హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం
హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్నగర్ వాసి మాజ్హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన సమీయుద్దీన్పై కేసు నమోదు చేసింది.
హైదరాబాద్లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్ చేయటం తెలిసిందే. హైదరాబాద్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటు మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.
ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్వింగ్ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్ఫోర్స్ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు. విడుదలయ్యాక కూడా జాహెద్ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్నగర్ వాసి మాజ్హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన సమీయుద్దీన్పై కేసు నమోదు చేసింది.

వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2023, 14:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.4k