నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ హెచ్చరిక

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు. 

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు.

ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

వారంలో 90 విమానాలకు బెదిరింపులు

గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణ మంత్రులు (Telangana Ministers), అధికారుల బృందం బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ , మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.

కాగా.. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావించింది. ఖాళీ చేసిన నివాసాల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ విభాగాలు.. మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్వాసితులను ఒప్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉన్నతస్థాయి ఆదేశాల నేపథ్యంలో వేచి చూస్తున్నాయి. ప్రాజెక్టులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తొలినుంచి యోచిస్తున్న సర్కారు వారిని దక్షిణ కొరియా తీసుకెళ్లాలని నిర్ణయించింది. సుందరకీరణ తర్వాత నది రూపు ఎలా మారనుందో అవగాహన కల్పించేందుకు అధ్యయనానికి తీసుకెళ్లనుంది. 21 మందితో కూడిన బృందం పర్యటనకు ఇటీవల సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఉన్నతాధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లింది. అక్కడి చాంగి చియోన్‌లో హన్‌ నది, సియోల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి 25వ తేదీన స్వదేశానికి రానుంది. గతంలో నది, తీరం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారాయో ప్రజాప్రతినిధులకు చూపించనున్నట్టు సమాచారం.

తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే.. కావాలంటే రాసి పెట్టుకోండి' .. ప్రశాంత్ కని

2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు..? కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి రేవంత్ రెండోసారి సీఎం అవుతారా..? లేక పడిలేచిన కెరటంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని కేసీఆర్ మూడోసారి సీఎం కుర్చీ ఎక్కుతారా..? ఈ రెండు పార్టీలు కాకుండా కమలం పార్టీ తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందా..? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ చర్చ జరగుతున్న నేపథ్యంలో తెలంగాణకు కాబోయే సీఎం ఆయనే అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కని జోష్యం చెప్పారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఓటమి పాలైంది. మెుత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 64 సీట్లతో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ పూర్తి డీలా పడింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిథ్యం లేకపోవటం ఇదే తొలిసారి

అంతకుముందు కేసీఆర్ తుంటి ఎముక విరగటం, ఆయన ఇంటికే పరిమితం కావటం, కవిత జైలుకు వెళ్లటం, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ద్వితయశ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కేడర్‌ పూర్తి నిరాశంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనైనా ఆ పార్టీ పుంజుంకుంటుందా..? కేసీఆర్ మరోసారి సీఎం అవుతారా..? బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తిర చర్చ జరుగుతోంది. ఇక రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ? బీజేపీకి అవకాశాలు ఉన్నాయా..? అనే చర్చ కూడా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తన ప్రిడిక్షన్ ఇచ్చారు ప్రస్తుతం పొలిటికల్‌గా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని జోతిష్యం చెప్పారు. ఆయనకు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ మేరకు ఆయన్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తాట తీయాల్సిందే, అదే లాస్ట్ డే - చంద్రబాబు ఆదేశం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు కీలక దిశా నిర్దేశం చేసారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. లైంగిక వేధింపుల కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల రిక్రూట్ మెంట్ ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు కావాల్సిన ఆధునిక వ్యవస్థను అందిస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరి రక్షణే బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ఒక బ్రాండ్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి కేసును సవాల్‌గా తీసుకుంటాం.. ఛేదిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డలు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. నేరస్థులకు చట్టపరమైన శిక్షపడేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

హిందూపూర్ గ్యాంగ్ రేప్, కడపలో యువతి హత్య కేసులో నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుదామని చెప్పారు. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ నమోదు కావాలని చంద్రబాబు సూచించారు.

శాంతి, భద్రతలు మొదటి ప్రాధాన్యతగా పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. నేరస్థులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే పోలీసులు పాత టెక్నాలజీ వాడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇకపై టెక్నాలజీ పరిజ్ఞానం అందిస్తామని... ఆధునిక పరికరాలు సమకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు.

ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బెజవాడలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల వ‌ద్ద భారీ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ (Dinesh Kumar) ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ప్రత్యేక బాధ్యత‌లు అప్పగించారు. ఏర్పాట్లను డ్రోన్ కార్పొరేష‌న్ అధికారులు నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తున్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. సదస్సు జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఐఅండ్‌ఐ కార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న డ్రోన్ల సమ్మిట్‌కు వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమ్మిట్‌ ఏర్పాట్లను వివరించారు.

డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.

22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి.

సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు.

డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి.

డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి.

వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలల ఏర్పాటు.

2030 నాటికి భారత్‌ను గ్లోబల్‌ డ్రోన్‌ హబ్‌గా రూపొందించడం, డ్రోన్‌ నిబంధనలపై బృంద చర్చలు.

ప్రజాభద్రత, విపత్తుల నిర్వహణ, డ్రోన్‌ సాంకేతికత అప్లికేషన్ల వినియోగం, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్ల ఆవిష్కరణలు తదితర అంశాలపైనా చర్చలు ఉంటాయి.

వ్యవసాయం, ఆరోగ్యం, లాజిస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం, డిజిటల్‌ భూరికార్డుల రూపకల్పనలో డ్రోన్ల వినియోగంపై బృంద చర్చలు జరుగుతాయి.

రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్‌

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి, ఉన్న రూ.10 వేలను కూడా ఊడగొట్టారని ఫైరయ్యారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని చెప్పారు. కాంగ్రెస్‌ రైతు ద్రోహి అని, ఆ పార్టీ చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని తెలిపారు.

ఇప్పుడు పంట పెట్టుబడి మరొకటని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుబంధు కావాలా.. రాబందు కావాలా.. అంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా ఎక్స్‌ వేదిగా ప్రశ్నించారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని చెప్పారు.

వడివడిగా మెట్రో రెండో దశ

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్‌ ఫేజ్‌లో తొలుత ప్రతిపాదించిన 5 కారిడార్ల నిర్మాణానికి కావాల్సిన రూ.24,237 కోట్లలో 48% నిధులను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్రో రెండో దశ పనులపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోని మార్గాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

నాగోల్‌–ఆర్‌జీఏఐ (ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌) 36.6 కి.మీ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌ 11.6 కి.మీ, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట (ఓల్డ్‌సిటీ కారిడార్‌) 7.5 కి.మీ, మియాపూర్‌–పటాన్‌చెరు 13.4 కి.మీ, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ 7.1 కి.మీ, ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డీటైయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం పొందిన వెంటనే అనుమతుల కోసం కేంద్రానికి పంపనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు.

రెండో దశలో ప్రతిపాదించిన మొత్తం 6 కారిడార్లలో.. తొలుత నాగోల్‌–ఆర్‌జీఏఐ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట, మియాపూర్‌– పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గాల పనులను ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను సెకండ్‌ ఫేజ్‌ డీపీఆర్‌లో పెడుతున్నప్పటికీ.. ఈ పనులను కాస్త ఆలస్యంగా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే 5 కారిడార్లకు సంబంధించిన రూ.24,237 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 18%, రాష్ట్ర ప్రభుత్వం 30 % ఖర్చు భరించనుంది. మరో 4 శాతం ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) ద్వారా, 48 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించాలని భావిస్తున్నారు. కాగా, మొదటి దశలోని 69.2 కిలోమీటర్ల పనులను ఎల్‌అండ్‌టీ పూర్తిగా పీపీపీ మోడల్‌లో చేపట్టింది.

ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకుగాను ఎల్‌అండ్‌టీకి రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో 267 ఎకరాలు కేటాయించింది. తొలుత 35 ఏళ్లపాటు లీజు అగ్రిమెంట్‌ కుదుర్చుకోగా.. నిర్మాణ వ్యయం ఎక్కువైన తరుణంలో తర్వాత మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అంటే మొత్తం 60 ఏళ్లపాటు ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని మెట్రో రైలు నిర్వహణను చేపట్టాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే రెండో దశలో పీపీపీ వాటా కేవలం 4% మాత్రమే ఉండడంతో అంతర్జాతీయ బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్న 48% వాటాకు సమానంగా మరో 48 శాతం బ్యాంకుల ద్వారా సేకరించాల్సి వస్తోంది. దీంతో 1.5 లేదా 2% తక్కువ వడ్డీతో రుణాలు అందించే బ్యాంకుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటికే జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) బ్యాంకు ప్రతినిధులతో ప్రభుత్వ పెద్దలు సమావేశమైన నేపథ్యంలో దానినుంచే ఎక్కువ మొత్తంలో సేకరించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.

అర్బన్‌ మొబిలిటీకి సంబంధించిన పనుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వం నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో రెండో దశ విస్తరణ పనులను పట్టాలెక్కించే విషయంలో ఆసక్తి చూపించలేదనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా రెండో దశలో కనీసం కిలోమీటరు పనులు కూడా జరగలేదని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర సర్కారు సహకారంతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. మెట్రో నిర్మాణానికి కావాల్సిన అనుమతులతో పాటు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు సేకరించేందుకు సాయం కోరేందుకు సిద్ధమైంది. ప్రధానంగా జైకా లాంటి ఇంటర్నేషనల్‌ బ్యాంకులను ఒప్పించేందుకు సహకారం అందించాలని కోరుతోంది. కాగా, 5 కారిడార్ల పనులను ప్రారంభించిన తర్వాత ఫోర్త్‌సిటీ కారిడార్‌ను నెమ్మదిగా పట్టాలెక్కించనున్నారు.

గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ..

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

2011 తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది.

టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ప్రతి షిఫ్ట్‌లో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ఆ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.

వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.

శనివారం లక్డీకాపూల్‌, రాజ్‌భవన్‌ తదితర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ పర్యటించారు. ఓ డ్రైన్‌ పూర్తిగా పూడుకుపోయి ఉండగా.. మరో డ్రైన్‌లో చెత్తాచెదారం పేరుకుపోయింది. చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితి ఉందనే అంచనాకు వచ్చారు. నగర వ్యాప్తంగా వరద నీటి ప్రవాహ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు

గ్రేటర్‌లో 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉండగా.. మేజర్‌ నాలాలు 370 కి.మీ, మైనర్‌ డ్రైన్‌లు 912 కి.మీలకు పైగా ఉన్నాయి. వీటిల్లో వ్యర్థాలనుత తొలగించేందుకు ఏటా రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డ్రైన్‌ల దుస్థితి నేపథ్యంలో పూడికతీత జరుగుతోందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైన్‌లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్‌ డ్రైన్‌లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు..? ఎంత మేర వ్యర్థాలు తొలగించారు..? అన్నదీ పరిశీలించే అవకాశముంది. కాగా, గతంలో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయంలో పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారకపోవడం గమనార్హం.

రోడ్ల మరమ్మతులకు నిధులు!

రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి.

రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులకు నిధులు ఏ మేరకు అవసరం అన్నదానిపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయని, వాటి రిపేర్లకు నిధులను మంజూరు చేయాలంటూ పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరమ్మతులకు అవసరమైన నిధులను అంచనా వేసి, పనులు ప్రారంభించే దిశగా ఇరు శాఖలు చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,320 కి.మీ.ల మేర 641 చోట్ల రహదారులకు మరమ్మతులు చేయాల్సి ఉందని, రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులను నియోజకవ ర్గాలవారీగా పలు దఫాలుగా మంజూరు చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఆయా పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్‌ అండ్‌ బీ శాఖ కూడా నియోజకవర్గాల వారీగా రోడ్ల మరమ్మతులకు ప్రాథమికంగా ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాలను సిద్ధం చేసింది.

దాని ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.30-40 కోట్ల చొప్పున 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రూ.3,570-4,760 కోట్ల నిధులు అవసరమవుతాయని తేల్చినట్టు సమాచారం. ఆర్‌ అండ్‌ బీ పరిఽధిలో రహదారులకు చేపట్టాల్సిన మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్న జాబితాలను సిద్ధం చేస్తున్నారు. తొలుత అత్యవసరమైన రోడ్లకు నిధులను మంజూరు చేయాలని, అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లోని రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిధుల సర్దుబాటు పూర్తికాగానే పనుల కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,888.34 కోట్లతో రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించి నిధులను కూడా ఆర్‌ అండ్‌ బీకి మంజూరు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ పనులు జరగలేదు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మతుల పనులు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారాయని ఆర్‌ అండ్‌ బీలో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఆర్‌ అండ్‌ బీ పరిధిలో దాదాపు 2,555 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేపట్టగా కొన్ని నియోజకవర్గాల్లో పనులు నిర్వహించలేదు. ఆ నియోజకవర్గాలను గుర్తించి, వాటికి నిధులను మంజూరు చేయటంపై కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు కేంద్రం సహాయాన్ని కూడా కోరే అవకాశం ఉంది.