/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 'నీదొక పాదయాత్ర.. నువ్వొక లీడర్‌వి' Yadagiri Goud
'నీదొక పాదయాత్ర.. నువ్వొక లీడర్‌వి'

తాడేపల్లి: డైరెక్ట్‌గా పోటీ చేస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని నారా లోకేష్‌.. దొడ్డిదారిన మంత్రి అయిన విషయం గుర్తించుకుంటే బాగుంటుందని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు..

ప్రస్తుతం లోకేష్‌ చేస్తున్న యాత్ర పాదయాత్ర కాదని, పనికిమాలిన యాత్రను దుయ్యబట్టారు మంత్రి జోగి రమేష్‌. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్‌.. చంద్రబాబు, నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు.

'చంద్రబాబు, లోకేష్‌ వీది రౌడీల్లా తయారయ్యారు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. పనికిమాలిన యాత్ర. సీఎంను పట్టుకుని ఇష్టానుసారి మాట్లాడతారా. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్‌ డబ్బుంటే సరిపోదు.. ఖలేజా ఉండాలి. చంద్రబాబే రాష్ట్రంలో పెద్దసైకో.భయం అంటే తెలియన వ్యక్తి సీఎం జగన్‌. ఢిల్లీ కోటను గజగజలాడించిన దమ్మున మొనగాడు జగన్‌. దమ్మున నాయకుడికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్‌ జగన్‌' అని పేర్కొన్నారు..

ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది

ముంబయి: ఐపీఎల్‌-2023 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది.

మార్చి 31 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్‌ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 70 మ్యాచ్‌లుంటాయి.

IND vs AUS: తొలి రోజు ఆట పూర్తి.. భారత్‌ 21/0

దిల్లీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయింది.

ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

క్రీజులో రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. అంతకుముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. షమి 4 వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా చెరో 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఆసీస్‌ బ్యాటర్లలో ఖవాజా (81), పీటర్ (72*) అర్ధశతకాలు సాధించారు.

ఒకరు మాకు టికెట్లు ఇచ్చేదేంటి?అవసరం ఉంటే వాళ్లే వస్తారు: కూనంనేని

హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

భాజపాకు వ్యతిరేకంగా మునుగోడు ఉపఎన్నికలో భారాసకు మద్దతు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. భారాసకు మద్దతు ఇచ్చినప్పటికీ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. పొత్తులు.. పోరాటం.. ఈ రెండూ వేర్వేరని కూనంనేని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది కమ్యూనిస్టులే. టికెట్లు ఒకరు మాకు ఇచ్చేదేంటి?అవసరం ఉందనుకుంటే మా దగ్గరకే భారాస వస్తుంది. లేదనుకుంటే ఎవరి దారి వారిదే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడికి చేరుకుంది. ఏఐటీయూసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదు. సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. త్వరలోనే భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. అదాని కుంభకోణంపై ఒక్క సారి కూడా ప్రధాని మోదీ నోరు విప్పలేదు. సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది. 24గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టి సమస్య పరిష్కరించాలి’’ అని కూనంనేని కోరారు.

‘అదానీ-హిండెన్‌బర్గ్‌’.. కమిటీని మేమే నియమిస్తాం: సుప్రీం

దిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం కీలక ప్రకటన చేసింది.

ఇటు పిటిషనర్లు, అటు ప్రభుత్వం నుంచి ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సీల్డ్‌ కవర్‌ సూచనలను అంగీకరించబోమని తెలిపింది.

పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించి తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. తామే ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది.

సీఎం కేసీఆర్ కు ప్రధాని మంత్రి మోడీ బర్త్డే విషెస్*

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దేశ ప్రధానమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంతోషకరమైన జీవితం ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును.

ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు..

TS పోలీస్‌ జాబ్స్‌: గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్‌

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య ఎంపిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు పోలీసు నియామక మండలి(TSLPRB) మరో అవకాశం కల్పించింది.

ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనవచ్చిని తెలిపింది.

అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరి 28వ తేదీలోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

KTR: కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆణిముత్యం: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం

హైదరాబాద్‌: తెలంగాణకు నూతన వైద్యకళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

9 వైద్యకళాశాలలు ఇచ్చామని కిషన్‌రెడ్డి(Kishan Reddy).. అసలు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి ప్రతిపాదనలే రాలేదని మన్‌సుఖ్‌ మాండవీయ.. రెండు ప్రతిపాదన వచ్చాయని నిర్మలా సీతారామన్‌ అంటున్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు.

అబద్ధాలైనా ఎప్పుడూ ఒకేలా చెప్పేలా కేంద్రమంత్రులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ(PM Modi)కి కేటీఆర్‌ హితవు పలికారు. అసలు తెలంగాణలోనే లేని 9 వైద్యకళాశాలలను సృష్టించిన ఘనత కిషన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆయుష్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కల్పిత గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను కూడా ప్రకటించారన్నారు. కేంద్రమంత్రులు అందరిలో కిషన్‌రెడ్డి ఆణిముత్యం అంటూ కేటీఆర్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Bopparaju: ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే.. ప్రజలకేం చెబుతారు?: బొప్పరాజు

విజయవాడ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థికశాఖ.. తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ప్రశ్నించారు..

ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు.

''ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50 శాతం మేర వేతనాలు పెంచారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకేం చెబుతారు? ఎంత మొత్తాన్ని జమ చేస్తున్నారు? ఎంత వెనక్కి తీసుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదు. వీఆర్‌ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డీఏ చెల్లించలేరా?''అని బొప్పరాజు నిలదీశారు..

Andhra Neews: భాజపాతో పొత్తులోనే ఉన్నామని పవన్ చెప్పారు: సోము వీర్రాజు..

చీరాల: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలం నుంచి చేస్తున్న ఆరోపణలపై గతంలో స్పందించలేదని.. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు..

భాజపాలో కార్యకర్తగా చేరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని.. తానేంటో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని సోము అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక పార్టీలో వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయిందని.. వర్గాలుగా చీలిపోయేలా వ్యవహరించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..

జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. ''విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వారాహికి పూజ సమయంలో భాజపా పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ వైకాపా ప్రభుత్వానికి 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, అన్ని పథకాలకు తామే నిధులు ఖర్చుపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం శోచనీయం'' అని సోము అన్నారు..