TeluguCentralnews

Aug 30 2024, 16:59

Emergency | కంగనారనౌత్‌ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..⁉️

బాలీవుడ్ నటి కంగనారనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్‌ ఎమర్జెన్సీ. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్‌ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ (Emergency )ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగ‌నార‌నౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ.. నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తెలిపారు. మాజీ ఐపీఎస్‌ అధికారి తేజ్‌ దీప్‌ కౌర్ మీనన్‌ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం.

ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్‌, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమ‌ర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబ‌డ్డ ప్రముఖ రాజ‌కీయ వేత్త జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ (జేపీ) పాత్రలో పాపులర్‌ బాలీవుడ్‌ ద‌ర్శకనిర్మాత అనుప‌మ్ ఖేర్ న‌టిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇత‌ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యాన‌ర్ మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

TeluguCentralnews

Aug 30 2024, 16:54

వైసిపి పార్టీ కి మరో ఇద్దరు ఎంఎల్ సి లు గుడ్ బై..

నిన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్న ఎంఎల్ సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి తో పాటు మరో ఎంఎల్ సి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేసి లేఖ ను మండలి చైర్మన్ కు అందజేశారు.

నిన్ననే ఇద్దరు ఎంపీలు వెంకట రమణ, బీద మస్తాన్ రావు వైసిపి పార్టీ కి, ఎంపి పదవికి రాజీనామా చేసి డిల్లి లో రాజ్యసభ చైర్మన్ ను కలిసి లేఖ ను అందజేశారు.

రోజు కూడ గడవక ముందే వైసిపి పార్టీ కి మరో ఇద్దరు ఎంఎల్ సి లు రాజీనామా లేఖ ను మండలి చైర్మన్ కు అందజేశారు.

ఎం ఎల్ సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాజీ మంత్రి, మాజీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు ఆయన మరణతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బల్లి కళ్యాణ్ చక్రవర్తి కి ఎం ఎల్ సీ గా అవకాశం కల్పించారు.

నిన్నటి వరకు టిడిపి ప్రభుత్వం పై పోరాటం లో డిల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటానని చెప్పి రోజులు కూడా గడవక ముందే వైసిపి పార్టీ కి గుడ్ బై చెప్పారు.

TeluguCentralnews

Aug 29 2024, 18:40

BIG BREAKING రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్

రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్

రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం.

రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం.

సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం.

TeluguCentralnews

Aug 29 2024, 16:09

రాహుల్ ఎంతో మారిపోయాడు-ప్రతీదీ ఓ సంకేతమే-స్మృతీ ఇరానీ పొగడ్తలు..!

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ స్థానం నుంచి ఓటమి పాలైన తర్వాత కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నేత స్మృతి ఇరానీ ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో రాహుల్ గాంధీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారని ఇరానీ అంగీకరించారు. రాహుల్ ఇప్పుడు భిన్నమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. తాను కులం గురించి మాట్లాడితే, పార్లమెంటులో తెల్లటి షర్ట్ వేసుకుంటే యువతకు ఎలాంటి సందేశం ఇస్తుందో తెలిసిందే.

మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ప్రత్యర్థి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక నిర్దిష్ట వర్గాన్ని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు స్మృతి ఇరానీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దాడి శైలిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించిన ఆయన, 'అందువల్ల అతని చర్యల గురించి మనం తప్పుడు అంచనాలు వేయకూడదు. మీరు వారిని మంచివారు, చెడ్డవారు లేదా చిన్నపిల్లలు అని భావించినా - వారు భిన్నమైన రాజకీయాలలో నిమగ్నమై ఉన్నారు.

కొత్త రాజకీయ విజయం విఫలమైన వ్యూహం నుండి ఉద్భవించింది

గతంలో కాంగ్రెస్ పార్టీ 'సాఫ్ట్ హిందుత్వ' రాజకీయాలను అవలంబించే ప్రయత్నాలను కూడా ఈ సందర్భంగా ఇరానీ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రముఖ ఆలయ సందర్శనలు కూడా రాహుల్ గాంధీకి నచ్చలేదని, ఆయనను అనుమానంగా చూశారని స్మృతి ఇరానీ అన్నారు. గాంధీ యొక్క కొత్త రాజకీయ విజయం అని పిలవబడేది ఈ విఫల వ్యూహం నుండి ఉద్భవించిందని కూడా ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలయ సందర్శనల వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదని ఇరానీ అన్నారు. ఇదే జోక్‌గా మారింది. కొంతమంది దీనిని మోసగించినట్లు గుర్తించారు. కాబట్టి ఈ వ్యూహం ఫలించకపోవడంతో, వారు ప్రయోజనం పొందేందుకు కుల సమస్యలపై దృష్టి పెట్టారు. ఇరానీ ప్రకారం, ఈ చర్యలు భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ యొక్క ఔచిత్యాన్ని కొనసాగించే లక్ష్యంతో పెద్ద వ్యూహంలో భాగంగా ఉన్నాయి.

రాహుల్ గాంధీకి సామాజిక న్యాయంతో సంబంధం లేదు - ఇరానీ

రాహుల్ గాంధీకి నిజంగా సామాజిక న్యాయంతో సంబంధం ఉంటే, అది అతని మొత్తం రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేసి ఉండేదని కూడా స్మృతి అన్నారు. కానీ అది అలా కాదు. అతను అకస్మాత్తుగా కులతత్వాన్ని ఆశ్రయించడం ప్రారంభించాడు మరియు కొన్నిసార్లు నిరాధారంగా మాట్లాడతాడు. ఉదాహరణకు, మిస్ ఇండియాను ప్రభుత్వం ఎంపిక చేయలేదని వారికి తెలుసు, అయినప్పటికీ దళిత-వెనుకబడిన తరగతికి చెందిన అమ్మాయి మిస్ ఇండియాగా ఎందుకు మారలేదని వారు అడుగుతున్నారు. ఇవి అసంబద్ధమైన విషయాలని రాహుల్‌కు కూడా తెలుసు, అయితే ఇది తనను వార్తల్లో ఉంచుతుందని మరియు అతని మాటలు హెడ్‌లైన్‌లుగా మారుతాయని కూడా అతనికి తెలుసు.

TeluguCentralnews

Aug 28 2024, 15:08

వైసీపీకి మరో బిగ్‌షాక్‌..? రాజీనామాకు సిద్ధమైన ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీకి దూరంగా జరిగారు.. కొందరు పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తు్న్నారు.. మరోవైపు.. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు.. కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు.. ఇలా ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.. అయితే, ఇప్పుడు వైసీపీకి బిగ్‌ షాక్‌ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామాచేసిన అనంతరం, రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ ప్రకటించే అవకాశం ఉందట.. అంతేకాదు.. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీసీలె చేరే అవకాశం ఉందంటున్నారు..

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న మోపిదేవి వెంకటరమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మోపిదేవికి ఓటమి తప్పలేదు.. అయినా.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. తన తొలి కేబినెట్‌లో మోపిదేవికి మంత్రి పదవి కట్టబెట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించిన విషయం విదితమే.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగాను.. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెబితే.. వైసీపీకి భారీ షాక్‌ తగిలినట్టే అవుతుంది.

TeluguCentralnews

Aug 28 2024, 13:53

బెంగాల్‌లో రచ్చ, బంద్ సందర్భంగా బిజెపి నాయకుడి కారుపై బాంబులు

బెంగాల్‌లో రచ్చ, బంద్ సందర్భంగా బిజెపి నాయకుడి కారుపై బాంబులు విసిరారు, కాల్పులు కూడా జరిగాయి

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం చేపట్టిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల చర్యకు నిరసనగా రాష్ట్ర బిజెపి బుధవారం 12 గంటల నిరసనకు పిలుపునిచ్చింది. బెంగాల్ బంద్ ప్రభావం విస్తృతంగా కనిపిస్తోంది. బంద్‌కు మద్దతుగా ఉదయం నుంచి వీధుల్లోకి వచ్చిన బీజేపీ మద్దతుదారులు హౌరా, సీల్దా డివిజన్‌లతో పాటు పలు చోట్ల రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ మద్దతుదారులు వివిధ స్టేషన్లలో రైళ్ల ముందు నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు, దీని కారణంగా సుదూర రైళ్ల రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి.

బెంగాల్ బంద్ మధ్య, భట్పరాలో బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మా పార్టీ నేత ప్రియంగు పాండే కారుపై దాడి జరిగిందని బీజేపీ నేత అర్జున్ సింగ్ ఆరోపించారు. అతడిపైకి ఏడు రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. వీడియోను విడుదల చేస్తూ, "భట్పరాలో బిజెపి నాయకుడు ప్రియంగు పాండే కారుపై టిఎంసి గూండాలు కాల్పులు జరిపారు, అతని డ్రైవర్‌ను గాయపరిచారు. ఇది మమతా బెనర్జీ యొక్క అసహ్యకరమైన నిస్పృహకు ప్రదర్శన! వారు ఎంత చేసినా రక్తపాతాన్ని విజయవంతం చేయనివ్వండి ఎందుకంటే మమత వారి అవినీతి పాలన అంతమయ్యే వరకు గూండాలు మరియు వారి తోలుబొమ్మ పోలీసులు వీధుల నుండి మమ్మల్ని భయపెట్టలేరు.

TeluguCentralnews

Aug 28 2024, 12:38

పన్ను శ్లాబుల్లో మార్పులు..సెప్టెంబర్ 9న ప్రకటన.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్‌టీ మండలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 9, 2024 రోజున 54వ జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే పన్ను రేట్ల హేతుబద్దీకరణపై చర్చించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ క్రమంలోనే పన్నులు, ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులపై అదే రోజు ప్రకటన ఉంటుందా? అన్న ప్రశ్నకు శ్లాబుల్లో మార్పుపై తుది నిర్ణయం ఆ తర్వాత తీసుకుంటామని చెప్పారు ఆర్థిక మంత్రి. లగ్జరీ ఉత్పత్తులు, హానికారక ఉత్పత్తులపై పరిహార సెస్ విధింపు అంశంపైనా ఈ సమావేశంలోనే చర్చించనున్నట్లు విలేకరులతో తెలిపారు నిర్మలా సీతారామన్.

జీఎస్‌టీ (Goods and Services Tax) రేట్ల హేతుబద్దీకరణపై బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మంత్రుల బృందం తొలి సమావేశం సైతం ఇటీవలే జరిగింది. అయితే, పన్ను శ్లాబుల్లో ఏ మార్పులు చేయొద్దని కొందరు సభ్యులు ఈ సమావేశంలో సూచించారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఉన్న 5, 12,18,28 ట్యాక్స్ శ్లాబులు కొనసాగే అవకాశం ఉంది. ఈ అంశంపై మరింత చర్చించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కొన్ని వస్తువులపై పన్ను రేట్లలో మార్పు వల్ల కలిగే ప్రభావాన్ని మదింపు చేసేందుకు ట్యాక్స్ అధికారులతో ఫిట్‌మెంట్ కమిటీకి అప్పగించినట్లు బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాచ్ చౌదరి తెలిపారు.

విలేకరుల సమావేశంలో జీఎస్‌టీ మండలి సమావేశం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై మాట్లాడారు. పన్నులు, శ్లాబుల హేతుబద్దీకరణపై చర్చించున్నామని తెలిపారు. ఫిట్‌మెంట్ కమిటీ అధికారులు ఈ అంశంపై ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపారు. అయితే ఆ తదుపరి జరిగే సమావేశాల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు ఆర్థిక మంత్రి. మరోవైపు లగ్జరీ వస్తువులు, హానికారక ఉత్పత్తులపై పరిహార సెస్ కొనసాగించాలని కర్ణాటక నుంచి డిమాండ్ వచ్చినట్లు తెలిపారు. అందుకే ఈ పరిహార సెస్ కొనసాగింపుపైనా ఈ భేటీలో చర్చిస్తామని ఆర్థికమ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

TeluguCentralnews

Aug 28 2024, 10:34

ముంబయి నటి కాదంబరి జెత్వాని పై కేసులో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు బిగుస్తున్న ఉచ్చు

విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నీపై సీఎంవో ఆరా

ముంబయి నటిపై కేసులో ఇద్దరు ఐపీఎస్‍ల పాత్రపై వివరాలు కోరిన సీఎంవో

కాంతిరాణా, విశాల్ గున్నీకి సంజాయిషీ నోటీసులు ఇచ్చే యోచన

ముంబయిలో నమోదైన కేసు వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర పోలీసులు

వైసీపీ నేత విద్యాసాగర్, సజ్జల పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు

బాలీవుడ్ నటి, ఆమె కుటుంబంపై కేసు పెట్టి ఐపీఎస్ అధికారులు వేదించినట్లు స్పష్టమైన ఆధారాలు

TeluguCentralnews

Aug 28 2024, 08:45

నేడు ఏపీ ఈ- కేబినెట్ భేటీ.. అంతా ఆన్ లైన్లొనే!

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఏపీ సర్కారు ఈ- కేబినెట్ భేటీని నిర్వహించనుంది.

2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ నేటి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.

అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు మంగళవారం ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.

ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

TeluguCentralnews

Aug 27 2024, 15:51

Flash ; నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం !

- హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు

- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు ఎమ్మెల్యేలు

విజన్ 2047 రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ సమావేశం నిర్వహించింది.

ప్రధానితో వికసిత్ ఏపీ విజన్ - 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అనంతరం దేవదాయ శాఖపై చంద్రబాబు సమీక్షించనున్నారు. సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘విజన్ డాక్యుమెంట్ 2047’ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలు, మండలాలకు సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తాజాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని ఇప్పటికే చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనుసంథానం చేస్తామని గతంలో వెల్లడించారు. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే యోచన చేస్తున్నట్టు కూడా చంద్రబాబు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్రస్థాయి నుంచి కుటుంబస్థాయి వరకు ప్రణాళికలు రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు సైతం కృషి చేస్తున్నారు.