VijayaKumar

Aug 12 2024, 18:20

రామన్నపేట: ఇంద్రపాలనగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపార నగరంలో అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మల్లం మాదవి.గాజుల గణేష్.పావురాల ఐలయ్య .రాదారపు శంకరయ్య గారికి ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన చెక్కులను అందజేసిన రామన్నపేట మాజీ ఎంపీపీ పూస బలమని-బాలనర్సింహ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదలకు వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గార్దస్ సురేష్,సీనియర్ నాయకులూ పెద్దగోని వెంకటేశం,రవ్వ నర్సింహా,విక్కీసాయి,సందీప్,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 22:49

జర్నలిస్టు యోగి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: టీజేయు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఎండి షానూర్ బాబా

వరంగల్ జిల్లాకు చెందిన యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి మృతి చెందడం బాధాకరంమని ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక చౌరస్తాలో ముందుగా జర్నలిస్ట్ యోగి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు షానుర్ బాబా మాట్లాడుతూ యువ జర్నలిస్టు యోగి రెడ్డి మృతి చెందడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వాలు పాలకులు మారిన జర్నలిస్టు పరిస్థితులు మారటం లేదని ఆ దిశగా ఆలోచించే నాధుడు ఎవరు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ వృత్తి భద్రత వారి కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు సొంత ఇల్లు లేక మరణం అనంతరం పార్థివ దేహాన్ని అంతిమ చూపు సైతం చూడలేని పరిస్థితి ఉండటం సమాజంలో ఇంతకంటే విషాదకరమైన పరిస్థితి ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యోగి రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపత్తిని మథ్యస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.శ్రీనివాస్, శ్రీనివాస్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 15:11

అరూరు లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  అరూరు గ్రామంలో పురమ కృష్ణ అనారోగ్యం కారణాల వల్ల మరణించాడు, కృష్ణ కుటుంబానికి ఆదివారం రూ.10000/- పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని Ex.ZPTC వాకిటి పద్మ అనంత రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు అనంత రెడ్డి, వాకిటి శరత్ పవన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, జనరల్ సెక్రటరీ కోడితల కరుణాకర్,సుంకిశాల పరమెశ్,పోలెపాక నరసింహ,దమెర అంజయ్య, M. ముత్యాలు , జకిడి నర్సిరెడ్డి,రేఖ మచి, కసరబోయిన మహేష్,K.మధు ,ch.సీను,పోలెపాక చెమ్మయ, బుర్ర శ్రీను,కాదరి నరేష్,J.రాజు,M.గణేష్,నల సత్తయ్య, వేముల ఎట్టయ్య, వేముల నరసింహ, వేముల రమేష్,B.రాజు,జినుకల దానయ్య,ఫకీర,అజగర్,P.రమేష్,P.మహేష్, వేముల చిన నరసింహ,ch.ఉపేందర్,రెబస్ నరేష్,జోలం సిద్ధయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 12:08

ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,డిజిటల్ మీడియా సంస్థలలో పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ..ప్రజల సమస్యలపై పలు ప్రత్యేక కథనాలు రాస్తూ, సామాజికంగా, రాజకీయంగా ప్రజలను ,యువతని చైతన్యపరుస్తూ సేవలు అందిస్తున్నందుకు ఎస్ఎల్పి చారిటబుల్ ట్రస్ట్ ,ఎస్జెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని చిక్కడ పల్లి త్యాగరాయ కళా భవనంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న ,హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా చాడ గ్రామానికి చెందిన , యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, గ్రామస్తులు నాగరాజుకు అభినందనలు తెలియజేశారు.

VijayaKumar

Aug 10 2024, 19:48

భువనగిరి లొ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా.... భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జన్మదిన సందర్భంగా, భువనగిరి బాబు జగ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద, జన్మదిన వేడుకలు, కుమ్మరి వినాయకుని గుడి వద్ద పూజలు నిర్వహించి, ఏరియా హాస్పిటల్, పండ్లు,బ్రెడ్లు, పంపిణీ కార్యక్రమం, రైతు బజార్ వద్ద, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, అనంతరం కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన, నాయకులు . ఈ కార్యక్రమంలో,BRS పార్టీ అధ్యక్షులు, కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, ఎనబోయిన ఆంజనేయులు, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్, జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు, కొలుపుల అమరేందర్, జిల్లా నాయకులు, ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పిటిసి, బీర్ మల్లయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు, ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, రచ్చ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 09 2024, 21:45

భువనగిరి పట్టణంలోని 8వ వార్డులో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం

స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒకరూ భాగస్వామ్యం కావాలనిజమఖానగూడెము.సీతానగర. రాంనగరమున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బోనగిరి హ లో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఏర్పాటు చేసిన వన మహోత్సవానికి ఆయన హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వార్డ్ ఇన్చార్జి శబయొద్దీన్,సబితగోపాల్ బర్రె జాంగిర్, ముస్లిం సోదరులు ఆర్ .పి దనలక్ష్మీ ,పావని అంగన్వాడి టీచర్ నాగమ్మ ఏఎన్ఎం సిస్టర్స్ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 09 2024, 18:41

AISF ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని విజేత కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భ వేడుకలను పురస్కరించుకొని ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం చిన్నవయసులోనే వీరమరణం పొందిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, భారతరత్న అవార్డు ఇవ్వాలని శాంతి కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. 89 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా, విద్యారంగల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీ లో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చింతపల్లి అరుణ్,అనిల్ రెడ్డి రమేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 09 2024, 18:37

సాగర్ లో నేటి నుంచి క్యాట్ -కో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 10, 11, తేదీల్లో నలగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని వినియోగదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలోని వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, నూతనంగా వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయాలనుకునే వారు హాజరగుతారని ఆయన అన్నారు. రెండు రోజులపాటు జరిగే వర్క్ షాప్ లో "నూతన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం -2019", ఆహార భద్రత చట్టం, తూనికల కొలతల శాఖలో వచ్చినటువంటి మార్పులు- చేర్పులు, ఐఎస్ఐ, బిఐఎస్ , హాల్ మార్క్, ఆగ్ మార్క్, సిల్క్ మార్క్, తదితర నాణ్యతా ప్రమాణాల చిహ్నాల గురించి, రేర (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) , సంబంధిత శాఖల అధికారులు వివరిస్తారని ఆయన తెలిపారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే వారు, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు సెల్ నెంబర్ : 9440134610. 9059188199 లను సంప్రదించాలని ఆయన కోరారు.

VijayaKumar

Aug 09 2024, 15:35

గోల్నే పల్లి అంగన్వాడి కేంద్రంలో రక్తహీనత పై అవగాహన , శుక్రవారం మహాసభ


యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి మేడం మాట్లాడుతూ మాట్లాడుతూ రక్తహీనత పై అవగాహన కల్పించారు ప్రతి గర్భిణీ స్త్రీ కి బాలింతలకు రక్తహీనత లేకుండా మంచి పౌష్టిక ఆహారము తీసుకోవాలని ఆకుకూరలు పప్పు మునగాకు యూస్ చేయాలని రాగి జావా అని డిమాండ్ స్టేషన్ గా చేయించారు ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ పల్లి పట్టి బెల్లం ఆకుకూరలు తినాలని సూచించారు ఏడు నెలలు నిండిన పిల్లలకు ఖచ్చితంగా అన్నప్రాసన చేయాలని సూచించారు బరువు తక్కువ పిల్లల గురించి వయసుకు తగిన ఎత్తు ఎత్తుకు తగిన బరువు ఉండేలా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సరైన పోషక ఆహారము వారికి అందించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి డబ్లూ కృష్ణవేణి, మేడం సూపర్వైజర్ పారిజాత,స్కూల్ హెడ్మాస్టర్ కళావతి మేడం, అంగన్వాడీ టీచర్స్ ఇందిరా భాగ్యలక్ష్మి వసంత, ఆశా వర్కర్స్ సుష్మ,గిరిజ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 09 2024, 13:49

వలిగొండ: నాగారం లో మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన యువకుడు మంగ వినయ్ (25) అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన గోళ్ల పెద్ద భిక్షం ఒక క్వింటాల్ బియ్యాన్ని శుక్రవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బెలిదే నాగేశ్వర్, గోళ్ల అవినాష్,పాలెర్ల మహేష్, గోళ్ల ప్రవీణ్,మైసోళ్ల వెంకటేష్, గోళ్ల నవీన్,గోళ్ల శ్రీనివాస్, గోళ్ల విక్రమ్,తదితరులు పాల్గొన్నారు