadagiri Goud
ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులకు సీఎం జగన్‌ ప్రశంస

వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం, మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు గవర్నెన్స్‌ నౌ అంతర్జాతీయ సంస్ధ తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్‌ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్‌ నౌ అవార్డును ప్రకటించింది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, చైర్‌పర్సన్‌ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు. 

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. గెడ్డం శేఖర్‌ బాబు.

మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా

సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత, కేజ్రీవాల్ తదుపరి చర్య ఏమిటి, కొత్త మంత్రులను నియమిస్తారా లేదా శాఖల విభజన చేస్తారా?

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. కుంభకోణం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు.మనీష్ సిసోడియా 18 మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు నిర్వహించారు. అవినీతి కేసులో సిసోడియా ఫిబ్రవరి 26న అరెస్టయ్యారు. కాగా, సత్యేందర్ జైన్‌ను గతేడాది మే 30న అరెస్టు చేశారు. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నాడు. పోర్ట్‌ఫోలియో లేకుండా జైన్ మంత్రిగా ఉన్నారు.

ఇద్దరు మంత్రుల రాజీనామా తర్వాత ఈ శాఖను కేజ్రీవాల్ ఎవరికి అప్పగిస్తారు.. లేక ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనేది పెద్ద ప్రశ్న. వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఇంకా కొత్త మంత్రి ఎవరూ ఉండరు. సిసోడియాకు చెందిన కొన్ని పోర్ట్‌ఫోలియోలను రాజ్‌కుమార్ ఆనంద్‌కు మరియు మరికొన్ని కైలాష్ గెహ్లాట్‌కు ఇవ్వనున్నారు. గెహ్లాట్ ప్రభుత్వంలో రోడ్డు మరియు పర్యావరణ శాఖ మంత్రి. ఇక రాజ్‌కుమార్ ఆనంద్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.

2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిందని వివరించండి. ఈ విధానం ఇప్పుడు రద్దు చేయబడింది. అదే సమయంలో సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్, ఏ పాత్రో తెలుసా?

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు 'లాల్ సలాం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ కూడా ఒక ముఖ్యమయిన పాత్ర వేస్తున్నారని కూడా తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఇద్దరూ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు, గత సంవత్సరం ఈ సినిమా చెన్నై లో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.

అయితే ఇప్పుడు తాజా తెలిసిన వార్త ఏంటి అంటే, ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఐశ్వర్య ఎప్పటి నుంచో జీవిత రాజశేఖర్ కి ఈ పాత్ర గురించి చెప్పి, జీవిత మాత్రమే ఈ పాత్రకి కరెక్ట్ అని భావించి, ఆమెని కలిసి కథ చెప్పి, ఒప్పించిందని తెలిసింది. ఇందులో జీవిత, రజినీకాంత్ కి చెల్లెలు గా నటిస్తోందని భోగట్టా. జీవిత మార్చి మొదటి వారంలో చెన్నై వెళ్లి అక్కడి నుండి షూటింగ్ లో పాల్గొనవచ్చు అని కూడా తెలిసింది.

చాలా కాలం తరువాత జీవిత రాజశేఖర్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆమె వివాహం అయ్యాక, ఎక్కువగా దర్శకురాలిగా, నిర్మాతగా ఫోకస్ పెట్టారు కానీ, నటన మీద అంత దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వస్తుండటం విశేషం. అది కూడా ఒక తమిళ సినిమాలో, రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో.

'లాల్ సలాం' అనేది ఒక భారీ ప్రాజెక్ట్, దీన్ని పెద్ద సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య కి ఇది దర్శకురాలిగా మూడో సినిమా. దీనికి ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ముదిరిన ప్లెక్సీల ఘర్షణ.. రణరంగమైన భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి : బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఘర్షణ ముదిరింది. దీంతో భూపాలపల్లి రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఇవాళ భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే మొన్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్‌ను అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం...

తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

తెలంగాణ చరిత్రలోనే మరోసారి అత్యధిక విద్యుత్ వినియోగం...

ఈరోజు మధ్యాహ్నం 14750 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ నమోదు...

నిన్న 14,501 మెగావాట్ల వినియోగం...

రానున్న రోజుల్లో మరింత వినియోగం పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు...

అగ్ని వీరుల ఎంపిక.. తెలంగాణలో నాలుగు కేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్‌: అగ్ని వీరుల నియామకానికి (Agniveer recruitment) నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్‌ కె.దాస్‌ తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఆర్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిస్తామని కీట్స్‌ తెలిపారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ అభ్యర్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్‌గా లభిస్తాయని ఆయన వెల్లడించారు. అభ్యర్థులకు సందేహాలుంటే 79961 57222 నెంబర్ కు వాట్సాప్ చేయాలని ఆర్మీ నియామక అధికారి తెలిపారు.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath) స్కీమ్‌ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్‌ (Agniveer recruitment) విడుదలైంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుద చేసిన విషయం తెలిసిందే. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. అగ్నివీరులుగా చేరేందుకు https://www.joinindianarmy.nic.in/index.htmలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

74 మందులకు రిటైల్‌ ధరలు ఖరారు: ఎన్‌పీపీఏ

దిల్లీ: జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందులకు రిటైల్‌ ధరలను నిర్ణయించింది. ఈ నెల 21న జరిగిన 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లిఫ్లోజిన్‌ సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌ హెచ్‌సీఎల్‌ (ఈఆర్‌) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర; రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే టెల్మిసార్టాన్‌, బిసోప్రొలోల్‌ ఫ్యూమరేట్‌ ట్యాబ్లెట్‌కు రూ.10.92 ధర నిర్ణయించారు.

మరో 80 ఔషధాలకు గరిష్ఠ ధర (సీలింగ్‌ ప్రైస్‌)లనూ ఎన్‌పీపీఏ నిర్ణయించింది. మూర్ఛ, నూట్రోపెనియా వ్యాధి ఔషధాలు ఇందులో ఉన్నాయి. సోడియమ్‌ వాల్‌ప్రొయేట్‌- 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.3.20, ఫిల్‌గ్రాస్టిమ్‌ ఇంజెక్షన్‌ (ఒక వయల్‌)కు రూ.1,034.51 ధర ఖరారు చేశారు. స్టెరాయిడ్‌ తరగతికి చెందిన ఔషధం హైడ్రోకార్టిసోన్‌- 20 ఎంజీకి రూ.13.28 గరిష్ఠ ధర నిర్దేశించారు.

సచిన్‌కు నిలువెత్తు విగ్రహం.. ఎంసీఏ కీలక ప్రకటన

టీమ్‌ఇండియా (Team India) క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్‌ (Sachin) నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై ముంబయి క్రికెట్ అసోషియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్‌ కాలే ప్రకటన విడుదల చేశారు. ఇలా ఒక ఆటగాడికి ఈ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

అమోల్‌ కాలేతో కలిసి సచిన్‌ తెందూల్కర్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంసీఏ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. వాంఖడేతో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడాను.. ఆచ్రేకర్‌ సర్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయా. అలాగే నా చివరి మ్యాచ్‌నూ ఇక్కడే ఆడాను. ఇక్కడికి వస్తే నా జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు నా జీవితంలో అతి పెద్ద సంఘటనగా ఇది నిలిచిపోతుంది. ఇప్పుడు నేను పాతికేళ్ల అనుభవంతో 25 ఏళ్ల యువకుడిగా ఉన్నా. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి ధన్యవాదాలు. నాకు ఇదొక ప్రత్యేక ప్రదేశం’’ అని సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

భారత్‌లో క్రికెటర్ల విగ్రహాలకు సంబంధించి తొలి టెస్టు జట్టు కెప్టెన్‌ సీకే నాయుడుకు మాత్రమే అరుదైన గౌరవం దక్కింది. అదీనూ మూడు స్టేడియాల్లో వేర్వేరు సైజుల్లో విగ్రహాలను ఆయా క్రికెట్‌ సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియం, నాగ్‌పుర్‌లోని విదర్భ మైదానం, ఆంధ్రప్రదేశ్‌లోని వీడీసీఏ స్టేడియాల్లో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి.

కేసీఆర్‌ ఒక్కరే కాదు.. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది: ప్రొ.కోదండరామ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ (CM Kcr) ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. రాష్ట్ర ప్రజల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ జనసమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram) అన్నారు. చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (Telangana bachao) సదస్సును నిర్వహించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దిల్లీ మద్యం కుంభకోణం చూస్తే ఈ ప్రభుత్వం అధికారాన్ని ఎలా వాడుకుందో అర్థమవుతుంది. ఒకే కుటుంబం దిల్లీ స్థాయిలో ఈ కుంభకోణం ద్వారా వాటాలు పొందాలని చూసింది. భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగ పడుతుంది. భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటుంది. సీఎం కేసీఆర్‌ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు. దిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది.

మిలియన్ మార్చ్.. తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’ అని కోదండరామ్‌ పేర్కొన్నారు.

కుష్బూ కు చిరు శుభాకాంక్షలు

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన నటి బిజెపి నేత కుష్బూకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు.

కచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా సభ్యురాలిగా మహిళల సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తారని ఆశిస్తున్నాను.

ఇప్పుడు మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుందని చిరు పేర్కొన్నారు.