VijayaKumar

Jul 21 2024, 12:32

పౌర గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలని వినతి

పౌర గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ గ్రంధాలయ నిరుద్యోగుల సంఘం కోరింది . రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కలిసి, వారు వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా పబ్లిక్ లైబ్రరీలో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టేట్ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ ,రీజినల్ పబ్లిక్ లైబ్రరీ, తాలూకా పబ్లిక్ లైబ్రరీ ,మండల పబ్లిక్ లైబ్రరీ ,విలేజ్ పబ్లిక్ లైబ్రరీ లో ఖాళీగా ఉన్న గ్రేడ్ - 1, గ్రేట్ - 2, గ్రేడ్ - 3 , గ్రేడ్ - 4 పోస్టులను ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న 1000 నుంచి 1500 వరకు పోస్టులు తగ్గకుండా భర్తీ చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ... ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానయ్య, శంకర్, కట్టయ్య, సాయిలు, వై మత్స్యగిరి ,మాధవి లత, శ్రీనివాస్ ,చంద్రశేఖర్ ,ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 21 2024, 09:01

భువనగిరి లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన డిసిపి రాజేష్ చంద్ర

యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్  చంద్ర యాదాద్రి భువనగిరి జోన్ లోని పోలీస్ స్టేషన్ లలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, సీఐలు ఎస్ఐ లతో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని శనివారం భువనగిరి హెడ్ క్వార్టర్ లో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పలు స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పూర్తి విచారణ చేయాలని, దానికై సూచనలు చేశారు . అలాగే దొంగతనాలు కు సంబంధించి కేసులలో వాటిని ఛేదించడం గురించి తెలిపారు.

VijayaKumar

Jul 20 2024, 18:01

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15% మించి నిధులు కేటాయించాలి: బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ డిమాండ్

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% మించి నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దేశంలోనే అట్టడుగు స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు నిధుల లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని పాఠశాలలో టీచర్ల కొరత ఆయాలు అటెండర్ల కొరత మూలంగా విద్యార్థులచే క్లీనింగ్ మరియు బడి గంట కొట్టే పరిస్థితులు ఉన్నాయని టీచర్ల కొరత వల్ల విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలు తగ్గిపోయాయని కేంద్ర ప్రభుత్వం చేసిన అధ్యయనంలో వెళ్లడైందని గుర్తు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి చెందిన విద్యార్థులు వస్తారు కాబట్టి మధ్యాహ్న భోజనంలో పప్పుతో పాటు ఒక కర్రీ కూడా విధిగా సప్లై చేయాలని అదేవిధంగా ఉదయం అల్పాహారాన్ని ఇవ్వకపోవడం వల్ల ఆకలితో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో 475 కేజీబీవీ పాఠశాలలలో సుమారుగా 1,20,000 మంది విద్యార్థులు విద్యనాభ్యసిస్తున్నారు అని దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాల కల్పనకు రాబోయే రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని సంక్షేమ శాఖ పరిధిలో 850 గురుకులాలు 1523 సంక్షేమ హాస్టల్లో ఉన్నాయని 850 గురుకులాలకు 415 అద్దె భవనాలలో నడిపిస్తున్నారని వీటికి కొత్త భవనాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీసీ సంఘం కార్యదర్శి దేశారపు సత్యం గౌడ్, రాఘవేందర్ గౌడ్, బొడ్డు కింది శ్రీనివాస్ గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 20 2024, 16:45

రైతు ఆత్మగౌరవం కోసం రుణమాఫీ: కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదే శోభారాణి

రామన్నపేట: రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25 వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నా రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆగస్టు 15 లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రంగాల్లో ఇచ్చిన మాట నిల బెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా అన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ అవుతుందని ఆమె చెప్పారు.

VijayaKumar

Jul 20 2024, 14:14

వలిగొండ - 7 వ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిగొండ - 7వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ పబ్బు నాగమణి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ నాగమణి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని కోరారు .ఈ సందర్భంగా ఈసీసీఈ డే నిర్వహించి తల్లిదండ్రులకు ప్రీస్కూల్ విద్య ,పూర్వ బాల్యదశ ప్రాముఖ్యత గురించి వివరించారు .అనంతరం మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నాగమణి, ఆశ వర్కర్ తెరిసా, తల్లులు నికిత,ఉమా, రమ, ఎస్.కె హజ్రా ,వెంకట నరసమ్మ , రమ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 21:12

ఆగస్టు 5 ,6 న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : పల్లగొర్ల మోదీ రాందేవ్

భువనగిరి : వచ్చే నెల ఆగస్టు 5,6న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి లోని కాలేజీలు హాస్టల్స్ విజిట్ చేసి అనంతరం ఉమెన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అభివాదం చేశారు Bc విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాదిమందిగా తరలిరావాలని చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అలాగే SC, ST,BC బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనాభా గణనలో బీసీ కుల గణన చేయాలని దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థలో ప్రైవేటీకరణ నిషేధించాలని బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని బడ్జెట్లో బీసీలకు 5లక్షల కోట్లు కేటాయించాలని బీసీలంట్లే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగనే చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేశ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీలు 7 శాతం గిట్ల లేకపోవడం సిగ్గుచేటు రాజకీయంగా 12 శాతం దాటలేదు బీసీలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదు బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు .ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వట్టెం మధు, చిన్నం సాగర్,పబ్బాల ఎలీషా, మనీషా రెడ్డి, శాలిని నాయక్, మాధురి, సంగీత, మౌనిక గౌడ్, వసుందరి,ప్రత్యూష,మానస, సునీత తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 21:04

కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ కే మోహిన్ కి మొహర్రం కానుక రూ. 10వేలు అందజేసిన పారిశ్రామికవేత్త మిర్యాల శేషయ్య

రామన్నపేట: మొహరం పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా  మండలంలోని భోగారం గ్రామానికి చెందిన ఎస్కే.మోహిన్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూనూరు సాయి కుమార్ గౌడ్ అధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మిర్యాల శేషయ్య పండుగ కానుకగా రూ.10000/- నగదు ను శుక్రవారం నాడు భోగారం గ్రామానికి వచ్చి అందజేశారు. అనంతరం శేషయ్య మాట్లాడుతూ కులం, మతం విభేదాలు లేకుండా పండుగ నిర్వహించే కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూనూరు రాజు, గోగు సతీష్, జెల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 20:14

ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి: AISF

అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన సెయింట్ ఆన్స్ పాఠశాలను సందర్శించి పాఠశాల కరస్పాండెంట్ తో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ మోత్కూరు మండల నాయకులు చందు వినయ్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.

VijayaKumar

Jul 19 2024, 19:44

పహిల్వాన్ పురం అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట - అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని  పహిల్వాన్ పురం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు రమేష్ , అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పిల్లలను అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారికి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని ,తల్లిదండ్రులు తమ పిల్లలని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలి .వారి ఆరోగ్య విద్య, దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు .అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ఆ వయసు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి .ఆటపాటలతో విద్యను అందిస్తున్నాము మరియు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బాలమని, రాణి ,ఆశా వర్కర్లు పద్మ ,చంద్రకళ మరియు తల్లులు రజిత, మమత ,సంతోష, అలివేలు, లావణ్య, హేమలత, మౌనిక, గౌతమి, గీత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 17:56

సుంకి శాల పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న టీచర్లకు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల పాఠశాల నుండి బదిలీ పై వెళ్తున్న టీచర్లు ఆలకుంట్ల శ్రీనివాస్ , వరమ్మ ,వై వి ఎన్ . రెడ్డి,వి మాధవి లకు బదిలీ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బుగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినారు . ఈ కార్యక్రమంలో  వారి సేవలకు గుర్తుగా  టీచర్లకు మెమెంటోస్  అందజేసి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు. సుంకి శాల పాఠశాలకు బదిలీపై వచ్చిన టీచర్లు ఇద్దరు అయాజ్ అహ్మద్. పి శ్రీను  లకు హెచ్ ఎం.  జి. బుగ్గా రెడ్డి సాదరంగా  ఆహ్వానం పలికినారు. బదిలీపై వెళ్లిన టీచర్లు వారి అనుభవము విద్యార్థులతో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మొగిలి పాక నరసింహ, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.